breaking news
Infrastructure and construction
-
మౌలిక వసతులకు భారీ నిధులు
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు, అందరికీ సామాజిక భద్రత కోసం మౌలిక వసతులకు ఏటా రూ.15 లక్షల కోట్ల చొప్పున బడ్జెట్(Budget 2025-26) కేటాయింపులు అవసరమని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఇలా 25 ఏళ్లపాటు నిధులు వెచ్చించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత కేటాయింపులు రూ.11.5 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. ఐఎస్ఎస్ఏ–ఈఎస్ఐసీ అంతర్జాతీయ సదస్సు సందర్భంగా మంత్రి ప్రసంగించారు.2012లో మౌలిక వసతుల కోసం చేసిన బడ్జెట్ కేటాయింపులు రూ.1.2 లక్షల కోట్లుగానే ఉండేవని, 2014లో నరేంద్ర మోదీ సర్కారు రూ.2.4 లక్షల కోట్లకు పెంచినట్టు గుర్తు చేశారు. ‘2024కు వచ్చే సరికి బడ్జెట్ కేటాయింపులు రూ.11.5 లక్షల కోట్లకు పెరిగాయి. దీన్ని రూ.15 లక్షల కోట్లకు తీసుకెళ్లాలి. వచ్చే 25 ఏళ్ల పాటు ఏటా రూ.15 లక్షల కోట్ల చొప్పున ఖర్చు చేస్తే భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: రియల్టీలో మహిళలకు ఉపాధి ఎక్కడ?దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుండడంతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతున్నట్టు అభిప్రాయపడ్డారు. ఫలితంగా కొత్త రంగాల్లో ఉద్యోగాల కల్పన ఇనుమడిస్తున్నట్టు చెప్పారు. ఈ కొత్త రంగాల్లో (క్విక్ కామర్స్ తదితర) కార్మికులకు సామాజిక భద్రతను ప్రభుత్వం కల్పించాల్సి ఉందన్నారు. -
వైఎస్సార్, జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పన పనులు షురూ
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న వైఎస్సార్, జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం ఇళ్లలో 25 శాతం ఇళ్లు పునాది దశను దాటిన లేఅవుట్లలో ఈ పనులను చేపడుతున్నారు. ఇళ్లులేని పేదలకు ఈ పథకం కింద 30 లక్షలకు పైగా ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 17,005 లేఅవుట్లలో ప్రభుత్వం పేదలకు ప్లాట్లు పంపిణీ చేసింది. తొలిదశలో 10,067 లేఅవుట్లలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇక 17వేల కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ.32,909 కోట్లు ఖర్చుచేస్తోంది. 354 లేఅవుట్లలో విద్యుత్ పనులు తొలిదశ నిర్మాణాలు చేపడుతున్న 10వేల లేఅవుట్లలో రూ.24వేల కోట్లతో మౌలిక సదుపాయాల పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా.. ఇప్పటికే 354 లేఅవుట్లలో విద్యుత్ సరఫరా పనులు ప్రారంభించారు. విద్యుత్ స్తంభాల ఏర్పాటు, వైర్లు లాగడం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు వంటి పనులు చకచకా కొనసాగుతున్నాయి. మరో 2,343 లేఅవుట్లలో పనులు ప్రారంభించడానికి డిస్కమ్లు సర్వే చేపడుతున్నాయి. ఇక లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి ఆధారంగా గృహ నిర్మాణ శాఖ అధికారులు విద్యుత్ అధికారుల సమన్వయంతో పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు. విదుత్ సదుపాయాల కల్పనకు రూ.4,600 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఇందులో భాగంగా గృహ నిర్మాణ శాఖకు నిధులు çసమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వమే రుణదాతలకు హామీ ఇచ్చింది. మరోవైపు.. ఈ ఇళ్లలో అత్యున్నత ఇంధన పొదుపు ప్రమాణాలను పాటించేందుకు ఇండో–స్విస్ బీప్ (బిల్డింగ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ ప్రాజెక్టు) సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. దీంతో బయట ఉష్ణోగ్రతతో పోలిస్తే ఈ ఇళ్లలో 3–5 డిగ్రీలు తగ్గుతుంది. అదే విధంగా రోడ్లు, డ్రెయిన్లు, కాల్వల నిర్మాణం, నీటి సరఫరా, సహా ఇతర సదుపాయాలు కల్పించడానికి సంబంధిత శాఖలు చర్యలు తీసుకుంటున్నాయి. పారిశుధ్యం, పరిశుభ్రత, గ్రీనరీకి ప్రాధాన్యం కాలనీల్లో ఇళ్ల సంఖ్య, లేఅవుట్ విస్తీర్ణాన్ని బట్టి 20, 30, 40 అడుగుల రోడ్లు నిర్మించనున్నారు. 40 అడుగుల రోడ్లు నిర్మించిన చోట రోడ్డు మధ్యలో డివైడర్లు ఏర్పాటుచేస్తారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కింద పారిశుధ్యం, పరిశుభ్రత, గ్రీనరీ కోసం కూడా చర్యలు తీసుకోనున్నారు. 17వేల కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చుచేస్తుండగా ఇందులో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.10,251 కోట్లు, సీసీ డ్రెయిన్లకు రూ.7,227 కోట్లు, నీటి సరఫరాకు రూ.4,128 కోట్లు, విద్యుత్కు రూ.7,080 కోట్లు, ఇంటర్నెట్కు రూ.909 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని లేఅవుట్లో వసతుల కల్పనకు రూ.3,204 కోట్లు కేటాయించారు. అదే విధంగా కాలనీల్లో పర్యావరణ పరిరక్షణ, పారిశుధ్యం నిర్వహణకు సంబంధించిన వసతుల కల్పనకు రూ.110 కోట్లు ప్రభుత్వం వెచ్చించనుంది. ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీలకు దీటుగా.. కాలనీల్లో మౌలిక వసతుల కల్పన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపడుతోంది. ఆ శాఖలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. విద్యుత్ సదుపాయాల కల్పన పనులు చకచకా సాగుతున్నాయి. మిగిలిన శాఖలు తమ పనులు ప్రారంభిస్తున్నాయి. ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీలకు దీటుగా జగనన్న కాలనీల్లో సదుపాయాల కల్పన సీఎం లక్ష్యం. ఆ లక్ష్య సాధనకు కృషిచేస్తున్నాం. – ఎం. శివప్రసాద్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, గృహ నిర్మాణ సంస్థ -
డీఎల్ఎఫ్కు ఐఎస్ఓ సర్టిఫికేషన్
ఈ ఘనత సాధించిన తొలి భారత రియల్టీ కంపెనీ... న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం, డీఎల్ఎఫ్కు ఐఎస్ఓ సర్టిఫికేషన్ లభించింది. హౌజింగ్, కమర్షియల్ ప్రాజెక్ట్లను తగిన నాణ్యతతో సకాలంలో డెవలప్ చేస్తున్నందుకు డీఎల్ఎఫ్ హోమ్ డెవలపర్స్కు ఐఎస్ఓ 9001:2008 క్వాలిటీ సర్టిఫికేషన్ లభించిందని డీఎల్ఎఫ్ సోమవారం తెలిపింది. బ్రిటిష్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ (బీఎస్ఐ) కఠిన నిబంధనలను అందుకోగలిగామని, అందుకే తమకు ఈ సర్టిఫికేషన్ లభించిందని పేర్కొంది. నిర్మాణంలో నాణ్యతను పాటించడం, సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయడం, వినియోగదారుల సంతృప్తి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని బీఎస్ఐ ఈ సర్టిఫికెట్ను అందించిందని వివరించింది. తమ సేవల ప్రమాణాలకు, నిర్మాణ నాణ్యతకు ఈ సర్టిఫికేషన్ నిదర్శనంగా నిలుస్తోందని వివరించింది. ఈ సర్టిఫికెట్ తమకు గొప్ప ప్రోత్సాహాన్నిస్తుందని, మరింత నాణ్యత గల సేవలను అందిస్తామని పేర్కొంది. డీఎల్ఎఫ్ 15 రాష్ట్రాల్లో 24 నగరాల్లో కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. 31.4 కోట్ల చదరపుటడుగుల రియల్టీ ప్రాజెక్టులను చేపట్టింది. ప్రస్తుతం 5.2 కోట్ల చదరపుటడుగుల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.