breaking news
garmany
-
ఫ్రాంక్ఫర్ట్లో ఉగాది వేడుకలు
ఫ్రాంక్ఫర్ట్ లోని తెలుగు కమ్యూనిటీలు భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రదర్శిస్తూ తెలుగు నూతన సంవత్సరం ఉగాది స్ఫూర్తిని సరిహద్దులు దాటించారు. తెలుగు వెలుగు జర్మనీ (టివిజి) నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ దుస్తులలో కనిపించి ఉత్సవాలకు తెలుగు శోభను అద్దారు.స్థానిక తెలుగు వారి ప్రతిభను వెలికితీయడానికి, సంస్కృతి చైతన్యాన్ని ప్రదర్శించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భారత రాయబారి హరీష్ పర్వతనేని, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా బి.ఎస్. ముబారక్ పాల్గొన్నారు. దాదాపు రోజంతా జరిగిన ఉత్సవాలలో సాయంత్రం నిర్వహించిన మ్యూజికల్ ఫెస్ట్ హైలైట్గా నిలిచింది.ఈ సంగీతోత్సవంలో భారతదేశానికి చెందిన ప్రముఖ గాయకులు పృథ్వీ చంద్ర, మనీషా ఎరా బత్ని, ఇతిపాడ్ బ్యాండ్కి చెందిన సాకేత్ కొమండూరి ల సంగీత ప్రదర్శనలు ఉత్సవ హోరును శిఖరాలకు చేర్చాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఫ్రాంక్ఫర్ట్ మేయర్ (బర్గర్మీస్టర్) డాక్టర్ నర్గెస్ ఎస్కందారి గ్రున్బర్గ్ హాజరయ్యారు. అతిథులలో.. యూరోపా యూనియన్ ఫ్రాంక్ఫర్ట్ చైర్పర్సన్, క్లాస్ క్లిప్, జవ్వాజి గ్రూప్ కంపెనీల ఛైర్మన్, జవాజి, విదేశీ మండలి సభ్యురాలు నందిని తదితరులున్నారు. -
ప్రపంచకప్ నుంచి భారత్ ఔట్..
భువనేశ్వర్: వరుసగా రెండోసారి ప్రపంచ చాంపియన్గా నిలవాలనుకున్న భారత జూనియర్ హాకీ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 2–4 గోల్స్తో ఆరుసార్లు చాంపియన్ జర్మనీ చేతిలో ఓడింది. జర్మనీ తరఫున ఎరిక్ (15వ ని.లో), ఫ్లాటెన్ (21వ ని.లో), ముల్లర్ (24వ ని.లో), క్రిస్టోఫర్ (25వ ని.లో) గోల్స్ చేశారు. భారత ఆటగాళ్లలో ఉత్తమ్ సింగ్ (25వ ని.లో), బాబీ సింగ్ (60వ ని.లో) చెరో గోల్ సాధించారు. మరో సెమీఫైనల్లో అర్జెంటీనా ‘షూటౌట్’లో 3–1 తో ఫ్రాన్స్పై నెగ్గింది. ఆదివారం మూడో స్థానం కోసం జరిగే పోరులో ఫ్రాన్స్తో భారత్ ఆడుతుంది. చదవండి: IND vs NZ: ఐపీఎల్లో ఆ అంపైర్తో గొడవపడ్డ కోహ్లి.. అందుకే ఔట్ ఇచ్చాడా... -
ఫాసిజం అంతానికి 70 ఏళ్లు
సోవియట్ యూనియన్కి చెందిన ఎర్రసైన్యం బెర్లిన్ని ముట్టడించి కైవశం చేసుకోవడంతో హిట్లర్ నెలకొల్పిన థర్డ్ రీచ్, రెండో ప్రపంచ యుద్ధం 1945 మే 9న ముగిసి పోయాయి. జర్మనీ బేషరతుగా లొంగిపోవడంతో మానవ చరిత్రలోనే అత్యంత ఘోరమైన మారణకాండకు ముగింపు పలికినట్లయింది. హిట్లర్ హయాంలో జరిగిన అమానుష ఘటనలు సాంప్రదాయకమైన మానవ చిం తనపై ఎలాంటి ప్రభావం వేశాయంటే ఆనాడు నిజంగా ఏం జరిగిందన్నది అవగాహన చేసుకోవడం నేటివరకు చరిత్రకు సాధ్యం కావడం లేదు. ప్రముఖ తత్వవేత్త థియొడర్ అడోర్నో దీనిపై స్పందిస్తూ ఆస్చ్విట్జ్ (నాజీ చిత్రహింసల కేంద్రం)లో మారణకాండ పరంపర తర్వాత, కవిత్వ రచనను కొన సాగించడం కూడా అనా గరికమే అని వ్యాఖ్యానించారు. నాజీలు ఒక పద్ధతి ప్రకారం ఏకపక్షంగా లక్షలాది మందిని ఊచకోతకు గురి చేసిన తర్వాత ఇక కవిత్వం రాయడానికి ఏమీ లేదన్నది ఆయన భావన. ఆనాడు యూదులపై, తదితర ప్రజా నీకంపై జరిపిన చిత్రహింసలు, దౌర్జన్యాల గురించి తెలుసుకుని భయవిహ్వలతకు గురైనవారు మళ్లీ సాధా రణ జీవితం గడపటం సాధ్యం కాకపోయింది. ‘మళ్లీ ఎన్నడూ ఫాసిజం వద్దు. యుద్ధం వద్దే వద్దు’ అనేది వారి పవిత్ర ప్రమాణంలా మారింది. ఫాసిజంపై విజయం 20వ శతాబ్దికి చెందిన అత్యంత కీలక ఘటనల్లో ఒకటి. ఆ శతాబ్ది ద్వితీయా ర్థం నుంచి నేటి వరకు ఈ మహద్ఘటన మానవ నాగరి కతా వికాసానికి మెరుగులద్దుతూనే ఉంది. అది సాధిం చిన గొప్ప విజయం వలస పాలన నుంచి కోట్లాది మం ది ప్రజలను విముక్తి చేయడం. అనేక దేశాల్లో స్వాతం త్య్ర పోరాటానికి వీలు కల్పించింది. సంక్షేమ రాజ్యం, పెట్టుబడి దారీ దేశాల్లోని ప్రజలకు సామాజిక భద్రతా యంత్రాంగాన్ని నెలకొల్పడం, ప్రజాస్వామ్యాన్ని మరిం త విస్తృతపర్చడం వంటివి ఆ విజయ ఫలితాలే. అనంతరం జరిగిన మానవ చింతన అభివృద్ధిలో నుంచే ఆధునిక ప్రజాస్వామ్యానికి, పౌర స్వేచ్ఛకు, మానవ హక్కులకు కొత్త నిర్వచనాలు కూడా పుట్టుకొచ్చాయి. కానీ ఈ ఆశ, ఈ విశ్వాసం మనలో ఎంతమేరకు ఇప్పటికీ కొనసాగుతోందంటే చెప్పడం కష్టమే. హిట్లర్ గతించి 70 ఏళ్లు గడిచిన తర్వాత నేడు కూడా మనం శాంతియుత ప్రపంచంలో జీవించలేకపోతున్నాం. పైగా చరిత్రలో ఎన్నడూ లేనంత అధికంగా మనుషులు ప్రస్తుతం బానిస జీవితం గడుపుతున్నారు. ఆకలి చావు లు, వలసలు అనేవి మనిషిపట్ల జరుగుతున్న ఘోర అన్యాయానికి నిద ర్శనాలుగా నిలబడుతు న్నాయి. 2001 సెప్టెంబర్ 11తో మొదలుకుని నేటివరకు మధ్యప్రాచ్యంలో జరు గుతున్న యుద్ధాల్లో పది లక్షల మందికిపైగా పౌరులు చనిపోయారు. దేశాలకు దేశాలు బాంబుదాడుల్లో శిథిలమయ్యాయి. ఇక చిత్రహింసలు, అత్యాచారాలు, పాశవిక చర్యల మాట చెప్పనవసరం లేదు. ద్రోన్ దాడుల పేరుతో ఒబామా యంత్రసమన్విత హత్యాకాండను పరాకాష్టకు తీసుకు పోతున్నారు. ఇక యూరప్ మరోసారి ప్రపం చాధిపత్య శక్తుల మధ్య రణస్థలిలా మారే ప్రమాదం పొంచుకుని ఉంది. పాశ్చాత్య దేశాలకు, రష్యాకు మధ్య ఘర్షణ అనంతంగా సాగుతోంది. యూరప్లో అణు యుద్ధ ప్రమాదం ఎన్నడూ లేనంతగా పొడసూపు తోంది. సంపన్న రాజ్యాలుగా భావిస్తున్న యూరప్, ఉత్తర అమెరికాల్లో అసంఖ్యాక ప్రజలు దారిద్య్రంలోకి కూరుకుపోతుండగా, కులీన వర్గాలు పోగుచేసుకుం టున్న సంపద చరిత్రలో కనీవినీ ఎరుగనిరీతిలో సామాజిక అసమానతను పెంచి పోషిస్తోంది. భవిష్య త్తుపై నమ్మకం కోల్పోతున్న ప్రజలకు అవినీతి కరమైన పాలక వర్గంపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఈ పరిణామాలన్నీ కలసి 70 ఏళ్ల క్రితం జర్మనీలో వైమర్ రిపబ్లిక్ చివరి రోజుల్లో నెలకొన్న పరిస్థితిని తలపిస్తు న్నాయి. నాడు సైతం అత్యంత అధికస్థాయికి చేరుకున్న ఆర్థిక అసమానత్వమే ఫాసిజానికి దారి తెరిచింది. గ్రీస్, ఫ్రాన్స్, హంగరీలలో మితవాదశక్తులు పుంజుకుంటున్న తీరు చూస్తే 1933 నాటి ఫాసిస్టు ప్రమాదం విజృం భించడానికి ఎంతో కాలం పట్టదనిపిస్తోంది. నోమ్ చామ్స్కీ కొన్నేళ్ల క్రితం దీనిపై ఎంతో ముందు చూపుతో హెచ్చరించారు కూడా. చరిత్రపై ఇంతటి ప్రభావాన్ని కలిగించిన ఫాసి జంపై విజయ ఘటనకు మన దేశంలో కనీస గుర్తింపు లేకుండాపోవడమే విషాదకరం. వలసపాలనలోని బ్రిటిష్ ఇండియాకు చెందిన 25 లక్షల మంది సైనికులు ఫాసిజంపై వీరోచిత పోరులో పాలుపంచుకున్నారు. రెండో ప్రపంచయుద్ధంలో హిట్లర్ పక్షాన నిలిచిన జపా న్ను ఓడించడంలో అద్వితీయ పాత్ర భారతీయ సైనికు లదే. ఫాసిజంపై గెలుపులో భారతసైనికుల త్యాగాలు రూపుమాసిపోకూడదు. అలాగే ఫాసిజం చేదు జ్ఞాపకా లను ప్రపంచంలో ఏ ఒక్కరూ మరువకూడదు కూడా. (ఫాసిజంపై విజయానికి నేటికి 70 ఏళ్లు) కె. రాజశేఖరరాజు