-
48 గంటల్లో 9.5 కోట్ల మంది విజిటర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత సీజన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ను ప్రారంభించిన తొలి 48 గంటల్లోనే రికార్డు స్థాయిలో 9.5 కోట్ల మంది పైచిలుకు కస్టమర్లు తమ పోర్టల్ను సందర్శించినట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా డైరెక్టర్ (స్మార్ట్ఫోన్లు, టీవీలు) రంజిత్ బాబు తెలిపారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లు, టీవీల విక్రయాలకు సంబంధించి తమ టాప్ 3 మార్కెట్లలో రాష్ట్రాలపరంగా తెలంగాణ, నగరాలవారీగా హైదరాబాద్ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సీజన్లో తెలంగాణలో టీవీలకు రెండు రెట్లు డిమాండ్ కనిపించగా, 5జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు 60 శాతం పెరిగాయని రంజిత్ బాబు చెప్పారు. ఎక్కువగా ప్రీమియం స్మార్ట్ఫోన్లు, పెద్ద స్క్రీన్ టీవీలవైపు కస్టమర్లు మొగ్గుచూపుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి తమ ప్లాట్ఫాంపై 50,000 పైచిలుకు విక్రేతలు ఉన్నారని గురువారమిక్కడ ఐఐటీ హైదరాబాద్లో నిర్వహించిన అమెజాన్ ఎక్స్పీరియన్స్ ఎరీనా (ఏఎక్స్ఏ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఇందులో వివిధ ఉత్పత్తులను ప్రదర్శించే జోన్లను ఏర్పాటు చేశారు. మరికొన్నాళ్లు కొనసాగే ఫెస్టివల్లో బ్యాంకు డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్, ఎక్సే్చంజ్, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆకర్షణీయ ఆఫర్లు ఇస్తున్నట్లు రంజిత్ బాబు వివరించారు. -
ఆ స్మార్ట్ఫోన్లంటే ప్రాణం!, నిమిషానికి ఎన్ని ఫోన్లు కొనుగోలు చేస్తున్నారంటే!
భారత్లో రెండు ఈ -కామర్స్ సంస్థలు నువ్వా..నేనా..సై..అంటూ భారీ డిస్కౌంట్లతో కాలుదువ్వుతున్నాయి. దీన్ని అదునుగా భావిస్తున్న కోట్లాది మంది కస్టమర్లు కూర్చున్న చోటుకే కావాల్సినవి వస్తుండటంతో సెకన్ల వ్యవధిలో తమకు కావాల్సిన వస్తువుల్ని ఆర్డర్లు పెడుతున్నారు. ఆర్డర్లు సంగతి సరే. ఇంతకీ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ పోర్టల్లో ఏ వస్తువు ఎక్కువగా అమ్ముడవుతుంది? యూజర్లు ఏ బ్రాండ్ ఫోన్లు ఎక్కువగా కొంటున్నారు? దేశీయ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ నిర్వహిస్తున్న ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్స్, అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్స్లో సరికొత్త రికార్డ్లను నమోదు అవుతున్నాయి. స్పెషల్ సేల్లో భారీ ఎత్తున డిస్కౌంట్స్ అందిస్తుండడంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సైట్లకు కస్టమర్లు పోటెత్తుతున్నారు. దీంతో ఆయా సెగ్మెంట్లలోని వస్తువులు నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ఫ్లిప్కార్ట్లో రోజుకి 9.1 కోట్ల మంది కస్టమర్లు కొనుగోలు దారుల డిమాండ్ దృష్ట్యా ఫ్లిప్ కార్ట్ వెబ్సైట్ను రోజువారీ లావాదేవీలపై 9.1 కోట్ల మంది కస్టమర్లు సందర్శించారు. ఆర్డర్లు సైతం 7 రెట్లు పెరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ ప్రత్యేక సేల్లో కొనుగోలు దారులు మొబైల్, గృహోపకరణాలు (Appliance), లైఫ్స్టైల్, బ్యూటీ అండ్ జనరల్ మెర్చెండైజ్ ఉత్పత్తులు అంటే షూ’లు, దుస్తులు,ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్, జ్యువెలరీ, ఫుడ్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువుల్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. ►ఫ్లిప్ కార్ట్లో టైర్-2 ప్లస్ కస్టమర్లు రూ.20,000 ధర కంటే ఎక్కువగా ఉన్న ఫోన్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేసింది. ►ఇక, అదే సైట్లో 1-2 అండ్ 3 టైర్ సిటీస్కు చెందిన కస్టమర్లు మొబైల్స్, అప్లయెన్సెస్, లైఫ్ స్టైల్, బ్యూటీ అండ్ జనరల్ మెర్చెండైజ్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు 60 శాతం ఆర్డర్లు పెట్టారు. అమెజాన్లో 9. కోట్ల మంది మరోవైపు అమెజాన్ అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 15 వరకు కొనసాగుతున్న అమ్మకాలు సైతం భారీ ఎత్తున జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ మొదటి 48 గంటల్లో 9.5 కోట్ల మంది కస్టమర్లు అమెజాన్ సైట్ని వీక్షించారు. ఆఫోన్ అంటే మాకు ప్రాణం.. నిమిషానికి 100 ఆర్డర్లు అమెజాన్ పోర్టల్లో ఎక్కువగా కొనుగోలు చేసిన ప్రొడక్ట్లలో స్మార్ట్ ఫోన్లు అత్యధికంగా ఉన్నాయి. సాధారణ కస్టమర్ల కంటే ముందే ప్రైమ్ సబ్స్క్రైబర్లు అక్టోబర్ 7న కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే, ఆ ఒక్కరోజే ప్రైమ్ మెంబర్లు సెకనుకు 75 కంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు ఆర్డర్ పెట్టారు. ఆ ఫోన్లలో వన్ప్లస్, శామ్ సంగ్, యాపిల్ ఐఫోన్లు ఎక్కువగా ఉండగా.. తొలి 48 గంటల్లో ప్రతి నిమిషానికి 100 వన్ ప్లస్ ఫోన్ను కొనుగోలు చేశారు. ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో శాంసంగ్ డిమాండ్ ఎక్కువగా ఉంది. 75 శాతం స్మార్ట్ఫోన్ల అమ్మకాలు 2-3 టైర్ (సిటీస్/టౌన్ల) ప్రాంతాల కస్టమర్ల ఆర్డర్లకు అనుగుణంగా 75 శాతం స్మార్ట్ఫోన్లు అమ్మినట్లు అమెజాన్ తెలిపింది. బడ్జెట్ ధర, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్ఛేంజ్ ఆఫర్ సౌకర్యం ఉండడంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.30,000 కంటే ఎక్కువ ధర ఉన్న ప్రీమియం స్మార్ట్ఫోన్ల సేల్స్ 3 శాతం వృద్ది సాధించినట్లు వెల్లడించింది. నిమిషానికో టీవీ తాము నిర్వహిస్తున్న అమ్మకాల తొలి రెండ్రోజుల్లో ప్రతి సెకనుకు 1.2లక్షల కస్టమర్లు గృహోపకరకాణాల్ని కొనుగోలు చేశారు. ఆ సెకనులోని సగం మంది కస్టమర్లు ధర ఎక్కువగా ఉన్న అప్లయెన్సెస్ కోసం ఆర్డర్ పెట్టారు. 2-3 టైర్ నగరాల ప్రజలు ప్రతి నిమిషానికి ఒక టీవిని కొనుగోలు చేశారు. అందం మీద ఆసక్తితో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ స్పెషల్ సేల్పై ప్రముఖ రీసెర్చ్ సంస్థ రెడ్సీర్ ఓ ఆసక్తిరమైన రిపోర్ట్ను విడుదల చేసింది. బిగ్ బిలియన్ డే సేల్లో ఒకరోజు ముందే షాపింగ్ చేసుకునే అవకాశం ఉన్న ఫ్లిప్ కార్ట్ ఫ్లస్ సబ్స్క్రైబర్లు గ్రూమింగ్ సంబంధిత ప్రొడక్ట్లతో పాటు ఫుడ్ అండ్ న్యూట్రీషియన్, మేకప్, స్ప్రే బాటిల్స్ను ఎక్కువగా కొనుగోలు చేసినట్లు రెడ్రీస్ నివేదించింది గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో గత ఏడాదిలో అమెజాన్ నిర్వహించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్తో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాల్లో తొలి 48 గంటల్లో 35శాతం కంటే ఎక్కువగా ప్రీమియం స్మార్ట్ ఫోన్లను విక్రయించగా.. ప్రతి నిమిషానికి 10 ప్రీమియం నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్స్ను కొనుగోలు చేశారు. ఈ ప్రాంతాల నుంచే ఎక్కువ ఆర్డర్లు ఫ్లిప్కార్ట్లో బెంగళూరు,ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల నుంచి ఎక్కువ మంది ఆర్డర్లు పెట్టగా.. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై,పూణే, అహ్మదాబాద్,కోల్కతా, చెన్నై, గూర్ గావ్ నుంచి ఉన్నారు. ఆసక్తికరంగా ఫెస్టివల్ సీజన్లో షాపింగ్ ఎక్కువ చేసిన ప్రధాన నగరాల జాబితాలో హిసార్,లక్నో, పాట్నాలు ఉన్నాయి. -
ఆన్లైన్ షాపింగ్ వైపు .. కొత్త తరం చూపు
కొత్త తరం కస్టమర్లు (11–26 ఏళ్ల వయస్సువారు– జెన్ జీ) కొనుగోళ్ల కోసం భారీగా ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఫ్యాషన్ ఇండియా వీపీ సౌరభ్ శ్రీవాస్తవ తెలిపారు. వివిధ సెగ్మెంట్లలో కస్టమర్లు ఎక్కువగా ప్రీమియం ఉత్పత్తులపై ఆసక్తిగా ఉంటున్నట్లు ఆయన వివరించారు. అక్టోబర్ 8 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ (ఏజీఐఎఫ్) ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్లో ప్రివ్యూ నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ విషయం వివరించారు. ఆన్లైన్ షాపింగ్కు సంబంధించి ఫ్యాషన్, బ్యూటీకి ఎక్కువగా డిమాండ్ కనిపిస్తుండగా మొబైల్ ఫోన్లు, ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలు ఆల్టైమ్ ఫేవరెట్స్గా ఉంటున్నాయని శ్రీవాస్తవ చెప్పారు. ఈసారి ఏజీఐఎఫ్లో అమ్మకాలు కొత్త గరిష్ట స్థాయిని తాకగలవని అంచనా వేస్తున్నట్లు వివరించారు. రాబోయే పండుగ సీజన్లో ఆన్లైన్ అమ్మకాలు 20 శాతం వరకు వృద్ధి చెంది రూ. 90,000 కోట్లకు చేరే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. -
అద్భుతమైన ఆఫర్లతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ‘ఫినాలే డేస్’ సేల్
కొనుగోలు దారులకు ప్రముఖ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ శుభవార్త చెప్పింది. దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని నెల రోజుల పాటు నిర్వహించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముగియడంతో ..‘ఫినాలే డేస్’ పేరుతో మరో ఎగ్జైటింగ్ సేల్ను ప్రకటించింది. దీపావళి సందర్భంగా కొనుగోలు దారుల కోసం ‘ఎక్స్ట్రా హ్యాపినెస్ డేస్’ పేరుతో ఫినాలే డేస్ సేల్ను ప్రారంభించింది. అక్టోబర్ 17నుంచి ప్రారంభమై అక్టోబర్ 24 వరకు జరిగే సేల్లో ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ట్యాప్స్, టీవీలు, హెల్త్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, బేబీ ప్రొడక్ట్స్తో పాటు పలు రకాల ఉత్పత్తులపై ఢీల్స్, ఆఫర్స్ను సొంతం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా టెక్నో, ఐక్యూ, మైక్రోసాఫ్ట్, ప్యాంపర్స్, షావోమీ స్మార్ట్ ఫోన్స్, టీవీ, పీ అండ్ జీ ప్రొడక్ట్లపై స్పెషల్ ఆఫర్లను పొందవచ్చు. రివార్డ్ పాయింట్లు అమెజాన్ ఫినాలే డేస్ సేల్లో ఐసీఐసీఐ, సిటీ, కొటాక్, రూపే క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డు అండ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్లు నిర్వహించే కస్టమర్లకు 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్, షాపింగ్ బడ్జెట్ను బట్టి బజాజ్ ఫిన్ సర్వ్, అమెజాన్ పే లేటర్ వంటి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులపై జీరోకాస్ట్ ఈఎంఐ, అమెజాన్ పే ఇన్స్ట్రుమెంట్ ద్వారా చేసే చెల్లింపులపై రివార్డు పాయింట్లను సొంతం చేసుకోవచ్చు. డైమండ్స్ ధమాకా అక్టోబర్ 15 నుంచి కస్టమర్లకు డైమండ్ ధమాకా ఆఫర్ అందుబాటులోకి తెచ్చామని అమెజాన్ ప్రతినిధులు తెలిపారు. అక్టోబర్ 15వ తేదీ నుండి కస్టమర్లు 750 డైమండ్స్ని రీడీమ్ చేయడం ద్వారా రూ. 1500 కంటే ఎక్కువ షాపింగ్ చేస్తే, రూ. 150 క్యాష్బ్యాక్ డైమండ్స్ ధమాకా ఆఫర్ను పొందవచ్చు. రూ. 3 వేలు అంతకంటే ఎక్కువ షాపింగ్పై 1000 డైమండ్లను రీడమ్ చేయడం ద్వారా రూ. 300 క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. ఈ రెండు ఆఫర్లు అక్టోబర్ 24న ముగుస్తాయి. ఎగ్జిస్టింగ్ ఆఫర్లు,డైమండ్స్ను సంపాదించేందుకు డైమండ్స్ పేజీని సందర్శించండి గాడ్జెట్లను అప్గ్రేడ్ చేసుకోండి దివాళీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని కొనుగోలు దారులకు మొబైల్స్, యాక్సెసరీస్పై 40 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. వన్ ప్లస్, షావోమీ, శాంసంగ్, ఐక్యూ, రియల్ మీ, యాపిల్, టెక్నో తో పాటు ఇతర స్మార్ట్ ఫోన్ల ప్రారంభ ధర రూ.5219 కొనుగోలుతో రూ. 499 విలువైన ఇయర్ ఫోన్స్ ఉచితంగా పొందవచ్చు. ప్రారంభ ధర రూ.10799తో 5జీ ఫోన్ కొనుగోళ్లపై ఇతర ఆఫర్లను దక్కించుకోవచ్చు. రూ. 17990తో ప్రారంభమయ్యే ల్యాప్టాప్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు, రూ.999తో ప్రారంభమయ్యే స్మార్ట్వాచ్లపై 75 శాతం డిస్కౌంట్, రూ. 6999తో ప్రారంభమయ్యే టాబ్లెట్లపై 60 శాతం డిస్కౌంట్ , డీఎస్ఎల్ఆర్లో 70శాతం వరకు తగ్గింపుతో కెమెరాలు, రూ.4999 ప్రారంభ ధరతో మిర్రర్ లెస్, యాక్షన్ & డ్యాష్ కెమెరా యాక్సెస్లపై డిస్కౌంట్, ప్రారంభ ధర రూ.5199 లభించే హోమ్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీ (టీవీలు, ప్రొజెక్టర్ల)పై 60 శాతం డిస్కౌంట్లు, రూ.10499 తో ప్రారంభమయ్యే సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీలైన వన్ ప్లస్, మి, శాంసంగ్, ఎల్జీ, సోనీలపై ప్రత్యేక మైన ఆఫర్లు ఈ సేల్ ఉన్నాయి. మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి పండుగ రోజుల్లో ఇంటిని అందంగా అలకరించేందుకు ఇష్ట పడుతుంటాం. అలాంటి వారి కోసం అమెజాన్ సంస్థ యురేకా ఫోర్బ్స్, హావెల్స్, స్టోరీ@హోమ్, అజంతా, విప్రో, ప్రెస్టీజ్, బటర్ఫ్లై, మిల్టన్, సోలిమో వంటి బ్రాండ్లకు చెందిన హోమ్, కిచెన్ & అవుట్డోర్ ప్రొడక్ట్లపై 70శాతం వరకు తగ్గింపు అందిస్తుంది. బెడ్రూమ్ రీడెకరేషన్/అప్గ్రేడ్ కోసం, 350K+ ఎంపిక చేసిన ఫర్నిచర్ & పరుపులపై 85% వరకు తగ్గింపు, ఫర్నీచర్, టాప్ బ్రాండ్ల నుండి బాత్ & కిచెన్ ఫిట్టింగ్లపై 70శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. స్టైలిష్గా తయారవ్వండి 4.5 లక్షల స్టైల్స్పై డీల్లతో అమెజాన్ ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్లపై 50శాతం నుంచి 80 శాతం తగ్గింపు, బిబా, డబ్ల్యూ ఫర్ ఉమెన్, మ్యాక్స్, అలెన్ సోలీ, వాన్ హ్యూసెన్ లాంటి మరెన్నో ప్రసిద్ధ బ్రాండలకు చెందిన పురుషులు, మహిళల ఫ్యాషన్ ఉత్పత్తులపై 50శాతం నుండి 80శాతం వరకు తగ్గింపు! లగ్జరీ బ్యూటీ, పెర్ఫ్యూమ్లపై 60శాతం డిస్కౌంట్, మేకప్..గ్రూమింగ్ ప్రొడక్ట్లపై 70శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఇవి కాకుండా ప్రీమియం దుస్తులు, గడియారాలు, హ్యాండ్బ్యాగ్లు 60శాతం తగ్గింపు, ది డిజైనర్ బోటిక్ నుంచి 80శాతం వరకు అమెజాన్ సేల్లో పొందవచ్చు. స్పెషల్ ఆఫర్ మీకోసమే అమెజాన్ బిజినెస్ కస్టమర్లు జీఎస్టీ ఇన్ వాయిస్తో 28శాతం అదనంగా, 40శాతం ఎక్కువ ఆదా చేసుకోవచ్చు.ఇప్పటికే అమెజాన్.ఇన్ వంటి ఆఫర్లతో పాటు డీల్స్, బ్యాంక్ డిస్కౌంట్, కూపన్ డిస్కౌంట్, బిజినెస్ ఎక్స్క్లూజివ్ ద్వారా బిజినెస్ కస్టమర్లు 10% వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ www.amazon.in/business లో జీఎస్టీ నెంబర్ లేదా పాన్కార్డుతో లాగిన్ అవ్వండి. లబ్ధి పొందండి. (అడ్వర్టోరియల్) -
వచ్చేస్తోంది..మరో అదిరిపోయే సేల్, వీటిపై 80 శాతం భారీ డిస్కౌంట్!
దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని దేశీయ ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ స్పెషల్ సేల్ను ప్రకటించింది. మరో ఈకామర్స్ కంపెనీ అమెజాన్కు పోటీగా ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్-2022ను నిర్వహించనుంది. సెప్టెంబర్ 23నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 30 వరకు జరిగే ఈ సేల్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, ల్యాప్ ట్యాప్స్,స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచ్లపై భారీ డిస్కౌంట్లు పొందవచ్చని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే సేల్లో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వినియోగించి ప్రొడక్ట్ కొనుగోలు దారులకు 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్, పేటీఎం ట్రాన్సాక్షన్లపై 10శాతం డిస్కౌంట్ అందిస్తుంది. ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఆప్షన్తో రూ.1లక్ష వరకు రుణం ఇస్తుంది. ఈ రుణాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. “కస్టమర్లు ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఆప్షన్ను ఇతర ప్రీపెయిడ్ థర్డ్ పార్టీ కార్డ్ల ద్వారా చెల్లించవచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు హోల్డర్లకు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది” అని ఇ-కామర్స్ దిగ్గజం తెలిపింది. ఇటీవల ఫ్లిప్కార్ట్ తన యాప్ను అప్డేట్ చేసింది. దీంతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే 2022 సేల్ సమయంలో కూపన్ రెయిన్, ట్రెజర్ హంట్, స్పిన్ ది బాటిల్ వంటి గేమిఫికేషన్ కార్యక్రమాలు కస్టమర్లు సేల్ సమయంలో ఆఫర్లను పొందే అవకాశాన్ని కల్పిస్తుంది. 80శాతం డిస్కౌంట్ ప్రింటర్లు, మానిటర్లతో పాటు కంప్యూటర్ ఎక్విప్మెంట్పై 80 శాతం డిస్కౌంట్, టీవీలపై 80 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. సేల్ సందర్భంగా, ప్రతిరోజూ ఉదయం 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు 'క్రేజీ డీల్స్', 'రష్ అవర్స్'లో 'ఎర్లీ బర్డ్ స్పెషల్' ఐటెమ్లపై డిస్కౌంట్లు 'టిక్ టాక్ డీల్స్' ను అందిస్తుంది. భారీ తగ్గింపు సేల్ సమయంలో నథింగ్ ఫోన్ 1, గూగుల్ పిక్సెల్ 6 ఎ ధర తగ్గనుంది. నథింగ్ ఫోన్ 1 ప్రారంభ ధర రూ. 28,999, గూగుల్ పిక్సెల్ 6 ఎ ప్రారంభ ధర రూ. 27,699గా ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement