breaking news
HMT company
-
హెచ్ఎంటీలో వాలంటరీ రిటైర్మెంట్ !
న్యూఢిల్లీ: హెచ్ఎంటీ సంస్థ స్వచ్ఛంద పదవీ విరమణ/ స్వచ్ఛంద విభజన స్కీమ్ల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. వాచ్లు, ట్రాక్టర్లు తయారు చేస్తున్న ఈ సంస్థ గత 15 సంవత్సరాలుగా నష్టాల్లో నడుస్తోంది. సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవడానికి హెచ్ఎంటీ ఈ ప్రతిపాదనలను సమర్పించింది. ప్రస్తుతం ఈ కంపెనీలో 1.045 మంది ఉద్యోగులున్నారు. వీరి వార్షిక వేతన బిల్లు రూ.45కోట్లుగా ఉంది. భారీ పరిశ్రమల విభాగం ఆదేశాలననుసరించి ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసి, కేంద్రానికి సమర్పించామని హెచ్ఎంటీ సంస్థ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కు నివేదించింది. కాగా ఈ సంస్థను మూసేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోందని వార్తలు వస్తున్నాయి. గత పదేళ్లుగా వేతనాలకు, ఇతర బకాయిలకు బడ్జెటరీ మద్దతు లభిస్తోంది. గత ఏడాది కేంద్రం రూ.1,083 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించింది. కంపెనీ ఆధునీకరణ, ఐదేళ్లలో టర్న్ అరౌండ్ కావడానికి తోడ్పటటానికి ఈ ప్యాకేజీని కేంద్రం ఆమోదించింది. -
నేను సీఎం కావాలంటున్నారు: సర్వే సత్యనారాయణ
సాక్షి, హైదరాబాద్: ‘‘నేను ముఖ్యమంత్రిని కావాలని చాలామంది అంటున్నారు. సీఎం పదవి చెట్టుమీదున్న పిట్ట, కేంద్ర మంత్రి పదవి చేతిలోనున్న పిట్ట. చెట్టు మీద ఉన్న పిట్ట కోసం ఆరాటపడితే చేతిలో ఉన్న పిట్ట తుర్రుమనే అవకాశం ఉంది’’ అని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు. లోయర్ ట్యాంక్బండ్లోని ఎక్స్పో టెల్ హోటల్లో గురువారం క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ 26వ వార్షికోత్సవ సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్న రాష్ట్రాలుంటేనే పరిపాలన, ప్రజలు బాగుంటారని తెలిపారు. హైదరాబాద్ ఎవరి జాగీర్ కాదని, ఎవరైనా ఎక్కడైనా ఉండవచ్చని చెప్పారు. హెచ్ఎంటీ కంపెనీకి రూ.8.50 కోట్ల ప్యాకేజీను కేంద్రం నుంచి మంజూరు చేయించానని తెలిపారు.