breaking news
Gramadevata
-
మురుగులమ్మకు 365 గజాల చీర!
తూర్పు గోదావరి జిల్లా బండార్లంకలోని చేనేత కార్మికులు ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా 365 గజాల చీరను తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన అతి పెద్ద పడుగు (చీర తయూరీకి అవసరమైన నూలును కర్రలపై పరిచి సాఫు చేసే ప్రక్రియ)తో పట్టిన అల్లు (నూలును నేసేందుకు వీలుగా చుట్టే పనిముట్టు) చూసేందుకు జనం తరలివచ్చారు. గురువారం నుంచి బండార్లంకలోని చేనేత సహకార సంఘం మగ్గంపై నల్లా సత్యానందం, ఈశ్వరి దంపతులు ఈ చీరను నేస్తారు. ఈ చీరను గ్రామదేవత గంగాదేవి మురుగులమ్మవారికి సమర్పిస్తామని వరదరాజులు చెప్పారు. - అమలాపురం రూరల్ -
టూకీగా ప్రపంచ చరిత్ర -37
చరాచర పదార్థాలన్నిటికీ వ్యక్తిత్వం ఆపాదించే అలవాటు (personification) మన పురాతన సాహిత్యానికి ఈ తలీతలుగా ఉన్న కారణంగా, ఆ మహిషాసురుడు నిజంగా రాక్షసుడేనో, లేక భీభత్సంగా చెలరేగిన అడవి దున్నకు అసురునిగా ఆపాదించిన వ్యక్తిత్వమో చెప్పేందుకు వీలుగాదు. సూర్యుణ్ణి పురుషునిగా వర్ణించి, ‘ఛాయాదేవి’ని - అంటే నీడను, అతనికి భార్యగా సంపాదించారు. సర్వభక్షకుడైన అగ్నిని వ్యక్తిగా చూపించి, ‘స్వాహా దేవి’ని అతనికి భార్యగా అంటగట్టారు. ఇదేవిధంగా, శక్తివంతమైన ప్రకృతులన్నింటినీ పురుషులుగానూ, వాటి ఫలితాన్ని భార్యలుగానూ కథలల్లడం మన సాహిత్యంలో కొల్లలుగా కనిపిస్తుంది. కాళి కూడా అదే కోవలో, తన గుంపును క్రియాశీలకంగా సమన్వయించి, ఆ ఎనుబోతును ముక్కలకింద నరికిన స్త్రీ ఆయ్యిండొచ్చు. ఒకవేళ ఆమె నివాసం మైసూరు ప్రాంతమే అయ్యుంటే, దక్షిణాది నుండి ఉత్తర భారతం స్వీకరించిన ఏకైక సంప్రదాయం ‘దశరా’, లేక ‘నవరాత్రి’ ఉత్సవంగా చెప్పుకోవచ్చు. ఒక్క కాళికా శక్తినే కాదు. ఆమె అవతరాలుగా చెప్పబడే దుర్గ, చండి, భవాని తదితర దేవతలు గూడా దక్షిణ భారతదేశంలో విశిష్టమైన స్థాయిలో ఆరాధ్యులుగా ఉన్నారు. అదనంగా పెద్దమ్మ, చిన్నమ్మ, మారెమ్మ ఆరాధన కూడా దక్షిణాదిలో ముమ్మరంగా సాగుతూంది. విగ్రహం రూపంలో కనిపించే ప్రతి గ్రామదేవత చేతిలో, మొనకు నిమ్మకాయ గుచ్చిన కత్తి మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. వీళ్ళల్లో గంగమ్మ నీటికి, లేదా నదీప్రవాహానికి ప్రతీక; ఎల్లమ్మ వెల్లువెత్తిన ప్రవాహానికి ప్రతీక. సముద్రతీరాలు మినహాయిస్తే, మిగతా గుళ్ళల్లో సాధారణంగా గంగమ్మ, ఎల్లమ్మ కలిసే ఉంటారు. వీళ్ళ పూజకు అనుబంధంగా ప్రస్తావించే కులాలు విధిగా నీటితో విడదీయరాని సంబంధం కలిగిన చాకలి, బెస్త, యాదవ, రైతు వృత్తులవాళ్ళవే అయ్యుంటాయి. పెద్దమ్మ, చిన్న, మారెమ్మ వంటి ఇతర దేవతలను మశూచి, మంపులు, కలరా వంటి వ్యాధులతో పోల్చుకోవడం గమనిస్తే, ఈ గ్రామదేవతలు మానవుని భయాందోళనల నుండి పుట్టుకొచ్చిన (ఆపాదిత) వ్యక్తిత్వాలైనా అయ్యుండాలి. లేదా కుటుంబ వ్యవస్థ ఏర్పడక పూర్వం నివసించిన స్త్రీలైనా అయ్యుండాలి. ఈ గ్రామదేవతల్లో ఏవొక్కరికీ భర్త ఉండడుగానీ, సంతతి ఉంటుంది. అందుకే వీళ్ళ పురుషస్థానాన్ని ‘లింగం’ అంటారు. ఋగ్వేదంలో కనిపించే ‘అదితి’ పాత్రగూడా ఇంచుమించు ఇలాంటిదే. ఆమె ఇంద్ర, వరుణ మిత్ర దేవతలకు తల్లి. కశ్యప ప్రజాపతిని ఆమెకు భర్తగా పేర్కొన్నా, యజ్ఞానికి అందించే ఆహ్వానంలో ఏవొక్క చోటా ఆమెకు భర్తతో అనుసంధానం కనిపించదు. దక్షిణ భారతదేశంలోని ‘మళయాల’ ప్రాంతం ఆడవాళ్ళ రాజ్యంగా ఎలా ప్రచారమైందో ఆధారాలు దొరకవుగానీ, ఆ పునాది మీద తయారైన సాహిత్యం మాత్రం తెలుగులో బోలెడంత దొరుకుతుంది. వాటిల్లో ప్రధానమైంది ‘ప్రమీలార్జునీయం’ ఇందులో అర్జునుడు తన దక్షిణాది దండయాత్రలో భాగంగా, స్త్రీలు పరిపాలించే ‘ప్రమీల’ రాజ్యాన్ని గాండీవంతో కాకుండా మన్మథబాణాల సాయంతో జయిస్తాడు. ఇది మహాభారతంలో కనిపించే కథ కాదు; ‘శశిరేఖా పరిణయం’లో లాగే పాత్రల పేర్ల మతలబుతో మహా భారతంలోనిదిగా భ్రమింపజేసే పుక్కిటి పురాణం. అదే కోవలో మళయాలాన్ని చిత్రీకరించిన సాహిత్యం కందుకూరు విరేశలింగంగారి రచనలతో సహా, అనేక సందర్భాల్లో మనకు ఎదురౌతుంది. రచన: ఎం.వి.రమణారెడ్డి -
విషాదం
అప్పటివరకు ఆ ఇంట సందడి వాతావరణం. ఇంతలోనే గ్రామదేవతను చూసేందుకు చిన్నారిని తీసుకుని ఇద్దరు మహిళలు బయలుదేరారు. అమ్మవారిని దర్శించుకునే ముందు కాళ్లు కడుక్కునేందుకు బావి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రమాదం బారిన పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఏడాది వయస్సున్న చిన్నారి ఆచూకీ లభించలేదు. ఈ విషాదకర సంఘటన రేణిగుంట మండలం అల్లిమిట్ట వేమాలమ్మ గుడి ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. రేణిగుంట, న్యూస్లైన్: అల్లిమిట్టకు చెందిన రంగనాథం కుమా ర్తె సరళ(20)ను తిరుపతి రూరల్ మండలం చెర్లోపల్లె వాసి రాజాకు ఇచ్చి వివాహం చేశా రు. ఆదివారం కావడంతో సరళ తన భర్త రాజా, ఇద్దరు కుమార్తెలు దీప్తి(3), సారిక(1) లతో అల్లిమిట్టకు వచ్చింది. బిడ్డ ఇంటికి రావడంతో రంగనాథం ఇంట సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సరళ తన చిన్నకుమార్తె సారిక, పెదనాన్న కుమార్తె చిట్టె మ్మ అలియాస్ కృష్ణకుమారి(18)తో కలిసి సమీపంలోని వేమాలమ్మ ఆలయానికి ఆదివారం మధ్యాహ్నం బయలుదేరింది. కాళ్లు కడుక్కునేందుకు ఆలయ సమీపంలోని బావి వద్దకు చేరుకున్నారు. నీరు నిండుగా ఉండడంతో పాచి పట్టి ఉండడాన్ని గుర్తించలేదు. చిన్నారి సహా సరళ, కృష్ణకుమారి బావిలో పడిపోయారు. వీరు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆలయం వద్దకు చేరుకున్నారు. సమీప పొలాల వద్దనున్న రైతులను వివరాలు అడిగారు. ఇద్దరు మహిళలు బిడ్డను తీసుకుని బావి వద్దకు వెళుతుండగా చూశామని వారు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు బావి వద్దకు చేరుకున్నారు. సరళ, కృష్ణకుమారి మృతదేహాలను బావి నుంచి వెలికితీశారు. ఎంతకీ సారిక ఆచూకీ లభించలేదు. సంఘటన స్థలా న్ని పోలీసులు పరిశీ లించారు. బాధిత కుటుం బాలను సర్పంచ్ పేరూరు మునిరెడ్డి భాగ్యలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకుడు పేరూరు పురుషోత్తంరెడ్డి, మునిరత్నం పరామర్శించారు.