breaking news
gurukulalu
-
120 సమీకృత గురుకులాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సమీకృత గురుకులాల నిర్మాణానికి వెంటనే ఆయా నియోజకవర్గాల్లో స్థలాలు సేకరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5 వేల కోట్లతో 30 ప్రాంతాల్లో 120 సమీకృత గురుకులాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని సాధ్యమైనంత త్వరగా స్థలాల సేకరణతో పాటు, భవనాల నమూనాలు (డిజైన్లు) పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 25 ఎకరాల్లో, పట్టణ ప్రాంతాల్లో 10 నుంచి 15 ఎకరాల్లో సమీకృత గురుకుల పాఠశాలల ఏర్పాటు కోసం స్థల సేకరణ చేయాలని చెప్పారు. రాబోయే ఎడెనిమిది నెలల్లో ఈ భవనాలను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సోమవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని, అందుకు తగ్గట్టుగా అధికారుల పనితీరు ఉండాలని సూచించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో విద్యార్థుల ప్రవేశాలు వందశాతం పూర్తి చేయాలని చెప్పారు. ప్రతి విద్యార్థి మంచం పైనే పడుకోవాలి ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి మంచం పైనే పడుకునేలా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని భట్టి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 1,029 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు ఇప్పటివరకు మంచాలు, పరుపులు, దుప్పట్లు ఎన్ని ఉన్నాయి? ఇంకా ఎంతమందికి ఇవి కావాలి అనే దానిపై వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గురుకుల పాఠశాలలతో పాటు ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు తప్పనిసరిగా మరుగుదొడ్లు, స్నానాల గదులు, నీటి సరఫరా, విద్యుత్ సదుపాయం ఉండేలా చూడాలని, వసతి గదులకు తలుపులు, కిటికీలు, దోమలు రాకుండా వాటికి మెష్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యార్థులకు సౌకర్యాల కల్పనపై చెక్ లిస్టు రూపొందించి ఈనెల 29వ తేదీలోగా సమర్పించాలని ఆదేశించారు. చెక్ లిస్టును ప్రతి హాస్టల్లో ప్రదర్శించాలన్నారు. ఓవర్సీస్ స్కాలర్షిప్లు మంజూరు చేస్తాం విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలంటూ మంత్రి పొన్నం చేసిన విజ్ఞప్తిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలో పెండింగ్లో ఉన్న ఓవర్సీస్ స్కాలర్íÙప్ బకాయిల జాబితాను అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 800 మంది బీసీ విద్యార్థులకు, 500 మంది చొప్పున ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. పెద్దాపూర్ పాఠశాలపై సమీక్ష జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను తాము సందర్శించిన తర్వాత అక్కడ తీసుకున్న చర్యలపై గురుకులాల కార్యదర్శి రమణకుమార్ను డిప్యూటీ సీఎం ఆరా తీశారు. విద్యార్థులకు మంచాలు, పరుపులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాల మైదానం చదును చేయాలని, నూతన భవనాల నిర్మాణం కోసం కావాల్సిన ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
Fact Check: గురుకులాలపై ఈనాడు వక్రభాష్యాలు
అదేదో సినిమాలో ... ‘మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటున్నా.. మీరు ఇక్కడే ఉంటారని’..చెప్పే హాస్యనటుడి డైలాగ్ చంద్రబాబు–రామోజీలకు సరిపోతుందేమో...ఎన్నికలేమో దగ్గరపడుతున్నాయి...తన శిష్యుడు చంద్రబాబును ఎంత ఎత్తుదామన్నా...రాజకీయంగా అథఃపాతాళానికి దిగజారిపోయిన ప్రతిష్ఠను తీసుకురాలేని దౌర్భాగ్య స్థితిలో రామోజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై రాళ్లేయాలని చూస్తున్నారు... ఇది ఆకాశమ్మీద రాయివేసిన చందమేనని రామోజీకి అర్థం కావడం లేదేమో... తాజాగా గురుకులాలపై ఈ పచ్చపాత పెద్ద వక్రదృష్టి సారించి, తన విషప(పు)త్రికలో కట్టుకథలు అల్లారు...చంద్రబాబు ప్రభుత్వంలో గురుకులాల సంఖ్య పెరగలేదు..అక్కడి విద్యార్థుల సంక్షేమాన్ని బాబు పట్టించుకోలేదు...విద్యా ప్రమాణాలనూ గాలికొదిలేశారు... ఇప్పుడివన్నీ జగన్ ప్రభుత్వం పట్టించుకుంది..గురుకులాలు పెరిగాయి..డైట్ ఛార్జీలు పెరిగాయి...విద్యా ప్రమాణాలూ పెరిగాయి....ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, నీట్, ఇంజనీరింగ్ సీట్లను గురుకుల విద్యార్థులు సాధిస్తున్నారు.. గురుకులాల పేరిట కలకలం రేపాలని రామోజీ తహతహలాడుతూ చదువుల తల్లినీ అవమానిస్తున్నారు... కళ్లు విప్పార్చుకుని చూస్తే ఈ ఎల్లో పెద్దకు నిజానిజాలు తెలుస్తాయి... సాక్షి, అమరావతిః బీసీ విద్యార్థులు చదివే గురుకుల విద్యాలయాలపైనా రామోజీ గురివింద రాతలు మానలేదు. తెలంగాణాతో పోలిక పెట్టి ఆంధ్రప్రదేశ్పై బురద చల్లేందుకు ఈయన తాపత్రయ పడ్డారు. పేద పిల్లలకు పెద్ద చదువులు దక్కాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషిని వెక్కిరిస్తూ వెకిలి రాతలు రాసేశారు. బీసీ గురుకులాల మంజూరు, నిర్మాణం, విద్యార్థులకు వసతులు, మెరుగైన ఫలితాలు తదితర అనేక విషయాల్లో చంద్రబాబు వైఫల్యాలను కప్పిపుచ్చడమే కాకుండా సీఎం వైఎస్ జగన్ హయాంలో విజయాలను మరుగుపరిచే కుటిలయత్నం ఈ రాతల్లో స్పష్టంగా కన్పించింది. ఈనాడు అబద్ధాలను దునుమాడే వాస్తవాలు ఇవిగో.. ఆరోపణః వైకాపా పాలనలో గురుకులాలకు అథమ స్థానం వాస్తవంః రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన బీసీ గురుకుల విద్యాలయాలకు సీఎం వైఎస్ జగన్ మహర్దశ తీసుకొచ్చారు. చంద్రబాబు హయాంలో కేవలం 41 గురుకులాలు ఉంటే.. సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన అనంతరం వాటిని 105కు పెంచారు. విద్యార్థుల సంఖ్యా గణనీయంగా పెరగడంతో పాటు వారికి అవసరమైన నాణ్యమైన విద్య, మౌలిక వసతులు అందించడంలో జగన్ ప్రత్యేక శ్రద్ధతో అనేక చర్యలు చేపట్టారు. ♦ చంద్రబాబు హయాంలో 2018–19 నాటికి రాష్ట్రంలో బీసీ గురుకులాలు కేవలం 41 మాత్రమే ఉన్నాయి. ♦ 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు హడావుడిగా 65 కొత్త గురుకులాలు మంజూరు చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. వాటిని కనీసం గ్రౌండింగ్ అయినా చేయలేదంటే చంద్రబాబు చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న 2019 ఏప్రిల్లో హడావుడిగా 21 గురుకులాలు ప్రారంభించినట్టు బిల్డప్ ఇచ్చి జనాన్ని మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. ♦ సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన అనంతరం 2019 నుంచి 2023లోపు 41 కొత్త గురుకులాలను ప్రారంభించారు. 2023లో మరో రెండు కొత్త గురుకులాలను సీఎం జగన్ ప్రారంభించారు. దీంతో చంద్రబాబు హయాంలో 41 గురుకులాలు ఉంటే, జగన్ ప్రభుత్వ హయాంలో వాటి సంఖ్య 105కు పెరిగిన విషయాన్ని ఈనాడు దాచిపెట్టింది. ఈ గురుకుల విద్యాలయాల్లో 2018–19 విద్యా సంవత్సరం (చంద్రబాబు పాలన)లో 25,629 మంది విద్యార్థులుంటే.. 2023–24 విద్యా సంవత్సరానికి (జగన్ సర్కారు)లో 38,188 మంది విద్యార్థులు పెరగడం గమనార్హం. ♦ రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో 14 జూనియర్ గురుకుల కాలేజీలు ఉంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కొత్తగా మరో నాలుగు మంజూరు చేసింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, నంద్యాల జిల్లా డోన్, బేతంచెర్ల, చిత్తూరు జిల్లా సదుంలో కొత్తగా జూనియర్ గురుకుల కాలేజీలు ప్రారంభించింది. ♦ హెయిర్ కటింగ్ కోసం 3వ తరగతి నుంచి బాలురకు నెలకు గత ప్రభుత్వం రూ.30 ఇస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.50కి పెంచింది. ఆరోపణః బిల్లులు చెల్లించలేదు... వాస్తవంః బడ్జెట్ కేటాయింపుల్లోను జగన్ సర్కారు ఉదారంగా నిలిచిందనే విషయం గత పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. చంద్రబాబు అధికారం చేపట్టిన తొలినాళ్లలో కేవలం రూ.45 కోట్లు కేటాయిస్తే.. సీఎం జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి రూ.213 కోట్లకు పైగా ప్రభుత్వం కేటాయింపులు చేసింది. ఈ నిజాలనూ రామోజీ దాచేశారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం జగన్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు వాస్తవాలను వక్రీకరించి బోగస్ రాతలు రాస్తున్నారు. ఆరోపణః ‘అద్దె’సరు భవనాలు.. వాస్తవంః పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఇంగ్లీష్ మీడియం చదువులు, ప్రభుత్వ బడుల సౌకర్యాలను మెరుగు పర్చడంలో సీఎం వైఎస్ జగన్ చేపట్టిన నాడు–నేడు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందనే విషయం రామోజీకి మింగుడు పడటంలేదు. ప్రభుత్వ బడులు మాదిరిగానే బీసీ గురుకులాల రూపురేఖలను నాడు–నేడు కార్యక్రమంతో మార్చిన విషయాన్ని ఈనాడు ఉద్దేశపూర్వకంగా మరుగున పరిచింది. తొమ్మిది ప్రధానమైన మౌలిక వసతులు కల్పిస్తూ బీసీ గురుకులాలను తీర్చిదిద్దింది. రాష్ట్రంలో 37 గురుకులాలను రూ.17.97 కోట్లతో అభివృద్ధి చేసింది. వాటికి నీటి సరఫరాతో కూడిన టాయిలెట్లు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లతో విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, పాఠశాలకు పెయింటింగ్, మరమ్మతులు, ఆకుపచ్చ సుద్ద బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్లు, ప్రహరీ గోడలు నిర్మించింది. జూనియర్ కాలేజీ భవనాల నిర్మాణం విషయానికి వస్తే.. గత ప్రభుత్వం (2014–19)లో రూ.102.60 కోట్లు కేటాయిస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం (2019–23)లో రూ.194 కోట్లు కేటాయించింది. ఫలితాలే గీటురాయి.. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమేరకు ఫలప్రదమయ్యాయో తెలియాలంటే ఆయా విద్యా సంస్థల్లో విద్యార్థులు సాధించిన ఫలితాలే గీటురాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీ గురుకుల విద్యార్థులకు ప్రత్యేకంగా ఐఐటీ, నీట్లో ప్రత్యేక కోచింగ్ ఇవ్వడంతో వారు ఉత్తమ ఫలితాలు సాధించారు. ♦ బిసీ గురుకులాల్లో 2022–23లో పదో తరగతిలో 90 శాతం, ఇంటర్మీడియట్లో 90.10 శాతం ఉత్తీర్ణత సాధించారు. ♦ ఎంపీసీ (ఐఐటీ అడ్వాన్డ్స్)లో 2019–20లో 102 మంది విద్యార్థుల్లో 37 మంది అర్హత సాధించారు. 2020–21లో 205 మందికి 65 మంది అర్హత సాధించారు. 2021–22లో 147 మందికి 45 మంది అర్హత సాధించారు. ♦ఐఐటీ, నీట్, పోటీ పరీక్షల్లో 2022–23లో మంచి ప్రతిభ కనబరిచిన 40 మంది గురుకుల విద్యార్థులు సీట్లు సాధించారు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలో ఆరుగురు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో 24, నీట్ (బైపీసీ స్ట్రీమ్)లో ఎంబీబీఎస్లో నాలుగు, డెంటల్లో ఒక సీటు, వెటర్నరీ 4, అగ్రికల్చర్ లో ఒక సీటును సాధించారు. ఆరోపణః బీసీ విద్యార్థుల వెన్ను విరిచారు. వాస్తవంః పేద పిల్లలు చదివే గురుకులాల్లో చంద్రబాబు ప్రభుత్వం కనీసం డైట్, కాస్మొటిక్, హెయిర్ కట్ వంటి ఛార్జీల పెంపుదల మాటే పట్టించుకోలేదు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక వాటిని పెంచి అందిస్తున్నారు. ఈ వివరాలు గమనిస్తే ఈనాడు రాసినవన్నీ కట్టుకథలని ఇట్టే తేటతెల్లమవుతాయి. -
ఊరట.. ’గురుకుల’ పరీక్షపై స్టే ఎత్తివేత
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట కలిగింది. గురుకులాల పరిధిలోని డిగ్రీ కళాశాలల లెక్చరర్ల రాతపరీక్షపై విధించిన స్టేను మంగళవారం హైకోర్టు ఎత్తివేసింది. దీంతో రాత పరీక్షకు మార్గం సుగమం అయింది. గురుకులాల్లోని మహిళా కళాశాలల్లో ఉద్యోగాలన్నీ కూడా మహిళలకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడంపై కొంతమంది పురుష అభ్యర్థులు కోర్టుకు ఎక్కారు. దాంతో గత జులై 30న జరగాల్సిన పరీక్షను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం తరుపున కోర్టుకు తాజాగా వివరణ ఇవ్వడంతో దానితో ఏకీ భవించిన కోర్టు స్టేను ఎత్తివేసింది. దీంతో డిగ్రీ కళాశాలల లెక్కరర్ల రాత పరీక్ష జరగనుంది. మరోపక్క, గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ నియామక పరీక్షలకోసం జారీ చేసిన జీవో 1274ను హైకోర్టు ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువరించకపోవడంతో దీనిపై టీఎస్పీఎస్సీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. మరోపక్క, కొత్త షెడ్యూల్ను కూడా టీఎస్పీఎస్సీనే ప్రకటించాల్సి ఉంది. మొత్తం 500 పోస్టుల్లో మహిళకే కేటాయిస్తూ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపైనే ధుమారం రేగింది.