-
జీవీ బ్యాంక్లో ఇంటి దొంగలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీ జీవీబీ)కు ఇంటి దొంగలే కుచ్చుటోపీ పెట్టారు. గృహరుణాల పేరుతో అప్పటికే లోన్లు తీసుకున్న ఖాతాదారుల డాక్యుమెంట్లు పెట్టి, ఫోర్జరీ సంతకాలతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈ వ్యవహారంపై ఏపీజీవీబీ రీజినల్ మేనేజర్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురు బ్యాంకు అధికారులపై కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఖాతాదారుల సంతకాలు ఫోర్జరీ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇస్నాపూర్ బ్రాంచ్ లో ఫీల్డ్ అధికారిగా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా వాసి పి.దుర్గాప్రసాద్.. అదే బ్యాంకుకు చెందిన ఇద్దరు బ్రాంచ్ మేనేజర్లు ఎస్వీ రమణమూర్తి, ఎ.ప్రభాకర్తో కలిసి ఇంటి లోన్ల పేరిట రూ.5.2కోట్లు దండుకున్నారు. ఏపీ జీవీబీలో అప్పటికే 15మంది ఖాతాదారులు ఇంటి లోన్ తీసుకున్నారు. ఆ సమయంలో ఖాతాదారులు ష్యూరిటీగా సమర్పించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకొని దుర్గాప్రసాద్ అండ్ కో, మరో 15 గృహరుణాల నకిలీ దరఖాస్తులు సృష్టించి, ఖాతా దారుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ.5.2 కోట్ల నగదు ఆ ఖాతాదారుల బ్యాంకు ఖాతా లోకి మళ్లించారు. లోన్ తీసుకున్నప్పుడు కస్టమర్లు ముందస్తు ఓచర్స్పై చేసిన సంతకాలను ఉపయోగించి కొంతనగదును దుర్గాప్రసాద్ బంజారాహిల్స్లోని తన కోటక్ మహీంద్రా అకౌంట్, విక్రంపురిలోని హెచ్డీఎఫ్సీ ఖాతాలోకి మళ్లించాడని రీజనల్ మేనేజర్ మల్లెంపాటి రవి మంగళవారం సీబీఐ జేడీ చంద్రశేఖర్కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దుర్గాప్రసాద్ తన బ్యాంక్ ఖాతాలోకి మళ్లించుకున్న నగదుతో పాటు ప్రీ ఓచర్స్తో లోన్ డబ్బును డ్రా చేసుకొన్నట్లు సీబీఐ గుర్తించింది. -
రూ.20వేల కోట్లు దాటిన ఏపీజీవీబీ
♦ లాభం 11% అప్, రూ.223 కోట్లు ♦ బ్యాంకు చైర్మన్ వి.నర్సిరెడ్డి వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) నికర లాభం సుమారు 11 శాతం వృద్ధితో రూ. 202 కోట్ల నుంచి రూ. 223 కోట్లకు పెరిగింది. వ్యాపార పరిమాణం రూ.20,804 కోట్లకు చేరింది. తద్వారా రూ.20 వేల కోట్ల మైలురాయి అధిగమించిన అతి కొద్ది గ్రామీణ బ్యాంకుల జాబితాలో తాము కూడా చేరినట్లు ఏపీజీవీబీ చైర్మన్ వి.నర్సిరెడ్డి సోమవారం ఇక్కడ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా విలేకరులతో చెప్పారు. నిర్వహణ లాభం అధికంగానే ఉన్నప్పటికీ మొండి బకాయిల కోసం కేటాయింపులు పెంచాల్సి రావటం వల్ల నికర లాభం కొంత తగ్గినట్లు వివరించారు. నికర వడ్డీ ఆదాయం 12 శాతం మేర పెరిగినట్లు పేర్కొన్నారు. తగ్గిన ఎన్పీఏలు... లోక్ అదాలత్ల నిర్వహణ, రికవరీ చట్టాన్ని సమర్ధంగా అమలు చేయటం వంటి చర్యలతో నికర ఎన్పీఏలు గణనీయంగా 2.32 శాతం నుంచి 1.40 శాతానికి తగ్గాయని నర్సిరెడ్డి తెలియజేశారు. డిపాజిట్ల వృద్ధి 23 శాతం (రూ.1,922 కోట్లు), రుణాల వృద్ధి 17 శాతం (రూ. 1,536 కోట్లు) గాను ఉందని చెప్పారు. కరెంటు అకౌంటు, సేవింగ్స్ అకౌంటు (కాసా) నిష్పత్తి 0.65 శాతం మేర పెరిగింది. లక్ష్యాలను ప్రస్తావిస్తూ... ప్రస్తుతం తమకు 752 శాఖలున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం మరో 50 జత చేయాలని యోచిస్తున్నామని ఆయన చెప్పారు. ‘‘సిబ్బంది కొరత ప్రధాన సమస్యగా ఉంటోంది. రిక్రూట్మెంట్లో పాత విధానాన్ని పునరుద్ధరిస్తే ఈ సమస్య అధిగమించగలమనే నమ్మకం ఉంది’’ అని చెప్పారాయన. బ్యాంకు సిబ్బంది ప్రస్తుతం 3,070 పైచిలుకు ఉండగా, కొత్త శాఖల కోసం అదనంగా 150 మంది అవసరమవుతారని తెలియజేశారు. ఇప్పుడు 4.5 శాతంగా ఉన్న చిన్న, మధ్య తరహా సంస్థలకిచ్చే రుణాల పరిమాణాన్ని 7 శాతానికి పెంచుకోవటంతో పాటు సౌరవిద్యుత్ పంపుసెట్లు మొదలైన వాటికి రుణాలపై దృష్టి పెడుతున్నామని నర్సిరెడ్డి వివరించారు. ప్రత్యామ్నాయ డెలివరీ చానల్స్ లావాదేవీలను 19.3 శాతం నుంచి 30 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు తెలియజేశారు. -
గ్రామీణ వికాస్ బ్యాంక్ లో లాకర్ ధ్వంసం
ఖమ్మం: ఖమ్మం జిల్లా పినపాక మండలం కరకగూడెంలో బ్యాంక్ చోరి యత్నం జరిగింది. మండలంలోని గ్రామీణ వికాస్ బ్యాంక్ లో దుండుగులు చోరీకి విఫల యత్నం చేశారు. బుధవారం అర్థరాత్రి బ్యాంక్ లోకి ప్రవేశించిన దొంగలు లాకర్ ను పగులకొట్టేందుకు ప్రయత్నించారు. అయితే లాకర్ ఎంతకీ తెరుచుకోకపోవడంతో పరారయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
గ్రామీణ వికాస్ బ్యాంకు ఒకేసారి 24 శాఖలు
గాజువాక: ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఒకేసారి 24 శాఖలను ప్రారంభించింది. ఆన్లైన్ ద్వారా శ్రీకాకుళం జిల్లాలో 10 , విజయనగరం జిల్లాలో 3 , విశాఖపట్నం జిల్లాలో 11 శాఖలను ఏకకాలంలో ప్రారంభించారు. పెదగంట్యాడ మండలం వుడా కాలనీ వద్ద ఆ బ్యాంకు శాఖను సోమవారం ప్రారంభించిన అనంతరం మిగిలిన శాఖలను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారతీయ స్టేట్ బ్యాంకు చీఫ్ జనరల్ మేనేజర్, హైదరాబాద్ ఎల్హెచ్వో సి.ఆర్.శశికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బ్యాంకు చైర్మన్ వి.నర్సిరెడ్డి మాట్లాడుతూ 1.74 లక్షల స్వయం సహాయక సంఘాలకు ఆర్ఆర్బీ ద్వారా ఇప్పటివరకు రూ.3,298.56 కోట్ల రుణాలను మంజూరు చేయగా, వాటిలో ఉత్తరాంధ్ర జిల్లాలకు 80 శాతం రుణాలను తమ బ్యాంకు మంజూరు చేసిందన్నారు. ప్రజల ముంగిట్లోకి గ్రామీణ వికాస్ బ్యాంకు పేరుతో ఇప్పటివరకు తాము రూ.3,444.97 కోట్ల వ్యవసాయ రుణాలను అందజేశామన్నారు. సుమారు కోటి మంది ఖాతాదారులతో రూ.8178.32 కోట్ల డిపాజిట్లను కలిగి ఉన్నామన్నారు. కార్యక్రమంలో బ్యాంకు జీఎం వైఎన్ సుకుమార్, సర్కిల్ మేనేజర్ ఎన్ఎస్ ప్రసాద్, విశాఖ రీజనల్ మేనేజర్ బిఎస్ఎన్ రాజు, శ్రీకాకుళం ఆర్ఎం డి.వి.రమణ, విజయనగరం ఆర్ఎం బాల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకులో భారీ చోరీ
బ్యాంకులకు భద్రత ఏదీ? - కలకలం రేపిన ఏపీజీవీబీ దొంగతనం - ఆందోళనలో ఖాతాదారులు జడ్చర్ల : ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించి ప్రధాన వనరులుగా ఉన్న బ్యాంకులకే భద్రత కరువైతే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి బాలానగర్లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) లో జరిగిన దొంగతనం ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ బ్యాంకులో కుదువ పెట్టుకున్న బంగారు నగలకు సంబంధించి 13.5 కిలోల బంగారు నగలను, *15 లక్షలను దొంగలు అపహరించిన ఘటన ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. పోలీస్ స్టేషన్కు అతి సమీపంలో జాతీయ రహదారిని అనుసరించి ఉన్న బ్యాంకులో దొంగతనం చోటుచేసుకోవడం పోలీసులను సైతం కలవరపాటుకు గురిచేసింది. ఇందులో బంగారం కుదువపెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారులు ఆందోళనకు గురయ్యారు. తమ సొమ్ము ఇక చేతికి అందుతుందా లేదోనన్న అనుమానాలు వ్యక్తం చేశారు. రికార్డులను పరిశీలించి తమ బంగారం తూకం ప్రకారం ఇచ్చినా వాటిని నగలుగా మార్చుకోవడానికి కూడా తయారీ ఖర్చులు భారమవుతాయన్నారు. ఇదిలాఉండగా గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీ రాత్రి జడ్చర్ల మండలం గంగాపూర్లోని ఏపీజీవీబీలో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి యత్నించారు. అలాగే బాదేపల్లి ఎస్బీహెచ్ ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి నగదును ఎత్తుకు వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులు విచారణ చేసి సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించి చర్యలు తీసుకున్నారు. అక్కడక్కడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నా అటు బ్యాంకు అధికారులు గాని, ఇటు పోలీసులుగాని బ్యాంకుల భద్రతపై దృష్టి సారించడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రాత్రివేళ పోలీసులు బ్యాంకుల దగ్గర బందోబస్తు చర్యలు చేపట్టి దొంగతనాలను అరికట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కాలనీలలో, ప్రధాన రహదారులపై గస్తీ పెంచాలన్నారు. చోరీ అయిన ఆభరణాల విలువ రూ.4 కోట్లు నిందితులను కఠినంగా శిక్షించాలి : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాలానగర్ : తమ అవసరాల నిమిత్తమో లేక బ్యాంకులో భద్రంగా ఉంటాయన్న ఆలోచనతోనో మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) లో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంతో విలువైన తమ బంగారు ఆభరణాలను పెట్టి రుణాలు తీసుకున్నారు. అయితే ఈ బ్యాంకులో దొంగలు పడ్డట్లు తెలియడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. వివరాలు.. బాలానగర్ బస్టాండు కూడలిలో పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న ఈ బ్యాంకులో ఆదివారం అర్ధరాత్రి దొంగలు చొరబడి 15 లక్షలతో పాటు 13.5 కిలోల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఇదిలాఉండగా అక్కడ సెక్యూరిటీ గార్డు గాని, అల్లారం ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ దోపిడీ జరిగిందనే ఆరోపణలున్నాయి. రాత్రివేళలో పెట్రోలింగ్ లేకపోవడమే వల్లే తరచూ దొంగతనాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. బ్యాంకులో మొత్తం 2.4 కోట్ల బంగారు రుణాలు ఇచ్చామని, వాటి విలువ నాలుగు కోట్లకు పైనే ఉంటుందని మేనేజర్ రవికిశోర్రెడ్డి తెలిపారు. ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బంగారం సంబంధించిన రికార్డులు భద్రంగానే ఉన్నాయన్నారు. అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, గువ్వల బాల్రాజు, శ్రీనివాస్గౌడ్ ఈ బ్యాంకును పరిశీలించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
హస్తిన ‘దండు’యాత్ర
హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుపై తలకిందులైన కారు
వివాహితపై అత్తింటివారి దాడి
Lok sabha elections 2024: లాలూ వర్సెస్ రోహిణి!
ESI scam: అవినీతి మరక.. అచ్చెన్నకు ఎరుక
వేడుకునేది ఓటర్ని కాదు! సూర్యుడ్ని!!
సాంఘిక విప్లవ నాయకుడు
Association for Democratic Reforms: మూడో విడతలో... మహిళలు 9 శాతమే
ఆనందంతో డైరెక్టర్ని హత్తుకున్నాను: సుహాస్
జాలీ రైడ్
తప్పక చదవండి
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
Advertisement