breaking news
Honey bee attacks
-
వర్ధన్నపేట టీజేఎస్ ప్రచారంలో తేనెటీగల దాడి
సాక్షి, వర్ధన్నపేట: మండలంలో శుక్రవారం మహాకూటమి బలపరిచిన టీజేఎస్ అభ్యర్థి డాక్టర్ పగిడపాటి దేవయ్య ప్రచార పర్వంలో నల్లబెల్లి శివారు గుంటూరుపల్లి వద్ద భోజన సమయంలో తేనెటీగలు దాడి చేయడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే వర్ధన్నపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఓ బాలుడి ముఖంపై కుట్టడంతో తీవ్ర అ స్వస్థతకు గురయ్యాడు. కాగా ఆ బాలుడిని వరంగల్లోని ఓ ప్రైవేట్ అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం ప్రచారంలో భాగంగా చెన్నారం, కాషగూడెం, నల్లబెల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించి మధ్యాహ్నం సమయంలో నల్లబెల్లి శివారు గుంటరుపల్లిలో ఓ షెడ్డులో భోజనాలు చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న తేనెటీగలు దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. ఐనవోలు మాజీ చైర్మన్ చంద్రారెడ్డితో పాటు ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ పరమార్శించారు. -
కౌంటింగ్ కేంద్రంపై తేనెటీగల దాడి
శ్రీకాకుళం జిల్లా పలాసలోని కౌంటింగ్ కేంద్రంపై మంగళవారం తేనెటీగలు దాడి చేశాయి. ఇద్దరు కానిస్టేబుళ్లతోపాటు మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను అధికారులు స్థానికుల సహయంతో ఆసుపత్రికి తరలించారు. మంగళవారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్బంగా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ జోరుగా సాగుతుంది. అయితే పలాస కౌంటింగ్ కేంద్రం వద్ద ఓట్ల లెక్కింపు జరుగుతుండగా తేనెటీగలు అకస్మాత్తుగా దాడి చేశాయి. అక్కడే విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లు తీవ్రంగా గాయపడ్డారు. పోలింగ్ కేంద్రంలోని సిబ్బంది వెంటనే తలుపులు మూసివేశారు. అప్పటికే తేనెటీగలు భారీగా పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించాయి.