breaking news
indian design
-
బ్రౌన్ స్కిన్ బార్బీ.. భారతీయ మహిళ ఆహార్యంలో..!
‘బ్రౌన్ ఈజ్ బ్యూటిఫుల్’ అనే పదాన్ని ఇప్పుడు ప్రపంచమంతా గుర్తిస్తుంది. బ్రౌన్ స్కిన్ మేకప్ను ప్రాచుర్యంలోకి తేవడానికి దక్షిణాసియా బార్బీ డాల్ అమెరికన్ సీఇవో దీపికా ముత్యాల ఫస్ట్ ఇండియన్ స్కిన్టోన్ బార్బీని ఆవిష్కరించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును పొందింది. మహిళల హిస్టరీ మంత్ వేడుకలో భాగంగా ఈ యేడాది మార్చిలో తన బ్యూటీ బ్రాండ్ను ఆవిష్కరిస్తూ చూపిన ఈ రూపం ఇప్పటికీ ప్రజల నుంచి విశేష స్పందన అందుకుంటోంది. బార్బీ అనగానే తెల్లగా, నీలికళ్లతో ఉండే నాజూకైన రూపంతో ఉండే బొమ్మ మన మనసులో కదలాడుతుంది. ‘ఈ బార్బీని చూడండి. ఆమె చర్మం ముదురు గోధుమ రంగు, ఆమె కళ్లు పెద్దవి, వెడల్పాటి కనుబొమ్మలు, జూకాలు, గాజులు ధరించి పవర్సూట్తో సగర్వంగా ఉంటుంది. ఆమె ఈ ప్రపంచ సవాళ్లను తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇది ఆమె గుర్తింపు. ఆమె సాంస్కృతిక అడ్డంకులను విచ్ఛిన్నం చేస్తుంది. ఉన్నత లక్ష్యాలు, సానుభూతి, దయతో ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది’ అంటూ నేటి ఆధునిక భారతీయ మహిళ ఆహార్యాన్ని ఈ కొత్త బార్బీ రూపంలో తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా పరిచయం చేసింది. దీనికి వ్యూవర్స్ నుంచి ఎన్నో ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పుడు దీపికను అంతా ‘బ్రౌన్ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్’ అని పిలుస్తున్నారు. దక్షిణాసియా సమాజంలోని చర్మ రంగులను, విదేశాల్లో ఉన్న బ్యూటీ ప్రమాణాలను రెండింటినీ అంచనా వేసిన దీపికా ఈ రంగంలో ఏదైనా కొత్తదనం తీసుకురావాలనుకుంది. తన చిన్నతనంలో నీలిరంగు కళ్లతో తెల్లగా ఉండే బార్బీని గుర్తుచేసుకుంది. ఈ బొమ్మకు భారతీయ శైలికి తగినవిధంగా రూపొందించాలనుకుంది. అందుకు బొమ్మ రంగును ముదురు గోధుమ వర్ణంలో తీర్చింది. దీపికా ముత్యాల బ్రౌన్ స్కిన్ మేకప్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన లైవ్ టిండెడ్ బ్యూటీ బ్రాండ్ ఫౌండర్ కూడా. ‘ప్రజలు ఈ బొమ్మను తమదిగా చేసుకోవడానికి, అలాగే ముదురు గోధుమ రంగుకు ఉన్న ప్రాధాన్యతను ప్రపంచం ముందుంచడానికి చేసిన ప్రయత్నం ఇది’ అని చెబుతుంది ఈమె. నిజానికి చాలా బ్యూటీ ప్రొడక్ట్లు రంగులను దృష్టిలో ఉంచుకుని తయారు చేయరు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ 2015లో ముదురు గోధుమ రంగు చర్మంపై పై బ్యూటీ ఉత్పత్తులను ఎలా ఉపయోగించాలో చెబుతూ ఆమె చేసిన వీడియో వైరల్ అయ్యింది. 2018లో ఈ విభాగంలోనే ఆన్లైన్ కమ్యూనిటీని ప్రారంభించింది. 2019 నాటికి ఆల్–ఇన్–వన్ కలర్ కారెక్టర్, లిప్స్టిక్, ఐ షాడో, బ్లష్ను అభివృద్ధి చేయడానికి అనేకమంది నుంచి అభిప్రాయాలను సేకరించి, బార్బీని ఇలా ఆవిష్కరించింది. ప్రపంచ దృష్టిని ఆకట్టుకునేలా ఓ కొత్త ఆలోచనతో ఇండియన్ బార్బిని ఆవిష్కరించిన దీపికకు అభిమానులు ఇంకా విస్తృతస్థాయిలో తమ అభినందనలు తెలియజేస్తున్నారు. -
ఇండియన్ డిజైన్ గార్మెంట్స్లో విస్తృత తనిఖీలు
పరిగి : పరిగిలోని ఇండియన్ డిజైన్ గార్మెంట్ ఫ్యాక్టరీ నిర్వాహకులు సమీపంలోని జయమంగళి నది నుంచి ఫ్యాక్టరీలో భవనాల నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలింపులపై మండల రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. ఫ్యాక్టరీలో ఇసుక అక్రమ నిల్వలపై ‘సాక్షి’ ఇటీవల కథనం ప్రచురించింది. స్పందించిన తహశీల్దార్ గోపాలకృష్ణ రెవెన్యూ సిబ్బంది సహాయంతో ఫ్యాక్టరీలోకి మంగళవారం వెళ్లి భారీ ఇసుక నిల్వలను గుర్తించారు. సుమారు70-80 ట్రాక్టర్ల పరిమాణంలో ఇసుక నిల్వలను గుర్తించిన తహశీల్దార్ ఫ్యాక్టరీ సిబ్బందిపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఇన్చార్జి సందీప్తో మాట్లాడిన తహశీల్దార్ ఎవరి అనుమతితో ఈ ఇసుకను తరలించారని ప్రశ్నించారు. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి రుసుం చెల్లించకుండా వందలాది ట్రాక్టర్ల ఇసుకను తరలించేందుకు మీకెంత ధైర్యమని నిలదీశారు. ఫ్యాక్టరీలో నిల్వ ఉన్న ఇసుకను సీజ్ చేస్తున్నామని, ఈ ఇసుకను కట్టడాలకు వాడితే అదనంగా మరో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఫ్యా క్టరీ నుంచి జయమంగళి నదిలోని ఫ్యాక్టరీ వారు ఏర్పాటు చేసుకున్న అడ్డదారిని తహశీల్దార్ పరిశీలించారు. అనంతరం జయమంగళి నదిలోకి వెళ్లి ఎంత పరిమాణంలో ఇసుక తరలించారనే విషయాలను గుర్తించారు. అ నంతరం ఫ్యాక్టరీలో ఇసుక డంపులను గుర్తించిన విషయాన్ని తహశీల్దార్ గోపాలకృష్ణ ఆర్డీవో రామ్మూర్తికి తెలిపారు. తహశీల్దార్ వెంట ఆర్ఐ సుబ్బారావు, వీఆర్వో రఘు, సిబ్బంది ఉన్నారు. అక్రమ ఇసుక తరలింపుపై ‘సాక్షి’ కథనం వెలువడిన వెంటనే ఫ్యాక్టరీలోని భారీ ఇసుక నిల్వలను వేరే ప్రదేశాలకు గుట్టుచప్పుడు కాకుండా తరలించడం గమనార్హం.