breaking news
FZ bike
-
యమహా కొత్త బీఎస్-6 బైక్స్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో త్వరలోనే కొత్త ఉద్గార నిబందనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ద్విచక్ర వాహన తయారీదారులు కూడా ఆ వైపుగా కదులుతున్నాయి. ఇప్పటికే హీరో మోటో బీఎస్ -6 బైక్ను విడుదల చేయగా, తాజాగా ఇండియా యమహా మోటార్ (ఐవైఎం)కూడా ఈ కోవలోకి చేరింది. ఇండియా యమహా మోటార్ శుక్రవారం బిఎస్-వి కంప్లైంట్ వేరియంట్లైన ఎఫ్జెడ్-ఎఫ్ఐ, ఎఫ్జెడ్ఎస్-ఎఫ్ఐ బైక్లను విడుదల చేసింది. వీటి ధరలను రూ .99,200 నుంచి రూ .1.2 లక్షల (ఎక్స్షోరూమ్)గా నిర్ణయించింది. రానున్న కాలంలో మరిన్ని బీఎస్-6 వాహనాలను తీసుకు రానున్నామని ఐవైఎం ఒక ప్రకటనలో తెలిపింది. తాజాగా లాంచ్ చేసిన ఎఫ్జెడ్-ఎఫ్ఐ, ఎఫ్జెడ్ఎస్-ఎఫ్ఐ వెర్షన్ బైక్లు ఫ్రంట్ వీల్లో సింగిల్ ఛానల్ ఏబీఎస్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్లతో పాటు సింగిల్ పీస్ టూ లెవల్ సీటు తదితర వివిధ ఫీచర్లను పొందుపర్చింది. యమహా తన కొత్త మోటార్ సైకిళ్ళు 2019 నవంబర్ నుంచి దేశవ్యాప్తంగా అన్ని యమహా షోరూమ్లలో లభిస్తాయని యమహా మోటార్ ఇండియా చైర్మన్ మోటోఫుమి శితారా చెప్పారు. -
‘ఎఫ్ జెడ్’ సిరీస్లో 2 నూతన బైక్లు
న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ యమహా మోటార్ ఇండియా తన ఎఫ్ జెడ్ సిరీస్లో రెండు సరికొత్త బైక్లను సోమవారం మార్కెట్లో విడుదలచేసింది. ఎఫ్ జెడ్–ఎఫ్1, ఎఫ్జెడ్ఎస్–ఎఫ్1 పేర్లతో ఈ బైక్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అధునాతన బ్రేకింగ్ వ్యవస్థ, యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్).. 149 సీసీ 4–స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ల ధరల శ్రేణి రూ.95,000–రూ.97,000గా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది.ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్ మెటొఫుమీ షితార మాట్లాడుతూ.. ‘ఈ 2 నూతన బైక్ల విడుదల ద్వారా డీలక్స్ క్లాస్లో సంస్థ మార్కెట్ వాటా మరింత పెరగనుందని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
యమహా చౌక బైక్ వస్తోంది..!
ధర రూ.30 వేల లోపు ఉండొచ్చు ఎఫ్జెడ్ సిరీస్లో రెండు కొత్త వేరియంట్లు విడుదల ధరలు రూ.76,250-రూ.78,250 న్యూఢిల్లీ: యమహా కంపెనీ త్వరలో చౌక బైక్(500 డాలర్లు-రూ.30,000)ను మార్కెట్లోకి తేనున్నది. ఎఫ్జెడ్ బైక్ల్లో (150 సీసీ కేటగిరీ) రెండు కొత్త వేరియంట్లను అందిస్తోంది. ఎఫ్జెడ్, ఎఫ్జెడ్-ఎస్ల్లో అప్గ్రేడెడ్ వేరియంట్లను సోమవారం ఆవిష్కరించింది. ఎఫ్జెడ్ సిరీస్ను 2008లో భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టామని యమహా ఇండియా వైస్ ప్రెసిడెంట్(సేల్స్, మార్కెటింగ్) రాయ్ కురియన్ తెలిపారు. నేటి(మంగళవారం)నుంచి ఎఫ్జెడ్ వెర్షన్ 2.0(ధర రూ.76,250), ఎఫ్జెడ్-ఎస్ వెర్షన్ 2.0(రూ.78,250- ఈ రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)ను విక్రయిస్తామని వివరించారు. ప్రస్తుతం ఫేజర్తో సహా ఎఫ్జెడ్ సిరీస్ బైక్లను నెలకు 18వేల వరకూ విక్రయిస్తున్నామన్నారు. తాజాగా అందిస్తున్న ఈ అప్గ్రేడెడ్ వేరియంట్లతో కలుపుకొని అమ్మకాలు నెలకు 24 వేలకు పెరుగుతాయని అంచనాలున్నాయని చెప్పారు. రూ. 1,500 కోట్ల పెట్టుబడులతో నిర్మిస్తోన్న చెన్నై ప్లాంట్ నిర్మాణం షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందని, ఈ ఏడాది నవంబర్ నుంచి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభిస్తామని వివరించారు. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 18 లక్షలని పేర్కొన్నారు. 500 డాలర్ల యమహా బైక్: త్వరలో చౌక బైక్ (500 డాలర్లు-రూ.30,000)ను అందించనున్నామని యమహా మోటార్ ఆర్ అండ్ డీ ఇండియా ఎండీ తొషికజు కొబయాషి చెప్పారు. ఈ చౌక బైక్పై కసరత్తు జరుగుతోందని, ధర విషయం ఇప్పుడే నిర్ణయాత్మకంగా చెప్పలేమని పేర్కొన్నారు. 500 డాలర్ల ధరకే అందించాలని బెంచ్మార్క్గా పెట్టుకున్నామని తెలిపారు. అయితే ఈ బైక్ను ఎప్పుడు మార్కెట్లోకి తెచ్చేది వెల్లడించలేదు. ఈ చౌక బైక్ కారణంగా తమ మార్కెట్ వాటా మరింతగా పెరగగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. స్కూటర్లు, 150 సీసీ కేటగిరీ బైక్ల్లో పటిష్టమైన స్థానానికి చేరిన తర్వాత ఇతర సెగ్మెంట్లలోకి ప్రవేశిస్తామని రాయ్ కురియన్ వివరించారు. ఈ ఏడాది జనవరి-మార్చి కాలానికి తమ అమ్మకాలు 32% పెరిగాయని, ఇదే జోరు కొనసాగనున్నదని కురియన్ పేర్కొన్నారు. గతేడాది 4.47 లక్షల టూవీలర్లను విక్రయించామని, ఈ ఏడాది 6 లక్షల టూవీలర్లను విక్రయించనున్నామని చెప్పారు. ప్రస్తుతం 1,300గా ఉన్న డీలర్ల సంఖ్యను ఈ ఏడాది చివరికల్లా 1,600కు పెంచనున్నామని ఆయన పేర్కొన్నారు.