breaking news
International brand
-
మన ప్రతిభ మెరుస్తుందా?
అందాల పోటీలు మన దేశానికి చాలాసార్లు కిరీటాన్ని తొడిగాయి! కాస్మెటిక్స్కి మంచి మార్కెట్గా మార్చాయి! భారత్కు బ్రాండ్నూ సృష్టించాయి! మన అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్నీ పెంచాయి... ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో స్టార్స్ని చేశాయి! ఆ అవకాశాలు ఇప్పుడు తెలంగాణ వెదుక్కుంటూ వచ్చాయి... మేలో జరగనున్న 73వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ను డెస్టినేషన్గా కోరుకుంటూ! ఆ స్టోరీ...భాష, సంస్కృతి, సంప్రదాయం, భౌగోళిక వైవిధ్యంలో తెలంగాణ.. మన దేశానికి మినియేచర్గా ఉంటుంది. ఆ ప్రత్యేకతే తెలంగాణ రాష్ట్రాన్ని మిస్ వరల్డ్ పోటీలకు వేదికను చేసింది. ఇక్కడి కళలు, చేనేత, పర్యాటకప్రాభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. అందులో భాగంగానే ఈ పోటీలను తెలంగాణలోని పలుచోట్ల నిర్వహించనున్నారు. వీటిని కవర్ చేయడానికి అంతర్జాతీయంగా మూడువేల మీడియా సంస్థలు వస్తున్నాయి. అలా తనకంటూ ఓ బ్రాండ్ను క్రియేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. పోచంపల్లి ఇక్కత్తో 120 దేశాల సుందరీమణులు మెరవబోతున్నారు. హిందూ, ముస్లిం సౌభ్రాతృత్వానికి చిరునామా అయిన లాడ్బజార్లో హెరిటేజ్ వాక్ చేయబోతున్నారు. చౌమొహల్లా ప్యాలెస్లో చవులూరించే రుచులతో విందారగించనున్నారు. వీటన్నిటితోపాటు తెలంగాణ అభివృద్ధి, తమ అబ్జర్వేషన్స్నూ అంతర్జాతీయ మీడియా సంస్థలు.. ఫీచర్స్గానో.. ఆఫ్ బీట్ స్టోరీస్గానో ఫోకస్ చేస్తాయి. అలా తెలంగాణ టాక్ ఆఫ్ ద వరల్డ్ అవుతుందని అందాల పోటీల నిర్వాహకుల అభి్రపాయం. తెలంగాణ కూడా ఇక్కడి పర్యాటకం మీద ప్రపంచదృష్టి పడేలా చేసి తద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశిస్తోంది. ఈ పోటీల్లో లోకల్ మేకప్ ఆర్టిస్ట్లు, హెయిర్ స్టయిలిస్ట్లు, టెక్స్టైల్, కాస్ట్యూమ్ డిజైనర్స్, ఇతర కళాకారులకు అవకాశాలు లభించి, వారి ప్రతిభకు ప్రపంచ గుర్తింపు దొరకనుందా?హైదరాబాద్ను సౌత్ ఫ్యాషన్ హబ్లా మార్చనుందా? ఇక్కడా గ్రూమింగ్ సెంటర్స్, ఇమేజ్ బిల్డింగ్ కన్సల్టేషన్స్, స్కిన్ కేర్ ఇండస్ట్రీస్ ఏర్పడనున్నాయా? ఆయా రంగాల్లోని నిపుణులు ఏమంటున్నారో చూద్దాం!బాధ్యతనూ తీసుకోవాలినారాయణ పేట్ విమెన్ వీవర్స్ మీద నేనొక డాక్యుమెంటరీ చేశాను. లాక్డౌన్ టైమ్లో వాళ్లకో ఉపాధిలా ఉంటుందని తస్రిక వీవింగ్ టెక్నిక్తో అక్కడి స్త్రీలతో చీరలను నేయించాను. వాటికి నేను డిజిటల్ ప్రింట్స్ని యాడ్ చేసి ఆ చీరలతోనే వాళ్లకు మేకోవర్ చేసి నారాయణ పేట్ లోనే వీడియో షూట్, ఫొటో షూట్ చేశాను. ఆ డిజైన్స్ని హైదరాబాద్కి తీసుకొచ్చి పదిహేను రోజులు ఎగ్జిబిషన్లా పెట్టి.. ఆ సేల్స్ని పెంచాం. తర్వాత ఆ చీరలను హ్యాండ్లూమ్ డే రోజు వాళ్లకు గిఫ్ట్గా ఇచ్చాం. ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి చేయూతా దొరక లేదు. అలాగే ఈ అందాల పోటీల వల్ల మన టెక్స్టైల్స్ గురించి ఒక వారం మాట్లాడుకుంటారేమో అంతే! అవకాశాలు రావాలి, పెరగాలంటే మాత్రం టెక్స్టైల్ మినిస్ట్రీ చొరవ తీసుకునిæతెలంగాణ ఫ్యాషన్ హబ్ లాంటిదొకటి ఏర్పాటు చేయాలి. – హేమంత్ సిరి, ఫ్యాషన్ డిజైనర్మంచి అవకాశంనేనైతే దీన్ని పాజిటివ్గానే చూస్తాను. ఈ మిస్ వరల్డ్ కంటెస్ట్ తెలంగాణలో అందాల పోటీలకు ఓ స్పేస్ క్రియేట్ చేస్తుందనుకుంటున్నాను. ఫుట్వేర్, కాస్ట్యూమ్ డిజైనర్స్, హెయిర్ స్టయిలిస్ట్స్, మేకప్ ఆర్టిస్ట్స్ లాంటివాళ్లెందరికో అవకాశాలు దొరుకుతాయి. అంతేకాదు ఈ పోటీల్లో వాడే ఫుట్వేర్, కాస్ట్యూమ్స్ తయారీకీ ఇది హబ్గా మారొచ్చు. గ్రూమింగ్ సెంటర్స్, ఇమేజ్ బిల్డింగ్ కన్సల్టేషన్స్, స్కిన్ కేర్ ఇండస్ట్రీస్కీ స్కోప్ ఉంటుంది. గ్రూమింగ్ వల్ల తర్వాత అమ్మాయిలు ఏ రంగంలోకి వెళ్లాలనుకున్నా ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ ఉపయోగపడతాయి. – కె. అభిమానిక యాదవ్, సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని..మేకప్ రంగంలో మంచి విమెన్ మేకప్ ఆర్టిస్ట్లు ఉన్నారు. కానీ వాళ్లకు అవకాశాల్లేవు. అలాంటి వాళ్లకు ఈ ఈవెంట్స్ ఉపయోగపడాలి. నేను వరుసగా నాలుగేళ్లు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఈవెంట్కి వర్క్ చేశాను. ఆ తర్వాత నుంచి మళ్లీ అబ్బాయిలనే తీసుకుంటున్నారు. అలా కాకుండా దీన్ని తెలంగాణ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని.. అర్హతలు, ప్రమాణాలు, సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని మేకప్ ఆర్టిస్ట్ల నుంచి కొటేషన్స్ను ఆహ్వానించాలి– శోభాలత, సీనియర్ మేకప్ ఆర్టిస్ట్భద్రత.. రక్షణ కల్పించి...ముందు మహిళలకు తగిన భద్రత, రక్షణ కల్పించి.. ఆ తర్వాత మిస్ వరల్డ్ పోటీలకు వేదికను ఇవ్వడం గురించి ఆలోచించాలి. వీటివల్ల తెలంగాణ ప్రతిష్ఠ పెరగడం మాట ఎలా ఉన్నా తెలంగాణ వనరులు విదేశీ పెట్టుబడి సంస్థలకు ధారదత్తం అవడం మాత్రం ఖాయం అని నాకనిపిస్తోంది.– భండారు విజయ, రచయిత, మహిళా హక్కుల కార్యకర్తబ్యూటీ పాజంట్ విత్ తెలంగాణ స్టయిల్ఈ పోటీలు హైదరాబాద్ మొదలుకొని రామప్ప, పోచంపల్లి, చౌమొహల్లా ప్యాలెస్.. ఇలా పలుచోట్ల జరుగుతాయి. వీటివల్ల ప్రపంచం మన కళలు, సంస్కృతి, మన వారసత్వ సంపదను తెలుసుకుంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇక్కడి వైద్య సౌకర్యాలను గమనిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణ వైవిధ్యాన్ని పరిచయం చేయబోతున్నాం. ఈ పోటీలను బ్యూటీ పాజంట్ విత్ తెలంగాణ స్టయిల్ అనుకోవచ్చు. – మామిడి హరికృష్ణ, డైరెక్టర్, భాష – సాంస్కృతిక శాఖ -
అంతర్జాతీయ బ్రాండ్తో అజియో.. ఎందుకంటే?
భారతదేశపు ప్రముఖ ఫ్యాషన్ ఇ-టైలర్ 'అజియో' (AJIO) తన ప్లాట్ఫారమ్కు ఇంటర్నేషనల్ బ్రాండ్ 'హెచ్&ఎమ్'ను జోడిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సహకారం కంపెనీ ఉనికి మరింత బలమైనదిగా చేయడమే కాకుండా.. ప్రజలకు మరింత చేరువకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది.అజియో కంపెనీ.. హెచ్&ఎమ్ సహకారంతో తన అంతర్జాతీయ బ్రాండ్ లైనప్ను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. ఇదే సమయంలో కంపెనీ డిజిటల్ ప్లాట్ఫామ్ను, ఆన్లైన్ మార్కెట్ వాటాను పెంచుకోవాలని చూస్తోంది. ఈ కంపెనీ మహిళలు, పురుషుల దుస్తులు, కిడ్స్వేర్ వంటి వాటిని రూ. 399 ప్రారంభ ధర వద్ద విక్రయిస్తోంది.అజియో, హెచ్ అండ్ ఎమ్ భాగస్వామ్యం గురించి అజియో సీఈఓ వినీత్ నాయర్ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా కంపెనీ అత్యుత్తమ అంతర్జాతీయ బ్రాండ్లను అందించడానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ భాగస్వామ్యంతో మా కస్టమర్లకు సరికొత్త ప్రపంచ బ్రాండ్లను, సరికొత్త ట్రెండ్లను అందించగలమని అన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగులపై ఏఐ ఎఫెక్ట్!.. గ్రేట్ లెర్నింగ్ రిపోర్ట్ఈ సందర్భంగా హెచ్ అండ్ ఎమ్ ఇండియా కంట్రీ సేల్స్ మేనేజర్ 'యానిరా రామిరేజ్' మాట్లాడుతూ.. మా లక్ష్యం ప్రతో ఒక్కరికి మంచి నాణ్యత కలిగిన ఫ్యాషన్ని అందించడమే. అజియోతో మా భాగస్వామ్యం ఈ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి, దేశవ్యాప్తంగా మరింత మంది కస్టమర్లను చేరుకోవడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. భారతదేశంలోని మా కస్టమర్లకు గొప్ప ఫ్యాషన్ అనుభవాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. -
అరకు కాఫీకి ఇంటర్నేషనల్ బ్రాండింగ్.. ఓర్వలేని రామోజీ
-
దశలవారీగా భారత్కు విదేశీ బ్రాండ్లు
నవంబర్లోనే మార్కెట్లోకి అబర్త్ * 2015లో జీప్ బ్రాండ్ తీసుకొస్తాం * సాక్షితో ఫియట్ క్రిస్లర్ ప్రెసిడెంట్ నగేష్ బసవనహళ్లి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న ఇటలీ సంస్థ ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ దశలవారీగా అంతర్జాతీయ బ్రాండ్లను భారత్కు పరిచయం చేయనుంది. ఈ ఏడాది నవంబరులోనే అబర్త్ దేశీయ మార్కెట్లో అడుగుపెడుతోంది. 2015లో జీప్ బ్రాండ్ రానుంది. ఫియట్ క్రిస్లర్ వివిధ దేశాల్లో ఫియట్, అల్ఫా రోమియో, డాడ్జ్, లాన్సియా, ర్యామ్, ఎస్ఆర్టీ బ్రాండ్స్లోనూ పలు మోడళ్లను విక్రయిస్తోంది. మార్కెట్ స్పందననుబట్టి వీటిని ఇక్కడ ప్రవేశపెడతామని ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ప్రెసిడెంట్, ఎండీ నగేష్ బసవనహళ్లి బుధవారం తెలిపారు. హైదరాబాద్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్యూవీ అవెంచురాను విడుదల చేసిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ఒకదాని వెంట ఒకటి.. వచ్చే ఐదేళ్లలో కనీసం 12 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. వీటిలో తొలుత ప్రీమియం హ్యాచ్బ్యాక్ మోడల్ అబర్త్ 500 రానుంది. ధర రూ.25 లక్షల దాకా ఉండే అవకాశం ఉంది. 2015లో పుంటో ఇవో అబర్త్ను తీసుకు రానున్నారు. అలాగే స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ బ్రాండ్ అయిన జీప్ వచ్చే ఏడాది భారత్లో అడుగు పెడుతోంది. జీప్ బ్రాండ్లో ర్యాంగ్లర్, గ్రాండ్ చెరోకీ ఎస్యూవీలు అధికంగా అమ్ముడయ్యే మోడల్స్. వీటినే భారత్కు తీసుకు వచ్చే అవకాశం ఉంది. జీప్ బ్రాండ్ వాహనాలను 2015 నాటికి దేశంలో తయారు చేయాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ఇక రెండేళ్ల పరిశోధన అనంతరం అవెంచురా రోడ్డెక్కింది. 500పైగా ప్రీ బుకింగ్స్ను అవెంచురా సొంతం చేసుకుంది. 15 వేలకుపైగా ఎంక్వైరీలు నమోదయ్యాయి. డిమాండ్నుబట్టి.. కస్టమర్లు తమ అవసరాన్నిబట్టి పెట్రోలు/డీజిల్ కారును ఎంచుకుంటారని నగేష్ తెలిపారు. ‘రెండు రకాల ఇంజిన్లను తయారు చేసే సామర్థ్యం మాకుంది. మార్కెట్ డిమాండ్నుబట్టి ఇంజిన్ల తయారీ చేపడతాం’ అని అన్నారు. 2014-15 తర్వాతి నుంచి ప్రయాణికుల వాహన పరిశ్రమ వృద్ధి బాటన పయనిస్తుందన్న అంచనాలు ఉన్నాయని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో 50 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. పండుగ అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నాయని వెల్లడించారు. మార్కెట్ సెంటిమెంటు తిరిగి పుంజుకుంటున్న సంకేతాలు ఉన్నాయని వివరించారు. వ్యాపార అవకాశాలు ఉన్న అన్ని నగరాల్లో డీలర్షిప్ కేంద్రాలను తెరుస్తామని, ఔత్సాహికులు ఎవరైనా ముందుకు రావొచ్చని చెప్పారు.