breaking news
Indian Police Service
-
Year Ender 2024: 180 ఐఏఎస్లు, 200 ఐపీఎస్ల ఎంపిక.. టాప్లో ఏ రాష్ట్రం?
2024 మరికొద్ది గంటల్లో ముగియనుంది. వెంటనే 2025 ఆవిష్కృతం కానుంది. గడచిన 2024 ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్, పోలీస్ సర్వీస్లకు ప్రత్యేకంగా నిలిచింది. 2024లో దేశవ్యాప్తంగా 180 మంది ఐఏఎస్లు, 200 మంది ఐపీఎస్లు ఎంపికయ్యారు.ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ ఆల్ ఇండియా ర్యాంక్ వన్ సాధించారు. అనిమేష్ ప్రధాన్ రెండో ర్యాంక్, అనన్యారెడ్డి మూడో ర్యాంకు దక్కించుకున్నారు. వీరంతా యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించేందుకు ఎంతో కష్టపడ్డారు. నిబద్ధతతో చదువుకుంటూ, ఉత్తీర్ణులై అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో స్థానం సంపాదించారు.2024 యూపీఎస్సీ ఫలితాల్లో ఉత్తీర్ణులైనవారిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్కు చెందిన అభ్యర్థులు అత్యధికంగా ఉన్నారు. యూపీ నుంచి గరిష్టంగా 27 మంది ఐఎఎస్ అధికారులు ఎంపికయ్యారు. రెండో స్థానంలో రాజస్థాన్కు చెందిన 23 మంది అభ్యర్థులు ఐఏఎస్లుగా ఎంపికయ్యారు. బీహార్ నుంచి 11 మంది, మధ్యప్రదేశ్ నుంచి 7 మంది అభ్యర్థులు అధికారులుగా ఎన్నికయ్యారు.ఈ ఏడాది టాప్ 5 ర్యాంకుల్లో ఉన్న ముగ్గురు అభ్యర్థులు ఇప్పటికే ఐపీఎస్ అధికారులు. వన్ ర్యాంక్ సాధించిన ఆదిత్య శ్రీవాస్తవ, నాల్గవ ర్యాంక్ సాధించి పీకే సిద్ధార్థ్ రామ్కుమార్, ఐదవ ర్యాంక్ సాధించిన రౌహానీలు ఇప్పటికే హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. గత 11 ఏళ్లుగా సర్వీస్లో ఉంటున్న ఒక అధికారి యూపీఎస్సీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ వన్ సాధించడం ఇదే తొలిసారి. అంతకుముందు 2013లో ఐపీఎస్ అధికారి గౌరవ్ అగర్వాల్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ వన్ సాధించారు.ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఉద్యోగాల నియామకం కోసం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షను నిర్వహిస్తుంటుంది. ఈ పరీక్షను ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ప్రక్రియతో సహా మూడు దశల్లో నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం సుమారు తొమ్మిది లక్షల నుండి 10 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతుంటారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: జమ్ముకశ్మీర్కు మరింత ప్రత్యేకం.. 2025కు ఇలా స్వాగతం -
కేంద్ర ఉద్యోగాలకు ‘సెట్’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోగాల భర్తీకి ఒకే పరీక్ష ద్వారా చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. అందుకు ఒక ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఐఏఎస్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్), ఐపీఎస్(ఇండియన్ పోలీస్ సర్వీసెస్), ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారిన్ సర్వీసెస్), ఐఎఫ్ఓఎస్(ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్) ఉద్యోగాలతో పాటు గ్రూప్ ఏ, గ్రూప్ బీలోని కొన్ని గెజిటెడ్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మధ్య, దిగువ స్థాయి ఉద్యోగాల భర్తీకి, ముఖ్యంగా కొన్ని గ్రూప్ బీ ఉద్యోగాల కోసం ఏటా పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో.. ‘కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని గ్రూప్ బీ నాన్ గెజిటెడ్ పోస్ట్లు, కొన్ని గ్రూప్ బీ గెజిటెడ్ పోస్ట్స్, గ్రూప్ సీ పోస్ట్ల భర్తీకి ప్రత్యేకంగా ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి, ఆ ఏజెన్సీ ద్వారా కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష ‘కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్(సెట్)’ను నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది’ అని కేంద్ర సిబ్బంది శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై స్పందించాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరామన్నారు. అలాగే, ఉద్యోగార్థులు ఈ ప్రతిపాదనపై స్పందించాలని కోరారు. సెట్ నిర్వహణతో ఉద్యోగార్థులకు, ప్రభుత్వ సంస్థలకు డబ్బు, సమయం ఆదా అవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర చెప్పారు. ప్రధాని లక్ష్యమైన సులభతర పాలనలో భాగంగా ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చామన్నారు. ‘ప్రస్తుతం, ప్రభుత్వ ఉద్యోగం కోసం వేర్వేరు సంస్థలు ప్రకటించే వేర్వేరు ఉద్యోగాలకు అభ్యర్థులు వేరుగా దరఖాస్తు చేయాల్సి వస్తోంది. వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ప్రాంతాల్లో జరిగే ఆ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడం నుంచి పరీక్షకు హాజరవడం వరకు అభ్యర్థి అనేక వ్యయ ప్రయాసలకు లోనవాల్సి వస్తోంది. అందువల్ల ఒకే ఏజెన్సీ నిర్వహించే ఒకే పరీక్ష ద్వారా అభ్యర్థి వివిధ ఉద్యోగాలకు ఒకేసారి ప్రిపేర్ కావచ్చు’ అని అన్నారు. అధికారిక లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 6,83,823 ఖాళీలున్నాయి. -
వాంటెడ్ ‘ఐపీఎస్’!
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారుల కొరత పోలీసు విభాగాన్ని తీవ్రంగా వేధిస్తోంది. అవసరమైన సంఖ్యలో ఉన్నతాధికారులు లేకపోవడం, మరికొందరిని అప్రాధాన్య విభాగాలకు బదిలీ చేయడంతో ఈ ఇబ్బంది తీవ్రమైంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్రానికి 40 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించా లంటూ.. తెలంగాణ హోంశాఖ కేంద్రానికి విన్నవించింది. త్వరలోనే ఈ మేరకు రాష్ట్రానికి కేటాయింపులు ఉంటాయనే ధీమాతో ఉంది. తగినంతమంది ఐపీఎస్లు లేని కారణంగానే ప్రస్తుతం 8 జిల్లాలకు నాన్ కేడర్, అదనపు ఎస్పీ స్థాయి అధికారులనే ఎస్పీలుగా నియమించారు. మరోవైపు రాష్ట్రంలో 23 మంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు పదోన్నతులు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలిచ్చినా.. వారికి కొత్త పోస్టింగులు ఇవ్వలేదు. ఐజీలు, డీఐజీ వంటి కీలక పోస్టులకు సైతం ఐపీఎస్ అధికారులు లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇంకోవైపు ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డిప్యుటేషన్లకు అనుమతి రావడంతో త్వరలోనే వారు రాష్ట్రాన్ని వీడనున్నారు. రాష్ట్రానికి అవసరానికంటే తక్కువ అధికారులను కేంద్రం కేటాయించడం కూడా ఈ పరిస్థితికి ఓ కారణమని చెప్పవచ్చు. 10 నుంచి 33 కావడంతో...: 2016 వరకు తెలంగాణలో కేవలం 10 జిల్లాలు మాత్రమే ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం వాటి సంఖ్యను 33కు పెంచింది. వీటిలో కొత్త కమిషనరేట్లు కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 18 పోలీసు జిల్లాలు.. వీటికి అదనంగా 9 పోలీసు కమిషనరేట్లు ఉన్నాయి. ఒకేసారి ఈ స్థాయిలో పెరగడంతో ఐపీఎస్లకు డిమాండ్ ఏర్పడింది. కొరత కారణంగా 8 జిల్లాలకు నాన్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఎస్పీలుగా నియమించారు. మరోవైపు డీసీపీ ర్యాంకుల్లోనూ వీరినే నియమించారు. మామూలుగా అయితే, ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితి వేరుగా ఉండేది. ఒక ఐపీఎస్ అధికారి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టడానికి కనీసం ఆరేళ్లు సమయం పట్టేది. కానీ, కొత్త జిల్లాల ఆవిర్భావంతో అనివార్యంగా ఆ అనుభవం లేకపోయినా, అసలు ఐపీఎస్ కాకపోయినా ఎస్పీలుగా పని చేయాల్సి వస్తోంది. అదనపు బాధ్యతలు.. ఆకస్మిక బదిలీలు, పెరుగుతున్న రిటైర్మెంట్లు కూడా డిపార్ట్మెంట్లో కొత్త ఐపీఎస్ల అవసరాన్ని నొక్కిచెబుతున్నాయి. ఇప్పటికే కీలకమైన కొన్ని పోస్టులు ఖాళీగా ఉండగా, మరికొన్నింటిని ఇతర అధికారులకు అదనపు బాధ్యతగా అప్పజెప్పారు. హైదరాబాద్ రేంజ్, వరంగల్ రేంజ్లకు డీఐజీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వెస్ట్జోన్ ఐజీగా ఉన్న స్టీఫెన్రవీంద్ర ఏపీకి డిప్యుటేషన్పై వెళ్లి తిరిగి వచ్చారు. దీంతో అప్పటివరకు ఆ బాధ్యతలను అదనంగా పర్యవేక్షించిన వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డికి ఉపశమనం కలిగింది. జైళ్లశాఖ డీజీగా ఉన్న వీకే సింగ్ను కొంతకాలం క్రితం ప్రింటింగ్ విభాగానికి బదిలీ చేయడంతో ఆ బాధ్యతలను రోడ్ సేఫ్టీ అండ్ రైల్వేస్ అడిషనల్ డీజీ సందీప్ శాండిల్యకు అప్పగించారు. తర్వాత వీకే సింగ్ను తెలంగాణ స్టేట్ పోలీసు అకాడమీ (టీఎస్పీఏ) డైరెక్టర్గా పంపారు. ప్రింటింగ్ డీజీగా గోపీకృష్ణను నియమించారు. మొన్నటిదాకా హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న రాజీవ్ త్రివేదిని జైళ్లశాఖ డీజీగా బదిలీ చేశారు. దీంతో శాండిల్యకు అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభించింది. ప్రస్తుతం హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా ఏడీజీ (టెక్నికల్)గా సీనియర్ ఐపీఎస్ అధికారి రవిగుప్తా నియమితులయ్యారు. తన స్థానంలో మరొకరు వచ్చే వరకు రెండు పదవుల్లోనూ రవిగుప్తానే విధులు నిర్వహించనున్నారు. గత జూన్లో గద్వాల ఎస్పీ లక్ష్మీనాయక్, మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరరావులు రిటైరయ్యారు. వనపర్తి ఎస్పీ అపూర్వరావుకు గద్వాల ఇన్చార్జి ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. త్వరలో రిటైరయ్యేది వీరే.. ప్రస్తుతం అడిషనల్ సీపీలుగా ఉన్న ఐపీఎస్ అధికారులు మురళీకృష్ణ, శివప్రసాద్ ఆగస్టులో రిటైరయ్యారు. ప్రస్తుతం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కు ఎండీగా ఉన్న మల్లారెడ్డి, వరంగల్ సీపీగా ఉన్న రవీందర్, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న నవీన్చంద్ వచ్చే ఏడాది జూన్, సెపె్టంబర్లలో రిటైర్ కానున్నారు. ఎస్ఐబీలో పనిచేస్తోన్న ప్రభాకర్రావు కూడా వచ్చే ఏడాదే పదవీ విరమణ చేయనున్నారు. వీరితోపాటు డీజీపీ ర్యాంకులో ఉన్న రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ కృష్ణప్రసాద్, టీఎస్పీఏ అడిషనల్ డీజీగా ఉన్న వీకే సింగ్లు వచ్చే ఏడాదే పదవీ విరమణ చేయనున్నారు. డిప్యుటేషన్లు సైతం..! సీనియర్ ఐపీఎస్ అధికారులు అడిషనల్ డీజీ సౌమ్యమిశ్రా (పోలీస్ వెల్ఫేర్), ఐజీ అకున్ సబర్వాల్ (పౌరసరఫరాల శాఖ కమిషనర్)లు డిప్యుటేషన్కు అర్జీ పెట్టుకున్నారు. తొలుత అకున్ సబర్వాల్కు అనుమతి వచ్చింది. రాష్ట్రం కూడా ఇటీవల అనుమతించడంతో ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లారు. గతంలో సౌమ్య మిశ్రాను ఒడిశా క్యాడర్కు వెళ్ళేందుకు కేంద్రం అనుమతించగా.. రాష్ట్రం కూడా సుముఖత తెలిపింది. దీంతో ఆమె డిసెంబర్లో రాష్ట్రాన్ని వీడనున్నారు. మరోవైపు కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు సంతోష్మెహ్రా చేసుకున్న దరఖాస్తుకు సైతం గ్రీన్సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. మొన్నటిదాకా టీఎస్పీఏ డైరెక్టర్గా ఉన్న ఆయన్ను ఆ విధుల నుంచి తప్పించడమూ ఇందుకు బలం చేకూరుస్తోంది. వాస్తవ సంఖ్య ఇదీ.. తెలంగాణ రాష్ట్ర అవసరాల దష్ట్యా పోలీసుశాఖలో 139 మంది ఐపీఎస్ అధికారులు ఉండాలి. కానీ, కేంద్రం 112 మందినే కేటాయించింది. ఇందులో ఖాళీలు, రిటైర్మెంట్లు, ఇతర శాఖలకు బదిలీలు పోను కేవలం 96 మంది మిగిలారు. వీరిలో ఇద్దరు అధికారులు ఆగస్టులో రిటైరయ్యారు. ఇప్పటికే అకున్ సబర్వాల్ వెళ్లిపోయారు. త్వరలోనే సౌమ్యా మిశ్రా రాష్ట్రాన్ని వీడనున్నారు. దీంతో ఈ సంఖ్య 92కు పడిపోనుంది. అంటే కేంద్రం కేటాయించిన అధికారుల కంటే 20 మంది, వాస్తవ సంఖ్య కంటే 47 మంది ఐపీఎస్ అధికారులు తక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కనీసం 40 మంది ఐపీఎస్ అధికారులు కావాలని కేంద్రానికి పంపిన ప్రతిపాదనలకు అనుమతి లభిస్తుందని తెలంగాణ హోంశాఖ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. -
ఐపీఎస్ల ఖాళీలు... 930
న్యూఢిల్లీ: సివిల్స్ ఆశావహుల్లో ఐఏఎస్ తర్వాత ఎక్కువ మంది కోరుకునే ఐపీఎస్లో దేశవ్యాప్తంగా 930 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ కేడర్కు సంబంధించి 51 ఖాళీలు కూడా ఉన్నాయి. దేశం మొత్తం మీద 4,728 ఐపీఎస్ అధికారుల పోస్టులు ఉండగా, అందులో సీనియర్ అధికారులకు సంబంధించి 930 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఖాళీల్లో 105 ఉత్తరప్రదేశ్కు సంబంధించినవే. ఆ తర్వాత పశ్చిమబెంగాల్లో 96, ఒడిశాలో 83 ఖాళీలు ఉన్నాయి. ఐపీఎస్ అధికారుల పోస్టులను భర్తీ చేసేందుకు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ దేశవ్యాప్తంగా వివిధ కేడర్లలో ఖాళీలు ఇంకా ఉంటున్నాయని ఆయన చెప్పారు.