govt scheams
-
జీఎమ్ఎస్ గోల్డ్ స్కీమ్ నిలిపేసిన ప్రభుత్వం: బ్యాంకులు మాత్రం..
బంగారం ధరలు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా బుధవారం నుంచి 'గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్' (GMS)ను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే.. బ్యాంకులు తమ స్వల్పకాలిక గోల్డ్ డిపాజిట్ పథకాలను (1-3 సంవత్సరాలు) కొనసాగించవచ్చని ఒక ప్రకటనలో వెల్లడించింది.పసిడి దిగుమతులపై దేశం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మాత్రమే కాకుండా.. గృహాలు, సంస్థలు తమ బంగారాన్ని ఉత్పాదక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేలా ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని 2015 సెప్టెంబర్ 15న ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి నవంబర్ 2024 వరకు 31,164 కేజీల బంగారాన్ని సమీకరించారు.నిజానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది మూడు విధాలుగా ఉంటుంది. అవి షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ (1-3 సంవత్సరాలు), మిడ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (5-7 సంవత్సరాలు), లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (12-15 సంవత్సరాలు).బంగారం ధరలు పెరుగుతున్న తరుణంలో.. ప్రభుత్వం తన మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ డిపాజిట్లను నిలిపివేయాలని నిర్దారించింది. షార్ట్ టర్మ్ డిపాజిట్ల విషయాన్ని నిర్వహించడం లేదా నిర్వహించకపోవడం అనేది పూర్తిగా బ్యాంకులే నిర్ణయించుకునేలా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.ఇదీ చదవండి: ఈ పాలసీతో వాహనాల ధరలు తగ్గుతాయి: నితిన్ గడ్కరీనవంబర్ 2024 వరకు సమీకరించిన మొత్తం 31,164 కిలోల బంగారంలో.. షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ కింద 7,509 కేజీలు, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్రభుత్వ డిపాజిట్స్ కింద వరుసగా 9728 కేజీలు, 13926 కేజీల బంగారం ఉంది. కాగా జీఎమ్ఎస్ పథకంలో ఉన్న డిపాజిటర్ల సంఖ్య 5693 మంది. -
తప్పులు చేస్తే జైళ్లకే..
- షాదీ ముబారక్, పింఛన్లు పక్కదారి పట్టొద్దు - విద్యార్ధుల ఆధార్, బ్యాంకు ఖాతాలపై నిర్లక్ష్యం తగదు - ఇన్ చార్జి డీపీఓ రమాదేవి ఇబ్రహీంపట్నం: అధికారులు తప్పులు చేసి జైళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దని ఇన్చార్జి డీపీఓ రమాదేవి హెచ్చరించారు. మంగళవారం ఆమె ఇబ్రహీంపట్నంలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ.. పేదలకు రెండో పెళ్లికి షాదీ ముబారక్ పథకం, ఉద్యోగుల తల్లిదండ్రులకు వృద్ధాప్య పింఛన్లు వర్తించని స్పష్టం చేశారు. జిల్లాలోని పలు పలుచోట్ల ఇలాంటి తప్పులు బయటపడుతున్నట్లు ఆమె వెల్లడించారు. సంబంధిత వారినుంచి డబ్బులు రికవరీ చేస్తున్నట్లు వివరించారు. ఒకటికి రెండుసార్లు విచారణ జరిపి నిజమైన లబ్ధిదారులకు గుర్తించాలని.. తప్పులు చేస్తే శిక్ష తప్పదని అధికారులను హెచ్చరించారు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్పుల కోసం ఎంతమంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారని డీపీఓ మండల విద్యాధికారి వెంకట్రెడ్డిని ప్రశ్నించగా సరైన సమాధానం అయన చెప్పకపోవడంతో రమాదేవి అసహనానికి గురయ్యారు. విద్యార్ధుల ఆధార్ నంబర్ల సేకరణ, స్కాలర్షిప్స్, బ్యాంకు ఖాతాల వివరాల సేకరణలో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. అవసరమైతే ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవాలన్నారు. ప్రీమెట్రిక్ స్కాలర్షిప్పు తక్కువ కావడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు కులం, ఆదాయం, నివాస పత్రాలు తీసుకోవడం లేదని విద్యాధికారి వెంకట్రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుందని, స్కాలర్షిప్స్ పెరుగుతాయని విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్యం చేయాలని రమాదేవి సూచించారు. రెండు వారాల క్రితం సమావేశమైనప్పుడు చెప్పిన సమాధానాలే అధికారుల నుంచి వస్తున్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హరితహారం కింద చెట్లు నాటాం.. ఇంకేం పని అని అనుకోవద్దు.. మళ్లీ వర్షకాలం వస్తుంది.. తిరిగి సదరు పథకం కింద మొక్కలు నాటాల్సి ఉందన్నారు. మండలంలో 2.09 లక్షల మొక్కలు నాటగా అందులో 52 శాతం వర్షాభావంతో ఎండిపోతున్నట్లు ఉపాధి హామీ ఏపీఓ లలిత తెలిపారు. వీలైనన్ని ఎక్కువ మొక్కలను బతికించుకునేందుకు అధికారులు కృషిచేయాలన్నారు. ఆయా అంశాల ప్రగతిపై జిల్లా కలెక్టర్ ఎప్పుడైనా ప్రశ్నించవచ్చని, ఆధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జి డీపీఓ అధికారులను హెచ్చరించారు. సమావేశంలో తహసీల్దార్ విజయేందర్రెడ్డి, ఇన్చార్జి ఎంపీడీఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు.