International Technology
-
గ్లోబల్ టెక్ దిగ్గజాల్లో రిలయన్స్
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లలో ట్రేడవుతున్న 30 అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాల్లో దేశీ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ చోటు దక్కించుకుంది. ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్–ట్రెండ్స్ పేరిట రూపొందించిన నివేదికలో భాగమైన లిస్టులో 23వ స్థానంలో నిల్చింది. తద్వారా భారత్ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక సంస్థగా నిల్చింది. కృత్రిమ మేధ సాంకేతికత వినియోగ ధోరణులు, ప్రభావంపై రూపొందించిన ఈ నివేదికలో మార్కెట్ క్యాపిటలైజేషన్పరంగా తొలి ఎనిమిది స్థానాల్లో అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, యాపిల్, అమెజాన్ తదితర సంస్థలు ఉన్నాయి. ఈ ఏడాది చైనా నుంచి 3 సంస్థలు, జర్మనీ కంపెనీలు 2, తైవాన్.. నెదర్లాండ్స్ .. దక్షిణ కొరియా.. భారత్ నుంచి ఒక్కో కంపెనీ చొప్పున తొలిసారిగా ఈ లిస్టులో చేరాయి. అమెరికా టాప్.. అత్యంత విలువైన 30 గ్లోబల్ టెక్ కంపెనీల జాబితాలో మూడు దశాబ్దాలుగా అమెరికా ఆధిపత్యమే కొనసాగుతోంది. ఈ లిస్టులో 1995లో అమెరికా వాటా 53 శాతంగా ఉండగా 2025లో 70 శాతానికి పెరిగింది. 30 టాప్ కంపెనీల్లో 21 సంస్థలు అమెరికావే ఉన్నాయి. 1995లో జపాన్కి 30 శాతం వాటా ఉండగా ప్రస్తుతం అది సున్నా స్థాయికి పడిపోయింది. -
3 రోజుల్లో కోటి అమ్మకాలు..
యాపిల్ ఐఫోన్ 6 న్యూయార్క్: అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ .. ఐఫోన్ 6, 6 ప్లస్ మోడల్స్ అమ్మకాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. విక్రయాలు మొదలైన మూడు రోజుల్లోనే ఏకంగా 1 కోటి పైగా ఫోన్లు అమ్ముడయ్యాయి. ఒక కొత్త మోడల్ ఈ స్థాయిలో అమ్ముడవడం రికార్డు. ఏడాది క్రితం ఐఫోన్ 5సీ, 5ఎస్ మోడల్స్ని ప్రవేశపెట్టినప్పుడు 90 లక్షల మేర అమ్మకాలు జరిగినట్లు యాపిల్ పేర్కొంది. ప్రస్తుతం అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ తదితర పది దేశాల్లో ఈ కొత్త ఐఫోన్లను విక్రయిస్తోంది కంపెనీ. ఈ నెల 26 నుంచి మరో 20 దేశాల్లో విక్రయాలు ప్రారంభించనుంది. కంపెనీ ఊహించిన దానికంటే డిమాండ్ భారీగా ఉందని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. పెద్ద స్క్రీన్తో పాటు మరింత వేగవంతమైన పనితీరు, క్రెడిట్ కార్డు చెల్లింపుల కోసం వైర్లెస్ చిప్ తదితర ఫీచర్లు ఐఫోన్ లేటెస్ట్ వెర్షన్లో ఉన్నాయి. వచ్చే నెల 17న ఇవి భారత మార్కెట్లోకి రానున్నాయి. భారత్లో ఈ ఫోన్ల ధర సుమారు రూ. 48,000 - రూ. 60,000 దాకా ఉండొచ్చని అంచనా.