-
గ్రూప్ టాపర్ యువ భారత్
బ్లూమ్ఫోంటీన్ (దక్షిణాఫ్రికా): అండర్–19 క్రికెట్ ప్రపంచ కప్లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా న్యూజిలాండ్తో శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. దాంతో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచిన భారత జట్టు 6 పాయింట్లతో గ్రూప్ ‘టాపర్’గా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 23 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 115 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో 21 ఓవర్ల అనంతరం వర్షం రావడంతో మ్యాచ్ 4 గంటలకుపైగా ఆగిపోయింది. వాన తగ్గాక అంపైర్లు మ్యాచ్ను 23 ఓవర్లకు కుదించారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (57 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), దివ్యాన్ష్ సక్సేనా (52 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం డక్వర్త్ లూయీస్ పద్దతి ద్వారా న్యూజిలాండ్కు 23 ఓవర్లలో 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఛేదనకు దిగిన కివీస్ జట్టు 21 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటై ఓడింది. భారత లెగ్ స్పిన్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రవి బిష్ణోయ్ (4/30)తో ప్రత్యర్థిని కట్టడి చేయగా... అతనికి అథర్వ అన్కోలేకర్ (3/28) చక్కటి సహకారం అందించాడు. జనవరి 28న జరిగే సూపర్ లీగ్ తొలి క్వార్టర్ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. -
యువ భారత్దే సిరీస్
కొలంబో: ఓపెనర్ యశస్వి జైస్వాల్ (114 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీతో కదం తొక్కడంతో శ్రీలంక అండర్–19 జట్టుతో జరిగిన చివరి యూత్ వన్డేలో భారత అండర్–19 జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్ను యువ భారత్ 3–2తో సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మోహిత్ జాంగ్రా రెండు... హైదరాబాద్ క్రికెటర్ అజయ్ దేవ్గౌడ్, సిద్ధార్థ్ దేశాయ్, హర్‡్ష త్యాగి, ఆయుష్ బదోని, సమీర్ చౌదరి ఒక్కో వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత యువ భారత్ 42.4 ఓవర్లలో 2 వికెట్లకు 214 పరుగులు చేసి గెలుపొందింది. యశస్వి తొలి వికెట్కు దేవ్దత్ పడిక్కల్ (38; 6 ఫోర్లు)తో 71 పరుగులు... పవన్ షా (36)తో రెండో వికెట్కు 72 పరుగులు, కెప్టెన్ ఆర్యన్ జుయల్ (22 నాటౌట్)తో మూడో వికెట్కు అజేయంగా 69 పరుగులు జతచేసి భారత్కు విజయాన్నందించాడు. -
యువ భారత్ జయభేరి
హంబన్టోటా: శ్రీలంక అండర్–19 జట్టుతో జరిగిన రెండో యూత్ టెస్టులోనూ భారత అండర్–19 జట్టు జయభేరి మోగించింది. శుక్రవారం ముగిసిన ఈ మ్యాచ్లో యువ భారత్... ఇన్నింగ్స్ 147 పరుగుల తేడాతో గెలుపొంది 2–0తో సిరీస్ క్లీన్స్వీప్ చేసింది. ఓవర్నైట్ స్కోరు 47/3తో నాలుగో రోజు ఆట కొనసాగించిన లంక భారత బౌలర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్లో 62.2 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. పెర్నాండో (28) టాప్స్కోరర్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సిద్ధార్థ్ దేశాయ్ (4/40), బదోని (2/17), మంగ్వాని (2/9)లు చెలరేగడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన లంక పరాజయం పాలైంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 613/8 వద్ద డిక్లేర్డ్ చేయగా... శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 316లకే పరిమితమై ఫాలోఆన్ ఆడిన విషయం తెలిసిందే. -
క్రికెట్ జట్టు: సచిన్ కొడుకుకు పిలుపు!
న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ను భారత అండర్-19 క్రికెట్ జట్టులోకి తీసుకున్నారు. వచ్చేనెల శ్రీలంకతో జరగనున్న అండర్-19 సిరీస్లో అర్జున్ టెండూల్కర్ భారత జట్టు తరఫున ఆడనున్నాడు. జూలైలో శ్రీలంకలో జరగనున్న ఈ సిరీస్లో భాగంగా భారత అండర్-19 జట్టు రెండు ఫోర్ డే మ్యాచులు, ఐదు వన్డే మ్యాచులు ఆడనుంది. 18 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం ఆల్రౌండర్గా రాణిస్తున్నాడు. ఫోర్డే మ్యాచుల్లో భారత జట్టుకు అతను ప్రధాన ఆటగాడు కానున్నాడు. అయితే, ఐదు వన్డే మ్యాచులకు ప్రకటించిన జట్టులో మాత్రం అతన్ని తీసుకోలేదు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఉనాలోని జోనల్ క్రికెట్ అకాడమీ (జెడ్సీఏ)లో ఏర్పాటుచేసిన క్యాంపులోని ప్రధాన అండర్-19 ఆటగాళ్లలో ఒకడిగా అర్జున్ ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాడు. -
భారత్కు రెండో విజయం
రాణించిన రిషబ్ పంత్ అండర్-19 ముక్కోణపు సిరీస్ కోల్కతా: ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన భారత యువ జట్టు... అండర్-19 ముక్కోణపు సిరీస్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో టీమిండియా 33 పరుగుల తేడాతో అఫ్ఘానిస్తాన్పై విజయం సాధించింది. జాదవ్పూర్ యూనివర్సిటీ కాంప్లెక్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో... టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్ (88 బంతుల్లో 87; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. మహిపాల్ (62 బంతుల్లో 43; 6 ఫోర్లు), కెప్టెన్ రికీ భుయ్ (27) ఫర్వాలేదనిపించారు. అమన్దీప్ ఖరే (24)తో కలిసి రెండో వికెట్కు 62 పరుగులు జోడించిన పంత్... భుయ్తో మూడో వికెట్కు 75 పరుగులు సమకూర్చాడు. ఓ దశలో 201/6 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న భారత్... 35 పరుగుల తేడాలో చివరి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. రషీద్ ఖాన్ 4 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన అఫ్ఘానిస్తాన్ 47.3 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. రషీద్ ఖాన్ (43) టాప్ స్కోరర్. మహ్మద్ సర్దార్ (33), ముస్లిం మూసా (27), ఇసానుల్లా (25) ఓ మాదిరిగా ఆడారు. పేసర్ కలీల్ అహ్మద్ (4/41) ధాటికి అఫ్ఘాన్ టాప్ ఆర్డర్ విఫలమైంది. చివర్లో రషీద్, సర్దార్లు ఎనిమిదో వికెట్కు 62 పరుగులు జోడించి గెలిపించే ప్రయత్నం చేసినా భారత బౌలర్లు సమర్థంగా అడ్డుకున్నారు. ప్రమాణిక్, మహిపాల్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ గెలుపుతో భారత్ ఖాతాలో మొత్తం 9 పాయింట్లు ఉన్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
ధర్మాగ్రహం ముందు నిలవని దాదాగిరి
కన్నీటి సుడులు.. కరిగె మారాజు
ఎవరినీ వదిలిపెట్టను
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement