-
11వేల కార్మికులపై కేసులు నమోదు.. 150 ఫ్యాక్టరీలు మూసివేత
బంగ్లాదేశ్లో వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు తమ వేతనాలు పెంచాలని నిరసన తెలుపుతున్నారు. దేశవ్యాప్తంగా గత రెండు వారాలుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. గార్మెంట్ ఇండస్ట్రీలోని దాదాపు 40లక్షల మంది కార్మికులు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రోడెక్కారు. దాంతో అక్కడ హింసాత్మక వాతావరణం నెలకొంది. ఫలితంగా నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన తీవ్ర ఘర్షణల వల్ల ముగ్గురు కార్మికులు మరణించినట్లు సమాచారం. అక్కడి పరిస్థితులను నియంత్రించేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారని కార్మిక సంఘాలు ఆరోపించాయి. నిరసనకు పాల్పడిన 11,000 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి వివిధ సెక్షన్లకింద కేసులు నమోదు చేశారు. దాంతో దేశంలోని 150 ఫ్యాక్టరీలు నిరవధికంగా మూసివేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. కార్మికుల సమస్యలు ఇవే.. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో గార్మెంట్ పరిశ్రమ పాత్ర కీలకం. ఇది దేశం మొత్తం ఎగుమతుల్లో 84% వాటాను కలిగి ఉంది. కరోనా సమయంలో దుస్తుల డిమాండ్ మందగించింది. దానివల్ల దేశంలో 2020లో దాదాపు 17% వస్త్ర ఎగుమతులు తగ్గాయి. ముడిచమురు ధరలు పెరగడంతో బంగ్లాదేశ్ ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సవాళ్లతో పాటు ప్రధానంగా అక్కడి కార్మికులకు అరకొర జీతాలిచ్చి సరిపెడుతున్నారు. నెలకు కనీస వేతనం కింద రూ.9458(12,500 టాకాలు) చెల్లిస్తున్నారు. అయితే దాన్ని రూ.17400(23,000 టాకాలు)కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అక్కడి పనిప్రదేశాల్లో సరైన వెంటిలేషన్ లేకపోవడంతో పరిశ్రమల్లోని విషపూరిత వాయువులను పీల్చి చాలామంది కార్మికులు వివిధ వ్యాధుల బారినపడుతున్నట్లు కార్మికసంఘాలు తెలిపాయి. అక్కడి కార్మికుల్లో మహిళలు ఎక్కువగా పనిచేస్తుంటారు. కానీ వారికి సరైన మౌలికవసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఏదో ఒక పరిశ్రమలో మహిళలు లైంగికహింసకు గురవుతున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఇకపై అరచేతిలో సమాచారం.. ఏఐ పిన్ ఎలా పనిచేస్తుందంటే.. బంగ్లాదేశ్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పద్దెనిమిది గ్లోబల్ కంపెనీలు అక్కడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రధానికి లేఖ రాశాయి. వారి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి కొత్త కనీస వేతనం నిర్ణయించాలని కోరాయి. హెచ్ అండ్ ఎం, లెవీస్, గ్యాప్, పూమా.. వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు అక్కడ పరిశ్రమలు నెలకొల్పాయి. -
AP: బిర్లాతో ఉపాధికి ఊతం
ప్రగతి పతాకాలతో రెపరెపలాడుతున్న పులివెందుల సొంత గడ్డను, వైఎస్సార్ జగనన్న హౌసింగ్ లే అవుట్ను హెలికాప్టర్లో ప్రయాణిస్తూ చూస్తుంటే గర్వంగా ఉంది. నామీద మీకున్న అభిమానం, ప్రేమ, మమకారం, ఆప్యాయతల మధ్య ఈ రోజు వైఎస్సార్ జిల్లా పులివెందులలో 7,309 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. పక్కనే బ్రాహ్మణపల్లెలో మరో 733 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మొదట్లోనే (గత క్రిస్మస్ రోజున) అందరితోపాటు చేద్దామనుకున్నాం. కానీ రకరకాల కోర్టు కేసులు, గిట్టని వారు రకరకాల ఇబ్బందులు పెట్టిన పరిస్థితుల్లో ఆ చిక్కుముడులన్నింటినీ విప్పుకుని ఈ క్రిస్మస్ సందర్భంగా మొత్తం 8,042 మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో ఈ ఆస్తిని పెడుతున్నాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, కడప/ పులివెందుల/టౌన్/రూరల్: బిర్లా పరిశ్రమ రాకతో వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఆయన పులివెందులలోని సంయు గ్లాస్ ఫ్యాక్టరీ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదిత్య బిర్లా గ్రూపు వస్త్ర ఉత్పత్తి కేంద్రం పులివెందులలో ఏర్పాటు చేయడం చరిత్రాత్మకమని, సంతోషదాయకమని అన్నారు. ప్రపంచంలోనే 500 పెద్ద కంపెనీల్లో ఆదిత్య బిర్లా కంపెనీ ఒకటి అని తెలిపారు. ఈ కంపెనీలో 85 శాతం మంది మహిళలకే ప్రాధాన్యత ఇస్తూ సుమారు 2 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. ఈ కంపెనీకి దేశ వ్యాప్తంగా 3031 ఫ్యాషన్ రిటైల్ స్టోర్స్ ఉన్నాయని, 25 వేల మల్టీ బ్రాండ్స్ దుకాణాలు, 6,500 డిపార్ట్మెంట్స్ స్టోర్స్ను నడుపుతోందన్నారు. వ్యాన్ హ్యుసేన్, అలెన్ సోలీ వంటి పెద్ద, పెద్ద బ్రాండ్లను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తూ.. 2020–21లో రూ.8,700 కోట్ల టర్నోవర్తో ముందుకు సాగిందని చెప్పారు. మా సహకారం ఎప్పుడూ ఉంటుంది పులివెందులలో రూ.110 కోట్ల పెట్టుబడితో 2112 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నందుకు కుమార మంగళం బిర్లా, అశిష్, చీఫ్ సప్లయ్ ఆఫీసర్ స్వామినాథన్, కార్పొరేట్ ఎఫైర్స్ హెడ్ వివేక్, అతని బృంద సభ్యులకు సీఎం వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. ‘ఇక్కడికి సమీపంలో పెద్ద హౌసింగ్ కాలనీ రాబోతోంది. 7400 ఇళ్లు నిర్మించబోతున్నాం. దాదాపు 25 వేల మంది ప్రజలు ఇక్కడ నివసించబోతున్నారు. ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయి. ప్రభుత్వమే స్కిల్ డెవలప్మెంట్ కళాశాలలు నిర్మిస్తోంది. ఇది మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. దీని సహాయంతో మీరు మా వాళ్లకు శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. వీటన్నింటితో పాటు నేను కూడా అందుబాటులో ఉంటాను. భవిష్యత్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించడానికి, సత్సంబంధాలు నెలకొల్పే దిశగా ఇరువైపులా ఇది ఉపయోగపడుతుంది’ అని అన్నారు. అనంతరం ఆయన ఆదిత్య బిర్లా కంపెనీ ప్రతినిధులకు భూమి కేటాయింపు పత్రాలు అందజేశారు. వారు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్ర పటాన్ని సీఎం వైఎస్ జగన్కు అందించారు. ఆ తర్వాత ఆదిత్య బిర్లా ఎండీ ఆశిష్ దీక్షిత్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం తమకు అన్ని విధాలా సహకరిస్తోందని చెప్పారు. త్వరలోనే పరిశ్రమను నెలకొల్పి ఎక్కువ శాతం మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో నాగలితో సీఎం జగన్ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం సీఎం వైఎస్ జగన్ శుక్రవారం పులివెందుల వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.10.50 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. చీనీ రైతుల సౌకర్యార్థం రూ.4 కోట్ల 79 లక్షలతో నిర్మించిన షెడ్డును ప్రారంభించారు. ఆర్అండ్బీ బంగ్లా ఎదురుగా రూ.3.64 కోట్లతో నిర్మించిన మోడల్ పోలీస్స్టేషన్ను ప్రారంభించారు. పెద్దముడియం, శ్రీ అవధూత కాశినాయన మండలాల్లో పోలీసుస్టేషన్లను ఇక్కడి నుంచే ప్రారంభించారు. అంబకపల్లె రోడ్డులోని రాణితోపు పార్కు ఎదురుగా రూ.2.60 కోట్లతో నిర్మించిన ఫిష్ ఆంధ్ర అక్వా హబ్ను ప్రారంభించారు. నియోజకవర్గంలో 100కు పైగా ఫిష్ కియోస్క్లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం చెప్పారు. రీటైల్ షాపులు త్వరలోనే అన్నిచోట్ల రాబోతున్నాయన్నారు. రాష్ట్రంలో 70 ఆక్వా హబ్లు, 14 వేల రీటైల్ షాపులు పెడుతున్నామన్నారు. దీనివల్ల చేపలు, రొయ్యలు పండించే రైతులకు మంచి ధర వస్తుందని చెప్పారు. మోడల్ పోలీస్స్టేషన్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంతింటి కల నెరవేర్చడం ఆనందంగా ఉంది పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. పులివెందుల సమీపంలోని మెగా టౌన్షిప్ లే అవుట్ కాలనీలో 8,042 మంది మహిళలకు ఇంటి పట్టాలు, ఇల్లు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► హెలికాప్టర్లో వస్తున్నప్పుడు 323 ఎకరాల్లో ఉన్న ఈ కాలనీ మొత్తం చూశాను. ఇంత మందికి ఇక్కడ ఇళ్లు కట్టించే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ఒక్కో ఇంటి పట్టా విలువ రూ.2 లక్షలు.. ఇల్లు కట్టడానికి మరో రూ.2 లక్షలు.. ఆ తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఏడు వార్డు సచివాలయాలు, రెండు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఏడు ప్రాథమిక పాఠశాలలు, 15 ఎకరాల్లో మంచి పార్కులు, ఒక పోలీసుస్టేషన్, ఒక పోస్టాఫీసు, 10 ఎకరాల్లో మంచి ఆటస్థలం.. ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు అవుతున్నాయి. ► రూ.28 కోట్లతో నీటి సరఫరా, రూ.49 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రూ.69 కోట్లతో రోడ్ల నిర్మాణం మొత్తం కలిపి రూ.147 కోట్లు ఇక్కడ ఖర్చు చేస్తున్నాం. ఇందులో ఇంటికి సగటున మరో రూ.2 లక్షలు ఖర్చుపెడుతున్నాం. మొత్తంగా రూ.6 లక్షలు. ఇవన్నీ పూర్తయ్యాక ఇక్కడ ఇంటి విలువ కనీసం రూ.10 లక్షలు ఉంటుంది. ఈ మొత్తాన్ని అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టినట్లవుతుంది. మెగా టౌన్షిప్ లే అవుట్ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో సీఎం జగన్ ఈ పక్కనే ఇండస్ట్రియల్ పార్క్ ఈ కాలనీ పక్కనే ఇండస్ట్రియల్ పార్కు రాబోతోంది. అపాచీ అంటే అడియాస్ షూ తయారు చేసే కంపెనీని తీసుకువచ్చాం. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. అక్కడ దాదాపు 2 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరకుతాయి. ఆదిత్య బిర్లా కంపెనీ కూడా ఇక్కడే వస్తుంది. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక ఈ కంపెనీలకు నడుచుకుంటూ వెళ్లి ఉద్యోగాలు చేసుకోవచ్చు. నెలకు కనీసంగా రూ.10 వేలో, రూ.15 వేలో సంపాదించొచ్చు. మంచి జీతాలతో ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. ఫిష్ ఆంధ్ర ఆక్వా హబ్లో ఉత్పత్తులను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్ శరవేగంగా అభివృద్ధి పనులు ► పులివెందులలో రూ.500 కోట్లతో చేపట్టిన వైఎస్సార్ ప్రభుత్వ వైద్య కళాశాల పనులు వేగంగా సాగుతున్నాయి. 500 పడకల ఈ మెడికల్ కాలేజీ 2023 డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుంది. ► నూతన బస్సు డిపో, బస్సు స్టేషన్ నిర్మాణ పనులు, శిల్పారామం ఆధునీకరణ పనులు, పులివెందుల క్రీడా మైదానం (ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్) పనులు, ఉలిమెల్ల సరస్సు అభివృద్ధి పనులు, పులివెందుల యూజీబీ నిర్మాణ పనులు, సమగ్ర నీటి సరఫరా పథకం పనులు గడువులోగా పూర్తి చేస్తాం. ► ఇడుపులపాయ పర్యాటక సర్క్యూట్, వైఎస్సార్ మెమోరియల్ గార్డెన్ అభివృద్ధి పనులు, గండి వీరాంజనేయస్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు, వివిధ కళాశాలల్లో, పాఠశాలల్లో నిర్మాణ పనులు గడువులోగా పూర్తవుతాయి. ► రూ.480 కోట్లతో పులివెందుల నియోజకవర్గంలో వాటర్ గ్రిడ్ పనులు 2022 జూన్ నాటికి, రూ.5,036 కోట్లతో పులివెందుల, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లోని ఆయకట్టును స్థిరీకరించేందుకు చేపట్టిన జీఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ నుండి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకు నీటి ఎత్తిపోతల పథకం పనులు 2023 జూన్ నాటికి పూర్తవుతాయి. ► రూ.1,100 కోట్లతో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి ఎర్రబల్లి చెరువుకు నీటిని నింపడం ద్వారా వేంపల్లె మండలంలోని యురేనియం ప్రభావిత ఏడు గ్రామాలకు నీటి సరఫరా నిమిత్తం చేపట్టిన ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు 2022 డిసెంబరు నాటికి పూర్తవుతాయి. ► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు ఎస్బీ అంజద్బాష, ధర్మాన కృష్ణదాస్, మంత్రులు ఆదిమూలపు సురేష్, రంగనాథరాజు, సీదిరి అప్పలరాజు, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నన్ను గుండెల్లో పెట్టుకున్నారు సభ ప్రారంభంలో వైఎస్ జగన్.. చేతిలో ఉన్న మైకును చేతితో కొడుతూ.. ‘ఇలా పులివెందులలో కొట్టడం ద్వారా వచ్చే ఆనందం మరెక్కడా రాదు. నన్ను మీ గుండెల్లో పెట్టుకుని ఆప్యాయత చూపిస్తున్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అవ్వ, తాత, ప్రతి సోదరుడు, స్నేహితుడికి శిరస్సు వంచి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అన్నారు. సభానంతరం ముఖ్యమంత్రి.. రేణుక, షేక్ అప్సాబి, ఓబిగారి బీల అనే మహిళలకు ఇంటి పట్టాలు, గృహ మంజూరు పత్రాలను అందజేశారు. జగనన్న మా దైవం.. మెగా టౌన్షిప్ లే అవుట్లో ఇంటి స్థలంతోపాటు ఇంటి మంజూరు పత్రాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకోవడం సంక్రాంతి పండుగ ఈరోజే వచ్చినంత సంబరంగా ఉంది. నా భర్త ఆటో డ్రైవర్. తొమ్మిదేళ్లుగా అద్దె ఇంట్లో నివసిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో అనేక సార్లు తిరిగినా మాకు ఇంటి పట్టా మంజూరు కాలేదు. అయితే జగనన్న పుణ్యమా అని ఇవాళ ఆయన చేతుల మీదుగా ఏకంగా ఇంటి మంజూరు పత్రాలు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. అమ్మ ఒడి, ఆసరా వంటి ప్రభుత్వ పథకాల వల్ల మా లాంటి వాళ్లందరం చాలా సంతోషంగా ఉన్నాం. కరోనా సమయంలో జగనన్న చాలా బాగా ఆదుకున్నారు. ఆయన మేలు ఎప్పటికీ మరచిపోం. జగనన్న మా దైవం. ఎన్ని కష్టాలున్నా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు మేలు చేస్తున్న జగనన్నకు వందనం. – రేణుక, పులివెందుల -
నిత్యనూతనం... ఫ్యాషన్ డిజైనింగ్ పరిశ్రమ!
మీరే పారిశ్రామికవేత్త: దుస్తులు ధరించడం నాగరికత. అది అధునాతనంగా రోజుకో కొత్త పుంతలు తొక్కుతూ ఉంటుంది. ఫ్యాషన్ ప్రపంచంలో వస్త్రాలలో వచ్చినన్ని మార్పులు... బహుశా మరి వేటికీ రావేమో! ఆ కొత్త పోకడల హవాలో గార్మెంట్ మేకింగ్ ఇండస్ట్రీ ఏకంగా ఫ్యాషన్ డిజైనింగ్ ఇండస్ట్రీగా మారిపోయింది. ఈ పరిశ్రమ ప్రారంభించాలంటే... యంత్రాలు, ఇతర సామగ్రి: కుట్టు మిషన్లు (ఇండస్ట్రియల్ మెషీన్లు)- 3(ఒక్కొక్కటి 20 వేల వరకు ఉంటుంది) గది - వెయ్యి చదరపు అడుగుల జాగా కావాలి (అద్దె, అడ్వాన్సు వంటి ఖర్చులు ప్రదేశాన్ని బట్టి మారుతుంటాయి) కటింగ్ టేబుల్ - 1 (మూడు వేలు) కత్తెరలు - 4 (మాస్టర్ సిజర్స్ ఒక్కొక్కటి ఎనిమిది వందలవుతుంది. మామూలు కత్తెర 250కి వస్తుంది) మెజరింగ్ టేపు, స్కేళ్లు, బాబిన్స్, దారాలు, ఐరన్బాక్సు, ఐరన్ చేయడానికి టేబుల్ వంటి ఇతర సామగ్రి పదివేల లోపు అవుతుంది. ఈ వసతులతో ఐదుగురు పని చేసుకోవచ్చు. కాబట్టి పరిశ్రమ స్థాపించిన వారితోపాటు నలుగురు ఉద్యోగులు అనుకుంటే నలుగురికి జీతాలు (ఒక్కొక్కరికి కనీసంగా నెలకు ఐదు వేలు, మాస్టర్కి పదివేల రూపాయలు ఉంటుంది). శిక్షణ తీసుకున్న నలుగురైదుగురు కలిసి నిర్వహించునేటప్పుడు ఈ వేతనాల ఖర్చు ఉండదు. ముడిసరుకు... చొక్కాలు, నైట్సూట్, నైటీ, చుడీదార్, లేడీస్ టాప్స్... వంటివి కుట్టడానికి తగిన మెటీరియల్ కొనుక్కోవాలి. సాధారణంగా నైట్సూట్స్కి, నైటీలకు కాటన్, టాప్స్కి జార్జెట్, షిఫాన్ వంటివి ఉపయోగిస్తారు. అలాగే నెట్టెడ్ మెటీరియల్, గుండీలు, లేసుల వంటివి కూడా టోకుగా కొనుక్కోవచ్చు. ఇవన్నీ చార్మినార్ సమీపంలోని దుకాణాల్లో లభిస్తాయి. ముడిసరుకు కొనుగోలుకు రెండు లక్షలు అనుకుంటే మొత్తం యూనిట్ ప్రారంభించడానికి మూడు - నాలుగు లక్షల ఖర్చవుతుంది. ఇదే యూనిట్ని భారీ స్థాయిలో 30 ఇండస్ట్రియల్ మెషీన్లతో ప్రారంభించవచ్చు. అప్పుడు పాతిక లక్షలవుతుంది. స్కూలు యూనిఫామ్ వంటి భారీ ఆర్డర్లు తెచ్చుకోగలిగితే సాఫీగా నడిపించవచ్చు. చాలా స్కూళ్లు మెటీరియల్ ఇచ్చి కుట్టించుకుంటాయి కాబట్టి ముడిసరుకు కొనుగోలు శ్రమ తప్పుతుంది. మరో మార్గం ఏమిటంటే... ఇంట్లోనే ఉంటూ ఒక సాధారణ కుట్టు మిషన్ (పదివేలకు వస్తుంది)తో వర్క్ చేసుకోవచ్చు. పరిశ్రమ స్థాపించిన వారికి పని చేసి పీస్ లెక్కన డబ్బు తీసుకోవచ్చు. యూనిట్ పెట్టాలనుకునే వారికి ఆ రకమైన గైడ్లైన్స్ కూడా శిక్షణలోనే ఇస్తాం. ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికేట్ కాబట్టి శిక్షణ తరవాత బ్యాంకు నుంచి రుణాలు పొందడానికి మార్గం సులువవుతుంది. శిక్షణలో... బ్లవుజ్, స్కర్టు, టాప్, షర్ట్, నిక్కర్, ఫ్రాక్, సల్వార్ కమీజ్, చుడీదార్లు డ్రాఫ్టింగ్, కటింగ్, స్టిచింగ్ నేర్పిస్తారు. శిక్షణ కాలం... రెండు నెలలు. రా మెటీరియల్ఉచితంగా ఇస్తారు. శిక్షణ తర్వాత పరీక్ష పెట్టి ఉత్తీర్ణులైన వారికి ‘మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్’ నుంచి సర్టిఫికేట్ ఇస్తారు. రిజిస్ట్రేషన్ కోసం: 1800 123 2388 (ఉ॥10 ॥నుంచి సా॥5 ॥మధ్య), 88866 65895 నంబర్లలో సంప్రదించవచ్చు. - ఎలీప్ ఇచ్చిన వివరాలతో...
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement