icon status
-
అంబాసిడర్ 2.0: దశాబ్దం తరువాత..
దశాబ్దం క్రితం ఇండియన్ మార్కెట్లో తిరుగులేని కారుగా ప్రసిద్ధి చెందిన హిందూస్తాన్ అంబాసిడర్.. తరువాత కాలంలో కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు కూడా అక్కడక్కగా కొన్ని కార్లు కనిపించినప్పటికీ.. కంపెనీ మాత్రమే ఉత్పత్తిని ఆపేసి చాలాకాలం అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ కంపెనీ ఈ కారును దేశీయ విఫణిలో లాంచ్ చేయనున్నట్లు, దీనికి పూర్వ వైభవం తీసుకురానున్నట్లు కొన్ని వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.అంబాసిడర్ 2.0 పేరుతో మళ్ళీ ఆ కారు మార్కెట్లో తిరిగి వస్తుందని సమాచారం. ఇది మొదట్లో ఉన్న కారు కంటే కూడా చాలా అద్భుతంగా.. నేటి కాలానికి తగిన విధంగా ఉండేలా సంస్థ రూపొందించే అవకాశం ఉంది. ఈ కారుకు సంబంధించిన కొన్ని చిత్రాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.హిందూస్తాన్ అంబాసిడర్ కారు.. ఎల్ఈడీ హెడ్ల్యాంప్, బోల్డ్ గ్రిల్ కలిగి వెనుక భాగంలో లేటెస్ట్ స్టైల్ టెయిల్ లైట్స్ పొందుతాయి. ఇది క్లాసీ డిజైన్ కలిగి.. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో కార్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. కారు లోపల కూడా ప్రీమియం సీట్లు, పెద్ద టచ్స్క్రీన్ డిస్ప్లే, డిజిటల్ క్లస్టర్ వంటి వాటితో పాటు ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లే వంటివి కూడా ఉండనున్నాయి. అయితే డిజైన్, ఫీచర్లకు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.ఇదీ చదవండి: ఆ ఒక్క రాష్ట్రంలోనే ఐదు లక్షల కార్లు: SIAM డేటా..అంబాసిడర్ 2.0 కారు 1.5 లీటర్ లేదా 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో రావచ్చు. ఆ తరువాత కాలంలో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంజిన్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్బాక్స్ ఎంపికలను పొందే అవకాశం ఉంది. ఏబీఎస్, ఎయిర్బ్యాగ్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి కూడా ఈ కారులో సేఫ్టీ ఫీచర్లుగా ఉండనున్నట్లు సమాచారం. -
కెప్టెన్సీ ఇవ్వకపోతే టోర్నీకి గుడ్ బై!
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) త్వరలో ప్రారంభించనున్న పాకిస్థాన్ టీ20 సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో తమకు ప్రాధాన్యం కల్పించకపోవడంపై ఇద్దరు పాక్ సీనియర్ క్రికెటర్లు అసంతృప్తిగా ఉన్నారు. దిగ్గజ హోదా ఇవ్వకపోవడంపై యూనిస్ ఖాన్, మిస్బా ఉల్ హక్ వ్యతిరేఖ ధోరణిని అవలంభించేలా కనిపిస్తోంది. పాక్ జట్టుకు 2009లో జరిగిన టీ20 ప్రపంచ కప్ను అందించిన తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై యూనిస్ నిరాశ చెందినట్లు కనిపిస్తోంది. విదేశీ ఆటగాళ్లకు ఇచ్చే ప్రాధాన్యం వారికి ఇవ్వకపోవడంతో టోర్నీకి గుడ్ బై చెప్పాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ బోర్డు టీ20 లీగ్ ఫ్రాంచైజీ జట్లలో ఏదైనా జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించకపోతే వారు టోర్నీ నుంచి వైదొలుగుతారని వారి సన్నిహితులు తెలిపారు. కెప్టెన్సీ, జట్టు మెంటర్ లాంటి ప్రధాన బాధ్యతలు ఇవ్వకపోతే టీ20 టోర్నీ ఆడే ప్రసక్తేలేదని యూనిస్ ఇటీవలే స్పష్టం చేసిన విషయం అందరికీ విదితమే. పాక్ టెస్ట్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్, మహ్మద్ హఫీజ్ పరిస్థితి దాదాపు అలాగే ఉంది. కెవిన్ పీటర్సన్, క్రిస్ గేల్, షేన్ వాట్సన్ లాంటి విదేశీ క్రికెటర్లకు ఐకాస్ స్టేటస్ ఇచ్చి తనను పక్కనపెట్టడంపై మిస్బా నిరాశ చెందినట్లు చెప్పాడు. ఇంగ్లండ్ జాతీయ జట్టులోనే చోటు దక్కించుకోలేని పీటర్సన్కు పాక్ చేపట్టనున్న పీఎస్ఎల్లో జట్టు బాధ్యతలు అప్పగించడంపై యూనిస్, మిస్బా కాస్త సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ నుంచి కేవలం షాహిద్ ఆఫ్రిది, షోయబ్ మాలిక్ ఐకాన్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న దోహా (ఖతార్) వేదికగా పీఎస్ఎల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. 20 రోజులపాటు అంటే.. 24వ తేదీ వరకు జరిగే మొదటి సీజన్ లో మొత్తం ఐదు జట్లు బరిలోకి దిగనున్నాయి.