hirakud dam
-
హద్దు మీరిన మంత్రి కుమార్తె..
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి నవ కిషోర్ దాస్ కుమార్తె హద్దు మీరి హీరాకుడ్ జలాశయం నిషేధిత ప్రాంతంలో ఫొటో, వీడియోలు తీసుకోవడం దుమారం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మంత్రి కుమార్తెతో పాటు మరో ముగ్గురు యువతులు ఈ వీడియోలో ఉన్నారు. వీరంతా సినిమా, ఆల్బమ్లలో నటిస్తుంటారు. హీరాకుడ్ జలాశయం నిషేధిత ప్రాంతంలో వీరంతా ఫొటోలు తీసుకుని వీడియో రికార్డింగ్ చేశారు. కాగా విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది మినహా ఇతరులను అనుమతించని నిషేధిత ప్రాంతంలోకి ఈ యువతుల బృందం చేరడం ఎలా సాధ్యమైందనే విషయంపై చర్చ సాగుతోంది. వీడియో రికార్డింగు సమయంలో నిషేధిత ప్రాంతంలో కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తన కూతురుకి సంబంధించిన వీడియో వైరల్ కావడంపై మంత్రి నవ కిషోర్దాస్ స్పందించారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారి పట్ల చట్టం తన పని తాను చేస్తుందని మంత్రి మాట దాట వేశారు. విచారణకు సంబల్పూర్ ఎస్పీ ఆదేశాలు మంత్రి కుమార్తె దీపాలి దాస్తో పాటు ముగ్గురు నటీమణులు ప్రకృతి మిశ్రా, ఎలీనా సామంత్రాయ్, లోవినా నాయక్ ఈ ప్రసారంలో ఉన్నారు. ఆల్బమ్ షూటింగును పురస్కరించుకుని వీరంతా ముందస్తు అనుమతి లేకుండా హీరాకుడ్ జలాశయం నిషేధిత మహానది తీరానికి వెళ్లినట్లు ఆరోపణ బలం పుంజుకుంటోంది. ఈ సంఘటనపై విచారణకు సంబల్పూర్ పోలీసు సూపరింటెండెంట్ కన్వర్ విశాల్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సబ్-డివిజినల్ పోలీసు ఆఫీసరు (ఎస్డీపీఓ) ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. నిషేధిత ప్రాంతంలో వీడియో చిత్రీకరణ వాస్తవమేనని నటి ఎలీనా సామంత్రాయ్ అంగీకరించారు. ఈ చిత్రీకరణ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారి వివరాలు, నిషేధిత ప్రాంతంలోకి అనుమతించిన వర్గాల సమాచారం బహిరంగపరిచేందుకు ఆమె నిరాకరించారు. మంత్రి కుమార్తె చొరవతో నిషేధిత ప్రాంతంలో ప్రవేశించేందుకు అనుమతి లభించినట్లు పరోక్షంగా తెలిపారు. -
16 మంది జలసమాధి
-
16 మంది జలసమాధి
ఒడిశాలోని హిరాకుద్ డ్యామ్లో లాంచీ మునక మరి కొందరి గల్లంతు సుమారు 80 మందిని కాపాడిన అధికారులు భువనేశ్వర్, మల్కన్గిరి(ఒడిశా), న్యూస్లైన్: ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ఆదివారం ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. మహానదిపై ఉన్న హిరాకుద్ డ్యామ్లో లాంచి మునిగి 16 మంది జలసమాధికాగా మరో ఏడుగురు గల్లంతయ్యారు. ఇప్పటివరకూ 10 మృతదేహాలను వెలికితీశామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రత్యేక పునరావాస కమిషనర్ పి.కె. మహాపాత్రో భువనేశ్వర్లో తెలిపారు. సహాయ కార్యకలాపాలను రాత్రంతా కొనసాగిస్తామని చెప్పారు. అయితే అనధికార వర్గాలు మాత్రం మృతుల సంఖ్యను 12గా పేర్కొన్నాయి. అయింఠపల్లి పోలీసుస్టేషన్ అధికారి అమితావ్ పండా తెలిపిన వివరాల ప్రకారం... సంబల్పూర్, హిరాకుద్, బార్గఢ్లకు చెందిన 120 మంది లయన్స్ క్లబ్ సభ్యులు వనభోజనాల కోసం డ్యామ్కు ఆవలి వైపునున్న ఝార్సుగుడా జిల్లా జమదార్పల్లి ప్రాంతానికి వెళ్లారు. వనభోజనాలు పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లాంచీలో తొలుత సాంకేతిక లోపం తలెత్తింది. అదే సమయంలో నీరు కూడా లోపలికి చేరడంతో అది మునిగింది. లాంచీ సామర్థ్యం 70కాగా ప్రమాద సమయంలో 90 మందికిపైగా ఉన్నారు. 80 మందిని కాపాడగలిగాం. మరో లాంచిలోని పర్యాటకులు చేసిన ఆర్తనాదాలు విని నాలుగు నాటు పడవల్లో ఘటనాస్థలికి చేరుకున్నాం. వనభోజనాలకు వెళ్లేటప్పుడు 2, 3 పడవల్లో వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణంలో ఒకే లాంచిలో రావడంతో అధిక బరువుతో లాంచి అదుపుతప్పింది. ఈ ప్రమాదంపై సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. -
పడవ మునిగి 10 మంది మృతి, 30 మంది గల్లంతు
భువనేశ్వర్: ఒడిశాలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది. సంబర్ పూర్ జిల్లా తీతాపల్లి వద్ద హీరాకుడ్ రిజర్వాయర్లో పడవ మునిగి పది మంది మరణించారు. మరో 30 మంది గల్లంతయ్యారు. మృతదేహాలను వెలికితీశారు. మహానదిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. లైన్స్ క్లబ్కు చెందిన వారు మూడు పడవల్లో విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వారందరూ ఒడిశాకు చెందిన వారేనని తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం రక్షణ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. రాత్రి కావడంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. 30 మందిని సహాయక సిబ్బంది రక్షించినట్టు సమాచారం. పడవలో ప్రయాణిస్తున్న చిన్నపిల్లలు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గల్లంతైన వారు బతికే అవకాశాలు తక్కువని స్థానికులు అంటున్నారు.