breaking news
indo- pak border
-
అప్పుడే పుట్టిన నవజాత శిశువు పేరు ‘బోర్డర్’..ఎందుకో తెలుసా?
ఇస్లామాబాద్: ఇటీవలకాలంలో తమ పిల్లల పేర్లు విభిన్నంగా ఉండాలని, పైగా ఆ పేరు ఎవ్వరికి ఉండకూడదని విన్నూతనంగా పెడుతుండటం చూశాం. కానీ ఇక్కడొక జంట తాము భారత్ పాక్ సరిహద్దుల్లో చిక్కుకుపోవడంతో అప్పుడే పుట్టిన తమ బిడ్డకు సరిహద్దు(బోర్డర్) అని పేరుపెట్టుకుని అందర్నీ ఆశ్చర్యపరిచారు. (చదవండి: రెండు వేల ఏళ్లనాటి సమాధుల్లో... బంగారపు నాలుక!!) అసలు విషయంలోకెళ్లితే....ఓ పాకిస్తానీ దంపతులు తమకు పుట్టిన మగబిడ్డకు ‘బోర్డర్’ అని పేరు పెట్టారు. అయితే ఆ జంట 97 మంది పాకిస్తానీ పౌరులతో సహా 71 రోజులుగా అట్టారీ సరిహద్దులో చిక్కుకుపోయారు. ఈ మేరకు ఆ పాకిస్తానీ జంట పంజాబ్ ప్రావిన్స్లోని రాజన్పూర్ జిల్లాకు చెందిన నింబు బాయి, బాలం రామ్లు. ఈ క్రమంలో బాలం రామ్ మాట్లాడుతూ...ఇండో-పాక్ సరిహద్దులో పుట్టినందున మా బాబుకి ఆ పేరు పెట్టాం. నా భార్య నింబు బాయి ఈ నెల డిసెంబర్ 2 న ప్రసవం అయ్యిందని, అంతేకాక తన భార్యకు సాయం చేయడానికి పొరుగున ఉన్న పంజాబ్ గ్రామాల నుండి కొంతమంది మహిళలు రావడమే కాక వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే నేను లాక్డౌన్కు ముందు తమ బంధువులను కలవడమే కాకుండా తీర్థయాత్ర కోసం భారత్కు వచ్చాను. అయితే నా వద్ద తిరిగి వెళ్లేందకు అవసరమ్యే పత్రాలు లేకపోవడంతో ఇతర పాకిస్తానీ పౌరులతో కలిపి సుమారు 98 మందితో సహా ఈ సరిహద్దులో చిక్కుకుపోయాం" అని చెప్పాడు. దీంతో ఈ కుటుంబాలు అట్టారి అంతర్జాతీయ చెక్పోస్టు సమీపంలోని పార్కింగ్ స్థలంలో ఉండిపోయారు. అయితే వారికి స్థానికులు మూడు పూటల భోజనం, మందులు, దుస్తులు అందిస్తున్నారు. (చదవండి: వామ్మో! ఆ దేశం కేవలం పూల వ్యాపారంతోనే.... రూ.180 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందటా!!) -
పాక్ గూఢచారి పావురాల కలకలం
- పాకిస్థాన్ నుంచి పక్షుల ద్వారా రహస్య సమాచారం బట్వాడా - మూడు నెలల్లో పోలీసుల చేతికి చిక్కిన రెండు పావురాలు - 'విశ్వరూపం' తరహా దాడులకు దయాది దేశం కుట్ర! కమలహాసన్ తీసిన 'విశ్వరూపం' సినిమాలో ఉగ్రవాదులు పావురాల ద్వారా రహస్య సమాచారాలతోపాటు యురేనియం వంటి అణు ధార్మిక పదార్థాల్ని శత్రుదేశాలకు చేర్చి, అక్కడ పేలుళ్లకు పాల్పడుతూ ఉంటారు. పావురాల ద్వారా సమాచారం బట్వాడా కొత్తవిషం కానప్పటికీ, దాయాది దేశం నుంచి తరచూ అలాంటివి ఎగిరివస్తుండటం వెనుక కచ్చితంగా కుట్రకోణం దాగుందని భావిస్తున్నాయి భారత భద్రతా బలగాలు. గురువారం భారత్- పాక్ సరిహద్దుల్లోని ఓ గ్రామంలో కనిపించిన తెలుపురంగు పావురం ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లా మన్వాల్ గ్రామస్తుడు రమేశ్ చంద్.. తన ఇంటిమీదుగా వెళుతోన్న ఓ పావురాన్ని పట్టుకున్నాడు. పరీక్షించి చూడగా, దాని రెక్కలపై వేవేవో అక్షరాలు రాసున్నాయి. దీంతో అనుమానం వచ్చి స్థానిక పోలీలకు సమాచారం ఇచ్చాడు. పావురాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దాని రెక్కలపై 'తహశీల్ షకార్గంజ్, జిల్లా నరోవాల్' అని ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో రాసి ఉండటాన్ని గుర్తించారు. రెట్టింపు అనుమానంతో సదరు పావురానికి ఎక్స్ రే పరీక్షలు నిర్వహించారు. అయితే అనుమానిత పదార్థాలేవీ బయటపడన్నప్పటికీ పావురం రెక్కలపై ఉన్న రాతలు ఏదైనా రహస్య సమాచారానికి సంబంధించినవా? అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని పఠాన్ కోట్ ఎస్పీ రాకేశ్ కౌషల్ తెలిపారు. ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఏజెన్సీలతోపాటు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు సమాచారం అందించి అప్రమత్తం చేశామన్నారు. మూడునెలల కిందట గుజరాత్లోని ద్వారకా జిల్లాలోనూ ఇలాంటిదే ఓ పావురం భద్రతా బలగాలకు చిక్కింది. దాని నుంచి 'బెంజింగ్ దువాల్' అని రాసిఉన్న ఒక ఎలక్ట్రానిక్ చిప్, '28733' నంబర్ ముద్రించిన ఓ ఉంగరం, రెక్కల మధ్యలో 'రసూల్- ఉల్- అల్లాహ్' అని అరబిక్ భాషలో రాసిఉన్న సందేశాన్ని గుర్తించారు.