breaking news
incedents
-
మేఘాలయ షిల్లాంగ్లో ఘోర ప్రమాదం! బావిలో విషవాయువుతో..
మేఘాలయ: మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. శుక్రవారంరోజున ఒక ప్రైవేట్ నిర్మాణ స్థలంలోని ఓ బావిలో విషవాయువుతో ఐదుగురు మృతి చెందారు.తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా పోలీసు అధిపతి వివేక్ సియెమ్ తెలిపిన వివరాల ప్రకారం.. లాపాలాంగ్ ప్రాంతంలోని ప్రైవేట్ స్థలంలో ఉన్నటువంటి బావిలో నలుగురు కూలీలు నీరు తోడుతున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది. బావిలో ఉన్నటువంటి జనరేటర్ నుంచి విషపూరిత వాయువు వెలువడింది. ఈ పొగ కారణంగా వారికి ఊపిరాడక అక్కడే కుప్పకూలారు. అయితే, వీరిని రక్షించేందుకు అదే ప్రాంతంలో నివసించే ఇద్దరు సొంత సోదరులు బావిలోకి దిగారు. దీంతో దట్టమైన పొగ ఎక్కువవడంతో వారుకూడా అందులోనే చిక్కుకుపోయారు. ఎలాగోలా ఒక వ్యక్తి మాత్రం సురక్షితంగా బయటపడగలిగాడు.సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, తక్షణమే రెస్క్యూ టీంతో రక్షణ చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకుండాపోయింది. ఈ విషాదకర దుర్ఘటనలో ఐదుగురు ప్రాణాలు విడిచారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అయితే, పోస్టుమార్టం నుంచి ఖచ్చితమైన నివేదికలు వచ్చిన తరువాతే మరణాలకు గల అసలు కారణాలేంటో స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు. -
అడగగానే ఇవ్వొద్దు.. ఆలోచించనిద్దాం!
పుణేలో కోట అంచున నిలబడ్డ ప్రేమ ఒక్కతోపుతో హత్యగా మారింది. బెంగళూరులో నట్టనడి ఇంట్లో నిలుచున్న ప్రేమ నెత్తురు పారించింది. ఈ రెండు ఘటనలూ ‘ఇప్పుడే కావాలి’ అనే ఆవేశానివే. ‘ఇవ్వాళ ఆలోచించి రేపు మాట్లాడాలి’ అనే సంస్కారం పోయి ‘ఇప్పుడే తేల్చేయాలి’ అనే తెంపరితనం ఇది. దీని పేరు – ఇన్ స్టంట్ గ్రాటిఫికేషన్. అంటే ‘తక్షణ సంతృప్తి’ అనే మానసిక జ్వరం. బిర్యానీ నుంచి బంధాల వరకు, ప్రోటీన్ షేక్ నుంచి ప్రతీకారం వరకు– అంతా ‘క్విక్ డెలివరీ’ కావాల్సిందే. వేచి చూడలేని మనసు వేటు వేయడానికి వెనుకాడడం లేదు. ఓపిక నేర్పని ఫోన్ లు... ఓదార్పు మరచిన జెన్ జెడ్. మెదడులో ‘పాజ్’ బటన్ చెడిపోతే జీవితం ‘ఫాస్ట్ఫార్వర్డ్’లో నేరం వైపు పరుగెడుతుంది. ఇది ట్రెండ్ కాదు, టైం బాంబ్. ఆపకపోతే ప్రతి ఇల్లు ఒక క్రైమ్ సీన్ అవుతుంది. ‘ఇప్పుడే వద్దు, కాస్త ఆగి ఆలోచించండి’... ఈ ఒక్క మాటే ఇవాళ మీ పిల్లలకు మీరు ఇవ్వాల్సిన ఆస్తి.‘ఈరోజే... ఇప్పుడే’ ‘ధనా ధన్ ఫటా ఫట్’ ధోరణి అనేది సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన ఆనంద సూత్రం(ప్లెజర్ ప్రిన్సిపుల్). ఇదిప్రాథమిక అవసరాలను తక్షణమే తీర్చుకోవడానికి, బాధను తప్పించుకోవడానికి ప్రేరేపించే ఒక సహజ ప్రవృత్తి... ప్లెజర్ ప్రిన్సిపుల్. ఫ్రాయిడ్ ప్రతిపాదించిన ఈ సూత్రం మానవ మనస్తత్వంలోప్రాథమిక నియంత్రణ శక్తిగా పనిచేస్తుంది.దీర్ఘకాలిక మానసిక సమస్య‘ఇప్పటి ఈ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ వల్ల దీర్ఘకాలికంగా కొన్ని మానసిక సమస్యలకు రావచ్చు. తాము కోరుకున్నది తక్షణమే నెరవేరాలని ఆశించేలా చేస్తుంది... ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్. దీనివల్ల వేచి ఉండడం, ఓపికగా ఉండే గుణం తగ్గిపోతుంది. నిరంతర తృప్తి తొందరపాటును సృష్టిస్తుంది. తట్టుకునే శక్తిని తగ్గిస్తుంది. ఎదురుదెబ్బలు తట్టుకోలేమనే భావన కలిగిస్తుంది’ అని హెచ్చరిస్తున్నారు కోల్కతాలోని సీఎంఆర్ఐ ఆసుపత్రి సైకియాట్రిస్ట్ డా.అంబరీష్ ఘోష్.ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ కారణంగా జెన్ జెడ్ వినియోగ విధానాలలో, వ్యక్తిత్వంలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఏకాగ్రత తగ్గిపోవడంతో... టీ 20 మ్యాచ్లకుప్రాధాన్యత పెరిగింది, థియేటర్లకు వెళ్లడం కంటే ఓటీటీప్రాచుర్యం పొందింది.తొందరపాటు వద్దుమార్కెట్కు వెళ్లి బేరసారాలు చేసి, ఆ తర్వాత వంట చేయడాన్ని చాలామంది శ్రమగా భావిస్తున్నారు. దీంతో త్వరిత డెలివరీ యాప్లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఇలా ఆధారపడడం అనేది తొందరపాటు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి దారి తీయవచ్చు. ఆటిస్టిక్ లక్షణాలతో అనేక సవాళ్లకు దారితీయవచ్చు’ అని హెచ్చరిస్తున్న ఘోష్...ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ ప్రభావాన్ని తగ్గించడానికి... సహనం పెరిగేలా చేయడం, ఆలస్యంగా లభించే ప్రతిఫలాలను ప్రోత్సహించడం, సామాజిక విలువలను పెంపొందించడం తప్పనిసరి’ అని సలహా ఇస్తున్నారు.క్విక్–ఫిక్స్ థింకింగ్‘మనం చేసే పనులు, మనం శ్రద్ధ పెట్టే విషయాలకు స్పందనగా మన మెదళ్లు నిరంతరం మారుతుంటాయి. ఉదాహరణకు... మనం తొందరపడి అనారోగ్యకరమైన చిరుతిండి తిన్నా, ఆన్లైన్లో ఏదైనా కొన్నా, ఆ చర్యలకు సంబంధించి మన మెదడు మార్గాలు బలపడతాయి. ఇదే తరువాత బలమైన అలవాటుగా మారుతుంది. ఆ అలవాటుకు దూరం కావడం కష్టమవుతుంది.తక్షణ సంతృప్తి(ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్) వైపు దారి తీసే పనులు అనారోగ్యకరమైన, అనాలోచిత ప్రవర్తనకు దారి తీసేలా చేస్తాయి. కాలక్రమేణా...శరీరంపై తీవ్రమైన భారం మోపేలా చేస్తాయి. ఆసక్తిని రేకెత్తించే ఏ ఆన్లైన్ వస్తువైనా వెంటనే కొనెయ్యాలనుకోవడం క్రెడిట్ కార్డ్పై అదనపు భారాన్ని మోపుతుందనేది ఒక విషయం అయితే, మరొకటి... కుటుంబసభ్యులతో గడుపుతున్నప్పుడు కూడా సోషల్ మీడియా చూడాలనిపిస్తుంది. దీంతో కుటుంబసభ్యులతో పొడి పొడిగా మాట్లాడడం, యాంత్రికంగా సంభాషించే ధోరణి పెరుగుతుంది. తక్షణ సంతృప్తినిచ్చే వాటి కోసం అన్వేషణ సాగిస్తున్న కొద్దీ, ఆ ఫలితాన్ని అందుకోవడానికి చాలాకాలం ముందే మన మెదళ్లలో డోపమైన్ ఉప్పొగుతుంది’ అని చెబుతున్నాడు మానసిక విశ్లేషకుడు ఆస్టిన్ పెర్ల్మటర్. తక్షణ సంతృప్తి (ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్)లోని ప్రతికూల కోణాలపై ‘ది రియల్ ఇష్యూ విత్ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్: హౌ క్విక్–ఫిక్స్ థింకింగ్ క్రియేట్స్ప్రాబ్లమ్స్’ పేరుతో విశ్లేషణాత్మక వ్యాసం రాశాడు ఆస్టిన్.దూరంగా ఉన్నవారే... విజయానికి దగ్గరయ్యారు...స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ చేసిన ఒక అధ్యయనం...‘తక్షణ తృప్తికి దూరంగా ఉండే పిల్లలు ఎన్నో విజయాలు సాధించారు’ అని చెబుతోంది.ఈ అధ్యయనంలో భాగంగా... ఒక పిల్లవాడికి తక్షణం అందే ఒక చిన్న బహుమతి, కొంత సమయం వేచి ఉంటే రెండు చిన్న బహుమతులు... అని రెండు ఆప్షన్లు ఇచ్చారు.రెండో ఆప్షన్ వైపు మొగ్గు చూపిన పిల్లలు ఆ తరువాత కాలంలో చదువులలో మంచి విజయం సాధించారు. పెద్దయ్యాక ఎక్కువ ఆదాయం సంపాదించారు.స్టాన్ఫోర్డ్ స్టడీ ఇలా చెప్పింది...∙ఆకస్మిక కోరిక లేదా బలమైన కోరిక స్వీయ–నియంత్రణతో దగ్గరి సంబంధం ఉంటుంది ∙వేచి ఉండడానికి ఇష్టపడే వారిలో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ కాస్త గట్టిగా ఉంటుంది ∙ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది మెదడులోని ఫ్రంటల్ లోబ్ ముందు భాగం. ఇది కార్యనిర్వహణ విధులకు మెదడుకు సంబంధించి నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుంది ∙చాలామంది తక్షణ సంతృప్తి కోసం ఎందుకు ఆరాటపడతారో చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది... ఆలస్యాన్ని భరించలేకపోవడం. ‘ఇప్పుడే దొరుకుతుంది. ఎందుకు వేచి చూడాలి’ అని అనుకోవడం. తక్షణ సంతృప్తిని కోరుకునే వారు మాదకద్రవ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. ఊబకాయంతో పాటు అనేక ఇతర సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. వారు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో కూడా ఇబ్బంది పడుతుంటారు. మానసిక లోపాలతో బాధపడతారు ∙తక్షణ సంతృప్తి అనేది ఒక వ్యాధా? బహుశా కావచ్చు. మన జీవితాలను క్రమబద్దీకరించుకోవాలి. మన కోరికలను నియంత్రించుకోవాలి. ‘ఇప్పుడే కావాలి’ అనే వ్యాధిని నిర్మూలించాలి.డిలేడ్ గ్రాటిఫికేషన్... చాలా కష్టమా?∙ఆధునిక సంస్కృతి తక్షణ ఫలితాలు, సౌకర్యాలను గతంలో కంటే చాలా సులభంగా అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల ‘వేచి ఉండడం’ అనేది తగ్గిపోతుంది. వేచి ఉండడం కష్టం అనిపిస్తుంది. ∙భవిష్యత్పై దృష్టి, ప్రణాళిక లేని వారికి డిలేడ్ గ్రాటిఫికేషన్ (నిదానంగా సంతృప్తి పడడం) కష్టంగా అనిపిస్తుంది ∙ఒత్తిడి, విసుగు, ఆందోళనలాంటివి డిలేడ్ గ్రాటిఫికేషన్ దూరమయ్యేలా చేస్తాయి.డిలేడ్ గ్రాటిఫికేషన్కు దగ్గరవ్వాలంటే...∙దీర్ఘకాలిక లక్ష్యాల గురించి ఎప్పటికప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలి ∙మీ లక్ష్యాలను రాసుకోండి. ప్రతిరోజూ మీరు చూసే చోట అవి కనిపించాలి ∙లక్ష్యాలను చిన్న చిన్న పార్ట్స్గా విభజించుకోండి ∙ఫైనల్ రిజల్ట్ కంటే ఎప్పటికప్పుడు మీరు సాధిస్తున్న ఫలితాలపై దృష్టి పెట్టండి ∙లక్ష్యంలో ఒక చిన్న భాగానికి చేరువైనప్పుడు మీకు మీరే గిఫ్ట్ ఇచ్చుకోవాలి. ఉదాహరణకు... మీకు ఇష్టమైన స్వీటు ఆరోజు హాయిగా తినవచ్చు ∙ఎప్పుడైనా ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ వైపు మనసు లాగితే, దారి మళ్లించడానికి బయటకు వెళ్లి నడవడమో, ఫ్రెండ్కు ఫోన్ చేయడమో, ఇష్టమైన సినిమా చూడడమో... ఇలాంటి పనులు చేయాలి.ఇన్స్టంట్ వర్సెస్ డిలేడ్ గ్రాటిఫికేషన్..డబ్బుఇన్స్టంట్: పెద్దగా అవసరం లేకపోయినా సరే, కొత్త స్మార్ట్ ఫోన్ కొనడం.డిలేడ్: ఫోన్ కొనాలనుకున్న డబ్బును పొదుపు చేసి అవసరమైనప్పుడే కొనడం.ఎంటర్టైన్మెంట్ఇన్స్టంట్: రాత్రంతా ఫోన్లో షోలను అక్కడొక సీన్ ఇక్కడొక సీన్ అన్నట్లుగా చూడడం.డిలేడ్: ఈ రోజు కొన్ని భాగాలే చూస్తాను. రేపు మరికొన్ని... అని విభజించుకోవడం.షాపింగ్ఇన్స్టంట్: ఆన్లైన్లోనో, సూపర్ మార్కెట్లోనో కొత్త వస్తువును చూసినప్పుడు ‘అరే ఇది ఈరోజే కొనెయ్యాలి’ అనిపిస్తుంది.డిలేడ్: ఒక వారం ఓపిక పట్టాలి. ‘ఆ వస్తువు నాకు నిజంగా అవసరమా?’ అని విశ్లేషించుకోవాలి.కెరీర్ఇన్స్టంట్: భవిష్యత్లో పురోగతి లేకపోయినా ఎక్కువ జీతానికి ఆశపడి ఉద్యోగంలో చేరడం.డిలేడ్: తక్కువ జీతమైనా సరే, మంచి భవిష్యత్ ఉన్న ఉద్యోగాన్ని ఎంచుకోవడం.రిలేషన్షిప్స్..ఇన్స్టంట్: మీ సన్నిహితులతో ఎప్పుడో ఒకసారి వాగ్వాదం జరగవచ్చు. అలాంటి సందర్భంలో ఏదో ఒకటి ఎదుటి వ్యక్తిని కసిగా అనాలనిపిస్తుంది.డిలేడ్: వాదనలో ప్రతి మాటను జాగ్రత్తగా, ఆచితూచి ఉపయోగించాలి. దీనివల్ల ఎంత పెద్ద వివాదమైనా సంబంధాలు తెగిపోవు. -
Kukatpally Girl Incident: కూకట్పల్లి బాలిక హత్య కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు
-
ఏపీలో నారా సైకో పాలన సాగుతోంది: వైఎస్సార్సీపీ
సాక్షి, కృష్ణా జిల్లా: బీసీ మహిళ హారికను చంపాలని చూశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. హారికను చంపడానికి వచ్చినవారికి పోలీసులు సహకరించారన్నారు. పచ్చగూండాలకు పోలీసులు సపోర్ట్ చేశారు. హారికపై దాడి చేసిన పచ్చ సైకోలపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో నారా సైకో పాలన కొనసాగుతోంది’’ అంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడి ఉన్మాద చర్య. బీసీ మహిళపై ఇంత బరితెగించి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీని టార్గెట్ చేశారు. ఇంత దారుణమైన పాలన ఎన్నడూ చూడలేదు. ఇది ప్రజాస్వామ్య పాలనా లేక ఆటవిక రాజ్యమా?. చంద్రబాబు, పవన్కళ్యాణ్ మీ అరాచకాలన్నీ గుర్తు పెట్టుకుంటాం.ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ.. ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఉన్మాద చర్యలను పోలీసులు చోద్యం చూసినట్లు చూస్తున్నారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇంకెక్కడ ఉన్నట్లు?. ఒక జిల్లా ప్రథమ పౌరురాలికే పోలీసులు రక్షణ కల్పించలేకపోవడం దేశంలో మరెక్కడైనా జరుగుతుందా?. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇప్పుడేం సమాధానం చెబుతారు?. మహిళా హోంమంత్రి అనిత మీరెందుకు నోరు మెదపడం లేదు?. కచ్చితంగా తగిన గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉంది.విడదల రజిని మాట్లాడుతూ.. ఉప్పాల హారికపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు ప్రజలకిచ్చిన వాగ్ధానాల అమలులో విఫలమై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీని టార్గెట్ చేశారు. సూపర్ సిక్స్ పథకాల ఊసు లేదు కానీ మా పార్టీ వారిని వందల మందిని జైలు పాలు చేస్తున్నారు. ఇంత దారుణమైన పాలన ఎన్నడూ చూడలేదు. ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదు. కక్షసాధింపులు, వేధింపులు, దాడులు, దౌర్జన్యాలతో ఏడాది కాలం గడిపారు. వ్యక్తిగత కక్షలు, దాడులు, అరెస్ట్లు దారుణం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి గుండాలు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. ఒక బీసీ మహిళపై ఈ రకంగా దాడి చేయడం హేయం. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇలా ప్రజా ప్రతినిధుల పైన జిల్లా ప్రథమ పౌరురాలయినా బీసీ మహిళపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు, లోకేష్ రాష్ట్రంలో ఉన్న బీసీలకు క్షమాపణ చెప్పాలి.వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడి అమానుషం. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ, జనసేన గూండాలు పట్టపగలే విచక్షణారహితంగా దాడికి పాల్పడడం దారుణం. కూటమి పార్టీ కార్యకర్తలు ఉన్మాదంతో దాడి చేస్తున్నా.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణం. రెడ్ బుక్ రాజ్యాంగంలో మహిళా ప్రజా ప్రతినిధికే రక్షణ లేదు. ఇక సామాన్య మహిళలకు ఈ ప్రభుత్వం ఏం రక్షణ ఇస్తుంది? -
రక్తం మరిగిన తోడేళ్లు.. కనిపిస్తే కాల్చివేత!
బహ్రయిచ్: యూపీలోని బహ్రయిచ్ జిల్లాలో తోడేళ్ల భయోత్పాతం కొనసాగుతూనే ఉంది. తాజాగా హర్ది ప్రాంతంలో అవి ఓ పసికందును పొట్టన పెట్టుకున్నాయి. ఇద్దరు వృద్ధురాళ్లపై దాడి చేసి గాయపరిచాయి. దాంతో గత రెండు నెలల్లో తోడేళ్లకు బలైన వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది. వీరిలో ఎనిమిది మంది చిన్నారులే! 34 మంది గాయపడ్డారు. ఆరు తోడేళ్లలో నాలుగింటిని పట్టుకోగా రెండు మాత్రం నిత్యం అధికారులకు చుక్కలు చూపుతున్నాయి. ఆవాసాలు మారుస్తూ, రోజుకో గ్రామాన్ని లక్ష్యం చేసుకుంటూ తప్పించుకుంటున్నాయి. తప్పనిసరైతే వాటిని కాల్చివేయాల్సిందిగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ఆదేశాలిచ్చారు. దాంతో ట్రాంక్విలైజర్లతో షూటర్లను రంగంలోకి దించారు. తోడేళ్లను గుర్తించి పట్టుకునేందుకు, వీలవని పక్షంలో మట్టుపెట్టేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ‘ఆపరేషన్ భేడియా’కీలక దశకు చేరిందని బహ్రయిచ్ డీఎఫ్వో అజీత్ ప్రతాప్ సింగ్ తెలిపారు. తోడేళ్ల పీడ విరగడయ్యేదాకా ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.బహ్రయిచ్లో మంగళవారం తెల్లవారుజాము 3.35గంటలకు మహసీ సబ్ డివిజన్లోని నౌవన్ గరేతి గ్రామంలో తోడేలు ఓ ఇంట్లో దూరి అంజలి అనే రెండున్నరేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లింది. షాక్కు గురైన తల్లి అరిచేలోపే పాపను నోట కరుచుని పారిపోయింది. రెండు గంటల తర్వాత కిలోమీటరు దూరంలో చేతుల్లేకుండా చిన్నారి మృతదేహం దొరికింది. అనంతరం ఉదయాన్నే అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలోని కొటియా గ్రామంలో వరండాలో నిద్రిస్తున్న కమలాదేవి (70) అనే వృద్ధురాలిపై తోడేలు దాడి చేసింది. ఆమె అరుపులతో కుటు ంబీకులు అప్రమత్తమయ్యారు. తీవ్ర గాయాలైన ఆమె పరిస్థితి విషమంగా ఉంది. మరో అరగంట తరువాత మూడో దాడిలో సుమన్ దేవి (65) అనే మరో వృద్ధురాలు గాయపడింది. సోమవారం రాత్రి పండోహియా గ్రామంలో తోడేళ్ల దాడిలో గాయపడ్డ అఫ్సానా అనే ఐదేళ్ల బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆదివారం రాత్రి హర్ది దర్హియా గ్రామంలో తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిపై తోడేలు దాడి చేసింది. మెడను కరిచి లాక్కెళ్లబోయింది. తో డేలుతో తల్లి ధైర్యంగా పోరాడి తన బాబును కాపాడుకోగలిగింది. అదే రాత్రి మరో 50 ఏళ్ల వ్యక్తిపైనా తోడేలు దాడి జరిగింది.శ్మశాన నిశ్శబ్దం... తోడేళ్ల దెబ్బకు బహ్రయిచ్లో మార్కెట్లు మూతపడ్డాయి. వీధులు పగలు కూడా నిర్మానుష్యంగా ఉంటున్నాయి. మహసీ సబ్ డివిజన్లోనైతే జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రభావిత సీతాపూర్, లఖింపూర్ ఖేరి, పిలిభీత్, బిజ్నోర్ డివిజన్లలోనూ తోడేళ్ల భయం నెలకొని ఉంది. ఆ ప్రంతాలకు అదనపు ఫారెస్ట్ గార్డులు, ట్రాప్ బృందాలను పంపుతున్నారు. తోడేళ్లు నిత్యం తమ ఆవాసాలను మారుస్తుండటంతో పట్టుకోవడం కష్టమవుతోందని జిల్లా మేజి్రస్టేట్ మోనికా రాణి తెలిపారు. ‘‘అవి తెలివిగా ప్రతిసారీ కొత్త గ్రామా న్ని లక్ష్యం చేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా నాలుగింటిని పట్టుకున్నాం. ఇంకో రెండు దొరకాల్సి ఉంది’’అన్నారు. తమ బృందం నిరంతరం గస్తీ కాస్తోందని, వాటినీ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ (సెంట్రల్ జోన్) రేణుసింగ్ చెప్పారు. పిల్లలను ఇళ్ల లోపలే ఉంచాలని, రాత్రిపూట తలుపులకు తాళం వేసుకోవాలని అధికారులు లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.వీడియో ఆధారాలడిగారు...తోడేళ్లు తమ ఇళ్ల పక్కనే కనిపిస్తూ వణికిస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. అటవీ అధికారులకు చెబితే వీడియో ఆధారాలు అడుగుతున్నారని మండిపడుతున్నారు. ‘‘మా ఇంటి పక్కన తోడేలు కనిపిస్తే కుక్కనుకొని తరిమికొట్టాం. పొలాల వైపు పరుగెత్తడంతో తోడేలని గుర్తించాం. దాంతో పిల్లలంతా క్షేమంగా ఉన్నారా, లేరా అని చూసుకున్నాం. అంజలి తోడేలు బారిన పడిందని తేలింది’’అని నౌవన్ గరేతికి చెందిన బాల్కే రామ్ వెల్లడించారు. -
పాక్ కాల్పుల్లో 7 నెలల్లో 52 మంది మృతి
జమ్మూ: జమ్మూకశ్మీర్లోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ), అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంబడి ఈ ఏడాది జూలై చివరి వరకు శత్రుసైన్యం జరిపిన కాల్పుల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచార హక్కు చట్టం కింద కార్యకర్త రమణ్ సింగ్ అడిగిన ప్రశ్నకు హోం శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది. జనవరి నుంచి జూలై చివరి వరకు జరిగిన మొత్తం 1,435 కాల్పుల ఘటనల్లో 28 మంది పౌరులు, 12 మంది సైనిక సిబ్బంది, 12 బీఎస్ఎఫ్ జవాన్లు నేలకొరిగారని పేర్కొంది. దీంతోపాటు 140 మంది పౌరులు, 45 మంది సైనిక సిబ్బంది, 47 మంది బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారని తెలిపింది. మొత్తం 1,435 కాల్పుల విరమణ ఉల్లంఘనల్లో ఎల్వోసీ వెంట 945, ఐబీ వెంట 490 ఘటనలు చోటుచేసుకున్నట్లు వివరించింది. -
శోభాయాత్రలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
– పలువురికి గాయాలు – మునుగోడు మండలం కొంపెల్లిలో ఘటన కొంపెల్లి(మునుగోడు): గణేశ్ శోభాయాత్రలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని కొంపెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని గౌడ, యాదవ సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా వినాయకుల విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే ఆ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ట్రాక్టర్లపై సౌండ్ సీస్టంమ్తో వేర్వేరుగా ఊరేగిస్తూ ఒక కాలనీలో ఎదురు పడ్డారు. మీరు పక్కకు తొలగాలంటే మీరని వాగ్వాదానికి దిగారు. అది తారస్థాయికి చేరుకోవడంతో ఇరువర్గాలు కర్రలతో దాడులు చేసుకున్నారు. అయితే ఈ దాడుల్లో గౌడ సంఘానికి చెందిన వీరమళ్ల క్రాంతి కుమార్, పరమేష్, యాదవ సంఘంలోని జూకంటి శ్రీశైలం, దావ చంద్రమ్మ, దాం మహేష్, సైదులకు, అంజమ్మ, చంద్రమ్మకు తీవ్రమైన గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఇరువర్గాల వారు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు.


