-
గజ్జెల చప్పుడు.. చెవిలో గుసగుసలు
► మనిషి కనిపించరు.. ఒంటికి చల్లగా తగిలే స్పర్శలు ► గుసగుసలాడుతూ మనుషులతో మాట్లాడే చీకటి శక్తులు ► దుప్పట్లు తొలగించి ముఖాలు చూసే మసక రూపాలు ► గ్రామం మొత్తం నిర్మానుష్యం ► రాజస్థాన్లోని కుల్ధార గ్రామం వింత గాధ జైపూర్: ఆ గ్రామంలో 200 ఏళ్ల క్రితం చక్కగా ఇటుకలతో కట్టిన రెండంతస్తుల ఇళ్లలో ఇప్పటికి కొన్ని చెక్కు చెదరకుండా చక్కగా ఉన్నాయి. కొన్ని కప్పులు కూలిపోయి మొండిగోడలే మిగిలాయి. మరికొన్ని శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇళ్ల మధ్య సందులు, గొందులు తీర్చిదిద్దినట్లుగా కనిపిస్తున్నాయి. ప్రజల మంచినీటి అవసరాల కోసం తవ్వించిన బావులు ఇప్పటికీ మన నీడలను నిర్మలంగా ప్రతిఫలిస్తున్నాయి. అయినా గ్రామంలో ఒక్క పురుగు కూడా కనిపించదు. రాజస్థాన్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన జైసల్మీర్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మానుష్యమైన ఈ గ్రామం ఇప్పుడు పురాతత్వ శాఖ పరిరక్షణలోకి వెళ్లింది. కుల్ధారగా చరిత్రలో నిలిచిపోయిన ఈ గ్రామానికి సంబంధించిన ఆసక్తికర కథలెన్నో ఇప్పుడు ప్రచారంలోకి వచ్చాయి. ‘రాత్రిపూట ఈ గ్రామంలో దెయ్యాల లాంటి ముసుగేసుకున్న రూపాలు తిరుగుతుంటాయి. అడుగుల శబ్దం వినిపించడం తప్ప కనిపించని అతీత శక్తులు కదలాడుతుంటాయి. మన చెవుల పక్క నోరుపెట్టి గుసగుసలాడుతున్న చీకటి శక్తులేవో మనతో మాట్లాడుతుంటాయి. మనం అక్కడ మొండి గోడల్లో భయం భయంగా నిండా కప్పుకొని నిద్రపోతే మసక రూపాలేవో వచ్చి మన దుప్పట్లను తొలగించి ముఖాలను చూసి పోతుంటాయి. మనిషి కనిపించని స్పర్శలేవో ఒంటికి చల్లగా తగులుతుంటాయి. ఇది నా బృందానికి ఎదురైన అనుభవాలు’ అని ‘ఇండియన్ పారానార్మల్ సొసైటీ (అతీత శక్తులపై పరిశోధనలు జరిపే సంస్థ)’ వ్యవస్థాపకులు గౌరవ్ తివారీ కొంత కాలం క్రితం చెప్పారు. అతీత శక్తుల ఆచూకీ కోసం.... అతీత శక్తుల చుట్టూ అల్లుకునే భ్రమలను తొలగించేందుకే తమ సొసైటీ ఏర్పాటైందని, కుల్దార గ్రామంలో మాత్రం ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి అందని వింత శబ్దాలు, అంతుచిక్కని అంశాలు ఎన్నో ఉన్నాయని గౌరవ్ తివారీ తెలిపారు. తాను అనేక బృందాలను అనేకసార్లు తీసుకొని వెళ్లి రాత్రిపూట కుల్దారా గ్రామంలో బస చేశానని, ఎప్పుడూ తమకు వింతైన అనుభవాలే కలిగేవని, ఒక్కోసారి అరుపులు. కేకలు కూడా వినిపించేవని, మనుషులు మాత్రం కనిపించేవారు కాదని ఆయన తెలిపారు. ఓసారి తాము తీసుకెళ్లిన వాహనాలన్నింటిపై తాము చూస్తుండగానే చిన్న పిల్ల అరచేతి ముద్రలు ప్రత్యక్షమయ్యాయని ఆయన చెప్పారు. అక్కడ తమకు కనిపించిన దృశ్యాలను, వినిపించిన శబ్దాలను, కనిపించీ కనిపించని, వినిపించీ వినిపించని దృశ్యాలను, ధ్వనులను పూర్తిస్థాయి స్పెక్ట్రమ్ కెమేరాలు, సీసీటీవీ కెమెరాలు, ఈఎంఎఫ్ మీటర్లు, ఈవీపీ రికార్డర్లు, థర్మల్ ఇమేజర్లు, మోషన్ సెన్సర్లు, రెమ్ పాడ్స్, స్టాటిక్ డిటెక్టర్లను ఉపయోగించి రికార్డు చేశామని తివారీ తెలిపారు. తివారీ ఆకస్మిక మరణం... తివారీ పరిశోధనలపై కొన్ని ఆంగ్ల పత్రికల్లో ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. కానీ దురదృష్టవశాత్తు ఇటీవల అనుమానాస్పద పరిస్థితుల్లో ఆయన మరణించారు. ఆయన మృతిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఆయన వెల్లడించిన కథనం ప్రకారం: అది 1825వ సంవత్సరం. రక్షాబంధన్ రోజు, నాటి రాత్రి పున్నమి వెన్నల పుస్కలంగా విరగకాసింది. ప్రజలంతా ఆనందంగా పండుగ జరుపుకొనే సందర్భం. కానీ చుట్టుపక్కల 85 గ్రామాల్లో నివసిస్తున్న పాలివాల్ బ్రాహ్మణులు దాదాపు 1500 మంది కుల్ధార కూడలిలో సమావేశమయ్యారు. జైసల్మీర్ రాజ్యానికి చెందిన సలీమ్ సింగ్ అనే మంత్రి కుల్ధార గ్రామ పెద్ద కుమార్తెను ప్రేమించాడు. తనకు ఇచ్చి పెళ్లి చేయాలని గ్రామ పెద్దయిన పాలివాల్ బ్రాహ్మణ పెద్దను బెదిరించారు. లేకపోతే వ్యవసాయంపై బతికే పాలివాల్ బ్రాహ్మణులపై భారీగా సుంకాలు విధిస్తానని, రెండు రోజుల్లో నిర్ణయం తెలియజేయాలని హెచ్చరించారు. ఆ అంశాన్నే చర్చించేందుకే బ్రాహ్మణులంతా సమావేశమయ్యారు. వారి తెగకు చెందిన వారికి తప్ప మరో తెగ లేదా కులానికిచ్చే ఆనవాయితీ అప్పటికీ వారికి లేదు. 1500 మంది బ్రాహ్మణుల అదృశ్యం.. వారు ఆ రోజు అర్థరాత్రి వరకు చర్చించి ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదుగానీ, ఆ రోజు రాత్రి నుంచి వారిలో ఒక్కరు కూడా కనిపించకుండా అదృశ్యమయ్యారు. వారితోపాటు వారి కుటుంబసభ్యులు కూడా కట్టుబట్టలతో కనిపించకుండా పోయారు. ఇది చరిత్రలో ఇప్పటికీ అంతుచిక్కని విషయం. తివారీ వివరించిన ఈ చారిత్రక కథనాన్ని ‘ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ స్థానిక అధికారులు ధ్రువీకరించారు. అయితే రాత్రి పూట అతీంద్రియ శక్తులు తిరుగుతాయన్న అంశాన్ని మాత్రం వారు ఖండించారు. ప్రజల్లో అలాంటి విశ్వాసాలు ఉన్నాయని, తమకు మాత్రం అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని వారు చెప్పారు. తాము పర్యాటకులను మాత్రం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని చెప్పారు. అవన్నీ కట్టుకథలే కావచ్చు.. కుల్ధారలో అతీంద్రియ శక్తులు ఉన్నాయన్న విషయాన్ని ‘జైసల్మీర్ వికాస్ సమితి’ కార్యదర్శి చంద్ర ప్రకాష్ వ్యాస్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా ఖండించారు. తివారీ బృందం పరిశోధనల గురించి ప్రస్తావించగా ఆయనతోపాటు తాను కూడా కొన్ని రోజులు కుల్ధార గ్రామంలో రాత్రిపూట బస చేశానని, తనకు మాత్రం ఎలాంటి వింత శబ్దాలు వినిపించలేదని, వికృత రూపాలు కనిపించలేదని చెప్పారు. ఆరోజు అద్యశ్యమైన బ్రాహ్మణ కుటుంబాలు ఎక్కుడికి వెళ్లి ఉంటాయని ప్రశ్నించగా, కొన్ని కుటుంబాలు చెల్లాచెదురుగా రాజస్థాన్ ఇతర ప్రాంతాల్లో స్థిరపడి ఉండొచ్చని, మరికొన్ని కుటుంబాలు ఉత్తరప్రదేశ్, ఉత్తరఖండ్, బిహార్ రాష్ట్రాలకు వలసపోయి ఉంటాయని ఆయన చెప్పారు. పర్యాటకులను ఆకర్షించడం కోసం కొంత మంది ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కథనాలను ప్రచారం చేసి ఉంటారని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంతుచిక్కని రహస్యమే.. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్లో అతి తక్కువ నీటిని ఉపయోగించి వ్యవసాయం చేయడంలో పాలివాల్ బ్రాహ్మణులు అనుభవజ్ఞులు. వారు గోధుమ పంటను ఎక్కువగా పండించేవారు. పాలి ప్రాంతం నుంచి వారి పూర్వీకులు రావడం వల్ల వారి పాలివాల్ బ్రాహ్మణులని పేరు వచ్చి ఉంటుందన్న చారిత్రక అంచనాలు కూడా ఉన్నాయి. వారు నేర్పిన వ్యవసాయం గురించి రాజస్థాన్ విద్యాలయాల్లో ఇప్పటికీ పాఠాలు చెబుతారు. వారు ఇక్కడి నుంచి ఏ ప్రాంతానికి వలస వెళ్లారో, వారి ఆనవాళ్లు ఎక్కడున్నాయో మాత్రం ఎప్పటికీ చరిత్రకందని రహస్యమే! -
అరెస్ట్ దిస్ దెయ్యం
గౌరవ్ తివారీ దెయ్యాల్ని పట్టుకుంటాడు. ఇది తెలిసి దెయ్యాలన్నీ కలిసి ఓ మీటింగ్ పెట్టుకున్నాయట. దెయ్యమంటే భయం ఉండాలి కానీ గౌరవ్కి గౌరవం పెరగడం ఏంటని మీటింగ్లో నిరసనలు. ‘వెంటనే ఖతమ్ చేసెయ్యాలి’ అంది దెయ్యాల ప్రెసిడెంట్.అలా ఎందుకని ఓ పిల్లదెయ్యం అడిగింది. లేకపోతే ప్రజలకి మనమీద భయం పోతుంది,చెప్పాడు ప్రెసిడెంట్. సారీ, చెప్పింది ప్రెసిడెంట్ దెయ్యం.అంతే... నెక్స్ట్ డే మార్నింగ్... సారీ, నైట్ గౌరవ్ గొంతు పిసికి చంపేశాయట. దెయ్యాలుంటాయని నమ్మేవారు రాసుకున్న కథలివి.. హేతువాదులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు.. దెయ్యాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనుకునేవాళ్లు మాటిమాటికీ మంచం కిందికి తొంగి చూసుకుంటున్నారు... జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్. దెయ్యాల్లేవ్, భూతాల్లేవ్... కానీ భయమైతే ఉంది. భయాన్ని మించిన దెయ్యం లేదు! లేదూ దెయ్యమే చంపింది అంటే... దెయ్యాల వేట సాగించే ఆ సాహసవంతుడు మరిలేడు. అనుమానాస్పదంగా మరణించాడు. ప్రమాదవశాత్తూ చనిపోయాడా... ఆత్మహత్య చేసుకున్నాడా... లేదా దెయ్యాలే చంపేశాయా? ఇదో మిస్టరీ. వారం రోజుల క్రితం మరణించిన ఘోస్ట్ హంటర్ గౌరవ్ తివారీ కథ ఇప్పుడు దేశ విదేశాల్లో పారా నార్మల్ యాక్టివిటీల్లో నిమగ్నమైన గ్రూపులలో ఉత్కంఠ రేపుతోంది. ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. గౌరవ్ తివారీ ఎవరో తెలుసుకునే ముందు అతడేం చేసేవాడో చూద్దాం. కోల్కతాలోని ఓ అపార్ట్మెంటు... ఐదో అంతస్తులోని ఒక ఫ్లాట్ తలుపు బర్రున తెరుచుకుంది. లోపలంతా చిక్కటి చీకటి. కన్ను పొడుచుకుని చూసినా ఏమీ కనిపించడం లేదు. ‘ఏంటిది... భూత్ బంగ్లాలా ఇలా ఉంది’ అంటూ లోపలికి అడుగు పెట్టాడా వ్యక్తి. చేతిలోని టార్చ్ను ఆన్ చేశాడు. ఆ వెలుగులోనే స్విచ్బోర్డ్ ఎక్కడుందో వెతుక్కుని లైట్ ఆన్ చేశాడు. ఒక్కసారి చుట్టూ పరికించి చూశాడు. ‘వావ్... చీకటిలో కనిపించలేదు కానీ ఫ్లాట్ అదిరింది’ అనుకుంటూ ఒక్కో గది తలుపూ తెరిచి చూడటం మొదలుపెట్టాడు. కిచెన్, డైనింగ్ హాల్, స్టడీ రూమ్... అన్నీ చాలా బాగున్నాయి. ఇక బెడ్రూమ్ ఎలా ఉందో చూడాలి అనుకుంటూ డోరు తీశాడు. లోనికి అడుగుపెడుతుంటే ఎవరిదో నవ్వు వినిపించింది. ఎవరిదో అర్థం కాలేదు. కిటికీ తీసి చూశాడు బయట ఎవరైనా ఉన్నారేమో అని. ఎవరూ లేరు. మరి నవ్వింది ఎవరు అనుకుంటూ ఉండగానే మళ్లీ నవ్వు వినిపించింది. అతని వెన్నులో వణుకు. ఒకవేళ అది తన భ్రమ అయివుంటుంది అనుకున్నాడు. కానీ అది భ్రమ కాదని ఆరోజు రాత్రి అర్థమయ్యిందతనికి. ఎవరో అమ్మాయి నవ్వులు... అంతలోనే ఏడుపులు... మధ్యలో మూలుగులు. ఉన్నట్టుండి కప్పుకున్న దుప్పటి గాల్లోకి లేచింది. సైడ్ టేబుల్ మీద ఉన్న నీళ్ల గ్లాసు కింద పడి భళ్లున బద్దలయ్యింది. ఏసీ లేకపోయినా గది మొత్తం చల్లగా అయిపోయింది. మళ్లీ అంతలోనే వేడెక్కిపో యింది. మొత్తానికి ఆ రాత్రి అతనికి కాళరాత్రి అయ్యింది. అంతా శ్రద్ధగా విన్నాడు గౌరవ్ తివారీ. వెంటనే ఆ వ్యక్తిని తీసుకుని అతని ఫ్లాట్కి బయలుదేరాడు. ఆ గదిలో అడుగుపెడుతూనే అతనికి అర్థమైపోయింది అక్కడ ఏం జరుగుతోందో, ఎవరి వల్ల జరుగుతోందో. కొద్దిపాటి అన్వేషణ సాగించాడు. ఆచూకీ తెలిసింది. ఎస్. అక్కడ ఒక ఆత్మ ఉంది. కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉంది. భర్త చేతిలో వంచనకు గురై, హింసకు గురై, చివరికి ప్రాణాలే కోల్పోయిన వేదనతో దెయ్యమై అక్కడే తిరుగాడుతోంది. ఇక్కడ గౌరవ్ రెండు విషయాలు చెబుతాడు. ఒకటి: అక్కడ దెయ్యం ఉంది కనుక ఆ స్థలం విడిచి పెట్టమని. లేదా ఆ దెయ్యాన్ని తాను పారదోలదలుచుకుంటే అందుకు సహకరించమని. గౌరవ్ ఎక్కువగా దెయ్యాలు ఆ ప్రదేశంలో కచ్చితంగా ఉన్నాయి అని నిరూపించడమే తన పనిగా పెట్టుకున్నాడు. దెయ్యాలతో చెలిమి... ‘దెయ్యం అన్న మాట వింటేనే అందరూ హడలిపోతారు. అవి తమను ఏదో చేస్తాయని భయపడతారు. కానీ అన్ని దెయ్యాలూ చెడ్డవి కావు. మంచివి కూడా ఉంటాయి’... అంటాడు గౌరవ్ తివారీ. ఎన్నో పారానార్మల్ యాక్టివిటీస్ని ఇన్వెస్టిగేట్ చేసిన అనుభవంతో అన్న మాట ఇది. నిజానికి ఒకప్పుడు దెయ్యం అన్న మాటనే నమ్మేవాడు కాదు గౌరవ్. కానీ టెక్సాస్లో పైలట్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు అతణ్ని మొదటిసారి దెయ్యం అన్న మాట వణికించింది. లేదా దెయ్యాన్ని చూసిన అనుభవం కలిగింది. ఆ రోజుల్లో నలుగురు ఫ్రెండ్స్తో కలిసి ఓ ఫ్లాట్లో ఉండేవాడు గౌరవ్. అక్కడ అతనికి విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి. ఏవో ఆకారాలు కన్పించేవి. ఏవేవో శబ్దాలు వినిపించేవి. నవ్వులు, అరుపులు, ఏడుపులు... ఒక్క క్షణం ప్రశాంతత ఉండేది కాదు. చివరికి ఆ ఫ్లాట్ను ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే దెయ్యం అన్న దానిపై ఆసక్తి మొదలైంది గౌరవ్కి. పైలట్ కోర్సుతో పాటుగానే ‘పారానెక్సస్ అసోసియేషన్ ఆఫ్ ఫ్లారిడా’లో ‘పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ కోర్సు’ పూర్తి చేశాడు. రెండు లెసైన్సులూ పట్టుకుని ఇండియాకు వచ్చాడు. పారానార్మల్ సొసైటీని స్థాపించి దెయ్యాల వేట మొదలెట్టాడు. చూస్తూండగానే ఫేమస్ ఘోస్ట్ హంటర్ అయ్యాడు. దేశ విదేశాల్లో ఉన్న ఎన్నో దెయ్యాలను అతను వేటాడాడు. కానీ చివరికి అతనినే ఒకరు వేటాడారు. అతని ఉసురు తీశారు. కానీ అది మనిషా? దెయ్యమా? అదే ఇప్పుడు పెద్ద మిస్టరీ. ఎలా చనిపోయాడు... జూలై 7, 2016. ఢిల్లీలోని ద్వారక. ఉదయం పది గంటలు కావస్తోంది. గౌరవ్ తివారీ గది తలుపు మూసి ఉంది. కాఫీ తీసుకొచ్చిన భార్య సున్నితంగా తలుపు తోసింది. తెరచుకోలేదు. చిన్నగా తట్టింది. లోపలి నుంచి అలికిడి లేదు. దబదబా బాదింది. అయినా తెరవలేదు. తలుపు తెరవమంటూ అరిచింది. అతను పలకలేదు. దాంతో కంగారుపడి అత్తమావల్ని పిలిచింది. వాళ్లు కూడా ప్రయత్నించారు. కానీ ఫలితం లేదు. దాంతో బల వంతంగా తలుపు తెరిచారు. లోపలికి వెళ్లి చూస్తే అటాచ్డ్ బాత్రూమ్లో నేలమీద పడివున్నాడు గౌరవ్. ఉలుకూ పలుకూ లేదు. వెంటనే అతణ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఉపయోగం లేకపోయింది. అతని ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఆ క్షణం అతని జీవితం అంతమైపోయింది. కానీ ఓ కొత్త మిస్టరీకి తెర లేచింది. గౌరవ్ మెడ చుట్టూ తాడుతో బిగించినట్టుగా నల్లని గీత ఒకటుంది. అంటే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడు అన్నారు పోలీసులు. ఊపిరాడకే చనిపోయాడని పోస్ట్మార్టం రిపోర్టు కూడా తేల్చడంతో అతనిది సూసైడ్ అని డిసైడైపోయారంతా. గౌరవ్ భార్య నోరు తెరవకపోయి ఉంటే అందరూ అదే నిజం అనుకునేవారు. కానీ ఆమె చెప్పింది విన్న తర్వాత కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి. ఇంతకీ ఆమె ఏం చెప్పింది? వెంటాడుతున్న ఆత్మ... ‘నా భర్త గౌరవ్ని ఓ ఆత్మ వెంటాడుతోంది’ అని చెప్పిందామె. ‘ఆ సంగతి నాతో తరచూ చెప్పేవాడు. అది తనను ఎప్పుడో ఒకప్పుడు తన అధీనంలోకి తీసేసుకుంటుందని గౌరవ్ భయపడ్డాడు. కొన్నాళ్లుగా ఆ విషయాన్ని తరచూ చెబుతున్నాడు కానీ పని ఒత్తిడిలో ఏదో అలా మాట్లాడుతున్నాడు అనుకుని పట్టించుకోలేదు’ అందామె. గౌరవ్ తండ్రి కూడా అది నిజమే కావచ్చు అంటున్నారు. గౌరవ్ అభిమానులు కూడా అలాగే జరిగిందేమో అని అనుమానపడుతున్నారు. అందరూ చెప్తున్నదాన్ని బట్టి ఆత్మహత్య చేసుకునేంత సమస్యలు, బాధలు గౌరవ్కి లేవు. పైగా అయిదు నెలల క్రితమే పెళ్లయ్యింది. మరి ఎందుకు ప్రాణం తీసుకుంటాడు? ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నా తాడుకి వేళ్లాడుతూ ఉండాలి. కానీ అతడు నేలమీద పడివున్నాడు. కనీసం అతడు ఉరి వేసుకున్న తాడు కూడా అక్కడ లేదు. అంటే గౌరవ్ని దెయ్యం చంపిందా? అది సాధ్యమేనా? దేవుడు, దెయ్యాలు లేవనే నాస్తికులు ఈ సంగతి విని నవ్వి ఊరుకున్నారు. కానీ దెయాల్ని నమ్మేవారు, వాటి ఉనికిని రుచి చూసినవాళ్లు మాత్రం భయంతో వణుకుతున్నారు. దెయ్యాల్ని వేటాడేవాడు ఆ దెయ్యాలకే బలైపోయాడా అంటూ వాపోతున్నారు. నిజమా? గౌరవ్ని దెయ్యాలే చంపేశాయా? ప్రస్తుతం అతను ఢిల్లీలోని జానకీపుర ప్రాంతంలో సంచరిస్తోన్న ఓ మహిళ ఆత్మ గురించి పరిశోధిస్తున్నాడని తెలిసింది. దానికీ అతని చావుకీ ఏదైనా సంబంధం ఉందా? గౌరవ్ని వెంటాడుతోంది ఆ ఆత్మేనా? ఆ ఆడదెయ్యమే అతణ్ని వేటా డిందా? అంటే పోలీసులు దెయ్యాన్ని అరెస్ట్ చేయాలా? దెయ్యాల్ని వేటాడేదెలా? అతీంద్రియ శక్తుల ఉనికిని పారానార్మల్ యాక్టివిటీ అంటారు. వాటిని కనిపెట్టేవాళ్లని పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్, ఘోస్ట్ బస్టర్స్, ఘోస్ట్ హంటర్స్ అంటారు. ఘోస్ట్ హంటింగ్ అన్న మాట మన దేశంలో తక్కువే వినిపిస్తుంది కానీ, విదేశాల్లో... ముఖ్యంగా అమెరికాలో ఇది చాలా ఎక్కువ. దెయ్యాలు ఉన్నాయి అని అనుమానం వచ్చిన ప్రదేశాల్లో పరిశోధనలు జరపడం, దెయ్యాల ఉనికిని కనిపెట్టడమే ఘోస్ట్ హంటింగ్. ఎలక్ట్రో మ్యాగ్నటిక్ రేడియేషన్ డిటెక్టర్ (దీన్ని ఈఎంఫ్ మీటర్ అని కూడా అంటారు), డిజిటల్ థర్మోమీటర్, డిజిటల్ వీడియో కెమెరాలు, డిజిటల్ ఆడియో రికార్డర్, కంప్యూటర్ తదితర పరికరాలను ఉపయోగించి శబ్దాలను, దృశ్యాలను రికార్డు చేస్తారు. తద్వారా అక్కడ దెయ్యం ఉందో లేదో కనిపెడతారు. కొందరు వాటిని వెళ్లగొడతారు కూడా. అమెరికాకు చెందిన ఎడ్, లారెన్ దంపతులను ప్రపంచంలోనే నంబర్వన్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అని చెబుతారు. వీరి పరిశోధనల ఆధారంగానే ఆనబెల్లె, కన్జ్యూరింగ్, పారానార్మల్ యాక్టివిటీ, పోల్టర్గైస్ట్ లాంటి సూపర్హిట్ సినిమాలు వచ్చాయి. మన దేశపు తొలి ప్రఖ్యాత ఘోస్ట్ హంటర్ కావడం వల్ల గౌరవ్ తివారీని ఎడ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తుంటారు. పదహారేళ్ల వయసులో నటుడిగా కెరీర్ను ప్రారంభించాడు గౌరవ్ తివారీ. టాంగో చార్లీ, 16 డిసెంబర్ చిత్రాల్లో నటించాడు. తర్వాత పైలట్ కోర్సు చేయడానికి అమెరికా వెళ్లిపోయాడు. గౌరవ్ కేవలం ఘోస్ట్ హంటరే కాదు... రెవరెండ్, స్పిరిచ్యువల్ కౌన్సెలర్, హిప్నటిస్ట్, లైఫ్ అండ్ రిలేషన్షిప్ కోచ్ కూడా. అయితే ఘోస్ట్ హంటర్గానే ఎక్కువ పాపులర్ అయ్యాడు. ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, సింగపూర్, యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ తదితర దేశాల్లో గౌరవ్ ఘోస్ట్ హంటింగ్స్ చేశాడు. గౌరవ్ హంటింగ్స్ ఆధారంగా పలు టీవీ షోలు రూపొందాయి. వాటిలో ‘ఎమ్టీవీ గాళ్స్ నైటవుట్’ ఒకటి. ఇది మన దేశంలో తొలి హారర్ రియాలిటీ షో. ఇది ఏషియన్ టెలివిజన్ అవార్డును గెల్చుకుంది. అలాగే హాంటెడ్ వీకెండ్స్ విత్ సన్నీ లియోన్, ఫియర్ ఫైల్స్, భూత్ ఆయా షోలు కూడా సక్సెస్ అయ్యాయి. వీటిలో కొన్నింటిలో గౌరవ్ కూడా కనిపించాడు. దెయ్యమై వచ్చింది! ఇరవై రోజుల శెలవు తర్వాత ఆఫీసులో అడుగు పెట్టింది సీమ (పేరు మార్చాం). ఆమెను అందరూ సంతోషంగా పలకరించారు. పరామర్శల తర్వాత పనిలో పడిపోయింది సీమ. సాయంత్రం ఇంటికి బయలుదేరేటప్పుడు ‘చాలా రోజులయ్యింది కదా... ఈరోజు నాతో నా రూమ్కి రావే’ అంది సీమ ఫ్రెండ్ కాజల్. ‘దానికేం... పద పోదాం’ అది సీమ. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కాజల్ రూమ్కి వెళ్లారు. సరదాగా గడిపారు. రాత్రి పది అవుతుండగా సీమ వెళ్లిపోయింది. కాజల్ పడక మీదకు చేరింది. మరుసటి రోజు ఉదయం ఆఫీసుకు బయల్దేరి ఆటో కోసం ఎదురుచూస్తోన్న కాజల్కు సీమ వాళ్ల అక్క కనిపించింది. సంతోషంగా వెళ్లి పలకరించింది. ముందు రోజు తాను, సీమ కలిసి గడిపినట్టు చెప్పింది. అది విని సీమ అక్క షాకైపోయింది. ‘సీమ యాక్సిడెంట్లో చనిపోయి పదిహేను రోజులవుతోంది. తను నీ దగ్గరకు రావడమేంటి’ అంది. అంతే... కాజల్ పై ప్రాణాలు పైనే పోయాయి. ఇది ఢిల్లీలో జరిగిన ఓ వాస్తవ ఘటన. గౌరవ్ డీల్ చేసిన కేసుల్లో ఇదొకటి. మరణించిన సీమ మళ్లీ ఎలా వచ్చిందో అర్థం కాక ఈ విషయాన్ని గౌరవ్ దృష్టికి తీసుకెళ్లారు. సీమ ఆత్మే అలా వచ్చిందని తేల్చాడు గౌరవ్. విచిత్రం ఏమిటంటే ఆ తర్వాత మళ్లీ ఆ ఆత్మ కనిపించలేదు. ఇంటి గొడవలే కారణమా? గౌరవ్ మృతి వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి. మొదట గౌరవ్ మృతదేహం బాత్రూమ్లో నేలమీద పడివుంది అన్నారు. తర్వాతేమో బట్టలు హ్యాంగ్ చేసుకునే రాడ్కి ఓ క్లాత్తో ఉరి వేసుకున్నాడు అన్నారు. వీటిలో ఏది నిజం, ఏది కాదు అన్నది ఓ పెద్ద సందేహం. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే అందుకు కారణం ఏముంటుంది అన్నది మరో పెద్ద సందేహం. పోలీసులు మాత్రం ఇంటి గొడవలే కారణమై ఉండొచ్చు అంటున్నారు. గౌరవ్ ప్రొఫెషన్ కారణంగా అతని ఇంట్లో గొడవలు జరుగుతున్నాయట. దెయ్యాలు, భూతాలు అంటూ తిరగడం, అర్ధరాత్రిళ్లు ఇంటికి రావడం, సంపాదన సరిగ్గా లేకపోవడం వంటి విషయాలపై అటు భార్య, ఇటు తండ్రి కూడా అతనిని తప్పు పట్టి నిందిస్తున్నట్లు పనివాళ్లు, కొందరు దగ్గరివాళ్ల ద్వారా తెలిసిందని పోలీసులు అంటున్నారు. మరి నిజం ఎప్పటికి నిర్ధారణ అవుతుందో! -
ప్రముఖ హిప్నాటిస్ట్ అనుమానాస్పద మరణం
న్యూఢిల్లీ: ప్రసిద్ధ పారానార్మల్ పరిశోధకుడు, హిప్నాటిస్ట్ గౌరవ్ తివారీ (32 )అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఢిల్లీలోని తన ఫ్లాట్ లో అనుమానాస్పద పరిస్థితుల్లో గత గురువారం చనిపోయారు. భారత పారానార్మల్ సొసైటీ వ్యవస్థాపక సీఈవో తివారీ ద్వారక ప్రాంతంలో తన ఫ్లాట్ లోని బాత్రూమ్ లో శవమై కనిపించారు. బాత్రూమ్ నుంచి దబ్ మన్న శబ్దం బిగ్గరగా వినిపించడంతో కుటుంబ సభ్యులు ఎలర్ట్ అయ్యారు. బలవంతంగా తలుపు తెరిచి అపస్మారక స్థితిలో ఉన్న అతణ్ని ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే గౌరవ్ చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ ఏడాది జనవరిలో వివాహం అయిన గౌరవ్ తల్లిదండ్రులు, భార్యతో కలిసి నివసిస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకునేంత పెద్ద సమస్యలేవీ లేవని తెలుస్తోంది. ప్రాథమిక పోస్ట్ మార్టం నివేదికలో మెడ చుట్టూ నల్ల లైన్ ఉండడంతో , ఊపిరి ఆడక చనిపోయి వుంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఒక ప్రతికూల శక్తి తన వైపు లాక్కుంటోందని గౌరవ్ తివారి ఒక నెల క్రితం భార్యతో చెప్పినట్టు తెలుస్తోంది. ఎంత ప్రయత్నించినా... అదుపు చేయడం కష్టంగా ఉందని భార్య దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పనిలో ఒత్తిడికారణంగా అలా అలోచిస్తున్నారని తాను పెద్దగా పట్టించుకోలేదని పోలీసులకు తెలిపింది. పారానార్మల్ (విపరీత మానసిక ప్రవర్తన గల) సమాజం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2009 లో ఏర్పాటు పారానార్మల్ సొసైటీని స్థాపించి తన సేవలను అందిస్తున్నారు. విపరీత మానసిక ప్రవర్తన గల దాదాపు6000 ప్రదేశాలను సందర్శించి.. దర్యాప్తు చేపట్టారు. ఇంతలో ఆయన మరణం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల విచారణ కొనసాగుతోంది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
పకడ్బందీగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
పనులు వేగంగా చేయిస్తున్నాం: కలెక్టర్
ఆత్మ ఘోష..!
స్ట్రాంగ్రూమ్ల వద్ద మూడంచెల భద్రత
ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీ సీట్లు గెలుస్తాం
దేవుడి భూమిని క్రీడా మైదానంగా మార్చే యత్నం
రామన్పాడులో 1,010 అడుగులు
వెళ్దామంటే దారులు లేవు
ప్రైవేట్ క్లినిక్లలో తనిఖీలు
తప్పక చదవండి
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- జీ ఎంటర్టైన్మెంట్ లాభం రూ. 13 కోట్లు
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- Delhi Chief Minister Arvind Kejriwal: భారత్లో ‘రష్యా’ పరిస్థితులు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం మార్కెట్ ఆధునీకరణ
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
Advertisement