breaking news
Gold Bond Trading
-
నేటి నుంచి జూలై గోల్డ్ బాండ్ల ట్రేడింగ్
ముంబై: జూలై నెలలో జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లకు సంబంధించి ట్రేడింగ్ మంగళవారం నుంచీ స్టాక్ ఎక్సే్ఛంజీల్లో ప్రారంభమవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొం ది. ఆర్బీఐ సోమవారం నాడు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై 6వ తేదీన ప్రభుత్వం 2017–18 సిరిస్ 2 సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ను ప్రకటించింది. జూలై 10 నుంచి 14 వరకూ అమల్లో ఉన్న స్కీమ్కు సంబంధించి బాండ్లు జూలై 28న జారీ అయ్యాయి. 2015 నవంబర్ 5న తొలిసారిగా కేంద్రం గోల్డ్ బాండ్ స్కీమ్ను ఆవిష్కరించింది. ఫిజికల్ గోల్డ్కు డిమాండ్ను తగ్గించడం, ఈ మొత్తాలను పొదుపులుగా మళ్లించి ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా చేయడం ఈ విధాన లక్ష్యం. జూలై సిరిస్కు ముందు, ప్రభుత్వం ఎనిమిది దఫాలుగా ఈ స్కీమ్ను ఆవిష్కరించింది. తద్వారా రూ.5,400 కోట్లు సమీకరించగలిగింది. బంగారం బాండ్లలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించేలా కేంద్రం ఇటీవలే ఒక కీలక నిర్ణయమూ తీసుకుంది. సావరిన్ గోల్డ్ బాండ్లలో (ఎస్జీబీ) వార్షిక పెట్టుబడుల పరిమితిని భారీగా పెంచింది. ప్రస్తుతం 500 గ్రాముల మేరకు మాత్రమే పెట్టుబడి పెట్టే వీలుండగా... దీన్ని ఏకంగా 4 కిలోలకు పెంచింది. ఈ పథకం ద్వారా 2015–16, 2016–17లో రూ. 25,000 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యమైనా, రూ.4,769 కోట్లే ప్రభుత్వ ఖాతాలోకి వచ్చాయి. -
నెలాఖరున గోల్డ్ బాండ్స్ ట్రేడింగ్
న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్బాండ్(ఎస్జీబీ) ట్రేడింగ్ ఈ నెలాఖరున ప్రారంభమవుతుందని ప్రభుత్వం తెలిపింది. ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత నాలుగో అంచె సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ను ప్రారంభిస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పుత్తడి సంబంధిత స్కీమ్ల ప్రగతిపై సమీక్ష జరపడానికి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోల్డ్ బాండ్ ట్రేడింగ్కు సంబంధించిన నిర్ణయం తీసుకున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. గోల్డ్ మోనెటైజేషన్ స్కీమ్(జీఎంఎస్) కింద మరింత బంగారాన్ని సమీకరించడానికి ముమ్మర ప్రయత్నాలు చేయాలని బ్యాంక్లు ఆదేశించాలన్న నిర్ణయం కూడా తీసుకున్నామని ఆ వర్గాలు వివరించాయి. షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్(ఎస్టీబీడీ), మీడియమ్ అండ్ లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్(ఎంఎల్టీజీడీ) కింద ఇప్పటివరకూ ప్రభుత్వం రూ.2,891 కేజీల బంగారాన్ని సమీకరించింది.