-
23 నుంచి తెలుగు భాషా వారోత్సవాలు: విజయబాబు
సాక్షి, అమరావతి: తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి 160 వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 23 నుంచి 29 వరకు వారం రోజుల పాటు తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం రాష్ట్రంలో ద్విభాషా విధానాన్ని ప్రోత్సహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం ఆంగ్ల భాషను ప్రోత్సహిస్తూనే నిత్య జీవితంలోనూ, పాలనా వ్యవహారాల్లోనూ తెలుగు భాషను ప్రోత్సహించడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా వారం రోజుల పాటు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుతున్నాం. ఈ వారోత్సవాలను అన్ని జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్ర స్థాయిలో ప్రధానంగా గుంటూరు, విజయవాడ కేంద్రాల్లో ఘనంగా నిర్వహిస్తాం. వారోత్సవాల్లో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు, రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగులకు కథలు, కవితలు, అంత్యాక్షరీ పోటీలు నిర్వహిసామని పేర్కొన్నారు. సాహితీ స్రష్టలను, భాషా సేవకులను, భాషా వారసత్వాన్ని పరిపుష్టం చేసేందుకు కృషి చేస్తున్న వారిని గుర్తించి సముచిత స్థాయిలో సత్కరిస్తాం. తెలుగు భాషా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఈ నెల 23వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ వారోత్సవాలు ప్రారంభమౌతాయి. 29 వ తేదీ మద్యాహ్నం 3.00 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంతో ముగుస్తాయి. 24వ తేదీ ఉదయం 11.30 గంటలకు విజయవాడ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో, 25వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు విజయవాడలోని ఆంధ్ర లాయోల డిగ్రీ కళాశాలలోను, 26వ తేదీ ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని బెజవాడ బార్ అసోసియేషన్లో, సాయంత్రం 4.00 గంటలకు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన్ మందిరంలో, 27 వ తేదీ సాయంత్రం 5.00 గంటలకు విజయవాడ ఘంటసాల సంగీత విశ్వవిద్యాలయంలో, 28వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోనూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తామని విజయబాబు పేర్కొన్నారు. -
తెలుగు ఔన్నత్యాన్ని చాటుదాం: సీఎం జగన్
సాక్షి, హైదరాబాద్ : తెలుగు భాష ఔన్నత్యాన్ని సగర్వంగా చాటుదామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా ఈరోజు(గురువారం) తెలుగు భాషా దినోత్సవం జరుపుకొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు భాషాభివృద్ధికై గిడుగు రామమూర్తి చేసిన విశేష కృషిని స్మరించుకుంటూ, తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మహనీయుడి స్మరణలో.. గ్రాంథిక భాషలోని తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చి.. వ్యావహారిక భాష అందాన్ని చెప్పిన మహనీయుడు గిడుగు రామమూర్తి. శ్రీకాకుళానికి ఉత్తరాన 20 మైళ్ల దూరంలో శ్రీముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట గ్రామంలో 1863 ఆగస్టు 29న ఆయన జన్మించారు. తండ్రి వీర్రాజు, తల్లి వెంకటమ్మ. 1877 వరకూ రామమూర్తి ప్రాథమిక విద్య స్వస్థలంలోనే కొనసాగింది. ఆ తర్వాత తండ్రికి చోడవరం బదిలీ కాగా.. అక్కడే ఆయన కన్నుమూశారు. అనంతరం రామమూర్తి మేనమామ ఇంట్లో ఉంటూనే మహారాజా వారి ఆంగ్ల పాఠశాలలో చేరి 1875 నుంచి 1880 వరకూ విజయనగరంలోనే గడిపారు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావుకు సహాధ్యాయి. భాషను అమితంగా ప్రేమించే గిడుగు రామమూర్తి అడవుల్లోని సవరల భాషను నేర్చుకుని వాళ్లకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒక వ్యక్తిని ఇంట్లోనే పెట్టుకుని సవరభాష నేర్చుకున్నారు. ఏళ్లపాటు శ్రమించి సవరభాషలో పుస్తకాలు రాశారు. సొంత నిధులు వెచ్చించి పాఠశాలలు ఏర్పాటు చేశారు. జీతాలు చెల్లించి సవరలకు వాళ్ల భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశారు. అప్పటి మద్రాసు ప్రభుత్వం ఈయన కృషికి మెచ్చి 1913లో రావు బహుదూర్ అనే బిరుదునిచ్చింది. అనంతరం 1931లో ఆంగ్లంలో సవరభాషా వ్యాకరణాన్ని, 1936లో సవర-ఇంగ్లిష్ కోశాన్ని నిర్మించారు. మద్రాసు ప్రభుత్వం గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవర భాషా వ్యాకరణాన్ని 1931లో, సవర కోశాన్ని 1938లోనూ అచ్చువేశారు. 1934లో ప్రభుత్వం ఆయనకు కైజర్-ఇ-హింద్ అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది. 1940 జనవరి 15న ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికా సంపాదకులను సంబోధిస్తూ చేసిన తుది విన్నపంలో ప్రభుత్వ విద్యాశాఖ, విశ్వవిద్యాలయాలు గ్రాంథికాన్ని వదిలిపెట్టకపోవడం విచారకరమని పేర్కొన్న గిడుగు 1940 జనవరి 22న కన్నుమూశారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు: సీఎం జగన్ జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రీడాకారులందరికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఒలంపిక్స్లో భారత్కు మూడు స్వర్ణాలు సాధించిన హాకీ దిగ్గజం ధ్యాన్చంద్.. దేశాన్ని గర్వపడేలా చేశారని కొనియాడారు. అటువంటి గొప్ప క్రీడాకారుడిని స్మరించుకుంటూ నేడు ఆయన జన్మదినం సందర్భంగా క్రీడల దినోత్సవం జరుపుకొంటున్నామన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. A memorable hockey legend, who led our country three times to golden glory at the Olympics. Marking Dhyan Chand's birth anniversary today, India fondly remembers him & celebrates #NationalSportsDay. My Greetings to all from the sports fraternity. — YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2019 -
భాషా సంఘంలో రాజకీయం తగదు
భాషా సాహిత్యాల మీద ఉన్నతమైన పదవులలో ఉన్నవారు చెప్పే మాటలలో, ఇచ్చే వాగ్దానాలలో, చేసే నిర్ణయాలలో నిజాయితీ అవసరం. ఆగస్ట్ 29న విజయవాడలో జరిగిన గిడుగు రామమూర్తి 132వ వర్ధంతి సభలో ప్రభుత్వ పెద్దలు ఆడిన మాటలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇవాళ తెలుగును మరిచిపోతున్నామనీ, భాషను కాపాడుకో వడమంటే ఉనికిని కాపాడుకోవడమేననీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగంలో అన్నారు. నిజంగా మన నేతలు భాషను కాపాడుకునే విధం గా, ఉనికిని చాటే అంశంగా గుర్తించి గౌరవిస్తున్నారా? త్వరలో ఏర్పాటు చేసే అధికార భాషా సంఘానికి పొట్లూరి హరికృష్ణ అనే ‘ప్రముఖ రచయి త’ను నియమించనున్నట్లు సీఎం ప్రకటించడం ఇలాంటి ప్రశ్నలకు ఆస్కారమిస్తుంది. ఇది ఎంతవరకు సమంజసం? ‘తెలుగు భాషా పరిర క్షణకు నడుం బిగిద్దాం’ అని ఆ సభలోనే సీఎం చెప్పిన మాటకూ ఈ చర్య కూ పొంతన ఉందా? ఆ హరికృష్ణ ఎవరు? తెలుగు భాషా సాహిత్యాలకు సంబంధించి, తెలుగువారి చరిత్రకు సంబంధించి ఆయన రాసిన పుస్త కాలు ఏమైనా ఉన్నాయా? పరిశోధన, రచన వంటి ఏ ఇతర కృషిలోనూ అంతగా పేరు వినిపించని వారిని తీసుకు వచ్చి అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి నియమిస్తామని చెప్పడం, ఆ సంఘాన్ని రాజకీయ పున రావాస కేంద్రంగా మార్చే ప్రయత్నంగా ప్రజలు అర్థం చేసుకునే అవ కాశం లేదంటారా? గతంలో వావిలాల గోపాలకృష్ణయ్య, వందేమాతరం రామచంద్రరావు, దాశరథి కృష్ణమాచార్య, నండూరి రామకృష్ణమాచా ర్యులు, కొత్తపల్లి వీరభద్రరావు, పాకాల యశోదారెడ్డి ప్రభృతులు ఆ పద వికి ఎంపికయ్యారు. కానీ సీఎం నోటి నుంచి వచ్చిన వ్యక్తి పేరు ఇంత ప్రసిద్ధమైనదేనా? పోనీ ఆయన కృషి ఈ వ్యక్తుల కృషి స్థాయిలో ఉన్న దా? భాషా సేవ గురించి సీఎం చెప్పారు కాబట్టి, మైసూరులో ఏర్పాటైన తెలుగు పీఠం విషయం కూడా గుర్తుచేసుకోవాలి. ఆ పీఠం తెలుగు సాహి త్య, సాంస్కృతిక, చరిత్ర, సర్వతోముఖ సత్వర వికాస సంస్థగా ఏర్పాటైంది. కానీ అది ఇప్పటికీ అక్కడే ఎందుకు ఉండిపోయింది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కోట్ల రూపాయల నిధులు మైసూరులో ఉన్న ఆ సంస్థకు వెళుతున్నాయన్న వాస్తవాన్ని ఎందుకు పరిగణనలోనికి తీసుకోవడం లేదు? తెలుగుకు ప్రాచీన భాషగా గుర్తింపు వచ్చి పదేళ్లు గడుస్తున్నాయి. మరి గుర్తింపు వచ్చినా ఏమిటి ఉపయో గం? అలాగే కూచిపూడి పూర్వ వైభవం కోసం ఆ గ్రామానికి రూ.100 కోట్లు కేటాయించినట్టు కూడా విజయవాడ సభలో చెప్పారు. మరి ఆ గ్రామంలోనే ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం వారి దృశ్య, లలిత, అభి నయ కళాపీఠం భవిష్యత్తు ఏమిటి? తెలుగు భాష, కూచిపూడి నృత్యా లను అంతా నేర్వాలని, సజీవంగా ఉంచుకోవాలని పెద్దలు ఆకాంక్షిం చారు. వారి కుటుంబాలు కూడా ముందుకువస్తే దీనికి సార్థకత వస్తుంది. డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు హైదరాబాద్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement