breaking news
Heli Taxi
-
ఇండియాలో ఫ్లైయింగ్ కారు... వచ్చేది ఎప్పుడంటే ?
సాక్షి, వెబ్డెస్క్: దేశమంతటా ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంటే అందుకు భిన్నంగా ఏకంగా ఆకాశంలో ఎగిరే కారు తయారీలో బిజీగా ఉన్నాయి స్టార్టప్ కంపెనీలు. అందులో ఇండియాకి చెందిన ఓ కంపెనీ అయితే అక్టోబరులో తమ తొలి మోడల్ కారును ప్రదర్శనకు సిద్ధం చేస్తోంది. అక్టోబరు 5 కల్లా సిద్ధం చెన్నై బేస్డ్ వినత ఎయిరో మొబిలిటీ కంపెనీ ఎగిరే కార్ల తయారీలో మరో కీలక ఘట్టాన్ని దాటేసింది. ఎగిరే కారు కాన్సెప్టుకు సంబంధించి పూర్తి డిజైన్ని పూర్తి చేసింది. ఇప్పుడు కారు నిర్మాణ పనుల్లో బిజీగా ఉంది. అన్నీ అనుకూలిస్తే 2021 అక్టోబరు 5న లండన్లో జరిగే హెలిటెక్ ఎగ్జిబిషన్లో ఈ కారు దర్శనం ఇవ్వనుంది. ఇద్దరు ప్యాసింజర్లు వినత ఎయిరో మొబిలిటీ రూపొందిస్తోన్న ఫ్లైయింగ్ కారు బరువు 1100 కేజీలు ఉంటుంది. మొత్తంగా 1300 కేజీల బరువును మోయగలదు. ఇందులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించే వీలుంటుంది. వర్టికల్గా టేకాఫ్ ల్యాండింగ్ అవడం ఈ ఫ్లైయింగ్ కారు ప్రత్యేకత. ఈ కారులో హైబ్రిడ్ ఇంజన్ ఏర్పాటు చేస్తున్నారు. కారు ఎగిరేందుకు బయో ప్యూయల్ని ఉపయోగించుకుంటుంది. అదే విధంగా సందర్భాన్ని బట్టి ఎలక్ట్రిక్ ఎనర్జీని కూడా వాడుకుంటుంది. 3,000 అడుగుల వరకు ఈ కారు పైకి ఎగిరేందుకు కో యాక్సియల్ క్వాడ రోటర్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కారు ప్యానెల్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నట్టు కంపెనీ చెబుతోంది. ఈ కారు నేల నుంచి 3,000 అడుగుల ఎత్తు వరకు ప్రయాణించగలదు. ఒక్క సారి ఫ్యూయల్ నింపితే వంద కిలోమీటర్లు లేదా గంట సేపు ప్రయాణం చేయగలదు. అత్యధిక వేగం గంటకు 120 కిలోమీటర్లుగా ఉంది. ఫస్ట్ ఏషియన్ ఇప్పటి వరకు ఫ్లైయింగ్ కార్లకు సంబంధించి యూరప్, అమెరికా కంపెనీలదే పై చేయిగా ఉంది. ఏషియా నుంచి హ్యుందాయ్ సంస్థ కూడా ఫ్లైయింగ్ కారు టెక్నాలజీపై పరిశోధనలు చేస్తోంది. అయితే డిజైన్ పూర్తి చేసి అక్టోబరు కల్లా ప్రోటోటైప్ సిద్ధం చేసిన మొదటి ఏషియా కంపెనీగా రికార్డు సృష్టించేందుకు వినత సిద్ధమవుతోంది. -
హైదరాబాద్లో 'హెలీ' ట్యాక్సీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భాగ్యనగరిలో హెలీ ట్యాక్సీ సర్వీసులు సాకారం కానున్నాయి. భారత్లో హెలికాప్టర్ సర్వీసులందిస్తున్న ప్రభుత్వ రంగ దిగ్గజం పవన్ హన్స్ ఈ సేవల్ని ప్రారంభించనుంది. తొలుత హైదరాబాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి హెలీ ట్యాక్సీ నడుపుతారు. డిమాండ్ ఉంటే నగరంలోనే ప్రధాన ప్రాంతాల మధ్య కూడా ట్యాక్సీ సర్వీసులు అందించేందుకు పవన్ హన్స్ సిద్ధంగా ఉన్నట్లు సంస్థ సీఎండీ బి.పి.శర్మ వెల్లడించారు. ఇక్కడ ప్రారంభమైన ఏవియేషన్ సదస్సులో ఆయన మీడియాతో మాట్లాడారు. హెలీ ట్యాక్సీ కోసం స్థానిక ప్రభుత్వ సంస్థ నుంచి ప్రతిపాదన వచ్చిందని చెబుతూ... హెలిపోర్టులను మాత్రం ప్రభుత్వమే ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. దక్షిణాదిలో అడుగుపెడతాం.. పవన్ హన్స్ ప్రస్తుతం ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో 42 హెలికాప్టర్లతో సేవలందిస్తోంది. దక్షిణాదిన అడుగుపెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని శర్మ వెల్లడించారు. ‘భారత్లో సీప్లేన్ సేవలు ప్రారంభించేందుకు ప్రణాళికలు రెడీ చేశాం. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రోత్సహిస్తోంది. నీళ్లపైనా, భూమి మీద కూడా దిగేందుకు సీప్లేన్స్ అనువైనవి. దేశవ్యాప్తంగా ఎన్నో సరస్సులున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్పైనా దృష్టిపెట్టాం. హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ అనువుగా ఉంటే ఈ సర్వీసులు ప్రారంభిస్తాం. హెలీ ట్యాక్సీ కింద టికెట్ ధర కనీసం రూ.2,500 ఉండొచ్చు’ అని వివరించారు. కంపెనీ త్వరలో ఢిల్లీ–ఆగ్రా మార్గంలో హెలీ రెస్క్యూ సేవలు అందించనుంది. 100 హెలికాప్టర్లు సమకూర్చుకుంటాం.. హెలికాప్టర్ల సర్వీసులకు దేశంలో మంచి డిమాండ్ ఉందని శర్మ చెప్పారు. ‘2025 నాటికి మొత్తం 100 హెలికాప్టర్లు సమకూర్చుకుంటాం. కొత్త హెలికాప్టర్లు, సీప్లేన్స్ కొనుగోలుకు, పాతవి ఆధునీకరణ, విస్తరణకు వచ్చే 10 ఏళ్లలో రూ.4,000 కోట్లు వెచ్చించాలని నిర్ణయించాం. 21 రాష్ట్రాల్లో పవన్ హన్స్ విస్తరించింది. ఉడాన్ రెండో దశలో 111 రూట్లను దక్కించుకున్నాం. తద్వారా కొత్తగా 22 ప్రాంతాల్లో అడుగు పెడతాం. విస్తరణకు కావాల్సిన నిధుల కోసం వ్యూహాత్మక భాగస్వామి వేటలో ఉన్నాం. వాటా విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని సంస్థ ఆధునీకరణకు వెచ్చిస్తాం’ అని వివరించారు. భారత్కు 2,100 విమానాలు ఇదీ... వచ్చే 20 ఏళ్లలో డిమాండ్: బోయింగ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రానున్న 20 ఏళ్లలో భారత్లో కొత్తగా 2,100 విమానాలు అడుగుపెడతాయని బోయింగ్ అంచనా వేస్తోంది. వీటిలో చిన్నపాటి ఎయిర్క్రాఫ్ట్లు 85 శాతం ఉంటాయని బోయింగ్ కమర్షియల్ ఎయిర్ప్లేన్స్ ఆసియా పసిఫిక్, భారత్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దినేశ్ కేశ్కర్ చెప్పారు. ‘భారత్లో విమాన ప్రయాణికుల సంఖ్య 2017లో 20 శాతం వృద్ధితో 11.67 కోట్లుంది. ప్రపంచ సగటు వృద్ధి 7.3 శాతమే. దీనిని బట్టి భారత మార్కెట్ ఏ స్థాయిలో ఉందో గమనించవచ్చు. అయిదేళ్లుగా ఇక్కడ ప్యాసింజర్ ట్రాఫిక్ గణనీయ వృద్ధిని నమోదు చేస్తోంది. 2018లో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 13.5 కోట్లను దాటుతుంది. భారత మార్కెట్ వృద్ధి విషయంలో ఇప్పటి వరకు బోయింగ్ అంచనాలు ఎప్పుడూ తప్పు కాలేదు. అంచనాలను మించి ఇక్కడ కొత్త విమానాలు అడుగుపెట్టాయి’ అని వెల్లడించారు. లో కాస్ట్ క్యారియర్లదే..: భారత్లో లో కాస్ట్ క్యారియర్లదే హవా అని బోయింగ్ అభిప్రాయపడింది. ‘నలుగురు ప్రయాణికుల్లో ముగ్గురు లో కాస్ట్ విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడున్న ఫ్లయిట్స్లో 60% లో కాస్ట్ క్యారియర్లే. 2037 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుంది. ప్రభుత్వ విధానాల సరళీకరణ, మధ్య తరగతి కుటుంబాలు పెరుగుతుండటంతో విమానయాన రంగం వృద్ధి బాటలో ఉంది. అయితే ఇందుకు తగ్గట్టుగా మౌలిక వసతులకు ప్రభుత్వం నిధులు వెచ్చించాలి. 2016 ప్రారంభం నుంచి ఇంధన ధరలు 81% పెరిగాయి. తక్కువ టికెట్ ధరలు, విమానాలు ఎక్కువ ప్రయాణికులతో నడవడం వంటి కారణాలతో కంపెనీలు లాభాలను ఆర్జించగలుగుతున్నాయి’ అని దినేశ్ వెల్లడించారు. -
బెంగళూరులో హెలీ ట్యాక్సీ టేకాఫ్
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): దేశంలో తొలిసారిగా హెలీ ట్యాక్సీ సేవల్ని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (బీఐఏఎల్) అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరులోని పీణ్య, ఎలక్ట్రానిక్ సిటీతోపాటు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలనుంచి ఎయిర్పోర్టుకు చేరాలంటే ప్రయాణికులు కనీసం రెండు గంటల ముందు బయలుదేరాల్సి వస్తోంది. దీంతో తుంబీ ఏవియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో హెలీట్యాక్సీ సేవలకు బీఐఏఎల్ శ్రీకారం చుట్టింది. పీణ్య, ఎలక్ట్రానిక్ సిటీ, హెచ్ఏఎల్ చుట్టు పక్కలున్న పలు ప్రాంతాలకు రెండు హెలీ ట్యాక్సీల ద్వారా సేవలు అందజేస్తారు. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా శుక్రవారం ఈ సేవల్ని లాంఛనంగా ఆరంభించారు. ఒక హెలికాప్టర్లో ఐదుగురు, మరో హెలికాప్టర్లో 13 మంది ప్రయాణించవచ్చు. డిమాండ్ మేరకు హెలికాప్టర్ల సంఖ్య పెంచే ఆలోచన ఉన్నట్లు అధికారులు చెప్పారు. వీటి చార్జీలు లగ్జరీ ట్యాక్సీల తరహాలోనే ఉంటాయన్నారు. బెంగళూరు విమానాశ్రయాన్ని జీవీకే ఇన్ఫ్రా నిర్మించినా... ఇటీవలే మొత్తం వాటాను విక్రయించి దీన్నుంచి వైదొలిగింది.