breaking news
Indian Aces team
-
ఇండియన్ ఏసెస్ ‘హ్యాట్రిక్’
మనీలా (ఫిలిప్పీన్స్): అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్లో డిఫెండింగ్ చాంపియన్ ఇండియన్ ఏసెస్ జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. యూఏఈ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఇండియన్ ఏసెస్ జట్టు 30-18 గేమ్ల తేడాతో నెగ్గి ‘హ్యాట్రిక్’ సాధించింది. ఆడిన ఐదు సెట్లలోనూ ఏసెస్ జట్టుకు విజయం దక్కడం విశేషం. మిక్స్డ్ డబుల్స్లో బోపన్న-సానియా మీర్జా (ఏసెస్) ద్వయం 6-4తో నెస్టర్-మ్లాడెనోవిచ్ (రాయల్స్) జోడీపై... మహిళల సింగిల్స్లో సమంత స్టోసుర్ (ఏసెస్) 6-3తో మ్లాడెనోవిచ్ (రాయల్స్)పై... పురుషుల లెజెండ్స్ సింగిల్స్లో సాంతోరో 6-3తో ఇవానిసెవిచ్ (రాయల్స్)పై... పురుషుల డబుల్స్లో నాదల్-డోడిగ్ (ఏసెస్) జోడీ 6-3తో నెస్టర్-బెర్డిచ్ జంటపై... పురుషుల సింగిల్స్లో నాదల్ (ఏసెస్) 6-4తో బెర్డిచ్ (రాయల్స్)పై గెలిచారు. -
ఏసెస్కు రాయల్స్ షాక్
మిక్స్డ్ డబుల్స్లో సానియా-ఫెడరర్ జంట ఓటమి - అలరించిన జొకోవిచ్ - ఐపీటీఎల్ న్యూఢిల్లీ: సొంతగడ్డపై ఇండియన్ ఏసెస్ జట్టు దూకుడుకు పగ్గాలు వేయడంలో యూఏఈ రాయల్స్ జట్టు సఫలమైంది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో ప్రపంచ నంబర్వన్ నొవాక్ జొకోవిచ్ ప్రాతినిధ్యం వహిస్తున్న యూఏఈ రాయల్స్ జట్టు 29-22 పాయింట్ల తేడాతో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సభ్యుడిగా ఉన్న ఇండియన్ ఏసెస్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్తో ఢిల్లీ దశ పోటీలు ముగిశాయి. ఇక ఈ లీగ్లో చివరిదైన నాలుగో అంచె పోటీలు ఈనెల 11 నుంచి 13 వరకు దుబాయ్లో జరుగుతాయి. ప్రస్తుతం ఇండియన్ ఏసెస్ 30 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 27 పాయింట్లతో యూఏఈ రాయల్స్, మనీలా మావెరిక్స్ ఉమ్మడిగా రెండో స్థానంలో; 17 పాయింట్లతో సింగపూర్ స్లామర్స్ మూడో స్థానంలో ఉన్నాయి. మహిళల సింగిల్స్గా జరిగిన తొలి మ్యాచ్లో క్రిస్టినా మ్లాడెనోవిచ్ 6-5తో అనా ఇవనోవిచ్ను ఓడించి యూఏఈ రాయల్స్కు శుభారంభాన్ని ఇచ్చింది. రెండో మ్యాచ్గా జరిగిన లెజెండ్స్ సింగిల్స్లో గొరాన్ ఇవానిసెవిచ్ 6-3తో ఫాబ్రిస్ సాంతోరోపై గెలిచి రాయల్స్కు రెండో విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో తొలుత సంప్రాస్ బరిలోకి దిగినా స్కోరు 1-4 వద్ద ఉన్నపుడు అతను వైదొలిగాడు. సంప్రాస్ స్థానంలో సాంతోరో సబ్స్టిట్యూట్గా ఆడాడు. మూడో మ్యాచ్గా జరిగిన మిక్స్డ్ డబుల్స్లో ఫెడరర్-సానియా మీర్జా ద్వయం 2-6 తేడాతో నెనాద్ జిమోనిచ్-మ్లాడెనోవిచ్ చేతిలో ఓటమి పాలైంది. ఇక నాలుగో మ్యాచ్గా జరిగిన పురుషుల డబుల్స్లో ఫెడరర్-మోన్ఫిల్స్ జంట 6-5తో జిమోనిచ్-జొకోవిచ్ జోడీపై గెలిచింది. అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఫెడరర్, జొకోవిచ్ల మధ్య జరిగిన చివరిదైన పురుషుల సింగిల్స్ మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. పదునైన ఏస్లు, సుదీర్ఘ ర్యాలీలు, చురుకైన కదలికలతో ఈ ఇద్దరు మేటి ఆటగాళ్లు అభిమానులను అలరించారు. స్కోరు 5-5తో సమం కావడంతో ఐపీటీఎల్ నిబంధనల ప్రకారం ఐదు నిమిషాల షూటౌట్ను నిర్వహించారు. ఈ షూటౌట్లో ఫెడరర్ గెలిచాడు. అయితే వీరిద్దరి మధ్యే మరో గేమ్ను నిర్వహించగా.. ఈ గేమ్లో జొకోవిచ్ నెగ్గాడు. దాంతో ఈ ఇద్దరి మ్యాచ్ 6-6తో సమంగా ముగిసింది. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్లో మనీలా మావెరిక్స్ జట్టు 23-17తో సింగపూర్ స్లామర్స్పై గెలిచింది. -
ఇండియన్ ఏసెస్ ‘హ్యాట్రిక్’
మూడో మ్యాచ్లో 28-20తో యూఏఈ రాయల్స్పై గెలుపు ఫిలిప్పీన్స్: ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ జట్టు ‘హ్యాట్రిక్’ విజయాలు సాధించింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో ఏసెస్ 28-20తో యూఏఈ రాయల్స్ను ఓడించింది. మహిళల సింగిల్స్లో అనా ఇవనోవిచ్ 4-6తో క్రిస్టినా మల్డోనోవిచ్ చేతిలో ఓడింది. అయితే తర్వాతి నాలుగు మ్యాచ్ల్లో ఏసెస్ ఆటగాళ్లు సత్తా చాటారు. మిక్స్డ్ డబుల్స్లో సానియా-బోపన్న ద్వయం 6-3తో జిమోన్జిక్-మల్డోనోవిచ్లపై గెలిచింది. పురుషుల డబుల్స్లో బోపన్న-మోన్ఫిల్స్ జోడి 6-4తో జిమోన్జిక్-సిలిచ్పై; సింగిల్స్లో మోన్ఫిల్స్ 6-3తో మాలెక్ జజీర్పై నెగ్గారు. పురుషుల లెజెండ్ సింగిల్స్లో సంటారో 6-4తో ఇవానిసెవిచ్ను ఓడించి ఏసెస్కు స్పష్టమైన ఆధిక్యంతో విజయాన్ని అందించాడు. మరో మ్యాచ్లో మనీలా మావెరిక్స్ 27-19తో సింగపూర్ స్లామర్స్పై నెగ్గింది. ప్రస్తుతం ఏసెస్ జట్టు 12 పాయింట్లతో పట్టికలో టాప్లో కొనసాగుతుండగా, రాయల్స్ 10, మనీలా 7, సింగపూర్ స్లామర్స్ 4 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.