-
ఎమ్మెల్యే క్వార్టర్స్ను ప్రారంభించిన కేసీఆర్
-
కొత్త ఎమ్మెల్యే క్వార్టర్స్ను ప్రారంభించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : హైదర్గూడలో సకల హంగులతో నిర్మితమైన శాసనసభ్యుల నివాస గృహ సముదాయాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం ప్రారంభించారు. నిర్మాణంలో తీవ్ర ఆలస్యం జరిగినా ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం రెండో శాసనసభ కొలువుదీరిన తర్వాత ఈ భవనాలు సిద్ధమయ్యాయి. నాలుగున్నర ఎకరాల సువిశాల విస్తీర్ణంలో దాదాపు రూ.166 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించారు. ఎమ్మెల్యేలతోపాటు సిబ్బంది, సర్వెంట్ల కుటుంబాలు కూడా ఉండేందుకు వీలుగా ఈ సముదాయాన్ని సిద్ధం చేశారు. 119 మంది ఎమ్మెల్యేలతోపాటు మరో నియమిత ఎమ్మెల్యే... వెరసి 120 మంది సభ్యులు ఉండేందుకు వీలుగా వీటిని నిర్మించారు. 36 స్టాఫ్ క్వార్టర్లు: ఆరు అంతస్తుల్లో స్టాఫ్ క్వార్టర్లు నిర్మించారు. ఇందులో మొత్తం 36 ఫ్లాట్లు ఉంటాయి. 810 చ.అ. విస్తీర్ణం ఉండే రెండు పడక గదుల ఫ్లాట్లు 12, 615 చ.అ.విస్తీర్ణంలో ఉండే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 24 ఉంటాయి. 12 అటెండెంట్ల ఫ్లాట్లు ఉన్నాయి. ఈ సముదాయం కూడా ఆరు అంతస్తుల్లో ఉంది. ఒక్కో ఫ్లాట్ను 325 చ.అ.విస్తీర్ణంలో నిర్మించారు. ఐటీ అండ్ ఎమినిటీస్ బ్లాక్ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఇది ఐదు అంతస్తుల్లో ఉంటుంది. గ్రౌండ్ఫ్లోర్లో 4 వేల చ.అ.విస్తీర్ణంలో సూపర్ మార్కెట్, క్యాంటీన్ ఉంటాయి. మొదటి అంతస్తులో కార్యాలయం, హెల్త్ సెంటర్ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో ఆఫీస్, ఇండోర్ గేమ్స్, స్టోర్ రూమ్ ఉంటాయి. 0.73 ఎమ్మెల్డీ సామర్థ్యంతో భూగర్భ సంప్, ఓ ఎస్టీపీ, 1,000 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి. ఇప్పటికే ఉన్న పాత, కొత్త ఎమ్మెల్యే క్వార్టర్లలో ఉండాలనుకుంటున్న ఎమ్మెల్యేలు వాటిల్లోనే కొనసాగే అవకాశముంది. 12 అంతస్తుల్లో... వాహనాలు నిలిపేందుకు సెల్లార్లో మూడంతస్తులు నిర్మించారు. ఇందులో 276 కార్లను నిలిపే స్థలం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో 23 విజిటర్స్ రూమ్లు నిర్మించారు. తమను కలిసేందుకు వచ్చే వారితో ఎమ్మెల్యేలు ఈ గదుల్లో భేటీ అవుతారు. ఓ క్లబ్ హౌస్, ఒక వ్యాయామశాల కూడా సిద్ధం చేశారు. ఈ భవనాలు 12 అంతస్తుల్లో నిర్మించారు. ఎమ్మెల్యేలకు 120 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కోటి 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో మూడు పడక గదులు, హాలు, వంటగది, డ్రాయింగ్రూమ్, విజిటర్ రూమ్ ఉంటాయి. ఆరు లిఫ్టులు, 5 మెట్ల దారులు ఏర్పాటు చేశారు. -
గన్ మిస్ఫైర్: నర్సాపూర్ ఎమ్మెల్యే డ్రైవర్ మృతి
హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కాల్పులు కలకలం రేపాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి డ్రైవర్ అక్బర్ మంగళవారం మధ్యాహ్నం మరణించాడు. తొలుత అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు కథనాలు వచ్చాయి. అయితే.. గన్మన్ నుంచి గన్ తీసుకుని దాన్ని చూస్తుండగా మిస్ఫైర్ అయ్యి, బుల్లెట్ బయటకు వచ్చి అతడు మరణించినట్లు తర్వాత తేలింది. గన్మన్, డ్రైవర్ ఇద్దరూ వాహనం దగ్గరే ఉండటం, ఎమ్మెల్యే లోపలకు వెళ్లడంతో గన్ మన్ వద్ద ఉన్న తుపాకిని అక్బర్ తీసుకుని చూస్తున్నట్లు తెలిసింది. అంతలో.. అది పొరపాటున పేలడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. మొత్తమ్మీద తుపాకి చూడాలన్న సరదా.. నిండు ప్రాణాలను బలిగొంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement