-
ఆమెతో పెళ్లి వద్దు.. వధువు మేకప్ ప్లాన్ ఎంత పనిచేసింది!
పెళ్లి వేడుక సందర్బంగా బ్యూటీపార్లర్కు వెళ్లడమే ఆమె పాలిట శాపమైంది. చిన్న మిస్టేక్ కారణంగా వివాహం ఆగిపోయిన పరిస్థితి ఎదురైంది. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. ఇంతకీ ఏం జరిగిదంటే.. వివరాల ప్రకారం.. కర్నాటకలోని హసన్ జిల్లాలోని అరసికెరె గ్రామానికి చెందిన ఓ యువతికి పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. కాగా, పెళ్లి కోసమని ఆమె స్థానికంగా ఉన్న ఓ బ్యూటీ పార్లర్కు వెళ్లింది. ఈ సందర్భంగా ఫేషియల్ అనంతరం ఆవిరి పడుతున్న క్రమంలో వేడి కారణంగా ఆమె ముఖం వాడిపోయింది. దీంతో, ఆమె రూపం మొత్తం మారిపోయింది. ముఖం నల్లగా అయిపోయి.. ఆవిరి కారణంగా ముఖం వాచిపోయింది. అనంతరం, ఆమెను ఆసుపత్రిలో చేర్పించడంతో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో ఆమెను చూసిన వరుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఆమె ముఖం మారిపోవడంతో వరుడు పెళ్లికి తిరస్కరించాడు. కాగా, వరుడి నిర్ణయంలో వధువు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈ ఘటనకు కారణమైన బ్యూటీ పార్లర్ యజమాని గంగపై మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యజమానిని పిలిపించి విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, పెళ్లి ఆనందంలో ఉన్న ఇంట్ల ఈ చిన్న కారణంగా వివాహం ఆగిపోవడంతో ఈ ఘటన స్థానికంగా హాట్టాపిక్గా మారింది. -
Manjarabad Fort: మంజారాబాద్.. స్టార్ఫోర్ట్
ఆకాశంలో మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాన్ని చూడాలంటే తలెత్తి చూస్తే చాలు. నేల మీద ఉన్న ఈ నక్షత్రాన్ని చూడాలంటే మాత్రం ఆకాశంలో విహరించాల్సిందే. ఈ టూర్లో ఈ నక్షత్రకోటతోపాటు పశ్చిమ కనుమల ప్రకృతి విన్యాసాలన్నీ ఆస్వాదించవచ్చు. కర్ణాటక ఊటీ... నక్షత్రం ఆకారంలో ఉన్న ఈ కోట కర్ణాటక, హసన్ జిల్లాలో ఉంది. ఈ కోట సందర్శన పెద్ద సాహసం అనే చెప్పాలి. నాచు మధ్య జాగ్రత్తగా అడుగులు వేస్తూ దిగుడుబావి ఒడ్డుకు చేరడం యువతకే సాధ్యం. ఏడాది మొత్తం ఇక్కడ చల్లగానే ఉంటుంది. ఈ చల్లదనానికి పశ్చిమ కనుమల పచ్చదనం కూడా కారణమే. సక్లేశ్పురా నుంచి ఈ కోటకు ప్రయాణం మొదలైనప్పటి నుంచి కాఫీ గింజల పరిమళం ఉత్సాహాన్నిస్తుంది. ఆకాశాన్నంటుతున్న పోక చెట్లు మీ ప్రయాణం కూడా ఆకాశం వైపేనని గుర్తు చేస్తాయి. యాలకుల చెట్లు వాతావరణాన్ని సుగంధభరితం చేస్తుంటే మిరియాల గుత్తులు ఒకింత ఘాటు వాసనతో ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్నిస్తుంటాయి. చల్లటి వాతావరణంలో గొంతు గరగర అనిపిస్తే రెండు మిరియాలను నమిలితే పర్యటన ఆరోగ్యంగా ముందుకు సాగుతుంది. మధ్యలో చిన్న చిన్న నీటి కాలువలు పాదాలను కడుగుతుంటాయి. కొండల్లో ప్రవహించే స్వచ్ఛమైన నీరు చల్లగా పాదాలను స్పృశిస్తుంటే చెప్పలేని ఆనందం కలుగుతుంది. ఈ హిల్స్టేషన్ను ఊటీతో పోలుస్తారు. ఊటీ సంపన్నుల పర్యాటక క్షేత్రం అయితే ఇది పేదవారి పర్యాటక ప్రదేశమని చెబుతారు. మంచులో మెరిసిన నక్షత్రం... హసన్ జిల్లా కేంద్రానికి 45 కి.మీల దూరంలో మల్నాడు రీజియన్, సక్లేశ్పురా పట్టణానికి దగ్గరలో ఉన్న స్టార్ఫోర్ట్ అసలు పేరు మంజారాబాద్ కోట. మంజు అంటే కన్నడలో మంచు అని అర్థం. ఎప్పుడూ మంచు తెర కమ్మినట్లే ఉంటుంది ఇక్కడి వాతావరణం. ఇది మైసూరు పాలకుల వేసవి విడిదిగా ఉండేది. ఈ కోటలో పెద్ద ఆయుధాగారం ఉండేదని ఇప్పుడున్న ఆనవాళ్లు చెబుతుంటాయి. మైసూర్ కోట నుంచి ఈ కోటకు రహస్య మార్గం ఉండేదని స్థానిక కథనం. ఎనిమిది కోణాల నిర్మాణం ఇది. నిజానికి దీనిని ఎనిమిది రెక్కల పద్మం ఆకారం అనే చెప్పాలి. అయితే మూలలు కోసుగా కోణాకారంలో ఉండడంతో నక్షత్రకోటగా వాడుకలోకి వచ్చింది. -
చెత్తకుప్పలో మెతుకులే పరమాన్నం
బనశంకరి: మానవాళికి కరోనా తెచ్చిన కష్టాలు అన్నీఇన్నీ కావు. అప్పటివరకు సాఫీగా సాగిపోతున్న లక్షలాది కుటుంబాలు సుడిగుండాల్లో చిక్కుకున్నాయి. ఉద్యోగాలు, ఉపాధి పోయి రోడ్డున పడ్డవారెందరో. ఒక కూలీ పని కోల్పోయి చేతిలో చిల్లిగవ్వ లేక చెత్తకుప్పలో మెతుకులు ఏరుకుతింటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సంఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లాలో జరిగింది. ఆలూరు తాలూకా కోనపేటే రోడ్డులో పొరుగూరికి చెందిన రాజు అనే వ్యక్తి చెత్త కుప్పలో ఆహారం ఏరుకుని తిన్నాడు. దారినపోయేవారు గమనించి విచారించగా ఆకలిని తట్టుకోలేక ఇలా చేస్తున్నానని సమాధానమిచ్చాడు. అల్లంతోటలో ఏడాది కిందట పని కోసం వచ్చానని, లాక్డౌన్తో పని పోయిందని, ఊరికి వెళ్లడానికి కూడా డబ్బులు లేవని చెప్పాడు. తెలిసినవారు కూడా ఎవరూ లేరని రాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. విషయం తెలిసిన తాలూకా కట్టడ కార్మికుల సంఘం అధ్యక్షుడు ఆనంద్ అన్నం, సాంబారు తెప్పించి రాజుకు అందజేశాడు. తాలూకా ఆరోగ్యాధికారి డాక్టర్ తిమ్మయ్య ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. రాజుకి తానే తాపీ పని ఇప్పిస్తానని ఆనంద్ చెప్పాడు. చదవండి: మనిషిని అనుకరించిన ఏనుగు.. ఏకంగా తొండంతో -
హీరో యశ్పై కలెక్టర్కు ఫిర్యాదు
యశవంతపుర: కేజీఎఫ్ ఫేమ్.. హీరో యశ్పై రాజ్య రైతు సంఘం కార్యాధ్యక్షుడు అణ్ణాజప్ప హాసన్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. యశ్ తల్లిదండ్రులు ఇటీవల దుద్ధ హోబళి తిమ్మాపుర గ్రామంలో కొనుగోలు చేసిన భూమిలో అక్రమంగా ప్రహరీ నిర్మించి రైతులకు ఇబ్బందులకు గురి చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గూండాలను రప్పించి గ్రామస్తులను యశ్ భయపెడుతున్నట్లు ఆరోపించారు. రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఇటీవలే యశ్ తల్లికి, గ్రామస్థులకి మధ్య గొడవ జరిగింది. యశ్ తల్లి కర్ణాటకలోని హాసన్ జిల్లాకు చెందినవారు. హాసన్లో సొంత ఇల్లు ఉంది. హాసన్ సమీపంలోని తిమ్మాపుర గ్రామంలో ఇటీవల 80 ఎకరాల భూమిని యశ్ కుటుంబం కొనుగోలు చేసింది. తమ పొలాలకు దారిని మూసివేశారని గ్రామస్థులు యశ్ తల్లి పుష్పలతతో గొడవ పడ్డారు. వివాదం పెద్దది కావంతో గ్రామస్థులు దుద్ద పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: భూ వివాదంలో హీరో యశ్ కుటుంబం -
బలవంతంగా యువతికి తాళి కట్టాడు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement