breaking news
hikaru Nakamura
-
గెలిస్తే గొప్పా?.. ఇంత పొగరు పనికిరాదు! వీడియో వైరల్
అమెరికాలోని ఆర్లింగ్టన్లో జరిగిన చెక్మేట్ ఈవెంట్ ఓపెనింగ్ లెగ్లో భారత్పై యూఎస్ఎ ఆధిపత్యం చెలాయించింది. ఆదివారం జరిగిన గేమ్లో అమెరికా గ్రాండ్ మాస్టర్ హికారు నకమురా.. ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్ను 0-5 తేడాతో వైట్వాష్ చేశాడు.దీంతో భారత్పై అమెరికా విజయం సాధించింది. అయితే విజయం అనంతరం హికారు నకమురా ఓవరాక్షన్ చేశాడు. గేమ్ ముగిసిన వెంటనే ఈ అమెరికా చెస్ స్టార్ గుకేష్ కింగ్ను ప్రేక్షకులపైకి విసిరి సెలబ్రేట్ చేసుకున్నాడు.కానీ గుకేష్ మాత్రం సహనం కోల్పోకుండా పావులను అమర్చకుంటూ నవ్వుతూ ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ క్రమంలో అతడిపై నెటిజన్లు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.మరీ అంత పొగరు పనికిరాదు అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే తన చర్యలపై నకమురా స్పందించాడు. తాను గెలిచిన ప్రతీసారి కింగ్ను విసిరేస్తాను అని నకమురా చెప్పుకొచ్చాడు.HIKARU THROWS A PIECE TO THE CROWD TO CELEBRATE THE USA 5-0! @GMHikaru What an event!! 🔥👏 @CheckmateUSAIND pic.twitter.com/LGnM8JLulJ— Chess.com (@chesscom) October 5, 2025చదవండి: Pro Kabaddi League: తెలుగు టైటాన్స్ గెలుపు జోరు.. -
ప్రపంచ రెండో ర్యాంకర్ నకమురాపై అర్జున్ గెలుపు
స్టావెంజర్: నార్వే చెస్ టోర్నమెంట్లో తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ అద్భుత విజయం అందుకున్నాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ హికారు నకమురా (అమెరికా)తో జరిగిన ఐదో రౌండ్ గేమ్లో అర్జున్ అర్మగెడాన్ టైబ్రేక్ గేమ్లో గెలుపొందాడు. వీరిద్దరి మధ్య జరిగిన క్లాసికల్ ఫార్మాట్ గేమ్ 76 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. దాంతో విజేతను నిర్ణయించేందుకు అర్మగెడాన్ గేమ్ను నిర్వహించారు. ఈ గేమ్లో అర్జున్ 48 ఎత్తుల్లో నకమురాపై విజయం సాధించాడు. మరోవైపు ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ఐదో రౌండ్ గేమ్లో 56 ఎత్తుల్లో వె యి (చైనా) చేతిలో ఓడిపోయాడు. ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి చైనా గ్రాండ్మాస్టర్ లె టింగ్జీపై అర్మగెడాన్ టైబ్రేక్ గేమ్లో 38 ఎత్తుల్లో గెలిచింది. అంతకుముందు వీరిద్దరి మధ్య క్లాసికల్ ఫార్మాట్ గేమ్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. భారత మరో గ్రాండ్మాస్టర్ వైశాలి 35 ఎత్తుల్లో స్పెయిన్కు చెందిన సారా ఖాడెమ్ను ఓడించింది. -
ఆనంద్ రెండో రౌండ్ గేమ్ డ్రా
స్టావెంజర్ (నార్వే): ఆల్టిబాక్స్ నార్వే చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా రెండో ‘డ్రా’ నమోదు చేశాడు. హికారు నకముర (అమెరికా)తో మంగళవారం జరిగిన రెండో రౌండ్ గేమ్ను ఆనంద్ 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. లెవాన్ అరోనియన్ (అర్మేనియా)తో సోమవారం జరిగిన తొలి రౌండ్ గేమ్ను ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’ చేశాడు. 10 మంది గ్రాండ్మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో రెండో రౌండ్ తర్వాత ఆనంద్ ఒక పాయింట్తో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. -
జ్యూరిచ్ చెస్ టోర్నీ రన్నరప్ ఆనంద్
భారత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ జ్యూరిచ్ చెస్ చాలెంజ్ టోర్నమెంట్లో రన్నరప్గా నిలిచాడు. ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల గేమ్లు ముగిశాక హికారు నకముర (అమెరికా), ఆనంద్ 10.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా నకముర విజేతగా అవతరించగా... ఆనంద్ రన్నరప్తో సంతృప్తి పడ్డాడు. 9.5 పాయింట్లతో వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.