breaking news
hyderabad - bangalore highway
-
కూతురు మృతి.. అంతదూరం నుంచి రాలేమన్న తల్లిదండ్రులు
సాక్షి, బంజారాహిల్స్: కరోనా మహమ్మారి వల్ల కడచూపుకూడా దక్కడం లేదు. తల్లిదండ్రులు చనిపోతే తమ పిల్లలు, కన్నవాళ్లు చనిపోతే తల్లిదండ్రులు చివరి చూపు చూసుకునేందుకు కూడా వీల్లేకుండా పోతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఖానాపురానికి చెందిన శీలం అరుణ శ్రీ(31) బ్యూటీషియన్గా పనిచేస్తూ యూసుఫ్గూడ సమీపంలోని యాదగిరి నగర్లో గత ఏడు సంవత్సరాలుగా ఉంటోంది. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యానికి గురై శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూసింది. తల్లిదండ్రులు స్వగ్రామంలో ఉండగా పోలీసులు వారికి సమాచారం అందించారు. అయితే కరోనా వ్యాపిస్తుండటంతో రాకపోకలకు కూడా తమకు తీవ్ర ఇబ్బందికారంగా ఉందని.. వచ్చివెళ్లేందుకు డబ్బులు కూడా లేవని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. మీరే అంత్యక్రియలు చేయాలని కోరారు. దీంతో మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీలో భద్రపరిచినట్లు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖరరెడ్డి తెలిపారు. చదవండి: జూబ్లీహిల్స్: ఓయో రూమ్లో వ్యభిచారం.. -
హైదరాబాద్లో 6 ప్రైవేట్ బస్సులు సీజ్
ప్రైవేట్ ట్రావెల్స్పై ఆర్టీఏ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులు బుధవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆరు బస్సులను సీజ్ చేశారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలో ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. ఆ ఘటనలో 45 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు మొద్దు నిద్రలో ఉన్న రవాణా శాఖ అధికారులు ఆ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అదికాక ఆ దుర్ఘటనపై సర్వత్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సులపై నిరంతరం దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.