-
నేటి నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు బస్సు సర్వీసులు ప్రారంభించనుండగా, మంగళవారం నుంచి మహారాష్ట్రలోని ప్రాంతాలకు మొదలుకానున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు లాక్డౌన్ సడలింపు అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటల తర్వాత ఏపీ సరిహద్దు దాటి, సాయంత్రం 6 లోపు తిరిగి తెలంగాణ సరిహద్దులోకి బస్సులు రాకపోకలు సాగించేలా ప్రణాళిక రూపొందించారు. ఇక కర్ణాటకకూ సోమవారం నుంచే బస్సులు ప్రారంభం అవుతున్నా.. పరిమితంగానే తిరగనున్నాయి. ఎన్ఈకేఆర్టీసీ (కర్ణాటకలోని ఈశాన్య ఆర్టీసీ) మాత్రమే పచ్చజెండా ఊపింది. దాని పరిధిలోని యాద్గిర్, రాయచూర్, బీదర్, గుల్బర్గాలకు సోమవారం నుంచి బస్సులు తిరుగుతాయి. ఉదయం 5 నుంచి రాత్రి 7 వరకు ఆ ప్రాంతంలో లాక్డౌన్ మినహాయింపు ఉండటంతో ఆ సమయాల్లో బస్సులు వెళ్లి వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇక కర్ణాటక ఆర్టీసీ పరిధిలోని బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాలకు ఇంకా అనుమతి రాలేదు. మహారాష్ట్రలోని నాగ్పూర్, చంద్రాపూర్, నాందేడ్ తదితర ప్రాంతాలకు మంగళవారం నుంచి బస్సులు తిరుగుతాయి. ముంబై, పుణే లాంటి దూరప్రాంతాలకు ప్రస్తుతం బస్సులు తిప్పే అవకాశం లేదు. -
ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద మరోసారి భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ సత్ఫలితాలు ఇస్తుండటంతో లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పోలీసుశాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద మరోసారి గందరగోళ వాతావరణం నెలకొంది. లాక్డౌన్ సడలింపు ఉంటుందన్న భావనతో ఏపీ నుంచి భారీగా వాహనదారులు తరలివస్తున్నారు. దీంతో చెక్పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అంతర్రాష్ట్ర సరిహద్దులైన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్పోస్టు వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏపీ నుంచి వచ్చే వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఉదయం 10 గంటల వరకు మినహాయింపు ఉన్నా వాహనాలను నిలిపివేస్తున్నాki. ఈ-పాస్ ఉంటేనే అనుమతి ఇస్తామని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ వాహనాలకు గుర్తింపు కార్డులు తప్పనిసరిన అని పేర్కొన్నారు. అంతేగాక తెలంగాణలో లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం చేయడంతోరా.9 నుంచి ఉ. 8 గంటల వరకు మాత్రమే సరుకు రవాణాకు అనుమతి ఇచ్చింది. ఉదయం 10 తర్వాత గూడ్స్ వాహనాలకు అనుమతి నిరారించింది. అయితే జొమాటో, స్విగ్గిలాంటి ఆన్లైన్ డెలివరీకి అనుమతి ఉంది. చదవండి: లాక్డౌన్.. లాఠీలకు పని చెబుతున్న పోలీసులు -
సరిహద్దులు దాటి రయ్.. రయ్
సాక్షి, హైదరాబాద్: ఏడు నెలల తర్వాత తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. సోమవారం ట్రాన్స్పోర్టు భవన్లో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సునీల్శర్మ, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు.. రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సమక్షంలో అంతర్రాష్ట్ర ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో కొన్ని నెలలుగా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. ఆ వెంటనే ఆర్టీసీ బస్సులు సరిహద్దులు దాటి ముందుకు వెళ్లటం విశేషం. కొత్త ఒప్పందం ప్రకారం.. తెలంగాణకు వచ్చే ఏపీ బస్సుల కంటే, ఏపీకి వెళ్లే తెలంగాణ బస్సులే ఎక్కువ. సరిహద్దు నుంచి పరిశీలిస్తే తెలంగాణ భూభాగమే ఎక్కువగా ఉన్నందున టీఎస్ఆర్టీసీ బస్సుల సంఖ్య ఎక్కువగా నిర్ధారించారు. 826 టీఎస్ఆర్టీసీ బస్సులు ఏపీలో 1,61,258 కి.మీ.లు.. 638 ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తెలంగాణలో 1,60,999 కి.మీ. మేర తిరగనున్నాయి. తెలంగాణ ప్రతిపాదన ప్రకారమే.. రాష్ట్రం విడిపోక ముందు ఆంధ్రప్రాంత భూ భాగంలో వెసులుబాటు ఆధారంగా సింహ భాగం ఆ ప్రాంత డిపో బస్సులే తిరిగేలా షెడ్యూల్స్ రూపొందించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒప్పందం జరగకపోవడంతో అవి అలాగే కొనసాగాయి. ఫలితంగా ఏపీ పరిధిలో టీఎస్ఆర్టీసీ బస్సులు తక్కువగా, తెలంగాణ పరిధిలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఎక్కువగా తిరుగుతూ వచ్చాయి. ఇప్పుడు దాన్ని మార్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు సూచించారు. ఆ మేరకే అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. దా ని ప్రకారం.. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు 1.03 లక్షల కి.మీ. మేర తెలంగాణలో తక్కువగా తిరగాల్సి వస్తోంది. దీనికి బదులు టీఎస్ ఆర్టీ సీ కూడా అంతమేర ఎక్కువగా బస్సులు తిప్పుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ కోరింది. కానీ అది నష్టమే తెస్తుందని గట్టిగా పేర్కొన్న తెలంగాణ, ఏపీ కూడా అంతమేర తగ్గించడమే రెండు ఆర్టీసీలకు మంచిదని వాదించింది. ఇప్పుడు ఆ మేరకే రెండు ఆర్టీసీలు ఒప్పం దం చేసుకున్నాయి. ఈ సమావేశంలో తెలంగాణ ఈడీలు వినోద్కుమార్, వెంకటేశ్వర్లు, పురుషోత్తంనాయక్, యాదగిరి, ఏపీ ఈడీలు బ్రహ్మానందరెడ్డి, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఒప్పందం కుదిరిన వెంటనే బస్సులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఒప్పందంపై ప్రజలకు అవగాహన లేకపోవటంతో బస్టాండ్లకు పెద్దగా ప్రయాణికులు రాలేదు. దీంతో పరిమిత సంఖ్యలో సర్వీసులు నడిపారు. రాత్రి సర్వీసులకు కొంత రద్దీ పెరిగింది. మంగళవారం నుంచి ప్రయాణికుల సంఖ్య ఆధారంగా సర్వీసుల సంఖ్య పెంచుతామని అధికారులు పేర్కొన్నారు. కాస్త ఆలస్యమైనా.. మంచి ఒప్పందం కోవిడ్ నేపథ్యంలో బస్సులు డిపోలకే పరిమితం కావడంతో భారీ నష్టం వాటిల్లింది. ఆ తర్వాత అంతర్రాష్ట్ర సర్వీసుల ఒప్పందంలో కొంత జాప్యంతో రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిరగలేదు. కాస్త ఆలస్యమైనా ఇప్పుడు మంచి ఒప్పందం కుదిరింది. ఇది రెండు ఆర్టీసీలకు మేలు చేస్తుంది. ఈ ఒప్పందం సామరస్యపూర్వకంగా కుదరడంలో ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, ఏపీ రవాణా మంత్రి పేర్నినాని, ఏపీ–తెలంగాణ ఎండీలు కృష్ణబాబు, సునీల్శర్మ, ఈడీలు ఎంతో కృషి చేశారు. వారందరికీ కృతజ్ఞతలు. – మంత్రి పువ్వాడ అజయ్కుమార్ -
మూడున్నర దశాబ్దాలైనా.. పూర్తికాని ‘లెండి ప్రాజెక్టు’
సాక్షి, కామారెడ్డి : అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయిన ‘లెండి’కి ని ధుల గ్రహణం వీడడం లేదు. మూడున్నర దశాబ్దాలు గడచినా పనులు పూర్తికావడంలేదు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మూడున్నర దశాబ్దాల క్రితం పునాదిరాయి పడింది. ఈ ప్రాజెక్టు కింద ఇరు రాష్ట్రాల్లో కలిపి 60వేల పైచిలుకు ఎకరాల భూములకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. కానీ నిర్మాణ పనులకు, భూసేకరణ, నిధుల సమస్యలతో ప్రాజెక్టు పనులు కొనసాగడం లేదు. ప్రాజెక్టు పనులు పూర్తయితే వెనుకబడిన ప్రాంతమైన కామారెడ్డి జిల్లాలోని మద్నూర్, బిచ్కుంద మండలాల్లో దాదాపు 22వేల ఎకరాల మెట్ట భూములు సాగులోకి వస్తాయి. కేవలం వర్షాధారంపైనే ఆధారపడి ఆరుతడి పంటలు సాగు చేస్తున్న రైతులు లెండి ప్రాజెక్టు కోసం ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రాజెక్టు ముంపు రైతులకు పునరావాసం కింద అందించాల్సిన డబ్బులు అప్పట్లో పూర్తి స్థాయిలో చెల్లించకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణం పెండింగులో పడిపోయింది. దీంతో ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి. ప్రాజెక్టు పూర్తి కాకున్నా కెనాల్ పనులు చేపట్టిన దృశ్యం లెండి సామర్థ్యం 6.36 టీఎంసీలు.. మహారాష్ట్రలోని దెగ్లూర్ తాలూకా గోజేగావ్ గ్రామం వద్ద లెండి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 6.36 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ఇందులో మహారాష్ట్రకు 3.93 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 2.43 టీఎంసీల నీటిని వాడుకునేలా నిర్ణయించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.54.55కోట్లు.. ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టిన 1984 సంవత్సరంలో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.54.55 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అప్పట్లో నిధుల సమస్య, భూసేకరణ వంటి సమస్యలతో పనులకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా పనులు ఆగిపోవడంతో ఇప్పుడు అంచనా వ్యయం రూ.వెయ్యి కోట్లు దాటింది. అప్పట్లో ముంపు గ్రామాల రైతులకు పరిహారం విషయంలో అసంపూర్తి చెల్లింపులు జరగడంతో నిర్మాణానికి ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా మహారాష్ట్రలోని దెగ్లూర్, ముఖేడ్ తాలూకాల పరిధిలోని గ్రామాల్లో 39,275 ఎకరాల ఆయకట్టుకు, తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాలోని మద్నూర్, బిచ్కుంద మండలాల్లోని గ్రామాల పరిధిలో 22 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ప్రతిపాదించారు. 75శాతం పనులు పూర్తి.... గోజేగావ్ వద్ద చేపట్టిన లెండి ప్రాజెక్టు నిర్మాణ పనులు దాదాపు 75 శాతం పూర్తయ్యాయి. ప్రాజెక్టుకు 14 గేట్లు నిర్మించాల్సి ఉండగా, 10 గేట్ల నిర్మాణం అప్పుడే పూర్తయ్యింది. మరో నాలుగు గేట్ల నిర్మాణాలు పూర్తి కావలసి ఉంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత లెండి ప్రాజెక్టు పనులను కొలిక్కి తెచ్చే ప్రయత్నం జరిగింది. ప్రాజెక్టు కోసం రూ . 43.14 కోట్లు ఖర్చు చేశారు. అప్పుడు కామారెడ్డి జిల్లా పరిధిలోని మద్నూర్, బిచ్కుంద మండలాలకు సంబంధించి కెనాల్స్ పనులు జరిగాయి. కాని ప్రాజెక్టు పనులు మాత్రం అసంపూర్తిగానే ఉండిపోయాయి. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత లెండి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.554.54 కోట్లని తేల్చారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 42 శాతం కింద రూ.236.10 కోట్లు, మిగతా మొత్తం రూ.318.45 కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర వాటాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.189.73 కోట్లు విడుదల చేసింది. అయినా పనులు మాత్రం ముందుకు సాగలేదు. దీంతో ప్రాజెక్టు అంచనా వ్యయం ఏటేటా పెరుగుతూనే ఉంది. పరిహారమే అసలు సమస్య... మహారాష్ట్రలో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు పరిహారం విషయంలో అక్కడి ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడం వల్లే సమస్య పరిష్కారం కావడంలేదని అంటున్నారు. ఏటేటా అంచనా వ్యయం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం రూ.వెయ్యి కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం చేస్తున్న జాప్యం వల్లే లెండి పనులు పూర్తి కాలేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్తో ప్రాజెక్టులపై జరిగిన చర్చల సందర్భంగా సీఎం కేసీఆర్ లెండి ప్రాజెక్టు సమస్యపై కూడా చర్చించారు. అయినప్పటికీ సమస్య కొలిక్కిరావడం లేదు. రైతుల ఆశలు నెరవేరడం లేదు. జల వనరుల శాఖతోనైనా న్యాయం జరిగేనా.... రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల శాఖలోని ఆయా విభాగాలన్నింటినీ కలిపి జలవనరుల శాఖను ఏర్పాటు చేసింది. కామారెడ్డి జిల్లా పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, ఎత్తిపోతల పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 22వ ప్యాకేజీతో సహా అన్నింటినీ కామారెడ్డిలో ఏర్పాటు చేయబోయే చీఫ్ ఇంజనీర్ పరిధిలోకి తీసుకువచ్చారు. పరిపాలనా సౌలభ్యం కలుగనున్నందున లెండి ప్రాజెక్టు సమస్యపై పర్యవేక్షణ, పరిశీలనకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం లెండి ప్రాజెక్టుపై దృష్టి సారించాలని మద్నూర్, బిచ్కుంద ప్రాంత రైతాంగం వేడుకుంటోంది. ఏండ్ల సంది ఎదురు చూస్తున్నం... మాకు ఎలాంటి నీటి సౌకర్యం లేదు. లెండి ప్రాజెక్టు కడితే నీళ్లు వస్తయని ఏండ్ల సంది ఎదురు చూస్తున్నం. అప్పట్లో కాలువలు తవ్వి, లైనింగ్ జేసిండ్రు. నీళ్లు వచ్చినట్టేనని సంబరపడ్డం. ఏండ్లు గడుస్తున్నా పనులు పూర్తి కాలేదు. నీళ్ల సౌకర్యం లేక వానల మీద ఆధారపడి ఆరుతడి పంటలు వేస్తున్నం. కాలువలు వస్తే మా కష్టాలు తీరుతయి. –రాములు, రైతు, మద్నూర్ లెండి నీళ్లు వస్తయని చెపుతూనే ఉన్నరు... లెండి నీళ్లు వస్తయని, నీళ్లొస్తే మా భూములకు నీటి కష్టం తీరుతదని ఎదురు చూస్తున్నం. మస్తు సంవత్సరాల నుంచి లెండి ముచ్చట చెప్పుతనే ఉన్నరు. ఎప్పుడు కట్టుడు అయిపోతుందో, నీళ్లు ఎప్పుడు వస్తయో తెలుస్తలేదు. వానలు పడితేనే మాకు పంటలు, లేకుంటే ఇబ్బందులు తప్పడం లేదు. సర్కారు ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఆదుకోవాలె. –నాగనాథ్, రైతు, మద్నూర్ -
అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్
– రూ.4.35 లక్షలు విలువ చేసే సొమ్ములు రికవరీ కర్నూలు: కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి తప్పించుకుతిరుగుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సీసీఎస్ డీఎస్పీ హుసేన్ పీరా పర్యవేక్షణలో పలువురు సీఐలు, ఎస్ఐలు బృందాలుగా ఏర్పడి చోరీ కేసులలో నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం చెన్నమ్మ సర్కిల్లోని హైవే బ్రిడ్జి కింద అనుమానాస్పదస్థితిలో తిరుగుతుండగా కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామానికి చెందిన తెలుగు నాగిరెడ్డి, కొత్తపల్లి గ్రామానికి చెందిన షేక్ సద్దాం హుసేన్, మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం చౌడూరు గ్రామానికి చెందిన కుతాటి హరికుమార్ను పోలీసులుఅదుపులోకి తీసుకుని విచారించగా వారి నేరచరిత్ర బయటపడింది. వారి వద్ద నుంచి సుమారు రూ.4.35 లక్షలు విలువ చేసే 14.50 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని శనివారం అదనపు ఎస్పీ షేక్షావలి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీసీఎస్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన దొంగల వివరాలను వెల్లడించారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్: నాగిరెడ్డి, సద్దాం హుసేన్ జల్సాలకు అలవాటు పడి నేరాల బాట పట్టారు. తాళం వేసిన ఇళ్లను ఎంపిక చేసుకుని ముందుగా రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడేవారు. వీరిపై కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో పలు పోలీస్స్టేషన్లలో దొంగతనం కేసులు ఉన్నాయి. కుతాటి హరికుమార్ హత్య కేసులో జైలుకు వెళ్లాడు. అక్కడ నాగిరెడ్డి, సద్దాం హుసేన్తో పరిచయం ఏర్పడింది. చిన్నప్పటి నుంచే చోరీలకు పాల్పడుతూ జైలుకు వెళ్లి తిరిగి బెయిల్పై రావడం, మళ్లీ చోరీలకు పాల్పడటం వీరికి అలవాటుగా మారింది. ఏడాది క్రితం ముగ్గురు నిందితులు బెయిల్పై బయటకు వచ్చి ముఠాగా ఏర్పడి పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. కర్నూలు నగరంతో పాటు ఆదోని, బళ్లారి ప్రాంతాల్లో ఇటీవల ఇళ్ల దొంగతనాలకు పాల్పడ్డారు. పలుమార్లు వీరు జైలు జీవితం గడిపినప్పటికీ మార్పు రాలేదు. కర్నూలులోని నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో మూడు ఇళ్లలో, ఒకటి, రెండు పోలీస్స్టేషన్ల పరిధిలో ఇళ్ల దొంగతనాలకు పాల్పడినట్లు అదనపు ఎస్పీ వివరించారు. నిందితులను పట్టుకుని సొమ్మును రికవరీ చేయడంలో కృషి చేసిన సీఐలు లక్ష్మయ్య, నాగరాజరావు, ఎస్ఐలు నారాయణ, శ్రీనివాసులు, రమేష్ బాబు, లక్ష్మయ్య, హెడ్ కానిస్టేబుల్ మస్తాన్, కానిస్టేబుళ్లు సుదర్శన్, నాగరాజు, రవికిషోర్, సమీర్ తదితరులను అదనపు ఎస్పీ అభినందించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: నేను ఏమాత్రం సంతోషంగా లేను: ప్రీతి జింటా ట్వీట్ వైరల్
పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని
మళ్ళీ బీజేపీదే విజయం: యూపీ డిప్యూటీ సీఎం
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement