-
The Gentlemen 2 launch : జెంటిల్మేన్-2 ప్రారంభం.. కీరవాణికి సన్మానం (ఫొటోలు)
-
30 ఏళ్ల తర్వాత సీక్వెల్.. సంగీత దర్శకునిగా ఆస్కార్ గ్రహీత!
1993లో విడుదలై జెంటిల్మెన్ చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన శంకర్ ఇప్పుడు ఇండియాలోని ప్రముఖ దర్శకులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అర్జున్, మధుబాల జంటగా నటించిన ఈ బ్రహ్మాండ చిత్రానికి నిర్మాత కె.టి.కుంజుమోన్. ఎ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. (ఇది చదవండి: రోజుకు రూ.4 లక్షలు.. దారుణంగా మోసపోయా: షకీలా) కాగా 30 ఏళ్ల తరువాత కేటీ కుంజుమోన్ జెంటిల్మెన్–2 చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిని ఎ.గోకుల్కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. టాలీవుడ్ నటుడు సేతన్ శీను కథానాయకుడిగా నటించనున్న ఇందులో నయనతార అనే నూతన నటి నాయకిగా పరిచయం కాబోతున్నారు. కాగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ జెంటిల్మెన్ చిత్రానికి సంగీతాన్ని అందించగా ఇప్పటి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి జెంటిల్మెన్–2 చిత్రానికి సంగీతాన్ని అందించనుండం విశేషం. (ఇది చదవండి: ఎవరీ అండ లేకుండానే ఇండస్ట్రీలో ఎదిగా: హీరోయిన్) అవును తమిళంలో మరకతమణి పేరుతో ఇంతకుముందు కొన్ని చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఎం ఎం కీరవాణి చాలా గ్యాప్ తరువాత మళ్లీ జెంటిల్మెన్ –2 చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. కాగా ఈ చిత్ర దర్శకుడు గోకుల్కృష్ణ ఇటీవల హైదరాబాదుకు వెళ్లి కీరవాణికి కథను వినిపించారట. కథ అద్భుతంగా ఉందని కీరవాణి ఆయన్ని ప్రశంసించడంతో పాటు నిర్మాత కేటీ కుంజుమోన్కు ఫోన్ చేసి వచ్చే నెల నుంచి జెంటిల్మెన్–2 చిత్ర సంగీత కార్యక్రమాలు ప్రారంభిద్దామని తెలిపినట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. కేటీ కుంజుమోన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి తాజాగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం మరో విశేషం. -
మెన్టోన్
పురుషులందు పుణ్యపురుషులు వేరయా.. అని ‘ఉప్పుకప్పురంబు’ పద్యంలో వేమన సెలవిచ్చాడు. అంటే, పురుషులందరూ పుణ్యపురుషులు కాదని తేల్చేశాడు. పురుషుల మీద ఇది వేమన ఒక్కడి అభిమతమే కాదు, సమస్త సమాజానిది కూడా. ఇంచుమించు పుణ్యపురుషుల్లాంటి వాళ్లను ఇంగ్లిష్లో జెంటిల్మెన్ అంటార్లెండి. అనడమే గానీ, జంటిల్మెన్ అనగా ఎవరు..? వారి రూపురేఖా విలాసంబులెట్టివి..? వారి తీరుతెన్నులు మిగిలిన మెన్నాధములకు ఏ రీతిలో భిన్నముగా ఉండును..? అనే విషయాల మీద ఇంగ్లిష్ వాళ్లకే స్పష్టత లేదు. అయినా, ఏదో మర్యాద కోసం అలా అనేస్తూ ఉంటారు. ఎంతైనా ‘మగా’నుభావులంతా మర్యాదస్తులు కదా! సూటు బూటు హ్యాటు వంటి నానాలంకార భూషితులనే జంటిల్మెన్గా పొరబడతారు చాలామంది. నికార్సయిన జంటిల్మెన్ అందుకు భిన్నమైన వేషధారణలో కనిపించవచ్చు. అంతమాత్రాన వాళ్లు జంటిల్మెన్ కాకుండాపోరు. అలాగే, సూటు బూటు హ్యాటాది అలంకారాలతో మెరిసిపోతూ కనిపించే మాఫియా డాన్లూ మనకు తారసిల్లవచ్చు. అలంకారాల మాయలో పడి వాళ్లతో సెల్ఫీలు దిగి, ఫేస్బుక్లో పెట్టామో..! ఇక అంతే..! అడ్డంగా బుక్కయిపోతాం. అందువల్ల... ఎవరు జంటిల్మెన్... ఎవరు మెంటల్మెన్... ఎవరు కన్నింగ్మెన్... ఎవరు దొంగ... ఎవరు దొర... వంటివి తేల్చుకోవాలంటే... ‘మగా’నుభావులారా..! ఉప్పుకప్పురంబు పద్యాన్ని ఉత్తనే బట్టీపట్టకుండా నరనరాల్లోకి ఇంకించుకోండి. అయినదానికీ, కానిదానికీ మొత్తం మగజాతినే ఈసడించుకుని, నిందించే మాయదారి లోకం కళ్లు తెరిపించండి. - పన్యాల -
విసర్జన తర్వాత కూడా కొంత మూత్రం లోపలే మిగిలిపోతోంది..?
నా వయసు 55. మూడేళ్ల నుంచి నాకు మూత్రధార సరిగా రాకపోవడం, రాత్రిపూట ఎక్కువ సార్లు మూత్రానికి లేవాల్సి రావడం జరుగుతోంది. పదిహేనేళ్ల నుంచి నాకు షుగర్ ఉంది. షుగర్ ఉంటే మూత్రం ఎక్కువసార్లు వస్తుందంటారు కానీ నాకు చాలా తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు వస్తోంది. స్కానింగ్ చేయించుకుంటే ‘మూత్ర విసర్జన తర్వాత లోపల 150 ఎం.ఎల్. మిగులుతోంది’ అంటున్నారు. ఇలా మిగిలిపోవడం వల్ల ఏదైనా ప్రమాదమా? - ఎస్.వి.కె., వరంగల్ సాధారణంగా యాభైఏళ్లు పైబడిన వాళ్లలో ఇలాంటి మూత్ర సమస్యలు వస్తూ ఉంటాయి. ఆరోగ్యకరమైన వ్యక్తిలో లోపల 20 ఎం.ఎల్. కంటే ఎక్కువగా మూత్రం మిగలకూడదు. ఇలా మూత్రం సరిగా రాకపోవడానికి ప్రోస్టేట్ గ్రంథి వాపు, మూత్రంలో ఇన్ఫెక్షన్, పురుషాంగంపై చర్మం ముడుచుకుపోవడం వంటివి ప్రధాన కారణాలు. మీరు యూరిన్ ఎగ్జామినేషన్, ప్రోస్టేట్ గ్రంథి సైజు తెలుసుకునేందుకు స్కానింగ్, మూత్ర విసర్జన చేసే విధానాన్ని తెలుసుకునే యురెథ్రోమెట్రీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. ఈ పరీక్షల ద్వారా మీ సమస్యకు కారణం తెలుసుకుని దానికి అనుగుణంగా చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్స్, ప్రోస్టేట్ గ్రంథి పెరిగితే శస్త్రచికిత్స లేదా కొన్ని మందులు వాడటం, పురుషాంగంపై చర్మం మూసుకుపోతే సున్తీ ఆపరేషన్ వంటి చికిత్సల ద్వారా మీ సమస్యను నయం చేయవచ్చు. మా బాబుకు మూడేళ్లు. బాబు కడుపులో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ స్కాన్ చేయించుకున్నప్పుడు బాబుకు కిడ్నీలో వాపు ఉన్నట్లు చెప్పారు. ఇప్పుడు కూడా అల్ట్రాసౌండ్ స్కాన్ చేయిస్తే రెండు కిడ్నీల్లోనూ వాపు ఉందన్నారు. వాడికి ఏడాది వయసున్నప్పుడు ఎంసీయూజీ అనే పరీక్ష చేయించారు. అతడికి రెండువైపులా కిడ్నీల్లోకి మూత్రం వెనక్కు వెళ్తోందని చెప్పారు. ఐదేళ్ల వయసు వచ్చే వరకు అతడిని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాపు తగ్గకపోతే ఐదేళ్ల తర్వాత ఆపరేషన్ అవసరమంటున్నారు. అసలు మా బాబుకు వచ్చిన సమస్య ఏమిటి? - ఆర్. ధనంజయరావు, అనంతపురం పిల్లల్లో వచ్చే ఈ జబ్బును విసైకో యురెథ్రల్ రిఫ్లక్స్ అంటారు. మూత్రం పోసినప్పుడు మూత్రం వెనక్కు తిరిగి కిడ్నీల్లోకి వెళ్లకూడదు. ఒకవేళ అలా వెళ్తుంటే ఆ కండిషన్ను ‘రిఫ్లక్స్’ అంటారు. ఇలా మూత్రం రివర్స్లో వెనక్కు వెళ్తున్నప్పుడు... అది ఎంతదూరం వెనక్కు వెళ్లిందనే దాన్ని బట్టి ఐదు గ్రేడులుగా విభజిస్తారు. మొదటి రెండు గ్రేడుల్లో కిడ్నీకి ప్రమాదం తక్కువ. అందువల్ల కొద్దిరోజులు వేచి చూసినా పర్వాలేదు. నాలుగు, ఐదు గ్రేడుల్లో కిడ్నీలో వాపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగానే ఆపరేషన్ చేయించుకోవడం మంచిది. గ్రేడ్-3లో యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్లీ మళ్లీ వస్తుంటే కూడా ఆపరేషన్ను సూచిస్తాం. వయసు పెరిగేకొద్దీ రిఫ్లక్స్ తగ్గుతుంది. అందుకోసమే మీ బాబు విషయంలో డాక్టర్లు ఐదోఏడు వచ్చే వరకూ వేచిచూడమని మీకు సలహా ఇచ్చి ఉంటారు. మీరు క్రమం తప్పకుండా మీ యూరాలజిస్ట్తో ఫాలో అప్లో ఉండి, ఆయన సలహా మేరకు చికిత్స తీసుకోండి. నాకు 27 ఏళ్లు. ఈమధ్యనే పెళ్లయ్యింది. ఈమధ్య ఒకసారి సెక్స్ తర్వాత వీర్యంలో కొద్దిగా రక్తం కనిపించింది. ఆ తర్వాత ఒకసారి హస్తప్రయోగంలో కూడా కాస్త రక్తం వచ్చింది. నాకు చాలా ఆందోళనగా ఉంది. అయితే అంగస్తంభన యథావిధిగా జరుగుతోంది. సెక్స్ కూడా బాగానే చేయగలుగుతున్నాను. నాకు ఉన్న సమస్య తీవ్రత ఏమిటి? అది భవిష్యత్తులో ఏదైనా పెద్ద సమస్యకు దారితీసే అవకాశం ఉందా? - ఎస్.ఆర్.ఎమ్., భీమవరం వీర్యంలో రక్తం రావడం అన్నది అంత ప్రమాదకరమైన పరిస్థితి కాకపోవడానికే అవకాశాలు ఎక్కువ. వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉన్నా, టీబీ ఉన్నా, వీర్యం వచ్చే మార్గంలో నీటిబుడగలు (సిస్ట్స్) ఉన్నా, అక్కడ ఏవైనా గడ్డలు ఉన్నా ఇలా వీర్యంతో పాటు రక్తం రావడం చాలా పరిపాటి. పైగా ఇలా కనిపించడం చాలా సాధారణం. ఇది చాలామందిలో జరిగేదే. కొన్నిసార్లు ఇలా జరగడానికి ఏ కారణమూ కనిపించదు. చికిత్స చేసినా చేయకపోయినా ఒక్కోసారి దానంతట అదే తగ్గిపోవచ్చు. అందుకే చాలామంది బయటకు చెప్పకపోవడం అన్నది ఇలాంటి కేసుల్లో చాలా సహజంగా జరుగుతుంటుంది. చాలా సందర్భాల్లో పరిస్థితి దానంతట అదే చక్కబడుతుంది కాబట్టి చాలామందిలో దీనికి సంబంధించిన ఆందోళన కూడా క్రమంగా తగ్గిపోతుంటుంది. అయితే ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో మీరు ఒకసారి యూరిన్ పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుని యూరాలజిస్ట్ను కలిసి, ఏమైనా సాధారణ యాంటీబయాటిక్స్ తీసుకోవాలేమో చూసుకోండి. ఇది ఆందోళన పడాల్సినంత పెద్ద సమస్య కాదనే కాన్ఫిడెన్స్తో యూరాలజిస్ట్ను కలవండి. నాకు 67 ఏళ్లు. ఇటీవల మూత్రం సరిగా రాకపోవడంతో మూత్రపరీక్షలు చేయించుకున్నాను. ప్రోస్టేట్ గ్రంథిలో గడ్డలు తయారైనట్లు చెప్పారు. ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా ఆపరేషన్ చేసి తొలగించాలని అంటున్నారు. ఇప్పటికీ నేనూ, నా భార్య సెక్స్ను బాగా ఎంజాయ్ చేస్తుంటాం. అందుకే ఆపరేషన్ అనగానే నా అంగస్తంభన సామర్థ్యం దెబ్బతింటుందేమోనని నాకు ఆందోళనగా ఉంది. దయచేసి నాకు సరైన సలహా ఇవ్వగలరు. - ఎస్.ఆర్.కే., రాజమండ్రి అరవైఏళ్లు పైబడ్డవారిలో ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు రావడం సాధారణం. వీటిని మందులతో లేదా ఎండోస్కోపీ (టీయూఆర్పీ)తో నయం చేస్తాం. వీర్యంలో ఎక్కువభాగం ఈ ప్రోస్టేట్ గ్రంథి వల్లనే తయారవుతుంది. కాబట్టి దీన్ని తొలగించినప్పుడు వీర్యం తక్కువగా రావడం అన్నది చాలా సాధారణం. అయితే సెక్స్ చేయడానికి గాని, సెక్స్లో సంతృప్తి పొందడానికి గాని ఈ ఆపరేషన్ ఏవిధంగానూ అడ్డంకి కాదు. దీని వల్ల మీ అంగస్తంభనలకుగాని, సెక్స్ పార్ఫార్మెన్స్కు గాని ఎలాంటి లోపమూ రాదు. అందువల్ల ఈ ఆపరేషన్ అవసరమని మీ డాక్టర్లు చెబితే మీరు నిశ్చింతగా శస్త్రచికిత్స చేయించుకోవచ్చు. డాక్టర్ వి.చంద్రమోహన్ యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి: ఐదేళ్ల తర్వాత 11 మంది వైద్యులపై కేసు!
బీజేపీ నాయకులపై ఫిర్యాదు
బీజేపీ డబ్బులు తీసుకుని కాంగ్రెస్కు ద్రోహం
● ఎమ్మెల్యే పాయల్ శంకర్
కాంగ్రెస్ గెలుపు తథ్యం
అప్పుడు.. ఇప్పుడు
పంచదార.. ఇక లేనట్లేనా?
స్ట్రాంగ్.. భద్రత
లాఠీచార్జి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- పదేళ్ల తర్వాత.. చాట్జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement