యువ భారత్‌దే సిరీస్‌

Jaiswal hits ton as India U-19 win one-day series in Sri Lanka - Sakshi

కొలంబో: ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (114 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో కదం తొక్కడంతో శ్రీలంక అండర్‌–19 జట్టుతో జరిగిన చివరి యూత్‌ వన్డేలో  భారత అండర్‌–19 జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌ను యువ భారత్‌ 3–2తో సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరి వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.

భారత బౌలర్లలో మోహిత్‌ జాంగ్రా రెండు... హైదరాబాద్‌ క్రికెటర్‌ అజయ్‌ దేవ్‌గౌడ్, సిద్ధార్థ్‌ దేశాయ్, హర్‌‡్ష త్యాగి, ఆయుష్‌ బదోని, సమీర్‌ చౌదరి ఒక్కో వికెట్‌ పడగొట్టారు.  ఆ తర్వాత యువ భారత్‌ 42.4 ఓవర్లలో 2 వికెట్లకు 214 పరుగులు చేసి గెలుపొందింది. యశస్వి తొలి వికెట్‌కు దేవ్‌దత్‌ పడిక్కల్‌ (38; 6 ఫోర్లు)తో 71 పరుగులు... పవన్‌ షా (36)తో రెండో వికెట్‌కు 72 పరుగులు, కెప్టెన్‌ ఆర్యన్‌ జుయల్‌ (22 నాటౌట్‌)తో మూడో వికెట్‌కు అజేయంగా 69 పరుగులు జతచేసి భారత్‌కు విజయాన్నందించాడు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top