breaking news
Garuda Purana
-
‘శివాజీ వెనుక చంద్రబాబు హస్తం’
సాక్షి, అమరావతి: గరుడు పురాణం సృష్టికర్త శివాజీ వెనుక చంద్రబాబు హస్తం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఇద్దరూ కలిసి తమ పార్టీపై, రాష్ట్రంపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన కన్నా.. ఆంధ్రప్రదేశ్లో బీజేపీని అణవేసేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని కేంద్రంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు వీలుకాదని.. హోదాకు సమానమైన ఆర్థిక సాయం కేంద్రం ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక ప్యాకేజికి చంద్రబాబు అంగీకరించి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సన్మానం కూడా చేశారని గుర్తు చేశారు. ఎన్నికల్లో లబ్ధిపొందేదుకే బీజేపీపై ఆరోపణలు చేశారని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో తమకు పూర్తి బలం ఉందని, అక్రమ పొత్తుతో అధికారంలోకి వచ్చారు కనుకే కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలిందని అభిప్రాయపడ్డారు. ఏపీలోనే కాక.. దేశమంతా బీజేపీపైపు చూస్తోందని, యువత పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. -
గరుడ పురాణంలో ఏముంటుంది?
గరుడపురాణం అనేది మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. మరణానంతర జీవితంపై గరుత్మంతుడికి తలెత్తిన పలు సందేహాలకు శ్రీ మహావిష్ణువు వివరంగా సమాధానాలు చెప్పాడు. అదే గరుడ పురాణం. దీనిని చదవడం వల్ల మనిషి తన జీవితాన్ని మంచిమార్గంలోకి మలచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇందులో స్వర్గం అంటే ఏమిటి, నరకమంటే ఏమిటి, ఏ పాపం చేసిన వారు నరకానికి పోతారు, ఏ పుణ్యకార్యం చేసిన వారికి స్వర్గార్హత లభిస్తుంది, వైతరణి అంటే ఏమిటి, వైతరణకి ఎవరు పోతారు? నరక బాధలు తప్పించు కోవాలంటే ఏం చేయాలి... వంటి అనేక సందేహాలకు విష్ణుమూర్తి గరుడునికి సమాధానాలు చెప్పాడు.. ఎవరైనా మరణించినప్పుడు పురోహితుడు లేదా ఎవరైనా పెద్దవాళ్లు గరుడ పురాణాన్ని పారాయణ చేస్తారు. అయితే ఎందువల్లో ఏమో, గరుడపురాణం అంటే కేవలం ఎవరైనా పోయినప్పుడు మాత్రమే చదువుకునేది అనే ఒక అపప్రధ ఉంది. మనిషి మనిషిగా బతకడానికి చదవవలసిన గ్రంథం కాబట్టి దీనిని ఎప్పుడైనా చదవవచ్చునని కొందరు ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. అయితే, మనసు బలహీనంగా ఉన్నవారు మాత్రం ఇది చదవకపోవడమే మంచిదని మరికొందరు చెబుతారు. -
గరుడ పురాణంలో ఏముంటుంది?
గరుడ పురాణాన్ని వేదవ్యాసుడు రచించాడు. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతునికి ఒకసారి మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు? ఆ జీవుడికి ఏయే గతులు కలుగుతాయి... తదితర సందేహాలు కలిగాయట. వాటన్నింటికీ విష్ణువే సమాధానాలు చెప్పి, గరుడుని సందేహ నివృత్తి చేశాడట. గరుడుని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణం అని పేరొచ్చింది. దీనిలో ప్రధానంగా రెండు భాగాలుంటాయి. ఒకటి... పూర్వఖండం, రెండు... ఉత్తర ఖండం. పూర్వఖండంలో బ్రహ్మాదుల ఆవిర్భావం, రాజుల కథలు, వ్యాకరణం, ఛందస్సు, యుగధర్మాలు, విష్ణువు దశావతారాలు వంటివి ఉన్నాయి. ఉత్తర ఖండంలోని ప్రథమాధ్యాయంలో ప్రేతకల్పం అనే భాగం ఉంది. అందులో మరణానంతరం జీవుడు ఏం చేస్తాడు... వంటి విషయాలుంటాయి. ఇంటిలో ఎవరైనా గతించినప్పుడు పఠించేది ఈ అధ్యాయాన్నే! ద్వితీయాధ్యాయాన్ని ఎవరైనా, ఎప్పుడైనా చదువుకోవచ్చు. ప్రతిమనిషికి భయం ఉండాలి. అది దైవభీతి కావచ్చు, పాపభీతి కావచ్చు... ఏదైనా. ఆ భయం లేకుంటే మనిషికి, మృగానికి భేదం లేకుండా పోతుంది. అందుకే ఋషులు ఎంతో ముందుచూపుతో పురాణాలను రచించి మానవజాతికి అందించారు. ఈ పురాణాలన్నింటిలోనూ అది చేస్తే పాపం, ఇది చేస్తే పాపం అని భయపెడుతున్నట్లే ఉంటుంది. దాంతో వాటిని పక్కన పడేస్తాం. వాస్తవానికి మనిషిని సద్వర్తనలోకి నడిపించాలంటే భయం కూడా అవసరమే. అందుకే మన పెద్దలు అంతగా భయపెట్టారు. గరుడ పురాణంలో అన్నీ ఇలాంటి విషయాలే ఉంటాయి. మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఇవిచేయకూడదా..? కొన్ని విషయాలను పాపాలని గరుడపురాణం చెబుతోంది. అవి... బ్రహ్మహత్య, శిశుహత్య, గో హత్య, స్త్రీ హత్యలతోబాటు గర్భపాతం చేసేవారు, రహస్యంగా పాపపు పని చేసేవారు, గురువులు, పండితులు, దేవతలు, స్త్రీ, శిశు ధనం హరించేవారు కూడా నరకంలో శిక్షలను అనుభవించక తప్పదంటుంది. అలాగే అప్పు తీర్చనివారు, పర ద్రవ్యాన్ని అపహరించేవారు, విశ్వాస ఘాతకులు, ఇతరులను హత్యచేసే వారు, దోషులను పొగిడేవారు, మంచివారిని నిందించేవారు, ఋణగ్రస్థులను ఎగతాళి చేసేవారు, సత్పురుషులతో స్నేహం చేయనివారు కూడా పాపులేనట. పుణ్యతీర్థాలను, సజ్జనులను, సత్కర్ములను, గురువులను, దేవతలను నిందించేవారు యమలోకంలో దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుందట. పురాణాలను, వేదాలను, మీమాంస, న్యాయశాస్త్రాలను, వేదాంత శాస్త్రాలను దూషించేవారు, ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు, ఎదుటివారు దుఃఖిస్తుంటే ఆనందించేవారు, చెడుమాటలు పలికేవారు కూడా దుర్గతుల పాలు కాక తప్పదు. పెద్దల హితోపదేశాన్ని వినని వారు, ఆత్మస్తుతి, పరనింద చేసేవారు, అధర్మ మార్గంలో నడిచేవారు ఒకరకానికి చెందిన వారైతే ఇంకా నీచమైన పనులు చేసేవారు మరికొందరున్నారు. అంటే... తల్లిదండ్రులను, గురువును, ఆచార్యులను అవమానించేవారు, భార్యను అకారణంగా ద్వేషించి విడిచిపెట్టేవారు, ఏదైనా ఇస్తానని మాట తప్పినవారు, ఇచ్చినదానిని తిరిగి తీసుకునేవారు, దానం ఇచ్చి, బాధపడేవారు వైతరణిని దాటక తప్పదు. దానం చేసేవారిని ఇవ్వవద్దని ఆపేవారు, యజ్ఞవిధ్వంసకులు, హరికథకులకు విఘ్నం కలిగించేవారు, పరుల భూముల సరిహద్దులను చెరిపి భూమిని ఆక్రమించేవారు, పశువులకి మేత లేకుండా చేసేవారు, పశుహత్య చేసేవారు... యమలోకంలో దక్షిణమార్గాన ఉన్న వైతరణిలో కూలబడవలసిందేనట. యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములను వైతరణిలో తోసి వేస్తారట. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, వంచన చేసి ధనం సంపాదించేవారు, దొంగతనం చేసేవారు, పచ్చని చెట్టను నరికేవారు, ఫలవృక్షాలను పూలతోటలను ధ్వంసం చేసేవారు, తీర్థయాత్రలను చేసేవారికి ఆటంకం కలిగించేవారు, వితంతువులను మోసం చేసి మానహరణ చేసేవారు వైతరణిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరుగచెట్టుకు కట్టబడి యమభటుల చేతి దెబ్బలు తింటూ ఉంటారని గరుడపురాణం చెప్తుంది. అంటే గరుడపురాణం మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. దీనిని చదవడం వల్ల మనిషి తన జీవితాన్ని మంచిమార్గంలోకి మలచుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే... బలహీన మనస్కులు దీనిని చదవడం వల్ల చలించి పోతారని, అందువల్ల ఎప్పుడైనా మృతి సంభవించిన సమయంలో మాత్రమే గరుడపురాణాన్ని చదవాలని పెద్దలు చెప్పారు. కానీ, గరుడపురాణం ఇంటిలో ఉండటం కూడా మంచిది కాదని జరిగే ప్రచారాలలో ఏమాత్రం యథార్థం లేదని పండితులు చెబుతున్నారు. - డి.వి.ఆర్. భాస్కర్