-
ఫెడ్ వడ్డీ రేటు 0.25% పెంపు
వాషింగ్టన్: ముందస్తు సంకేతాలను నిజం చేస్తూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజాగా వడ్డీ రేటును 0.25 శాతంమేర పెంచుతున్నట్లు ప్రకటించింది. వెరసి ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల ఫెడ్.. 2018 తదుపరి మళ్లీ రేట్ల పెంపు బాట పట్టింది. రెండు రోజులపాటు నిర్వహించిన సమావేశంలో చివరికి ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) కఠిన విధానాలకే మొగ్గు చూపింది. కోవిడ్–19 ప్రభావం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఫెడ్ పాలసీ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఫెడ్ తాజా నిర్ణయంతో ఫండ్స్ రేట్లు 0.25–0.5 శాతానికి చేరాయి. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణ వార్షిక రేటు 40 ఏళ్ల గరిష్టం 7.9 శాతానికి చేరడం ప్రతికూల అంశంకాగా.. నిరుద్యోగిత భారీగా తగ్గి 3.8 శాతానికి పరిమితం కావడంతో రేట్ల పెంపునకు అనువైన పరిస్థితులు ఏర్పడినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో 2.18 శాతానికి చేరిన 10ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ మరింత బలపడనున్నట్లు తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రతీ నెలా బాండ్ల కొనుగోలు ద్వారా వ్యవస్థలోకి భారీగా విడుదల చేస్తున్న నిధులను మార్చి నుంచి ఫెడ్ పూర్తిగా నిలిపివేయనున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడనుండగా.. పసిడి, స్టాక్ మార్కెట్లు వెనకడుగు వేసే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. -
గ్రామీణ డిమాండ్కు గడ్డు పరిస్థితి
♦ బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా ♦ వర్షాభావం ప్రభావం ఉంటుందని విశ్లేషణ న్యూఢిల్లీ: గ్రామీణ డిమాండ్ తగ్గే అవకాశం ఉందని గ్లోబల్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ (బీఓఎఫ్ఏ)తన తాజా నివేదికలో పేర్కొంది. వర్షాభావ పరిస్థితులు, అంతర్జాతీయంగా వ్యవసాయ ఉత్పత్తులు తక్కువగా ఉండడం వంటివి దీనికి ప్రధాన కారణంగా వివరించింది. గ్రామీణ డిమాండ్నుపునరుద్ధరించడమే ప్రభుత్వం ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని పేర్కొంది. ఇందుకు స్వామినాథన్ ఫార్ములాను క్రమంగా అమలు పరచాల్సి ఉంటుందనీ సూచించింది. వరి, గోధుమలకు కనీస మద్దతు ధర వ్యయానికన్నా 50 శాతం అధికంగా ఉండాలని ఈ ఫార్ములా సూచిస్తోంది. 2017 వరకూ పెట్టుబడుల ఆధారితంగా ఆర్థిక వృద్ధి అవకాశాలు లేవని పేర్కొన్న బ్యాంక్, అప్పటి వరకూ ఆర్థిక వ్యవస్థకు వినియోగ ఆధారిత రికవరీనే మార్గమని వివరించింది. వేతన కమిషన్ సిఫారసుల అమలు, రేటు కోత, చమురు ధరలు తక్కువగా ఉండడం వల్ల గృహాల పొదుపురేట్లు పెరగడం వంటి అంశాలు 2016 మధ్యలో జీడీపీ విలువను ఒక శాతం మేర పెంచే వీలుందని వివరించింది. అయితే ఈ విషయంలో గ్రామీణ డిమాండ్ పెరుగుదలను తాము పరిగణనలోకి తీసుకోవడం లేదని వివరించింది. ద్రవ్యలోటు లక్ష్యం కష్టమే: యూబీఎస్ ఇదిలావుండగా... వృద్ధి మందగమనం వల్ల ద్రవ్యలోటు లక్ష్యాల విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడే వీలుందని మరో గ్లోబల్ ఫైనాన్షియల్ సేవల దిగ్గజం యూబీఎస్ అభిప్రాయపడింది. వేతన కమిషన్ సిఫారసుల అమలు, డిమాండ్ను పెంచాల్సిన అవసరం వంటి అంశాల నేపథ్యంలో ప్రభుత్వ వ్యయాలు పెరిగి ద్రవ్యలోటు అంచనాలు దాటే వీలుందని ఒక నివేదికలో విశ్లేషించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement