-
‘ధాన్యం నాణ్యత దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి’
సాక్షి, హైదరాబాద్: యాసంగికి సంబంధించి రైసు మిల్లుల్లో ఉన్న ధాన్యం నాణ్యత ప్రమాణాలు దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి రైసు మిల్లర్లను, జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు, మిల్లర్లు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. యాసంగి సీజన్ సీఎంఆర్ సేకరణ, ఎఫ్సీఐ నుంచి ఎదురవుతున్న సమస్యలపై గురువారం పౌరసరఫరాలభవన్లో కమిషనర్ అనిల్ కుమార్తో కలసి ఆయన రైసు మిల్లర్లతో సమీక్షించా రు. యాసంగి సీజన్లో మొత్తంగా 92లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, సీఎంఆర్ కింద బియ్యంగా మార్చి 64 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉందని, అయితే ఇప్పటివరకు మిల్లర్ల నుంచి 22లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఎఫ్సీఐ తీసుకుందని తెలిపారు. -
ధాన్యం నాణ్యత నిర్ధారణకు ‘టెస్ట్ మిల్లింగ్’
మిల్లర్ల అసోసియేషన్ వినతితో ప్రభుత్వం పునరాలోచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల ద్వారా పౌరసరఫరాలశాఖ సేకరిస్తున్న ధాన్యాన్ని.. బియ్యంగా మార్చేందుకు మిల్లర్లకు ఇచ్చేముందు టెస్ట్ మిల్లింగ్ జరిపే అంశమై ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. మార్కెట్లోకి వస్తున్న ధాన్యానికి ఎలాంటి టెస్ట్ మిల్లింగ్ చేయకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్ణయించిన మేరకు నిర్ణీత బియ్యాన్ని ఇవ్వమంటే తమకు లాభసాటి కాదని రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రభుత్వం దీనిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 1 నుంచి లెవీ విధానాన్ని ఎత్తివేస్తుండటం, పూర్తి ధాన్యాన్ని సేకరించేం దుకు ప్రభుత్వమే సమాయత్తమవుతున్న తరుణంలో..మిల్లర్లు చేస్తున్న డిమాండ్ చర్చనీయా ంశమైంది. ప్రతి సీజన్లో పౌర సరఫరాల శాఖ తాను సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద మిల్లర్లకు ధాన్యాన్ని అందజేస్తుంది. ఆ శాఖ అందించిన ధాన్యాన్ని మిల్లర్లు బియ్యంగా మలిచి తిరిగి ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. 100 క్వింటాళ్ల ధాన్యానికి పచ్చి బియ్యమైతే 67, ఉప్పుడు బియ్యమైతే 68 క్వింటాళ్లు మిల్లర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చినందుకుగాను మిల్ల ర్లు చెబుతున్న మేరకు, వంద క్వింటాళ్ల ధాన్యా న్ని మిల్లింగ్ చేస్తే 61 లేక 62 క్వింటాళ్ల బియ్యం మాత్రమే వస్తోంది. అతి ఉష్ణోగ్రతల కారణం గా ధాన్యంలో నూక, పరం ఎక్కువగా ఉంటుం దని, ప్రభుత్వం నిర్ధారించిన మేర బియ్యం ఇవ్వాలంటే వేరుగా మరో ఐదారు క్వింటాళ్ల బియ్యాన్ని తామే సేకరించి ఇవ్వాల్సి వస్తోం దని మిల్లర్లు అంటున్నారు. దీంతో ఆర్థికభారం ఎక్కువ అవుతోందన్నారు. అందుకే ఖరీఫ్ ధా న్యం సేకరణకు ముందే క్వింటాల్ ధాన్యంలో బియ్యం, నూక, పరం, తౌడు ఎంతెంత వస్తా యో టెస్ట్ మిల్లింగ్ చేయాలని కోరుతున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement