-
ఆన్లైన్ క్లాసుల ఫీజుల దోపిడీపై హైకోర్టు విచారణ
హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసుల పేరుతో జరుగుతున్న ఫీజుల దోపిడీపై హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిల్పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఫిబ్రవరి 1 నుంచి ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభంకానున్న నేపథ్యంలో జనవరి 31 వరకు జరిగే పరిణామాలను పరిశీలిస్తామని విచారణ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. పాఠశాలలు తెరిచాక ఇతర ఫీజుల పేరుతో అధిక వసూళ్లు చేయరాదని స్కూలు యాజమాన్యాలను హైకోర్టు ఆదేశించింది. కాగా, ఆన్లైన్ విద్య పేరుతో ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఫీజుల పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఫీజుల వసూలుపై ప్రైవేటు స్కూలు యాజమాన్యాలు జీవో 46 ఉల్లంఘనకు పాల్పడుతున్నారని వారు పిటిషన్లో పేర్కొన్నారు. -
స్కూల్ ఫీజుల దందాపై పోరుకు కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్ల ఫీజు దోపిడీపై ఉద్యమించేందుకు బృహత్ కార్యాచరణ సిద్ధమైంది. విచ్చలవిడిగా ఫీజులు లాగుతున్న తీరుపై ఇప్పటివరకు హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ (హెచ్ఎస్పీఏ) ఒంటరిగా ఆందోళనలు చేస్తూ వచ్చింది. అడపాదడపా కొన్ని సంఘాలు విడిగా ఫీజులపై పోరాటాలు సాగించినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో స్కూళ్లు ఫీజులు తగ్గించకపోగా.. పెంచాయి. పైగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలు స్కూళ్లలో చేపట్టిన తనిఖీల నివేదికను ప్రభుత్వం ఇంతవరకు బహిర్గతం చేయలేదు. తనిఖీలు ముగిసి 6 నెలలైనా.. నాన్చుడు ధోరణే అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో ఫీజుల పోరుకు పదును పెట్టాలని హెచ్ఎస్పీఏ నిర్ణయించింది. ఎంవీఎఫ్, టీపీఈఆర్ఎం, సీఆర్పీఎఫ్, ఏపీఎస్ఏ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ తదితర ప్రజా, విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో చర్చలు జరిపి ‘స్కూల్ ఫీజుల నియంత్రణ సాధనకు ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ-ఎస్ఎఫ్ఆర్)’ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతనంగా ఏర్పాటైన జేఏసీ - ఎస్ఎఫ్ఆర్ ప్రతినిధులు తమ కార్యాచరణను వివరించారు. 9న రాజకీయ పార్టీలతో సమావేశం అధిక ఫీజులపై పోరాడేందుకు రాజకీయ పార్టీల మద్దతు తీసుకుంటున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 9న నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసేదాకా ఉద్యమిస్తామని హెచ్చరించారు. స్కూల్ అధిక ఫీజుల విషయంలో దేశంలోని అన్ని నగరాలన్నింటిలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. కమిటీ కార్యవర్గమిదే.. జేఏసీ-ఎస్ఎఫ్ఆర్ చైర్పర్సన్గా అరవింద జటా, జనరల్ సెక్రటరీగా ఎస్టీఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షులు నాగటి నారాయణ, వైస్ చైర్పర్సన్లుగా కె. విమల, శారదా గౌడ్, హెచ్ఎస్పీఏ అధ్యక్షులు విక్రాంత్, జాయింట్ సెక్రటరీలుగా డి. ప్రకాశ్, ప్రతాప్, ఆశిష్, సుబ్రహ్మణ్యం, ట్రెజ రర్గా శ్రీనివాస్రెడ్డి, అడ్వైజరీ బోర్డ్ చీఫ్గా ఆర్. వెంకట్రెడ్డి నియమితులయ్యారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
Advertisement