-
హెల్ప్డెస్క్ల పనితీరుపై మంత్రి ఆళ్ల నాని ఆరా
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని కోవిడ్ ఆస్పత్రుల్లో హెల్ప్డెస్క్ల పనితీరుపై డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. డీఎంహెచ్వో, డీసీహెచ్ఎస్ సూపరింటెండెంట్లతో ఆళ్ల నాని ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐసీయూ, నాన్ ఐసీయూ బెడ్స్ ఆధారంగా ఆక్సిజన్ సదుపాయం ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను వాడుకోవాలని సూచించారు. బ్లాక్ ఫంగస్ పేషెంట్లకు అవసరమైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. చదవండి: వలపు వల.. బెజవాడలో మాయలేడీ మోసాలు ప్రతి ప్రభుత్వ ఆస్పత్రికి 10 ఐసీయూ బెడ్లు -
డిసెంబర్ 10 నాటికి ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్లు
సాక్షి, అమరావతి: వచ్చే నెల 10వ తేదీ నాటికి ఆరోగ్య శ్రీ ఆస్పత్రులన్నింటిలో హెల్ప్ డెస్క్ల ఏర్పాటు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్ డెస్క్లు, సీసీ కెమెరాలు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వివిధ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరోగ్య మిత్రలు ఏం చేయాలన్న దానిపై ఒక నిర్దిష్ట ఎస్వోపీ ఖరారు చేయాలని సూచించారు. ఆరోగ్య ఆసరా ఎలా అమలవుతోందన్నది జేసీలు చూడాలన్నారు. అస్పత్రులలో 9,800 పోస్టులు మంజూరు చేశామని, వాటిలో జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో 7,700 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, ఇప్పటికే 5,797 పోస్టులు భర్తీ అయ్యాయన్నారు. మిగిలిన పోస్టులు కూడా త్వరగా భర్తీ చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జగనన్న తోడు పథకం నవంబర్ 25న ప్రారంభం అవుతోందని, ఈ పథకంలో ఇప్పటి వరకు 6.29 లక్షల దరఖాస్తులకు బ్యాంకులు టైఅప్ అయ్యాయని చెప్పారు. మిగిలిన దరఖాస్తులను కూడా వెంటనే బ్యాంకులకు పంపాలన్నారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఇవి సకాలంలో పూర్తి కావాలి ► గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ), వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు (వైఎస్సార్ ప్రీప్రైమరీ స్కూళ్లు), స్కూళ్లకు ప్రహరీల నిర్మాణం వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి కావాలి. బీఎంసీయూల నిర్మాణ పనులు వచ్చే నెల 15వ తేదీ నాటికి మొదలు కావాలి. ► ప్రతి నియోజకవర్గంలో రూ.10 కోట్ల విలువైన పనులు చేయాలి. సకాలంలో అవి పూర్తి చేస్తే, అదనంగా మరో రూ.5 కోట్ల విలువైన పనులు వస్తాయి. ► నాడు–నేడు కింద తొలి దశలో 15,715 స్కూళ్లలో పనులు చేపట్టగా, 78 శాతం పూర్తయ్యాయి. డిసెంబర్ 31 టార్గెట్గా పనులు పూర్తి చేసేలా జేసీలు బాధ్యత తీసుకోవాలి. విత్తనాలకు లోటు లేకుండా చూడాలి ► కనీస నాణ్యతా ప్రమాణాలు (ఎఫ్ఏక్యూ) లేని వేరుశనగ పంటకు సైతం గ్రేడెడ్ ఎమ్మెస్పీ రూ.4,500 ప్రకటించామనే విషయాన్ని బాగా ప్రచారం చేయాలి. ► రబీ సీజన్కు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల లోటు లేకుండా చూడాలి. సీఎం–యాప్, ఈ–క్రాప్ డేటా నమోదుపై జేసీలు, కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ► తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కాలువల్లో గుర్రపు డెక్కను తొలిగించి నీరు సాఫీగా పారేలా చర్యలు చేపట్టాలి. పోలవరం కాఫర్ డ్యామ్ పనుల దృష్ట్యా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో డిసెంబర్ 31లోగా రబీకి సంబంధించి వరినాట్లు, ఇతర పనులు పూర్తయ్యేలా చూడాలి. ► జాతీయ ఉపాధి హామీ పనులు బాగా జరుగుతున్నాయి. దాదాపు రూ.150 కోట్ల విలువైన పనులు ఒక్కో వారంలో జరుగుతున్నాయి. అయితే కేవలం రూ.150 కోట్లు మాత్రమే బకాయి ఉండగా, ‘ఈనాడు’ పూర్తిగా తప్పుడు వార్తలు రాస్తోంది. గ్రామాల్లో పనులకు ఎవ్వరూ రాకుండా కుటిల ప్రయత్నం ఇది. బిల్లులు ఇవ్వడం లేదని తప్పుడు వార్తలు రాస్తోంది. -
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సాధారణ ఎన్నికలకు సంబంధించి ఈ నెలాఖర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ బి.శ్రీధర్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెలాఖర్లో లేదా వచ్చేనెల మొదటి వారంలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుందని, ఈ నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నియోజకవర్గ రూట్ మ్యాపులు, చార్టులతో సిద్ధంగా ఉండాలన్నారు. పోలింగ్ స్టేషన్లలో టాయిలెట్లు, ర్యాంపులు, ఫర్నిచర్, విద్యుత్తు, తాగునీటి సౌకర్యం కల్పించాలని, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంత పోలింగ్ కేంద్రంలో 1300కుపైగా, పట్టణ ప్రాంతాల్లో 1600కుపైగా ఓటర్లుంటే అనుబంధ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని,ఇందుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సూచించారు. గతంలో అతి తక్కువ పోలింగ్ నమోదైన కేంద్రాల పరిధిలో పోలింగ్ శాతం పెంచేందుకు చైతన్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ చంపాలాల్, సబ్కలెక్టర్ ఆమ్రపాలి, డీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్వీఎం పీఓ కిషన్రావు, ఎన్సీఎల్పీ పీడీ సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తెలంగాణలో పోలింగ్ శాతం పెరిగింది: సీఈవో వికాస్రాజ్
ఓటు హక్కు వినియోగించుకున్న వల్లభనేని వంశీ ఫ్యామిలీ
ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు
నార్వే కంపెనీతో హైదరాబాద్ సంస్థ ఒప్పందం
కుటుంబ సభ్యులతో తన ఓటు హక్కు వినియోగించుకున్న కొడాలి నాని
ఈసీ అధికారిక ప్రకటన ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ శాతం
పల్నాడు: ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలు
ఈవీఎంల భద్రతపై సుప్రియా సూలే సంచలన ట్వీట్
ఈ పిల్లాడు.. టీమిండియా నయా సూపర్స్టార్? గుర్తుపట్టారా?
వెల్లడైన సీబీఎస్ఈ ఫలితాలు: విద్యార్థులకు మోదీ సందేశం
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement