breaking news
Google organization
-
ఆహా అనిపిస్తున్న.. బెంగళూరులోని గూగుల్ కొత్త ఆఫీస్ (ఫోటోలు)
-
గూగుల్ నుంచి ఆండ్రాయిడ్ నానో డిగ్రీలు
యుడాసిటీ భాగస్వామ్యంతో ఆఫర్; వెయ్యి ఉచిత స్కాలర్షిప్లు - కోర్సు కాలవ్యవధి 6-9 నెలలు - నెలకు రూ. 9,800 వరకూ వ్యయం బెంగళూరు: గూగుల్ సంస్థ భారత్లో ఆండ్రాయిడ్ నానోడిగ్రీలను ఆఫర్చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంపెనీ యుడాసిటీ భాగస్వామ్యంతో ఈ డిగ్రీలను ఆఫర్ చేస్తున్నామని తెలిపింది. అంతర్జాతీయ, దేశీయ యాప్ల రూపకల్పన చేసే అత్యున్నత స్థాయి మొబైల్ డెవలపర్లను తయారు చేయడం లక్ష్యంగా ఈ డిగ్రీలను అందిస్తున్నామని గూగుల్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ(సౌత్ ఈస్ట్ ఏషియా, ఇండియా) రాజన్ ఆనందన్ చెప్పారు. భారత్లో ఇప్పటికే 30 లక్షల మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారని, 2018 కల్లా ఈ విషయంలో అమెరికాను భారత్ అధిగమిస్తుందని పేర్కొన్నారు. అప్పటికల్లా భారత్లో సాఫ్ట్వేర్ నిపుణుల సంఖ్య నలభై లక్షలకు పెరుగుతుందని పేర్కొన్నారు. అయితే టాప్ 1,000 ఆండ్రాయిడ్ యాప్లలో భారత డెవలపర్లు రూపొందించిన యాప్స్ కేవలం రెండు శాతమేనని తెలిపారు. సాఫ్ట్వేర్ నిపుణులు అధిక సంఖ్యలో ఉన్నా, యాప్స్ రూపొందించే నైపుణ్యం ఉన్న నిపుణుల సంఖ్య స్వల్పంగా ఉందని, ఈ లోటును భర్తీ చేయడానికే ఆండ్రాయిడ్ నానో డిగ్రీలను ఆఫర్ చేస్తున్నామని వివరించారు. ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు... ఆండ్రాయిడ్ నానో డిగ్రీ కార్యక్రమంలో భాగంగా డెవలపర్లు ఎక్కడ నుంచైనా, ఏ డివైస్తోనైనా కొత్త నైపుణ్యాలను కొన్ని నెలల్లోనే నేర్చుకొని తమ కెరీర్లో మరింత ముందుకు వెళ్లవచ్చని యుడాసిటీ వ్యవస్థాపకుడు, సీఈఓ సెబాస్టియన్ తరుణ్ చెప్పారు. ఈ కోర్సు కాలపరిమితి 6-9 నెలలని నెలకు రూ.9,800 ఖర్చవుతుందని తెలిపారు. కోర్సు పూర్తయిన తర్వాత ట్యూషన్ ఫీజులో 50 శాతం రిఫండ్ చేస్తామని వివరించారు. ఈ కోర్సుకు గూగుల్, టాటా ట్రస్ట్స్ సంస్థలు చెరో 500 ఉచిత స్కాలర్షిప్లను ఆఫర్ చేస్తున్నాయని చెప్పారు. -
సాఫ్ట్బ్యాంక్లో భారతీయుడి భారీ పెట్టుబడులు..
- రూ.3,148 కోట్లు ఇన్వెస్ట్ చేసిన నికేశ్ అరోరా - సాఫ్ట్బ్యాంక్ ప్రెసిడెంట్, సీఓఓగా విధులు టోక్యో: నికేశ్ అరోరా...గూగుల్ సంస్థలో అత్యున్నత స్థాయిలో పనిచేసి గత ఏడాది బయటకు వచ్చిన ఈయన 48 కోట్ల డాలర్ల(రూ.3,148 కోట్ల) విలువైన సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ షేర్లను కొనుగోలు చేశారు. జపాన్కు చెందిన సాఫ్ట్బ్యాంక్కు ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న భారత్లో జన్మించిన అరోరా కొనుగోలును డెరైక్టర్ల బోర్డ్ ఆమోదించిందని సాఫ్ట్బ్యాంక్ సంస్థ టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్కు బుధవారం వెల్లడించింది. ఐఐటీ-వారణాసిలో పట్టభద్రుడైన అరోరా అమెరికా యూనివర్శిటీలో ఎంబీఏ చదివారు. పదేళ్లపాటు గూగుల్లో పనిచేసిన ఆయన గత ఏడాది జూలైలో సాఫ్ట్బ్యాంక్లో చేరారు. అరోరాకు సాఫ్ట్బ్యాంక్ 13.5 కోట్ల డాలర్ల వార్షిక వేతనాన్ని ఇస్తోందని సమచారం. దీంతో ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న మూడో ఉన్నతస్థాయి వ్యక్తిగా ఆయన నిలిచారు. నికేశ్ అరోరా గొప్ప బిజినెస్ లీడర్ అని, సహృదయుడని సాఫ్ట్బ్యాంక్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ మసయోచి సన్ వ్యాఖ్యానించారు. కాగా, మసయోచి స్థానంలో నికేశ్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.