breaking news
The high charge
-
సిటీ బస్సు వచ్చేస్తోంది
మార్చి నుంచి నడిపేందుకు కసరత్తు కడపకు రానున్న 40 బస్సులు ఆర్టీసీ బస్టాండు సమీపంలో మరో గ్యారేజీ రూ.4.50 కోట్ల పనులకు టెండర్లు ప్రయాణికులకు తప్పనున్న ‘ఆటో’ కష్టాలు కడప : కడప నగర వాసుల ప్రయాణ కష్టానికి త్వరలో ‘బ్రేక్’ పడనుంది. ఆటోల ప్రయూణాలతో విసిగిపోరుున ప్రయూణికులకు మార్చి నుంచి మంచిరోజులు రానున్నాయి. సిటీ బస్సుల రాకతో నగర రోడ్లు కొత్త కళను సంతరించుకోనున్నారుు. నగరాలలో సిటీ బస్సులు నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం సంకల్పించిన నేపధ్యంలో కడపకు కూడా ప్రత్యేక సిటీ బస్సులు రానున్నాయి. మార్చి తొలి వారంనుంచే సిటీ బస్సులను తిప్పాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొదట ప్రస్తుతం ఉన్న బస్టాండునుంచే వీటిని నడపాలని అధికారులు నిర్ణరుుంచారు. జవహర్లాల్ నెహ్రూ అర్బన్, రూరల్ మేనేజ్మెంట్ కింద సుమారు 40 బస్సులను కడపకు కేటారుుంచారు. ఈ బస్సులు రావడమే అలస్యం నగరంలో తిప్పాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. రూట్లపై అధికారుల కసరత్తు సిటీ బస్సులు నడపాల్సిన రూట్లపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. నగరంతోపాటు చుట్టుపక్కల గ్రామాలు (నగరంతో ఎక్కువ అనుబంధం ఉండేవి) కలిసేలా కసరత్తు చేస్తున్నారు. రాజంపేట రూట్లోని ఒంటిమిట్ట, పులివెందుల రోడ్డులోని పెండ్లిమర్రి, ప్రొద్దుటూరురోడ్డులోని చెన్నూరు, రాయచోటిరోడ్డులోని ఎన్టీపీసీ, ఎర్రగుంట్ల రోడ్డులోని కమలాపురం వరకు నడపాలని ప్రాథమికంగా నిర్ణయూనికి వచ్చారు. దీంతో పాటు నగరంలో దేవునికడప, రిమ్స్, రైల్వేస్టేషన్, పాత బస్టాండు, అల్మాస్పేట, బిల్టప్, అప్సర సర్కిల్, చిన్నచౌకు, ఐటీఐ సర్కిల్ తదితర ప్రాంతాలను గుర్తిస్తున్నారు. రూట్లను సిద్ధం చేసి అందుకు సంబంధించి బస్టాప్ల ఏర్పాట్లపై కూడా త్వరలోనే అధికారులు చర్చించి నిర్ణయానికి రానున్నారు. ప్రతినిత్యం లక్షలాది సంఖ్యలో కడపలో వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు రాకపోకలు సాగిస్తున్న నేపధ్యంలో సిటీ బస్సుల రాకతో చాలా వరకు ప్రయోజనం ఒనగూరనుంది. కడపలో మరో ఆర్టీసీ గ్యారేజ్ ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఖాళీ స్థలంలో మరో గ్యారేజి నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకు సంబంధించి ఆర్టీసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉన్న ప్రాంతంలోనే గ్యారేజీని నిర్మించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. గ్యారేజీ నిర్మాణానికి సుమారు రూ.4.20 కోట్లు కేటాయించారు. అందుకు సంబంధించి హైదరాబాదులో టెండర్లను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఈనెల 9వ తేదీన టెండర్లను ఓపెన్ చేసి కాంట్రాక్టు ఖరారు చేయనున్నారు. ప్రయాణికులకు తప్పనున్న ‘ఆటో’ కష్టాలు ఆటోలలో అధిక ఛార్జీలతో సతమతమవుతున్న ప్రయాణికులకు త్వరలోనే కష్టాలు తొలిగిపోనున్నాయి. సాధారణ రూట్లలో తీసుకుంటున్న ఆటో ఛార్జి రూ.10లే అయినా ప్రధాన రహదారిలోని ఇంటి వద్దకు వెళ్లాలంటే అధిక మొత్తంలో వసూలు చేస్తున్న నేపధ్యంలో కొంతమేర సిటీ బస్సుల రాకతో సమస్య తొలిగిపోతుందని పలువురు భావిస్తున్నారు. -
పది ఫీజుల్లో ప్రైవేట్ దందా
నిర్ధేశించిన దాని కంటే పదిరెట్లు అధిక వసూలు ఫిర్యాదు చేయడానికి సంకోచిస్తున్న తల్లిదండ్రులు చోద్యం చూస్తున్న విద్యాశాఖ కడప : పదో తరగతి పరీక్ష ఫీజుల విషయంలో ప్రైవేట్ యాజమాన్యాలు తమ దందాను కొనసాగిస్తున్నాయి. ఎవరికి నచ్చినట్టు వారు ఫీజులు వసూలు చేస్తున్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజులు కాక ఐదు నుంచి పది రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఇదేమని అడిగే తల్లిదండ్రులకు తప్పదని లేకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని భయపెడుతున్నారు. మరో దిక్కు లేక ప్రైవేట్ యాజమాన్యాలు అడిగినంత ఫీజులను విద్యార్థుల తల్లిదండ్రులు చెల్లిస్తున్నారు. ఇటీవల డీఎడ్ పరీక్ష ఫీజుల వసూళ్ల విషయంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు భారీ దందా సాగించాయన్న విమర్శలు విద్యాశాఖలో కలకలం రేపిన విషయం విదితమే. జిల్లా వ్యాప్తంగా ఉన్న 900 పైగా ప్రైవేట్ పాఠశాలల నుంచి ఈ ఏడాది 15వేలకు పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. మార్చి నెలలో నిర్వహించే పదో తరగతి పబ్లిక్ పరీక్షకు ఫీజు ఈనెల 15లోపు చెల్లించాలి. అపరాధరుసుంతో 23 వరకూ చెల్లించవచ్చు. ప్రభుత్వ నిబంధన ప్రకారం విద్యార్థి రూ.125 చెల్లించాలి. కాని కొన్ని ప్రైవేట్ సంస్థలు ఒక్కొక్కొ విద్యార్థి నుంచి రూ. 500 నుంచి రూ. 1000 వరకూ వసూలు చేస్తున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. తాము అంత చెల్లించలేమని ప్రాధేయపడినా తప్పదంటూ ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. ఏదో కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో తప్ప అన్ని చోట్లా ఇదే దందా కొనసాగుతోంది. ఇదేంటని ప్రశ్నించే తల్లిదండ్రులకు విద్యార్థికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే తప్పకుండా తామడిగిన ఫీజు చెల్లించాలని కరాకండీగా యాజమాన్యాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో జిల్లా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేయాలని తల్లిదండ్రులు చాలా మంది భావించినా ప్రైవేట్ యాజమాన్యాలు హెచ్చరించినట్టు భవిష్యత్తులో తమ పిల్లలకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయేమోనని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు అంత మొత్తంలో ఫీజలు చెల్లించలేక, ఇటు ఎవరికీ ఫిర్యాదు చేయలేక మధనపడుతున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు జిల్లాలో ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజు కంటే అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా మా దృష్టికి తీసుకువస్తే ఆ యాజమాన్యంపై చర్యలు తప్పవు. నిబంధనలు అతిక్రమించి ప్రైవేట్ పాఠశాలలు వ్యవహరించడం సరైంది కాదు. - కె. అంజయ్య, జిల్లా విద్యాశాఖాధికారి, కడప