-
ఆర్టీసీ ఉద్యోగులకు ఇక ట్రెజరీ జీతాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులకు ప్రభుత్వ ట్రెజరీ నుంచి జీతాలు పంపిణీ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుదిరితే ఈ నెల నుంచే ప్రభుత్వ జీతాలు అందేలా ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుంటూ ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. దీనికి గవర్నర్ ఆమోదముద్ర పడగానే చట్టబద్ధత రానుంది. ఈ క్రమంలో అటు గవర్నర్ ఆమోద ముద్ర కోసం ఎదురుచూస్తూనే.. ఇదే సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ నుంచి కాకుండా నేరుగా ప్రభుత్వం నుంచే జీతాలు విడుదలయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ తాజాగా ఆర్టీసీ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని కోరింది. దీంతో.. ఉద్యోగి పేరు, హోదా (డెజిగ్నేషన్), పనిచేస్తున్న విభాగం, ఆధార్కార్డు, ప్రస్తుతం అందుకుంటున్న జీతం వివరాలను ఆధార సహితంగా జాబితా రూపంలో ఆర్టీసీ సిద్ధం చేస్తోంది. ఈ నెల 16 తర్వాత బదిలీలు వద్దు ఉద్యోగులు, జీతాల జాబితాలను ఆయా విభాగాదిపతులు సిద్ధం చేసి బస్భవన్కు పంపితే, అక్కడి నుంచి ఆర్థిక శాఖకు చేరనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సిబ్బంది ఎక్కడివారు అక్కడే ఉంటే జాబితాలో అయోమయం లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో.. ఆర్టీసీలో ఈనెల 16వ తేదీ తర్వాత బదిలీలు, పదోన్నతులకు వీలు లేకుండా ఆదేశాలు వెలువడ్డాయి. పదోన్నతులు, బదిలీల వంటివి ఆలోగానే పూర్తి చేయాల్సి ఉంటుంది. 16వ తేదీ తర్వాత ఉద్యోగుల వివరాలను సిద్ధం చేసి, ఆర్థిక శాఖకు పంపనున్నారు. ఈ మేరకు ఆర్థికశాఖ జీతాల పద్దును సిద్ధంచేసి ట్రెజరీకి పంపుతుంది. ఆలోగా ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం వస్తే.. ప్రస్తుత నెల జీతాలను ట్రెజరీ నుంచి విడుదల చేసేందుకు మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ జాప్యం జరిగితే.. ఈ నెలకు ఆర్టీసీ నుంచే జీతాలిచ్చి, వచ్చే నెల నుంచి ట్రెజరీ ద్వారా విడుదల చేసే అవకాశం ఉంటుంది. కొంతకాలం ప్రస్తుత వేతనాలే..! ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైనా కొంతకాలం ప్రస్తుతమున్న వేతనాలే అందనున్నాయి. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోని వివిధ హోదాలు, కేడర్లకు సమానంగా నిర్ధారించాల్సి ఉంటుంది. అప్పుడు ఆయా కేడర్లను బట్టి వేతనాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయి. త్వరలో ప్రభుత్వం నియమించనున్న అధికారుల సబ్ కమిటీ దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందించాల్సి ఉంటుంది. సదరు కమిటీ ఏర్పాటై, వివరాలు కోరగానే అందజేసేందుకు వీలుగా.. ఆర్టీసీ ఉన్నతాధికారులు నివేదికలను సిద్ధం చేస్తున్నారు. ఏపీలో ఇంతకుముందే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనంచేసిన నేపథ్యంలో.. అక్కడ అనుసరించిన పద్ధతులు, ఎదురైన ఇబ్బందులు, వాటి పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను పరిశీలించేందుకు ఇటీవలే టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు విజయవాడ వెళ్లి వచ్చారు. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కూడా విజయవాడ వెళ్లి అధ్యయనం చేసి వస్తున్నారు. -
ఉవ్వెత్తున ఎగసిన సమైక్య ఉద్యమం
సాక్షి, నెల్లూరు : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లా వాసులు ఉద్యమ మంటలను మండిస్తూనే ఉన్నారు. సోమవారం నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆయా జేఏసీలు సమైక్యంగా గర్జించాయి. ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోయినా ప్రభుత్వ ఉద్యోగులు వెరవక ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకు పోయేందుకు సర్వం సిద్ధం చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయులు, ఎన్జీఓలు, గెజిటెడ్ ఆఫీసర్లతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలు ఉవ్వెత్తున కొనసాగిగించారు. ఉద్యమబాట పట్టిన ప్రజలకు వివిధ రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటిస్తూ ఆందోళనల్లో పాల్గొన్నారు. రాష్ట్ర విభజనకు పాల్పడిన పాలకులపై ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు. సమైక్యాంధ్రను సాధిస్తామని నినదించారు. ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన దీక్షలతో జిల్లా దద్దల్లింది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ఆర్టీసీ బంద్ కొనసాగుతోంది. జనజీవనం స్తంభించి పోయింది. మొత్తంగా 34వ రోజూ జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగింది. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను బాబు వెనక్కు తీసుకోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే వివేకానందరెడ్డి డిమాండ్ చేశారు. బాబు చేస్తున్నది ఆత్మ వంచనయాత్రగా అభివర్ణించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్సీ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర మంత్రి చిరంజీవి రాజీనామా చేయనందుకు నిరసనగా తుఫాన్ ఫ్లెక్సీలను తగులబెట్టారు. పొదలకూరు మండలం బిదరవోలు, మరుపూరు, సూరాయపాళెం గ్రామాల్లో సమైక్యవాదులు వంటావార్పు నిర్వహించారు. వింజమూరులో జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. సీతారామపురంలో ఉద్యోగ, ఉపాధ్యా య, పోరాట సమితి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి పిండప్రదానం నిర్వహించారు. సోని యా, కేసీఆర్ చిత్రపటాలకు పెళ్లి చేశారు. ఆటో కార్మికుల వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించి బస్టాండ్లో వంటా వార్పు చేశారు. దుత్తలూరు సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షల్లో ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. విశ్వతేజ పాఠశాల విద్యార్థులు 200 అడుగుల జాతీ య పతాకంతో మానవహారం ఏర్పాటు చేశా రు. బ్రహ్మేశ్వరంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వంటా వార్పు జరిగింది. కొండాపురంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పాఠశాలను మూసివేసి బస్టాండ్లో విద్యార్థులతో ఆట పాట కార్యక్రమం నిర్వహించారు. ఉదయగిరిలో వైఎస్సార్సీపీ, ఉపాధ్యాయ, ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో రిలేదీక్షలు జరిగాయి. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. వరికుంటపాడులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. కోవూరు ఎన్జీఓ హోంలో బలిజసంఘం నాయకులు దీక్షకు కూర్చున్నారు. ఇందుకూరుపేట మండల కార్యాలయంలో రెవెన్యూ అధికారులు దీక్షలో పాల్గొన్నారు. చిల్లకూరు మండలంలోని తీరప్రాంతంలోని తమ్మినపట్నం పంచాయతీలోని తమ్మినపట్నం, గుమ్మళ్లదిబ్బ, కొత్తూరు గ్రామాలకు చెందిన మత్స్యకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సముద్రంలో పడవలతో ప్రదర్శన నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. చిట్టమూరు మండలం మల్లాంలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మోటారు బైక్స్ ర్యాలీ నిర్వహించారు. చిట్టమూరులో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఎన్జీఓలకు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వంకా రమణయ్య సంఘీభావం తెలిపారు. కావలిలో ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండాచెట్టు సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ట్రాక్టర్లతో ర్యాలీని నిర్వహించారు. వెంకటగిరి పట్టణ జేఏసీ ఆధ్వ ర్యంలో కాశీపేట సెంటర్ వద్ద మానవ హారం, నిరసనలు చేపట్టారు. సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో 20 రోజులుగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నాయుడుపేట ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్ష, యూటీఎఫ్ ఆధ్వర్యంలో గాంధీమందిరం వద్ద రిలే దీక్షలు నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ సెంటర్లో రిలే దీక్షలు నిర్వహించారు. 3
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
నమ్రతా భారీ వర్కౌట్స్ చూస్తే షాక్, ఫ్యాన్స్ ఫిదా!
SRH vs GT: మ్యాచ్కు వర్షం అడ్డంకి.. హెచ్సీఏ కీలక ప్రకటన
ఓటీటీలోకి వచ్చేస్తున్న 12th ఫెయిల్ హీరో థ్రిల్లర్ మూవీ.. ఎక్కడంటే?
జగన్కు ఏపీ ఎందుకు జై కొట్టిందంటే..?
బేబీ హీరోయిన్ ఫోన్ కాల్.. 'లవ్ మీ' చెప్పాలంటూ హీరోను!
‘మమతా కూటమి నుంచి వెళ్లిపోయింది, ఆమె మాటలపై నమ్మకం లేదు’
టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
నన్ను భయపెట్టిన బౌలర్ అతడే: రోహిత్ శర్మ
విశాఖలో జూన్ 9న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం: మంత్రి బొత్స
హైదరాబాద్లో యూఎస్ఏఐడీ ఇండియా డైరెక్టర్
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement