-
ఎవరికీ వంతపాడం...
ఏపీకి అనుకూలంగా ఉన్నామన్న ఆరోపణ అర్థరహితం రాష్ట్రానికి వివరణ ఇస్తూ కృష్ణా బోర్డు లేఖ సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని నీటి పంపకాలు, ప్రాజెక్టుల నియంత్రణ, టెలిమె ట్రీ వ్యవస్థల ఏర్పాటు విషయంలో తామెవ రికీ వంత పాడటం లేదని, తటస్థ వైఖరితో ఉన్నామని కృష్ణానదీ బోర్డు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా ఉన్నామన్న తెలంగాణ ఆరోపణలు అర్థరహితమని పేర్కొ ంది. ఇరు రాష్ట్రాలకు న్యాయం చేసేందుకే ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేసింది. వాటాకు మించి నీటిని వినియోగం చేశారంటూ తమపై కేంద్ర జలవనరుల శాఖకు ఫిర్యాదు చేసిన బోర్డు, టెలిమెట్రీ పరికరాల అమల్లో ఏపీ చేస్తున్న జాప్యాన్ని ఎందుకు పట్టించు కోవడం లేదంటూ ఇటీవల తెలంగాణ బోర్డు కు ఘాటు లేఖ రాసిన నేపథ్యంలో దానికి వివరణ ఇస్తూ బోర్డు గురువారం రాష్ట్రానికి లేఖ రాసింది. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ దిగువన 600 మీటర్ల వద్ద టెలిమెట్రీకి ప్రతిపాదించగా, దాన్ని శ్రీశైలం కుడి కాల్వ కింద 12.26 కిలోమీటర్ పాయింట్కు మార్చ డంపై వివరణ ఇచ్చింది. ప్రతిపాదిత పాయిం ట్ వద్ద నీటి లెవల్ టెలిమెట్రీ వ్యవస్థ పని చేయడానికి అనుకూలించదని, దీనిపై కేంద్ర జలసంఘం అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే మార్పులు చేశామని తెలిపింది. ఇక మొదటి దశలో ప్రతిపాదించిన 18 టెలిమెట్రీల్లో సాగర్ ఎగువన ప్రతిపాదించిన వాటిపై తెలంగాణ అభ్యంతరాలు తెలుపగా, వాటిని ఆపించామని వివరించింది. శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, సాగర్ను తెలంగాణ అదుపు లో పెట్టుకొని ఇష్టానుసారం నీటిని వాడుకుం టున్నాయని, తమ ఆదేశాలను ఖాతరు చేయడం లేదని తెలిపింది. ఈ దృష్ట్యానే నీటి వాడకం అంశాన్ని కేంద్ర జల వనరుల శాఖ దృష్టికి తీసుకెళ్లాల్సి వచ్చిందని పేర్కొంది. త్రిసభ్య కమిటీ భేటీ వాయిదా.. కాగా శుక్రవారం జరగాల్సిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ వాయిదా పడింది. రాష్ట్ర ఈఎన్సీ అందుబాటులో లేకపోవడంతో బోర్డు సమావేశాన్ని వాయిదా వేశారు. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై మాత్రం స్పష్టత రాలేదు. ఈ భేటీ జరిగితే సాగర్లో 500 అడుగులు, శ్రీశైలంలో 765 అడుగుల దిగువకు వెళ్లి నీటిని తీసుకునే అంశంపై స్పష్టత వస్తుందని అంతా భావించినా వాయిదా కారణంగా నీటి వాటాల కోసం మరిన్ని రోజులు ఆగాల్సి ఉంది. -
హెడ్ రెగ్యులేటర్ నిర్మాణానికి స్థల పరిశీలన
శ్రీశైలం ప్రాజెక్టు: ప్రకాశం జిల్లా దోర్నాల ప్రాంతంలోని కొత్తపల్లి గ్రామం వద్ద వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణానికి నిపుణుల కమిటీ సభ్యులు..స్థలాన్ని పరిశీలించారు. రిటైర్డ్ ఈఎన్సీ బి ఎస్ ఎన్ రెడ్డి, రిటైర్డు చీఫ్ ఇంజనీర్లు సుబ్బారావు, రౌతు సత్యనారాయణలు ఆ ప్రాంతాన్ని పరిశీలించినట్లు జలవనరుల శాఖ ఎస్ఈ మల్లికార్జునరెడ్డి శనివారం తెలిపారు. నిపుణుల కమిటీ సభ్యులు.. శ్రీశైలం రిజర్వాయర్ వెనుక భాగం నుంచి కృష్ణానదిలో కొల్లంవాగుకు చేరుకుని ఆ ప్రాంతంలో హెడ్రెగ్యులేటర్ను నిర్మించేందుకు రవాణా మార్గాలను, నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించినట్లు ఆయన చెప్పారు. శ్రీ’శైల జలాశయానికి 21. కి.మీటర్ల నదీ మార్గ పరిధిలో కొల్లంవాగు ప్రదేశం ఉంది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పల్నాడు, అనంత ఎస్పీలపై వేటు
మీకు ప్రశ్నించే హక్కు ఉందా..?
ముక్కోటి దేవతలకు ఆహ్వానం
తిరుపతి గ్రామదేవతకు వేడుకగా భూమన కుటుంబం సారె
చెక్ బౌన్స్ కేసులో నిందితుడికి జైలు
పాల వ్యాన్ ఢీకొని ఆర్టీసీ డ్రైవర్ మృతి
కనిపించని ఏనుగు జాడ
ఘనంగా చిన్నకొట్టాయి ఉత్సవం
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
ముగ్గురూ ఆడపిల్లలైనా..
తప్పక చదవండి
- మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
- బ్యారేజీలకు తక్షణ మరమ్మతులు
- Kishori Lal Sharma: ఆమె నాకు పోటీయే కాదు!
- Lok Sabha Election 2024: నోరుజారె... పరువు పోయె..!
- 9 సీట్లలో గెలుపు ఖాయం
- అంచనాలకు మించి..
- Lok Sabha Election 2024: నల్లత్రాచు నుంచి ‘అప్సరస’ వరకు..
- Lok Sabha Election 2024: చివరి పంచ్ ఎవరిదో!
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
Advertisement