breaking news
Indian Foreign Secretary
-
ఉగ్రవాదులకు అధికారిక అంత్యక్రియలా?
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ దాడిలో హతమైన ఉగ్రవాదులకు పాకిస్తాన్ సైన్యం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించటంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి పనులు ఆ దేశానికి అలవాటుగా మారాయని మండిపడింది. ఆపరేషన్ సిందూర్పై గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. పాక్లో లష్కరే తోయిబా ఉగ్రవాది నాయకత్వంలో ఆ దేశ సైన్యం, పోలీసులు ఉగ్రవాదుల మృతదేహాలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఫొటోలను ప్రదర్శించారు. ఇలాంటి చర్యలతో పాకిస్తాన్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. భారత్ దాడుల్లో సాధారణ పౌరులు మరణించారన్న పాకిస్తాన్ ప్రకటనను ఖండించారు. ‘దాడుల్లో నిజంగా సామాన్య పౌరులే మరణిస్తే.. మరి ఈ ఫొటోలో ఉన్నదేమిటి? సామాన్యుల మృతదేహాలను శవపేటికల్లో పెట్టి.. వాటిపై పాకిస్తాన్ జాతీయ జెండాలు కప్పి, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారా?’అని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. తమ దాడుల్లో చనిపోయినవాళ్లంతా ఉగ్రవాదులేనని స్పష్టంచేశారు. ‘ఉగ్రవాదంతో మలినమైన చేతులను కడుక్కొనేందుకు పాకిస్తాన్ ప్రయతి్నస్తోంది. పాకిస్తాన్లో ఉగ్రవాదులే లేరని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఓ టీవీ చర్చలో ప్రకటించారు. కానీ, ఆ చర్చలోనే ఆయన తన ప్రకటనకు గట్టి సవాలు ఎదుర్కొన్నారు. ఉగ్రవాదానికి పాకిస్తానే కేంద్ర స్థానమని అనేక సందర్భాల్లో నిరూపణ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు భారత్తోపాటు అనేక దేశాల వద్ద ఉన్నాయి’అని మిస్రీ పేర్కొన్నారు. పుట్టినప్పటి నుంచీ అబద్ధాలే ∙ పాకిస్తాన్పై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ ధ్వజం న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఉగ్రవాదుల శిబిరా లు, వారి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ తేల్చిచెప్పారు. భారత్కు వ్యతిరేకంగా ముష్కర మూకలకు పాకిస్తాన్ నిస్సిగ్గుగా మద్దతిస్తోందని, ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని చెప్పారు. పాకిస్తాన్తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో టెర్రరిస్టు క్యాంపులపై జరిగిన దాడికి మతం రంగు పులుముతోందని పాక్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పుట్టినప్పటి నుంచి పాకిస్తాన్ అబద్ధాలే చెబుతోందని విమర్శించారు. 1947 నుంచి పాకిస్తాన్ అబద్ధాలు వినడం అందరికీ అలవాటైపోయిందని అన్నారు. విక్రం మిస్రీ గురువారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడా రు. పాకిస్తాన్ తీరుపై విరుచుకుపడ్డారు. ‘‘1947లో పాకిస్తాన్ సైన్యం జమ్మూకశ్మీర్పై దాడికి దిగింది. కానీ, ఆ దాడితో సంబంధం లేదంటూ ఐక్యరాజ్యసమితికి అబద్ధాలు చె ప్పింది. కేవలం గిజరినులే జమ్మూకశ్మీర్లోకి చొరబడ్డారని నమ్మబలికింది. భారత సైన్యం, ఐరాస బృందం అక్కడికి చేరుకుంటే అసలు సంగతి తెలిసింది. చివరకు చేసేది లేక తమ సైన్యమే జమ్మూకశ్మీర్పై దాడి చేసినట్లు పాకిస్తాన్ అంగీకరించింది. పాకిస్తాన్ అబద్ధాల ప్రయాణం 75 ఏళ్ల క్రితమే మొదలైంది కాబట్టి ఇది మాకు ఆశ్చర్యం కలిగించడం లేదు. పహల్గాంపై పాక్ అలాంటి అబద్ధాలే చెబుతోంది. తప్పుడు ప్రచారంతో నమ్మించాలని చూస్తోంది. ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న భారత యుద్ధ విమానాలను కూల్చేశామంటూ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. పుట్టుక నుంచే అబద్ధాలు మొదలు పెట్టిన పాకిస్తాన్ను నమ్మాల్సిన అవసరం లేదు. మసీదులపై భారత్ సైన్యం దాడి చేయలేదు భారత్కు చెందిన 15 సైనిక స్థావరాలపై దాడిచేసేందుకు పాక్ ప్రయతి్నంచగా భారత సైన్యం సమర్థంగా అడ్డుకుంది. భారత్ను ఎదుర్కొనే సత్తా లేని పాకిస్తాన్ మత ఉద్రిక్తతలు సృష్టించడానికి కుట్రలు పన్నుతోంది. ప్రజలను రెచ్చగొట్టడానికి మతంకార్డు వాడుతోంది. జమ్మూకశ్మీర్లోని పూంచ్లో సిక్కు మతస్తులే లక్ష్యంగా పాక్ సైన్యం దాడులు చేసింది. గురుద్వారాతోపాటు సిక్కు ఇళ్లపై దాడికి దిగింది. ఈ దాడుల్లో 16 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. మసీదులపై భారత సైన్యం దాడి చేసిందంటూ పాక్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఉగ్రవాదుల క్యాంపులే ఇండియన్ ఆర్మీ లక్ష్యం. నిజానికి ఉగ్రవాదులకు మసీదుల్లో ఆశ్రయం కలి్పంచింది పాకిస్తానే. మసీదులను రక్షణగా వాడుకోవడం నిజం కాదా? ఆపరేషన్ సిందూర్లో మరణించిన ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించడం దారుణం. పహల్గాంలో పర్యాటకుల మతం అడిగి మరీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భారత్లో పాక్ ఆటలు సాగవు. ఇక్కడ మతం పేరిట రెచ్చగొట్టాలని చూస్తే ఎవరూ రెచ్చిపోరు. పహల్గాంలో ఉగ్రదాడిని మతాలకు అతీతంగా భారతీయులంతా ఖండించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని నీలం–జీలం ప్రాజెక్టును ఇండియా టార్గెట్ చేసిందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాం. ఈ సాకుతో ఇండియాలోని మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే జరగబోయే పరిణామాలకు పాకిస్తానే బాధ్యత వహించాలి’’అని విక్రం మిస్రీ స్పష్టంచేశారు. -
నేడు భారత్, పాక్ కార్యదర్శుల భేటీ
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక చర్చలకు మరో అడుగు ముందుకు పడింది. అనుకోకుండా ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల భేటీ ఖరారైంది. ఢిల్లీలో జరిగే ‘హార్ట్ ఆఫ్ ఏసియా’ ప్రాంతీయ భేటీలో పాల్గొనేందుకు పాక్ విదేశాంగ కార్యదర్శి అజీజ్ అహ్మద్ చౌదరి మంగళవారం భారత్కు రానున్నారు. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్. జైశంకర్తో భేటీ కానున్నారు. -
వేటు వెనుక..?
*ప్రధాని అసంతృప్తే కారణం! భారత విదేశాంగ శాఖ కార్యదర్శి పదవి నుంచి సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి సుజాతాసింగ్ను అర్ధంతరంగా తొలగిం చటం వెనుక కారణాలేమిటి? అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. సుజాతాసింగ్ తొలగింపు అర్ధాంతరమే అయినప్పటికీ.. ఆకస్మిక నిర్ణయమేమీ కాదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఆమె పనితీరుపై ప్రధానమంత్రి మోదీ ఆరంభం నుంచీ అసంతృప్తిగానే ఉన్నారని.. ఆమెను ఆ పదవి నుంచి తొలగించాలని ఆయన కొంత కాలం కిందే భావించినప్పటికీ.. ఆమెను కొనసాగించాలని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ కోరటంతో ఈ వ్యవహారాన్ని కొంత కాలం వాయిదా వేసినట్లు సమాచారం. అలాగే.. అమెరికాలో భారత రాయబారిగా ఉన్న జైశంకర్ను విదేశాంగ కార్యదర్శిగా నియమించాలని కూడా ప్రధాని కొంత కాలం కిందటే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన ముగిసే వరకూ జైశంకర్ను అమెరికా రాయబారిగా కొనసాగించాలని ఆయన భావించారని.. అందుకే ఒబామా పర్యటన ముగిసే వరకూ వేచివున్నారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. సుజాతాసింగ్ తొలగింపు, జైశంకర్ నియామకం వ్యవహారానికి సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలివీ... * సుజాతాసింగ్ 1976 బ్యాచ్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. ఆమె భారత్ పొరుగు దేశాల్లో ఏ దేశంలోనూ రాయబారిగా పనిచేయలేదు. ఆమె2013 ఆగస్టులో విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. వాస్తవానికి ఆ సమయంలోనే సీనియారిటీలో ముందున్న సుజాతాసింగ్ను కాదని.. అమెరికాలో భారత రాయబారిగా ఉన్న ఎస్.జైశంకర్ను విదేశాంగ కార్యదర్శిగా నియమించాలని అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ భావించారు. అయితే.. నాటి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ నాయకత్వం అందుకు నిరాకరించటంతో.. సుజాతాసింగ్నే ఆ పదవిలో నియమించారు. సుజాతాసింగ్.. ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ అయిన టి.వి.రాజేశ్వర్ కుమార్తె. ఆయనను కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా పరిగణించేవారని.. యూపీఏ హయాంలో సుజాతాసింగ్ను విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమించటానికి ఆ అంశం కూడా చూపిందని అంటారు. * సుజాతాసింగ్ కన్నా జైశంకర్ ఒక ఏడాది జూనియర్. రక్షణ రంగ వ్యూహకర్త కె.సుబ్రమణ్యం కుమారుడైన జైశంకర్ 1977 బ్యాచ్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. జైశంకర్కు పొరుగు దేశమైన చైనాలో అత్యధిక కాలం భారత రాయబారిగా పనిచేసిన అధికారిగా రికార్డు ఉంది. సింగపూర్, చెక్ రిపబ్లిక్లలో కూడా ఆయన భారత రాయబారిగా పనిచేశారు. అంతర్జాతీయ సంబంధాలు, అందునా అణు దౌత్యంలో పీహెచ్డీ చేసి డాక్టరేట్ పొందిన జైశంకర్.. ఏడేళ్ల కిందట భారత్, అమెరికాల మధ్య అణు ఒప్పందం కుదరటంలో పోషించిన పాత్ర కారణంగా ఆయనను విదేశాంగ కార్యదర్శిగా నియమించాలని నాడు మన్మోహన్ భావించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు వివరించాయి. * ఇక.. సుజాతాసింగ్ విదేశాంగ కార్యదర్శిగా ఉన్నపుడు అమెరికా - భారత్ల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. ముఖ్యంగా అమెరికాలో జూనియర్ దౌత్యాధికారిగా పనిచేస్తున్న దేవయాని ఖోబ్రాగడెను వీసా అక్రమాల ఆరోపణలపై అమెరికా పోలీసులు అరెస్ట్ చేయటంతో ఇరు దేశాల సంబంధాలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. * మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆ రాష్ట్రంలో జరిగిన మత హింస నేపథ్యంలో ఆయనకు పదేళ్ల పాటు వీసా నిరాకరించిన అమెరికా వైఖరిలో మార్పు వచ్చేందుకు.. ప్రధానిగా మోదీ అమెరికా పర్యటన విజయంతం అయ్యేందుకు.. ఆ తర్వాత భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేలా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఒప్పించటంలో జైశంకర్ దిగ్విజయంగా కృషి చేశారని.. ఆయన విదేశాంగ కార్యదర్శిగా ఉండటం వల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని మోదీ భావించారు. * అమెరికాలో భారత రాయబారిగా ఉన్న డాక్టర్ సుబ్రమణ్యం జైశంకర్ ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే.. ఆయన పదవీ కాలం ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో.. ఆయనను భారత విదేశాంగ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విదేశాంగ కార్యదర్శిని అర్థంతరంగా తొలగించటం ఇది రెండోసారి. 1987లో అప్పటి విదేశాంగ కార్యదర్శి ఎ.పి.వెంకటేశ్వరన్ను నాటి ప్రధాని రాజీవ్ తొలగించారు. - సెంట్రల్ డెస్క్