breaking news
Hindu Rashtra Sena
-
ఫేస్బుక్ సందేశం.. ప్రాణాలు తీసింది!!
ఫేస్బుక్లో అభ్యంతరకరమైన సందేశాన్ని పంపినందుకు ఓ యువకుడి ప్రాణాలు పోయాయి. హిందూ రాష్ట్రసేనకు చెందిన కొంతమంది యువకులు అతడి మరణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పుణెలో జరిగిన ఈ సంఘటనలో ఇప్పటికి 13 మందిని అరెస్టు చేశారు. మొహిసిన్ మహ్మద్ సాదిక్ షేక్ అనే ఆ యువకుడిని అతడి ఇంటివద్దే హాకీ స్టిక్లతో కొట్టి చంపినట్లు పోలీసులు చెబుతున్నారు. అతడిని చంపిన తర్వాత.. 'మొదటి వికెట్ పడిపోయింది' అనే ఎస్ఎంఎస్ నిందితుల ఫోన్లలో చక్కర్లు తిరిగిందని పుణె జాయింట్ పోలీసు కమిషనర్ తెలిపారు. 2006 నుంచి పుణెలో ఉంటున్న షేక్, గత నాలుగేళ్లుగా ఓ వస్త్ర సంస్థలోని ఐటీ విభాగంలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. సోషల్ మీడియాలో అతడు అభ్యంతరకరమైన పోస్టు మీద వదంతులు వ్యాపింపజేస్తున్నాడన్నదే అతడి హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. -
హత్య కేసులో హిందూ రాష్ట్ర సేన కార్యకర్తల అరెస్టు
పుణేలో ఒక యువకుడిని హత్య చేసిన నేరంపై హిందూరాష్ట్ర సేన అనే ఉగ్రవాద సంస్థ కు చెందిన ఏడుగురు కార్యకర్తలను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. పుణేలో ఒక ఐటీ సంస్థలో పనిచేస్తున్న యువకుడు సోమవారం సాయంకాల ప్రార్థనలు ముగించుకుని వస్తూండగా ఏడుగురు యువకులు అతడిని చుట్టుముట్టి పొడిచి చంపేశారు. ఛత్రపతి శివాజీని అవమానిస్తూ ఫేస్ బుక్ , వాట్సప్ ల వంటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న అంశంపై పుణె ప్రస్తుతం అట్టుడుకుతోంది. ఇప్పటికే దాదాపు 200 బస్సులు, ఇతర వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే హత్య జరగడంతో సంచలనం రేగింది. పోలీసులు ఈ సంస్థ కార్యకర్తలతో పాటు, సంస్థ అధినేత ధనంజయ్ దేశాయ్ ను కూడా అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు. హిందూ రాష్ట్ర సేన సంస్థపై ఇప్పటికే పలు కేసులు నమోదై ఎన్నాయి. గత ఏడాది అభ్యంతర కరపత్రాలు పంచుతున్నందున సంస్థ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.