-
ప్రియుడి హత్య.. పరువు హత్య కానేకాదు..
సాక్షి, చెన్నై: ‘ఓ ప్రేమజంట కులాంతర వివాహం ఏడేళ్ల క్రితం మూడు గ్రామాల్ని కన్నీటి మడుగులో ముంచింది. వందలాది ఇళ్లు భష్మీపటలం అయ్యాయి. ఆ తదుపరి పరిణామాలతో ప్రియుడు రైలు పట్టాలపై శవంగా తేలడం రాష్ట్రంలో ఓ సామాజిక వర్గాన్ని ఆగ్రహానికి గురి చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ప్రత్యేక కమిషన్ను రంగంలోకి దించక తప్పలేదు. ఎట్టకేలకు ఈ కేసులో ప్రియుడి హత్య పరువు హత్య కానే కాదని, ఇది ఆత్మహత్య అని తేల్చుతూ ఆ కమిషన్ సమర్పించిన నివేదిక ఆదివారం ఓ వెబ్సైట్లో ప్రత్యక్షం అయింది. దర్మపురి జిల్లా చెల్లం కోట్టైకు చెందిన నాగరాజన్ కుమార్తె దివ్య (21), అదే జిల్లా నాయకన్ కోట్టై నత్తం కాలనికి చెందిన ఇళంగోవన్ కుమారుడు ఇలవరసన్ (23)ల ప్రేమ వివా హం ఏడేళ్ల క్రితం రాష్ట్రంలో పెద్ద వివాదానికి దారి తీసింది. కుమార్తె కులాంతర వివాహంతో నాగరాజన్ ఆత్మహత్య చేసుకోవడం రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టింది. ఆ సామాజిక వర్గాలకు చెందిన రాజకీయ పార్టీలు సైతం కయ్యానికి కాలు దువ్వడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఓ సామాజికవర్గం ఆగ్రహానికి మరో సామాజిక వర్గానికి చెందిన మూడు గ్రామాలు కన్నీటి మడుగులో మునిగాయి. వందలాది ఇళ్లు భష్మీ పటలం అయ్యాయి. ఈ వ్యవహారం కోర్టుకు సైతం చేరింది. చివరకు ఇరు సామాజిక వర్గాలకు చెందిన పెద్దలు రంగంలోకి దిగి ఈ జంటను విడగొట్టే యత్నం చేశారు. తామిద్దరం కలసి జీవిస్తామని ఈ ప్రేమజంట తొలుత స్పష్టం చేసినా, చివరకు ఏమి జరిగిందో ఏమోగానీ దివ్య మాత్రం తన తల్లి వెన్నంటి వెళ్తున్నట్టుగా కోర్టులో ప్రకటించింది. దివ్య దూరం కావడంతో తీవ్ర మనోవేదనలో ఇలవరసన్ పడ్డాడు. దివ్య తన తల్లి వెంట వెళ్లిన కొద్ది రోజులకు ధర్మపురి ఆర్ట్స్ కళాశాల వెనుక ఉన్న రైల్వే ట్రాక్లో ఇలవరసన్ మృతదేహం బయట పడింది. పరువు హత్యే అంటూ దళిత సామాజిక వర్గానికి చెం దిన సంఘాలు, రాజకీయపార్టీలు మరో సా మాజిక వర్గంకు వ్యతిరేకంగా ఆగ్రహాన్ని ప్రదర్శించాయి. ధర్మపురి జిల్లానే కాదు, కృష్ణగిరి, సేలం జిల్లాల్లో సైతం పరిస్థితి ఉద్రిక్తంగా మా రే రీతిలో పరిణామాలు చోటు చేసుకున్నాయి. రంగంలోకి సింగార వేలు కమిషన్.. ఈ కులాంతర ప్రేమ వివాహం, ప్రియుడి అనుమానాస్పద స్థితి వ్యవహారం చివరకు పీఎంకే, వీసీకేల మధ్య వివాదాన్ని రేపే పరిస్థితిని తీసుకొచ్చాయి. దీంతో విచారణ సీబీసీఐడీకి అప్పగించారు. ధర్మపురి కోర్టులో సీబీసీఐడీ చార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. ఇలవరసన్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా చార్జ్షీట్లో తేల్చారు. దీనిని ఇలవరసన్ కుటుం బీకులు, దళిత సామాజిక వర్గానికి చెందిన పార్టీలు, సంఘాలు వ్యతిరేకించాయి. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు రిటైర్డ్ జడ్జి సింగార వేలు నేతృత్వంలో ప్రత్యేక కమి షన్ రంగంలోకి దిగింది. ఈ కమిషన్ కొన్నేళ్లుగా విచారణ సాగించి, సమగ్ర సమాచారాలు, ఆధారాలతో నివేదికను సిద్ధం చేసి, గత ఏడాది ఆగస్టులో సీఎం పళనిస్వామికి సమర్పించింది. అయితే, ఆ నివేదికలో ఏమున్నదో అన్నది బహిర్గతం కాలేదు. బయట పెట్టాల్సిందేనని దళిత సామాజిక వర్గానిక చెందిన సంఘాలు, పార్టీలు నినదిస్తూ వచ్చాయి. అయితే, ఆ నివేదిక బయటకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఈ నివేదిక ఓ వెబ్సైట్లో ప్రత్యేక్షం కావడం గమనార్హం. 1300 పేజీలతో తన నివేదికను సింగార వేలు సిద్ధం చేసి సమర్పించారు. వన్నియర్ సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గానికి చెందిన వారి వద్ద జరిపిన విచారణ, తటస్థంగా ఉన్న వ్యక్తుల వద్ద సాగించిన విచారణ, వాంగ్మూలం, సేకరించిన వివరాలు అందులో పొందు పరిచారు. ఇలవరసన్ మృతదేహం పడి ఉన్న చోట లభించిన ఆధారాలు, పోస్టుమార్టం నివేదిక, వైద్యపరంగా సేకరించిన సమాచారాలు, అన్ని రకాల వివరాలను సేకరించి, వాటి ఆధారంగా ఇలవరసన్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా నిర్ధారించి ఉండడం గమనార్హం. దివ్య దూరం కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉన్నట్టుగా నివేదికలో తేల్చి ఉన్నట్టుగా వివరాలు ఆ వెబ్ సైట్లో పేర్కొన బడి ఉంది. ఇలవరసన్ మరణం ఆత్మహత్యే గానీ, పరువు హత్య కాదు అని ఆ కమిషన్ స్పష్టం చేసి ఉండడంతో, పీఎంకే నేత రాందాసు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. విడుదల చేసిన ప్రకటనలో తమపై నిందల్ని వేసే విధంగా గతంలో వ్యవహరించిన వాళ్లు, పరువు హత్య కాదని తేలడంతో ఇప్పుడు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమా అని సవాల్ చేయడం గమనార్హం. -
సహాయ నటుడు ఆత్మహత్యాయత్నం
తిరువొత్తియూరు: భార్య విడాకులు ఇచ్చేందుకు నోటీసు పంపడంతో విరక్తి చెందిన సినిమా సహాయ నటుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఓనాయుం, ఆటుకుట్టిం, డమాల్ డుమీల్, శకుని తదితర సినిమాల్లో సహాయ నటుడిగా నటించిన అరసు అనే ఇలవరసన్. ఇతను 2012వ సంవత్సరం మార్చి 9వ తేదీన కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య ఓ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నారు. వీరికి శివ అనే కుమారుడు ఉన్నాడు. దంపతుల మధ్య ఏర్పడిన మనస్పర్థలతో ఇద్దరు విడిపోయి జీవిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇలవరసన్ విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది చూసిన ఇరుగు పొరుగు వాళ్లు అక్కడికి చేరుకుని విషం తాగి అపస్మారక స్థితిలో ఉన్న ఇలవరసన్ను చికిత్స కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న కొడుంగయూర్ పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో అతని ఇంట్లో లభించిన ఓ ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో సినీ నటుడు నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్కు దీనంగా తన బాధను వ్యక్తం చేస్తూ రాసినట్టు తెలిసింది. అందులో తాను ఏడేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నానని తనకు సినిమా రంగంలో తగిన జీతం అందలేదని, దీని వలన కుటుంబంలో తనకు తన భార్యకు మనస్పర్థలు ఏర్పడి విడిపోయామని తాను విరక్తి చెంది ఉన్న సమయంలో తనకు తన భార్య నుంచి విడాకులు కోరుతూ నోటీసు అందిందని, దీని వలన తన కుమారుడికి ఇబ్బందులు గురవుతున్నాడని దీంతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆ ఉత్తరంలో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ప్రేమ ‘కుల’ చిచ్చు
సేలం: సేలం, ధర్మపురి పరిసరాల్లో ప్రేమ వ్యవహారాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తూ వస్తున్నాయి. ఇప్పటికే కులాంతర ప్రేమ వ్యవహారాలకు ఇలవరసన్, గోకుల్ రాజ్లు బలి అయ్యారు. ఈ ఘటనలు పెను కలకలాన్ని సృష్టించాయి. తాజాగా, ఆ జాబితాలో సయ్య ద్ ఇంతియాజ్ చేరాడు. ఓమలూరు కోమలికి చెందిన సయ్యద్ ఇంతియాజ్(22) ఆటో డ్రైవర్. గురువారం ఉదయం ఇతడి మృతదేహం రైల్వే ట్రాక్ వద్ద బయట పడింది. మృత దేహానికి ఆగమేఘాలపై పోస్టుమార్టం పూర్తి అయింది. తమ వాడు మృతి సమాచారంతో సేలంకు ఉరకలు తీసిన కుటుం బీకులు, ఇది ముమ్మాటికి హత్యేనని ఆరోపించారు. సమాచారం అందుకున్న మైనారిటీ సంఘాలు, వీసీకే పార్టీ వర్గా లు జిహెచ్ వద్దకు చేరుకున్నాయి. సయ్యద్ ఓమలూరులో ఓ కులానికి చెందిన యువతిని ప్రేమిస్తూ వచ్చినట్టుగా, గత వారం ఆ యువతి బంధువులు ఆటో స్టాండ్కు వచ్చి బెదిరించి వెళ్లినట్టు మైనారిటీ సంఘాలు పేర్కొంటున్నాయి. బుధవారం రాత్రి సయ్యద్ను హతమార్చి రైలు పట్టాలపై పడేసి ఉన్నారని, అతడి శరీరం మీదున్న గాయాలను చూస్తే అది హత్య అన్నది స్పష్టం కాక తప్పదని వాపోయారు. ఈ కేసును హ త్య కేసుగా నమోదు చేయాలని కోరు తూ, మైనారిటీ సంఘాలు, వీసీకే వర్గాలు శుక్రవారం ఉదయం కలెక్టరేట్లో నిరసన తెలియజేశారు. కలెక్టర్ను కలవడానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉన్నది. హత్య కేసు నమోదు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపు నిస్తామని మైనారిటీ సంఘాలు, వీసీకే వర్గాలు హెచ్చరికలు జారీ చేసి ఉన్నాయి. సయ్యద్ మృత దేహానికి రీ పోస్టుమార్టం సైతం జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్ఝున్వాలా
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement