breaking news
Indian Street Premier League (ISPL)
-
సూర్య జట్టు 'చెన్నై సింగమ్స్'దే ISPL టైటిల్
తమిళ నటుడు సూర్య కో-ఓనర్గా ఉన్న చెన్నై సింగమ్స్ జట్టు తొలి ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) టైటిల్ను కైవసం చేసుకుంది. నిన్న (ఫిబ్రవరి 6) జరగిన ఫైనల్లో ఆ జట్టు కోల్కతా టైగర్స్పై 29 పరుగుల తేడాతో గెలుపొందింది. సూరత్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో సింగమ్స్ ఆటగాళ్లు ఆది నుంచే పట్టు సాధించారు. ఈ మ్యాచ్ను సూర్యతో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ప్రత్యక్షంగా వీక్షించాడు. టెన్నిస్ బాల్తో ఆడే ఈ టీ10 లీగ్ దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. ఈ లీగ్కు ఇది మూడో ఎడిషన్. ఈ ఎడిషన్లో కొత్త ప్రతిభలు వెలుగులోకి వచ్చాయి. వివేక్ షెలార్ అనే బౌలర్ రెండు హ్యాట్రిక్లు నమోదు చేశాడు. అంకిత్ యాదవ్ (కోల్కతా) 16 వికెట్లు, ప్రశాంత్ ఘరాట్ (హైదరాబాద్) 203 పరుగులు, నిజామ్ అలీ (అహ్మదాబాద్) 20 వికెట్లు సాధించారు. అవార్డులు - MVP: జగన్నాథ్ సర్కార్ (చెన్నై సింగమ్స్) – బహుమతిగా పోర్షే 911 కారు అందుకున్నాడు. - Best Batter: సైఫ్ అలీ (కోల్కతా టైగర్స్) - Best Bowler: ప్రవీణ్ కుమార్ (హైదరాబాద్ ఫాల్కన్ రైజర్స్) - Best Catch: ప్రతమేష్ ఠాకరే (అహ్మదాబాద్ లయన్స్) మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 10 ఓవర్లలో 103/7 చేసింది. ఓపెనర్లు కేతన్ మ్హాత్రే, జగన్నాథ్ సర్కార్ వేగంగా ఆరంభించారు. కేతన్ రెండో ఓవర్లోనే 28 పరుగులు కొట్టి దూకుడు చూపాడు. మధ్యలో సరోజ్ ప్రమాణిక్ రెండు వికెట్లు తీసి చెన్నై వేగాన్ని తగ్గించినా, సర్ఫరాజ్ ఖాన్ దూకుడు కొనసాగించాడు. చివర్లో గణేష్, సంభాజీ దూకుడు ప్రదర్శనతో చెన్నై భారీ స్కోర్ చేసింది. అనంతరం 104 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో కోల్కతా విఫలమైంది. రాజత్ ముంధే, సరోజ్ ప్రమాణిక్ తొలుత కష్టపడ్డారు. జగన్నాథ్ సర్కార్ కీలక వికెట్ తీసి కోల్కతాను దెబ్బకొట్టాడు. అరిష్ ఖాన్ 25 పరుగులు చేసి కొంత ప్రతిఘటన చూపినా, కోల్కతా స్కోర్ 74/9కే పరిమితమైంది. అనురాగ్ సర్షర్ 3 వికెట్లు తీసి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. సునీల్ కుమార్, అంకుర్ సింగ్ చెరో రెండు వికెట్లు తీశారు. -
ISPL సీజన్ 3 ఓపెనింగ్ ఈవెంట్ లో రామ్ చరణ్ (ఫొటోలు)
-
కొత్తగా మరో క్రికెట్ జట్టు.. కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్
భారత్లో క్రికెట్ ఓ మతం లాంటిది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ ఆటను అభిమానిస్తారనడంలో సందేహం లేదు. అందుకే మనదేశంలో ఎన్ని క్రికెట్ లీగ్లు పుట్టుకొచ్చినా ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో మొదలుకాగా.. వివిధ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు కూడా టీ20 ఫార్మాట్లో లీగ్లు నిర్వహిస్తున్నాయి.టీ10 లీగ్ఈ క్రమంలో గతేడాది టీ10 క్రికెట్ లీగ్ కూడా పురుడుపోసుకుంది. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) పేరిట టెన్నిస్ బాల్తో నిర్వహించే ఈ లీగ్ ద్వారా స్ట్రీట్ లెవల్ టాలెంట్ను కూడా వెలుగులోకి తీసుకురావడం ప్రధాన ఉద్దేశం. ఇక ఈ లీగ్లో ఈ ఏడాది కొత్త జట్టు చేరింది. అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ జట్టు ఐఎస్పీఎల్లో ప్రవేశించింది.ఈ టీ10 లీగ్లో ఇది ఎనిమిదో ఫ్రాంఛైజీ. దీనిని బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గణ్ సొంతం చేసుకున్నాడు. కాగా ఈ లీగ్లో ఇప్పటికే మజీ ముంబై, టైగర్స్ ఆఫ్ కోల్కతా, శ్రీనగర్ కే వీర్, చెన్నై సింగమ్స్, బెంగళూరు స్ట్రైకర్స్, ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ పేరిట ఇప్పటికే ఆరు జట్లు ఉండగా.. బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ న్యూ ఢిల్లీ ఫ్రాంఛైజీని కొనుగోలు చేశాడు.బాలీవుడ్ తారలవే జట్లన్నీఇక మజీ ముంబై ఫ్రాంఛైజీకి బాలీవుడ్ దిగ్గజం, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ యజమాని కాగా.. టైగర్స్ ఆఫ్ కోల్కతాకు సైఫ్ అలీ ఖాన్- కరీనా కపూర్ ఖాన్ దంపతులు, శ్రీనగర్ కే వీర్కు అక్షయ్ కుమార్, చెన్నై సింగమ్స్కు సూర్య, బెంగళూరు స్ట్రైకర్స్కు హృతిక్ రోషన్, ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్కు రామ్ చరణ్ ఓనర్లుగా ఉన్నారు. సినీ ప్రముఖులు యజమానులుగా ఉన్న ఈ లీగ్లో తాజాగా అజయ్ దేవ్గణ్ కూడా చేరడం విశేషం.సచిన్ సంతోషంకాగా ISPLలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కోర్ కమిటీ మెంబర్. ఈ టీ10 లీగ్ ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారని.. జట్ల సంఖ్య పెంచడం ద్వారా మరికొంత మందికి ఆడే అవకాశం దక్కుతుందని సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ఈ లీగ్ మూడో సీజన్ కోసం ఇప్పటికే నలభై లక్షలకు పైగా మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. దేశంలోని 101 పట్టణాల నుంచి రిజిస్ట్రేషన్లు రాగా.. వడపోత తర్వాత ఎంత మంది మిగిలి ఉంటారో చూడాల్సి ఉంది.తొలి టైటిల్ ఎవరిదంటే..ISPL తొలి సీజన్ ఫైనల్లో టైగర్స్ ఆఫ్ కోల్కతా మజీ ముంబైని ఓడించి అరంగేట్ర ఎడిషన్ చాంపియన్గా నిలిచింది. ఇక ఐఎస్పీఎల్-2025లో శ్రీనగర్ కే వీర్పై గెలుపొంది మజీ ముంబై టైటిల్ను ఎగురేసుకుపోయింది.చదవండి: మౌనం వీడిన ఆర్సీబీ.. బిగ్ అప్డేట్.. పోస్ట్ వైరల్


