మేరీకోమ్కు మరో గౌరవం
భారత బాక్సర్ మేరీకోమ్కు మరో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఏఐబీఏ) మేరీకోమ్ను ‘లెజెండ్స్ అవార్డ్’తో సత్కరించనుంది. డిసెంబరు 20న ఆమెకు ఈ అవార్డు అందిస్తారు. ‘ఈ గౌరవం లభించడం పట్ల చాలా ఆనందంగా ఉన్నాను. నాతో పాటు దేశంలోని యువ బాక్సర్లకు ఇది స్ఫూర్తినిస్తుంది’ అని మేరీకోమ్ తెలిపింది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ కాంస్యం సాధించిన ఈ మణిపురీ బాక్సర్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలు కూడా.