breaking news
Geetu Mohandas
-
టాక్సిక్ టాక్స్: ట్రైలర్తో వైరల్ అయిన లేడీ డైరెక్టర్
‘కేజీఎఫ్’ వంటి చారిత్రక విజయం తర్వాత రాకింగ్ స్టార్, దక్షిణాది క్రేజీ హీరో యష్ నటించిన ‘టాక్సిక్’ ట్రైలర్ తోనే సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. హీరో యష్ తన స్వంత బ్యానర్ మాన్స్టర్ క్రియేషన్స్ ద్వారా సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్న పీరియాడికల్ గ్యాంగ్స్టర్ మూవీ టాక్సిక్. ఇందులో యష్ అత్యంత క్రూరమైన గ్యాంగ్ లీడర్ ‘రాయా’ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ‘ది టీజ్’ తోనే ఈ మూవీ భారీ అంచనాలు పెంచి సంచలనాలు కూడా రేపింది. కెమెరా టేకింగ్ యాక్టింగ్ వగైరాలన్నీ సినీ సాంకేతిక నిపుణుల మధ్య చర్చనీయాంశంగా మారి పలు ప్రశంసలు కూడా అందుకుంటుంటే... మరోవైపు నీలిచిత్రాల స్థాయిలో ఉన్న సన్నివేశం సంప్రదాయవాదుల కన్నెర్రకు కారణమైంది. ఈ నేపధ్యంలోనే ఆ సినిమాకు దర్శకత్వం వహించింది ఎవరు?తన నేపధ్యం ఏమిటి? అంటూ కన్నడేతర భాషా ప్రేక్షకుల్లో చర్చ కూడా జోరుగా సాగుతోంది. మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే షాకింగ్ సీన్లను జోడిస్తూ రూపొంది త్వరలోనే వెండితెరపై సందడి చేయబోతున్న ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్–అప్స్’.చిత్రం∙దర్శకురాలి పేరు గీతూ మోహన్దాస్.యాక్షన్ టూ డైరెక్షన్...ఆమె ఒక సెన్సేషన్...పాన్ ఇండియా యాక్షన్ చిత్రాలకు అలవాటైన దర్శకుల నుంచి కాకుండా, యష్ పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు.దానికి తగినట్టుగా ఆయనకు కనిపించారు దర్శకురాలు గీతూ మోహన్దాస్. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించి, తరువాత ఆస్కార్ స్థాయికి ఎదిగిన ప్రతిభావంతురాలైన దర్శకురాలిగా పేరొందారు. సాధారణ వాణిజ్య చిత్రాలకు పూర్తి భిన్నం గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘లైయర్స్ డైస్’ (2013). ప్రముఖ నటీనటులు నవాజుద్దీన్ సిద్ధిఖీ, గీతాంజలి థాపాలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, హిమాలయాల్లోని ఓ గ్రామం నుంచి ఢిల్లీ వరకు తన భర్త కోసం ఒక మహిళ చేసే ప్రమాదకర ప్రయాణాన్ని భావోద్వేగ సహితంగా చూపిస్తుంది.ఈ చిత్రం సండాన్స్ రోటర్డామ్ వంటి అంతర్జాతీయ చిత్రోత్సవాల్లోనూ ప్రశంసలు అందుకోవడంతో పాటు 87వ ఆస్కార్ అవార్డ్స్కు భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైన ఘనత దక్కించుకుంది. అంతేకాదు 61వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈ చిత్రం ఉత్తమనటి, ఉత్తమ సినిమాటోగ్రఫీలకు గాను రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి గీతూ మోహందాస్ భర్త కావడం. ఆయన అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్’ కు తన రఫ్ అండ్ రియలిస్టిక్ విజువల్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చి విజువల్ మాస్టర్గా పేరు తెచ్చుకున్నారు. గీతూ మోహన్దాస్ వైవిధ్యభరిత లైన్స్కు తెరపై జీవం పోసే లెన్స్ రాజీవ్ రవి అని చెప్పొచ్చు. అలాగే దేవ్ డి, చాందినీ బార్, ఉడ్తా పంజాబ్ వంటి వైవిధ్యభరిత సినిమాలు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి.‘టాక్సిక్’ కోసం గీతూనే ఎందుకు?‘కేజీఎఫ్’ లాంటి మాస్ బ్లాక్బస్టర్ తర్వాత, యష్ గీతూ మోహన్దాస్ లాంటి ఆలోచనాత్మక చిత్రాలకు పేరొందిన దర్శకురాలిని ఎంపిక చేయడం ఇండస్ట్రీలో ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ ఆమె రెండో చిత్రం ‘మూతోన్’ (సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గ్లోబల్ ఫిల్మ్ మేకింగ్ అవార్డు విజేత) చూసినవారికి ఈ నిర్ణయం ఎంత సరైనదో అర్థమవుతుంది. గీతూ కథనాల్లో ఉండే డార్క్ రియలిజం, అంతర్జాతీయ టచ్ – యశ్ మాస్ ఇమేజ్తో కలిసినప్పుడు, ఒక కొత్త తరహా భారతీయ బ్లాక్బస్టర్ రూపుదిద్దుకోబోతోందన్న అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రంలో యష్తో పాటు నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏదేమైనా... భారతీయ చిత్రాల్లో కామసూత్ర తీసిన మీరానాయర్ ఎంత వివాదాస్పదం అయ్యారో తెలిసిందే. అయితే సబ్జెక్ట్ పరంగా అవసరం కాబట్టి తీశానంటూ ఆమె సమర్ధవంతంగా తిప్పికొట్టగలిగారు. మరి కేవలం ఒకే ఒక్క టీజర్ ద్వారా సంప్రదాయవాదుల దాడులతో పాటుగా న్యాయ వివాదాలు కూడా ఎదుర్కుంటున్న గీతూ మోహన్...పూర్తి సినిమా విడుదల తర్వాత ఏవేం వివాదాలు ఎదుర్కోనున్నారో వేచి చూడాలి. -
ఒక్క సీన్తో వైరల్.. 'టాక్సిక్' బ్యూటీ ఇన్స్టా డిలీట్
కన్నడ స్టార్ హీరో యశ్ కొత్త సినిమా టాక్సిక్ టీజర్ పాన్ ఇండియా రేంజ్లో హీట్ పెంచుతుంది. టీజర్లో ఉన్న ఇంటిమేట్ సీన్పై మహిళా సంఘాలు తీవ్రమైన అభ్యంతరం తెలిపాయి. యశ్తో పాటు బోల్డ్ సీన్లో కనిపించిన బీట్రీజ్ టోఫెన్ బాఖ్ (Beatriz Taufenbach) తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించింది. తన ఇంటిమేట్ సీన్స్పై వివాదాలు రావడం వల్లనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని దర్శకురాలు గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.టాక్సిక్ టీజర్లో చాలా బోల్డ్గా నటించిన తర్వాత ఆమె గురించి తెలుసుకోవాలని నెటిజన్లు పోటీపడ్డారు. ఈ క్రమంలో దర్శకురాలు గీతూ మోహన్దాస్ ఆమె వివరాలు షేర్ చేశారు. దీంతో ఆమె పేరు బీట్రీజ్ బాఖ్ అని పంచుకున్నారు. హాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ఇదే ఫస్ట్ ఇండియన్ సినిమా... దీంతో ఆమెకు భారీగా ఫాలోవర్స్ పెరిగారు. జనవరి 13 వరకు ఆమె ఖాతా యాక్టివ్గానే ఉంది. కానీ, సెడెన్గా ఇన్స్టాగ్రామ్లో ఆమె ఖాతా కనిపించకపోవడంతో నెటిజన్లు ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు. -
'టాక్సిక్' సినిమా దర్శకురాలిపై ఫిర్యాదు
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’.. వారం క్రితం టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ఉన్న ఒక ఇంటిమేట్ సీన్ కర్ణాటకలో పెద్ద వివాదంగా మారింది. తాజాగా చిత్ర నిర్మాత, దర్శకురాలిపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. టీజర్ బాగుందని అందులో యశ్ లుక్ అదిరిపోయిందని అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ, బయట కాల్పుల శబ్దాలు వినిపిస్తుండగా.., కారులో యశ్తో పాటు మరో యువతిల మధ్య ఒక ఇంటిమేట్ సీన్ ఉంటుంది. ఈ సన్నివేశంపై పలు అభ్యంతరాలు వస్తున్నాయి.కర్ణాటకలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మహిళా విభాగం ఈ టీజర్పై భగ్గుమంది. దీంతో పలు అభ్యంతరాలు వ్యక్తం చేసి కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. టీజర్లోని కొన్ని దృశ్యాలు అశ్లీలంగా ఉన్నాయని మహిళలు, పిల్లలతో పాటు సాంస్కృతిక విలువలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్ర నిర్మాతతో పాటు దర్శకురాలిపై చర్యలు తీసుకోవాలన్నారు.విమర్శలరు రావడంతో టీజర్పై దర్శకురాలు గీతూ మోహన్దాస్ స్పందించారు. అయితే, ఆమె చాలా వ్యంగ్య ధోరణిలో కామెంట్ చేశారు. నేటి సమాజం ఇప్పటికీ మహిళల ఆనందం, స్వేచ్ఛ వంటి అంశాలపై చర్చల దశలోనే ఉందని పేర్కొన్నారు. ఎవరు ఏమనుకున్నా తాను మాత్రం ప్రశాంతంగా ఉన్నా అన్నారు. ఆ సీన్ను శృంగార దృశ్యంగా చూడకిండి అంటూ హితవు పలికారు. మహిళల అనుభవాలతో పాటు వారి ఎంపికలను ప్రతిబింబించే కోణంలో చూడాలని గీతూ మోహన్దాస్ చెప్పారు. టాక్సిక్ సినిమా మార్చి 19న విడుదల కానుంది. -
టాక్సిక్లో ఇంటిమేట్ సీన్.. విమర్శలపై డైరెక్టర్ రియాక్షన్..!
కేజీఎఫ్ హీరో యశ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ టాక్సిక్. ఈ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత యశ్ చేస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే టీజర్ విడుదల చేయగా ఫ్యాన్స్ను మాత్రం తెగ మెప్పించింది. అయితే ఆ ఒక్క సీన్తో టీజర్పై తీవ్రస్థాయిలో విమర్శలొస్తున్నాయి. ఓ మహిళ దర్శకురాలు ఇలాంటి సీన్స్ పెట్టడమేంటని సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫైరయ్యారు.తన మూవీ టీజర్లోని ఇంటిమేట్ సీన్పై విమర్శలు రావడంతో డైరెక్టర్ గీతూ స్పందించింది. తనపై వస్తున్న విమర్శలు చూసి చిల్ అవుతున్నానంటూ కామెంట్స్ చేసింది. ఒక మహిళ డైరెక్టర్ ఇలాంటి సీన్స్ తెరకెక్కించడం కరెక్టేనా అంటూ కొందరు మాత్రం ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. కాగా.. టీజర్ గ్లింప్స్లో శ్మశానం వద్ద కారులో ఇంటిమేట్ సీన్స్ చూపించారు. ఆ సీన్స్లో నటించిన ఆమెను కూడా పరిచయం చేశారు. ఈ హాలీవుడ్ నటి టీవీ సిరీస్ బ్రూక్లిన్ నైన్-నైన్తో గుర్తింపు తెచ్చుకున్నారు. డిస్నీ యానిమేటెడ్ చిత్రం ఎన్కాంటోలో బీట్రీజ్ నటించారు. కాగా.. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్ని మార్చి 19న రిలీజ్ చేస్తున్నారు. -
యశ్ 'టాక్సిక్'లో 5వ హీరోయిన్ ఎంట్రీ
కన్నడ నటుడు యశ్ జోరు పెంచాడు.. ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్బస్టర్స్ తర్వాత ఆయన హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’. కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే వారి పోస్టర్స్ను విడుదల చేశారు. అయితే, తాజాగా ఇందులో రుక్మిణి వసంత్ కూడా నటిస్తున్నారని మేకర్స్ ప్రకటించారు. ఇందులో ఆమె మెలిసా అనే పాత్రలో కనిపించనున్నట్లు ఒక పోస్టర్ను షేర్ చేశారు.టాక్సిక్ నుంచి ఇప్పటికే నలుగురు హీరోయన్ల ఫస్ట్లుక్స్ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి నదియా పాత్రలో నటిస్తోన్న కియారా అద్వానీ, గంగ పాత్ర చేస్తున్న నయనతార, హూమా ఖురేషి నటిస్తున్న ఎలిజిబెత్ పాత్రలతో పాటు తారా సుతారియా చేస్తున్న రెబెకా పాత్రను పరిచయం చేశారు. అయితే, తాజాగా మెలిసా పాత్ర కోసం రుక్మిణి వసంత్ను తీసుకున్నారు.గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోంది. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్ని మార్చి 19న రిలీజ్ చేస్తున్నారు.Introducing Rukmini Vasanth @rukminitweets as MELLISA in - A Toxic Fairy Tale For Grown-Ups#TOXIC #TOXICTheMovie #Nayanthara @humasqureshi @advani_kiara #TaraSutaria #GeetuMohandas @RaviBasrur #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva… pic.twitter.com/jv83SVLzYu— Yash (@TheNameIsYash) January 6, 2026 -
'యశ్' బర్త్డే స్పెషల్.. 'టాక్సిక్' నుంచి అదిరిపోయే వీడియో
కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) నటించనున్న తాజా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ (Toxic Movie). కేజీఎఫ్ సిరీస్ తర్వాత ఆయన నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులలో చాలా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ తాజాగా యశ్ పుట్టినరోజు (జనవరి 8) సందర్భంగా ప్రత్యేకమైన వీడియోను పంచుకుంది. గీతూ మోహన్దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో వెంకట్ కె. నారాయణ, యశ్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో నిర్మిస్తున్నారు. పవర్ఫుల్ అండ్ ఎమోషనల్ కథతో ‘టాక్సిక్’ తెరకెక్కనుంది. ఈప్రాజెక్ట్లో స్టార్ నటీనటులు నటించననున్నారు అని యూనిట్ పేర్కొంది. (ఇదీ చదవండి: సంధ్య థియేటర్ ఘటన.. బన్నీపై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు)ఎలాంటి అంచనాలు లేకుండా 2018లో విడుదలైన కేజీఎఫ్ చిత్రంతో యశ్ పాన్ ఇండియా రేంజ్ హీరోగా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత కేజీఎఫ్-2తో ఆయన మార్కెట్ పెరిగింది. ఈ చిత్రాలతో విపరీతమైన పాపులారిటీ దక్కడం వల్ల తన తర్వాతి సినిమా ఏ స్థాయిలో ఉండాలి అనే అంశంలో కాస్త టైమ్ తీసుకున్నాడు. అందుకే 2022 నుంచి ఆయన మరో సినిమా చేయలేదు. తనకు సరిపోయే కథ కోసం ఎదురుచూశాడు. ఈ క్రమంలో టాక్సిక్ స్టోరీ నచ్చడం ఆపై నేషనల్ అవార్డ్ అందుకున్న దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టాక్సిక్ షూటింగ్ ప్రారంభమైంది.రిలీజ్ ఎప్పుడు..?టాక్సిక్ సినిమాను వాస్తవంగా ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, సినిమా షూటింగ్ పనులు ఆలస్యం అవుతుండటంతో రిలీజ్ వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ వెల్లడించింది. కానీ, తాజాగా రిలీజ్ అయిన వీడియోలో సినిమా తెరపైకి ఎప్పుడు వస్తుందో మేకర్స్ ప్రకటించలేదు. ఈ ఏడాది ముగింపు నెల డిసెంబర్ నెలలో టాక్సిక్ విడుదల కావచ్చని తెలుస్తోంది.టాక్సిక్లో బాలీవుడ్ బ్యూటీఈ చిత్రంలో కరీనా కపూర్ ( Kareena Kapoor ) ఓ హీరోయిన్గా నటించనున్నారన్న వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ సినిమాలో కరీనాది హీరోయిన్ పాత్ర కాదని, యశ్కు అక్క పాత్రలో ఆమె కనిపించనున్నారనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం గతంలో శ్రుతి హాసన్ , సాయిపల్లవి వంటి వార్ల పేర్లు తెరపైకి రాగా, తాజాగా కియారా అద్వానీ పేరు కూడా వినిపిస్తోంది. మరి.. యశ్కు సిస్టర్ పాత్రలో కరీనా కనిపిస్తారా..? యశ్తో కియారా జోడీ కడతారా..? అనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.రామాయణంలో యశ్నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ్’ చిత్రంలో రావణుడిగా యశ్ నటించనున్నారు. ఇందులో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాతలుగా ఉన్నారు. యశ్కు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ ఉంది. ఈ బ్యానర్పై ‘టాక్సిక్’ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్తో పాటు నిర్మిస్తున్నారు. ఇప్పుడు రాయాయణ సినిమా కోసం నమిత్ మల్హోత్రాతో యశ్ చేతులు కలిపారు. మానవ సమాజ గతినే ప్రభావితం చేసిన ఒక మహత్తర కావ్యం రామాయణం. రామాయణంలోని ప్రతి సంఘటన, ప్రతి పాత్రా సమాజంపట్ల, సాటి మానవుల పట్ల మన బాధ్యతని గుర్తు చేసేవిగానే వుంటాయి. రామాయణం మధురమైన కథ. ఎన్నిసార్లు రామాయణం చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇప్పటికే పలుమార్లు సినిమాగా వెండితెరపై మెరిసింది. ఇప్పుడు మరోసారి 'రామాయణ' పేరుతో సినిమా రానున్నడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
యష్ కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?
రాకింగ్ స్టార్ యష్ 19 చిత్రంపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్కు చేరుకున్న యష్ తన తదుపరి చిత్రం ప్రకటించడంలో చాలా సమయం తీసుకున్నాడు. ఆయనకు భారీగానే ఆఫర్లు వచ్చినప్పటికీ కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేస్తూ వచ్చాడు. కానీ ఫైనల్గా తన కొత్త ప్రాజెక్ట్ను ప్రకటించాడు. ఈ చిత్రాన్ని మలయాళ దర్శకురాలు గీతూ మోహన్దాస్ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి 'టాక్సిక్' అనే టైటిల్ను ఖారారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు యశ్.. నువ్వు వెతుకుతున్నదే.. నిన్ను కోరుకుంటుంది' అనే క్యాప్షన్ను అక్కడ చేర్చారు. భారీ బడ్జెట్తో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రధానంగా మాదకద్రవ్యాలకు సంబంధించిన కథగా ఉంది. ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్లో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం ఉంది. -
లేడీ డైరెక్టర్కు ఛాన్స్ ఇచ్చిన 'కేజీఎఫ్' యశ్!
పాన్ ఇండియా హీరోల్లో డార్లింగ్ ప్రభాస్ ఎప్పుడూ టాప్ లో ఉంటాడు. ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ తదితరులు ఉంటారు. తెలుగు కాకుండా దక్షిణాది నుంచి ఈ గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో 'కేజీఎఫ్' యశ్ ఒకడు. గతేడాది ఏప్రిల్ లో 'కేజీఎఫ్ 2'తో వచ్చి వేల కోట్ల కలెక్షన్స్ సాధించాడు. దీంతో యశ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఫ్యాన్స్ అయితే ఈ హీరో నెక్స్ట్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ అప్డేట్ వచ్చేసినట్లు కనిపిస్తుంది. (ఇదీ చదవండి: 'సలార్' కొత్త పోస్టర్లో 'కేజీఎఫ్' కనెక్షన్.. గమనించారా?) 'కేజీఎఫ్' రెండు సినిమాల కోసం దాదాపు ఏడేళ్లు వెచ్చించిన హీరో యశ్.. అందుకు తగ్గ ఫలితం అందుకున్నాడు. ఇదే ఇప్పుడు కొత్త సమస్యల్ని తీసుకొచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ బడ్జెట్ తో సినిమాలు చేస్తే అభిమానులకు నచ్చకపోవచ్చు. అందుకే ఆచితూచి అడుగు వేయాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తో కలిసి ఓ మూవీ చేయడానికి సిద్ధమయ్యాడట. అధికారికంగా బయటకు రానప్పటికీ.. ఈ కాంబో ఖరారైనట్లు తెలుస్తోంది. మలయాళంలో 1989-2009 మధ్య నటిగా ఓ 20కి పైగా సినిమాలు చేసిన గీతూ మోహన్ దాస్.. 2009లో ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది. 2014లో 'లైయర్స్ డైస్' అనే చిత్రంతో దర్శకురాలిగా మారింది. 2019లో 'మూతున్' మూవీ తీసింది. లాక్ డౌన్ టైంలో ఓ యాక్షన్ స్టోరీ రెడీ చేసిన ఈమె.. దాన్ని యశ్ కి చెప్పగా అతడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. అదే టైంలో ఓ రొమాంటిక్ స్టోరీ కూడా యశ్ కోసం సిద్ధం చేసిందట. ఈ రెండింట్లో ఏది చేయాలనే కన్ఫ్యూజన్ కాస్త నడుస్తోందని, ఇది క్లియర్ అయిన వెంటనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. (ఇదీ చదవండి: ఆ బిజినెస్లో 'కేజీఎఫ్' విలన్ రూ.1000 కోట్ల పెట్టుబడి?)


