-
4 ఏళ్లలో భారీగా ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు
నోయిడా: దేశీయంగా ఎల్రక్టానిక్స్ పరికరాల వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వచ్చే 3–4 ఏళ్లలో భారత్ చెప్పుకోతగ్గ స్థాయిలో విడిభాగాల ఎగుమతిదారుగా ఎదగగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొబైల్ రంగానికి ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకంతో అదనంగా 5 లక్షల ఉద్యోగావకాశాలు వచ్చాయని, రాబోయే అయిదేళ్లలో ఇది మరింతగా పెరుగుతుందని మంత్రి చెప్పారు. ‘దేశీయంగా డిజైన్ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటున్నాం. ఇది దేశానికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఎల్రక్టానిక్స్ పరికరాల తయారీ కూడా వృద్ధి చెందుతోంది. వచ్చే 3–4 ఏళ్లలో మొబైల్ ఫోన్ల తరహాలోనే మనం విడిభాగాలను కూడా గణనీయంగా ఎగుమతి చేయబోతున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. డిక్సన్ టెక్నాలజీస్కి చెందిన నాలుగో మొబైల్ ఫోన్స్ తయారీ యూనిట్ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. డిక్సన్ అనుబంధ సంస్థ ప్యాడ్జెట్ ఎల్రక్టానిక్స్ దీన్ని రూ. 256 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసింది. ఈ ప్లాంటు వార్షిక సామ ర్ధ్యం 2.5 కోట్ల యూనిట్లు కాగా, చైనా కంపెనీ షావో మికి కోసం స్మార్ట్ఫోన్లను తయారు చేస్తారు. ఎల్రక్టానిక్స్ సంస్థల సమాఖ్య ఎల్సినా అంచనల ప్రకారం 2021–22లో దేశీయంగా మొత్తం విడిభాగాల మార్కెట్ 39 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఇందులో 68 శాతం వాటా దిగుమతులదే ఉంటోంది. -
మా కలయికలో పాట చేయలేదనే అసంతృప్తి నాకెప్పటికీ ఉంటుంది
ఏ.ఆర్. రెహమాన్ దాదాపు 22 ఏళ్లుగా పాటలు స్వరపరుస్తున్నాను. ఎప్పుడూ నాకు ఒకే వాద్యం ఇష్టం ఉండదు. కాలాన్ని బట్టి నా ఇష్టం మారుతుంది. కొత్త కొత్త వాద్య పరికరాలు ఎన్ని వచ్చినా ఆ భగవంతుడు ఇచ్చిన ‘స్వరం’కి సాటి రావు. అలాగే, ఒక వాద్యం ఉందనుకోండి. దాన్ని ఉపయోగించి మెరుగైన సంగీతం సమకూర్చినప్పుడే దాని విలువ పెరుగుతుంది. లేకపోతే ఆ వాద్యం సాదాసీదాగా మిగిలిపోతుంది. సంగీతానికి భాషతో సంబంధం లేదు. వినోదానికి కూడా అంతే. నా మనసు బాగున్నప్పుడూ పాట.. బాగాలేనప్పుడూ పాటతోనే నా ప్రయాణం. అయితే, ఎప్పుడైనా నా శక్తి తగ్గుతున్నట్లుగానో, మానసిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నప్పుడో కామెడీ సినిమాలు చూస్తా. తమిళంలో స్టార్ కమెడియన్లుగా వెలిగిన సురుళీ రాజన్, తేంగాయ్ శ్రీనివాసన్, నాగేశ్, ఎస్వీ శేఖర్లు చేసిన కామెడీ చూస్తూ పెరిగినవాణ్ణి. ఈ జాబితాలో చార్లీ చాప్లిన్ని మిస్ చేస్తే, తప్పు చేసినవాణ్ణవుతా. జనాలను నవ్వించి, ఆనందపరిచిన వీళ్లంతా ఎంతో గొప్పవాళ్లు. మాటల్లో వ్యక్తీకరించలేని భావాలను పాట ద్వారా చెబుతుంటాం. అందుకే పాట లేని సినిమా నాకు అసంపూర్ణం అనిపిస్తుంది. మన భారతీయ చిత్రాల్లో ఉండే అందమైన విషయాల్లో పాట ఒకటి. విదేశాల్లో పాటలకు అంతగా ప్రాధాన్యం ఉండదు. కానీ, నేను పని చేసే విదేశీ చిత్రాల్లో కేవలం నేపథ్య సంగీతానికి మాత్రమే కాకుండా పాటలకు ఆస్కారం ఉండటం నాకు ఆనందంగా ఉంటుంది. నాకు ఇళయరాజా గారి పాటల్లో ఎప్పటికీ నచ్చేది ‘కాట్రిల్ వరుమ్ గీతమ్...’. తమిళ చిత్రం ‘జానీ’ (1980) కోసం ఆయన స్వరపరచిన ఈ పాట ఎవర్ గ్రీన్ అనొచ్చు. నేను ఎక్కువసార్లు పాడుకునే పాటల్లో ఇదొకటి.నన్ను నమ్మే దర్శకుల సినిమాలకు పని చేయడం నాకిష్టం. నాకూ, మణిరత్నానికీ మధ్య మంచి అవగాహన ఉంది. బాలీవుడ్లో రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రాతో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఏ విషయాన్నయినా సరే ఆయన ముక్కుసూటిగా చెప్పేస్తారు. ఇక, ఇంతియాజ్ అలీ అయితే ఇప్పటివరకూ మనం చూడని కోణానికి తీసుకెళ్లిపోతారు. సుభా్ష్ ఘయ్ గురించి ఏం చెప్పాలి? సూపర్బ్. ఆశుతోష్ గోవారీకర్ అయితే మరుగున పడిపోయిన మన భారతీయ సంగీతాన్ని మళ్లీ తీసుకువచ్చేలా చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది దర్శకులు ఉన్నారు. నా జీవితంలో ఎప్పటికీ నేను పశ్చాత్తాపానికి గురయ్యే విషయం ఒకటుంది. ప్రపంచం గర్వించదగ్గ పాప్ స్టార్ మైకేల్ జాక్సన్తో పని చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎప్పటికైనా ఆయనను కలవాలనుకునేవాణ్ణి. మైకేల్ జాక్సన్ ఏజెంట్ స్నేహితుడు నా ఏజెంట్కి ఫ్రెండ్. అతని ద్వారానే మైకేల్ను కలిశాను. ఆస్కార్ అవార్డ్ అందుకున్న తర్వాత మొదటిసారి కలిశాను. మొదటిసారి కలిసినప్పుడు నా గురించి నేను పరిచయం చేసుకోవడానికే సరిపోయింది. అప్పుడు నాకు చాలా బెరుకుగా కూడా అనిపించింది. నేను స్వరపరచిన ‘జయహో..’ గురించి ఆయన మాట్లాడినప్పుడు చాలా ఆనందపడ్డాను. ఇండియా అంటే తనకు చాలా ఇష్టమని కూడా మైకేల్ చెప్పారు. రెండోసారి కలిసినప్పుడు ‘ఏఆర్.. మనిద్దరం కలిసి ‘వియ్ ఆర్ ది వరల్డ్..’ లాంటి పాట చేద్దాం అన్నారు. నేను రెండోసారి కలిసిన నెలకు ఆయన చనిపోయారు. మా కలయికలో పాట చేయలేదనే అసంతృప్తి నాకెప్పటికీ ఉంటుంది. నేనెక్కువగా క్లాసికల్ సాంగ్స్ వింటాను. క్లాసికల్ మ్యూజిక్ వినడం ద్వారా నూతనోత్సాహం వస్తుంది. పాప్ మ్యూజిక్ విన్నప్పుడు ఆ ఫీలింగ్ కలగదు. ఎప్పుడైనా పాప్ సాంగ్స్ వినాలనిపిస్తే, కారులో ప్రయాణిస్తున్నప్పుడు వింటాను. ఇంట్లో ఉన్నప్పుడు రేడియోలో వింటాను. అది కూడా చాలా తక్కువగా..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తెలంగాణ: మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్
శతక్కొట్టిన ఆటపట్టు.. టీ20 వరల్డ్కప్ క్వాలిఫయర్ ఛాంపియన్గా శ్రీలంక
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
హీరోయిన్ జాన్వీ కపూర్.. తిరుపతిలో పెళ్లి చేసుకోనుందా?
సీవీడ్తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!
మిస్టర్ బీస్ట్ బర్త్డే గిఫ్ట్ : ఖరీదైన టెస్లా కారు కావాలా నాయనా?
కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్’ (ఫొటోలు)
బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!
తప్పక చదవండి
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement