-
మానవ వంశవృక్షం లెక్కతేల్చారు..
ఈ రోజు ఈ భూమ్మీద సుమారుగా 795 కోట్ల మంది జనమున్నారు. రోజురోజుకీ ఆ సంఖ్య పెరుగుతోంది కూడా.. ఇంతకీ మీరెప్పుడైనా ఆలోచించారా.. అసలు మనకన్నా ముందు ఈ భూమ్మీద ఎంతమంది జనం నివసించి ఉండి ఉంటారని.. ఎంత మంది పుట్టి.. చనిపోయి ఉంటారని.. అసలు కచ్చితంగా మన పూర్వీకులెంతమంది అని.. లేదు కదూ..నిజానికి అలా లెక్కగట్టడం సాధ్యమేనా? అసలీ లెక్కలేంటి? కార్ల్ హాబ్ తోషికో కనెడా సాధ్యమేనని అంటున్నారు డెమోగ్రాఫర్స్ తోషికో కనెడా, కార్ల్ హాబ్లు. డెమోగ్రాఫర్ అంటే.. జనాభా పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడంలో నిపుణులు అన్నమాట. మన పూర్వీకుల సంఖ్యను లెక్కించడానికి ఈ జనాభా శాస్త్రవేత్తలు క్రీ.పూ. 190000ని బెంచ్మార్క్ కింద తీసుకున్నారు. ఎందుకంటే.. మన అసలు సిసలు పూర్వీకుడైన ఆధునిక హోమోసెపియన్ నివసించిన కాలమది. దీని ప్రకారం మనకు ముందు 10,900 కోట్ల మంది మానవులు ఈ భూమ్మీద జన్మించి, మరణించారని తేల్చారు. దానికి ఇప్పుడున్న జనాభాను కలిపితే.. ఇప్పటివరకూ మొత్తంగా 11,695 కోట్ల మంది ఈ భూమ్మీద నివసించినట్లు అన్నమాట. ఈ లెక్కకు ఆధారం ఏంటి? ఇందుకోసం వారు మూడు అంశాలను ఆధారంగా చేసుకున్నారు. 1. మానవులు ఈ భూమ్మీద నివసించారు అని భావిస్తున్న కాల వ్యవధి. 2. నాటి నుంచి నేటి దాకా.. వివిధ కాలాల్లో సగటు జనాభా పరిణామం. 3. ఆయా కాలాల్లో ప్రతి వెయ్యి మంది జనాభాకు జననాల సంఖ్య.. మొత్తంలో మనమెంత? ప్రస్తుత జనాభా(795 కోట్లు)ను పరిగణనలోకి తీసుకుంటే.. ఇప్పటివరకూ భూమ్మీద నివసించిన మొత్తం మానవుల సంఖ్యలో మన వాటా 7% అని జనాభా శాస్త్రవేత్తలు తెలిపారు. అంతేకాదు.. 2050 నాటికి మరో 400 కోట్ల జననాలు కలుపుకుంటే.. అప్పటికీ ఈ భూమ్మీద నివసించిన మానవుల సంఖ్య సుమారు 12,100 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. రుణపడి ఉండాల్సిందే.. నిజానికి ఈ 10900 కోట్ల మందికి మనం రుణపడి ఉండాలని ‘అవర్ వరల్డ్ ఇన్ డాటా’సంస్థకు చెందిన మాక్స్ రోజర్ అన్నారు. ‘‘ఈ ఆధునిక నాగరికత కోసం.. మనం మాట్లాడుతున్నఈ భాషల కోసం.. మనం వండుతున్న ఈ వంటల కోసం..మనం వింటున్న ఈ సంగీతం కోసం.. మనం వాడుతున్న ఆధునిక పరికరాల కోసం.. మనం వారికి థాంక్స్ చెప్పాల్సిందే. మనకు ఇప్పుడు తెలిసినదంతా.. వారి నుంచి నేర్చుకున్నదే. మనముంటున్న ఇళ్లు.. వాడుతున్న మౌలిక సదుపాయాలు, వివిధ రంగాల్లో గొప్పగొప్ప ఘనతలు.. మన చుట్టూ ఉన్నదంతా మన పూర్వీకులు.. మనముందున్నవారు నిర్మించి ఇచ్చినదే..’’అని ఆయన అన్నారు. మాక్స్ చెప్పిందీ నిజమే మరి.. మనం ఇంతకు ముందెప్పుడూ చెప్పిందీ లేదు.. అందుకే ఈసారైనా చెప్పేద్దాం.. తాతగారూ.. ముత్తాతగారూ.. థాంక్యూ -సాక్షి సెంట్రల్ డెస్క్.. -
భూగర్భాన్వేషకుడు.. జియాలజిస్ట్
అప్కమింగ్ కెరీర్: భూగర్భం... అపారమైన ఖనిజ సంపద, ముడి చమురు, సహజ వాయువు, జల వనరులకు నిలయం. భూగర్భ సంపద మెండుగా ఉన్న దేశాలు ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా ఎదిగాయి. అనతికాలంలోనే సంపన్న దేశాలుగా అవతరించాయి. అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు ఊహించనంతగా పెరిగాయి. దేశ ముఖచిత్రాన్ని మార్చేసే శక్తి భూగర్భ సంపదకు ఉంది. అలాంటి సంపదను అన్వేషించి, వెలికితీసేవారే జియాలజిస్ట్లు. ఎదుగుదలకు లెక్కలేనన్ని అవకాశాలు ఉన్న కెరీర్.. జియాలజిస్ట్. భూగర్భాన్వేషణకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయి. దీంతో జియాలజిస్ట్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఈ రంగంపై ప్రజల్లో అంతగా అవగాహన లేకపోవడంతో జియాలజీ కోర్సులను అభ్యసించిన నిపుణుల కొరత కంపెనీలను వేధిస్తోంది. మనదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో చమురు, గ్యాస్ వెలికితీత ఊపందుకుంటోంది. మైనింగ్ పరిశ్రమ అభివృద్ధి చెందింది. జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. జియాలజిస్ట్లకు అధిక వేతనాలు ఇచ్చి నియమించుకుంటున్నాయి. జియాలజిస్ట్లకు ప్రస్తుతం దేశ విదేశాల్లో ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. జియాలజీలో ఎంఎస్సీ పూర్తిచేయగానే ఉద్యోగం సిద్ధంగా ఉంటోంది. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ), సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వంటి ప్రభుత్వ సంస్థల్లో, మైనింగ్ శాఖల్లో అవకాశాలు సులువుగా దక్కుతున్నాయి. రిలయన్స్, హిందూస్థాన్ జింక్ లిమిటెడ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి ప్రముఖ సంస్థల్లోనూ మంచి అవకాశాలున్నాయి. కాలేజీలు/యూనివర్సిటీల్లోనూ ఫ్యాకల్టీగా, పరిశోధకులుగానూ సేవలందించొచ్చు. అర్హతలు మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత జియాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీలో చేరొచ్చు. అనంతరం మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ కూడా చేస్తే ఉద్యోగావకాశాలు సులభంగా పొందొచ్చు. వేతనాలు ఎంఎస్సీ డిగ్రీ ఉన్న జియాలజిస్ట్కు రూ.5 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. పరిజ్ఞానం, పనితీరును బట్టి జీతభత్యాలు ఉంటాయి. ప్రారంభంలో నెలకు సగటున రూ.25 వేల దాకా వేతనం అందుకోవచ్చు. అంతర్జాతీయ చమురు, గ్యాస్ కంపెనీలో చేరితే నెలకు రూ.లక్షన్నర దాకా పొందొచ్చు. జియాలజీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు - ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: http://www.osmania.ac.in/ - ఆంధ్రా యూనివర్సిటీ వెబ్సైట్: http://www.andhrauniversity.edu.in/ - నాగార్జునా యూనివర్సిటీ వెబ్సైట్: http://www.nagarjunauniversity.ac.in/ - ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్-ధన్బాద్ వెబ్సైట్: http://www.ismdhanbad.ac.in/ - సెంటర్ ఫర్ ఎర్త్ సెన్సైస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు వెబ్సైట్: http://www.ceas.iisc.ernet.in/ అన్వేషణతో అద్భుత ఫలం ‘‘భూ అంతరాల్లో దాగిన ఖనిజాల అన్వేషణలో జియాలజిస్టుల భాగస్వామ్యం తప్పనిసరి. ఇటీవలి కాలంలో జియాలజీ కోర్సులకు డిమాండ్ పెరిగింది. జియాలజిస్ట్లకు అవకాశాలు పెరగడమే ఇందుకు కారణం. ప్రభుత్వ, ప్రైవేట్ మైనింగ్ సంస్థలు గనుల తవ్వకాలకు, ఖనిజాల వెలికితీతకు నిపుణులను నియమించుకుంటున్నాయి. జియాలజిస్ట్లకు మనదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ అధిక వేతనాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. శ్రమించగల తత్వం, ఓర్పు ఉన్న వారికి ఇది బెస్ట్ కెరీర్’’ - డాక్టర్ ఎం.మురళీధర్, జియాలజీ విభాగ అధిపతి, ఉస్మానియా విశ్వవిద్యాలయం
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement