-
కరోనా: తమిళ నటుడు భూదానం
కరోనా వైరస్ని ఎదుర్కోవడానికి సినిమా స్టార్స్ తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. తాజాగా తమిళ సీనియర్ నటుడు విజయ్కాంత్ భూదానం చేశారు. ఇటీవల చెన్నైలో కరోనా సోకిన ఓ న్యూరోసర్జన్ను స్మశానంలోకి అనుమతించలేదు ఆ పరిసర వాసులు. అక్కడితో ఆగకుండా ఆ ఆంబులెన్స్ మీద దాడి చేశారు కూడా. ఈ విషయం తెలిసి చలించిపోయిన విజయ్కాంత్.. చెన్నెలో ఉన్న తన స్థలంలో కొంత భాగాన్ని దానం చేశారు. కరోనా వ్యాధితో చనిపోయినవారిని ఖననం చేయడానికి ఆ చోటుని వాడుకోమని కోరారు ఆయన. ‘‘మృతదేహాల నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందదు. ఈ విషయంలో జనంలో అవగాహన తీసుకురావాలి’’ ఈ సందర్భంగా విజయ్కాంత్ పేర్కొన్నారు. -
సీఎం సారూ.. సత్తుపల్లికి ఒక్కసారి రండి..
సాక్షి, సత్తుపల్లి : సత్తుపల్లి నియోజకవర్గంలో పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో నిర్మించిన వైకుంఠధామం ఫొటోలను అసెంబ్లీలో శుక్రవారం సీఎం కేసీఆర్ చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సర్పంచ్ దొడ్డపునేని శ్రీదేవి బ్రహ్మాండంగా వైకుంఠధామాన్ని పార్కులా.. దేవాలయంలా కట్టారు. సండ్ర వెంకటవీరయ్య చెప్పింది చాలా కరెక్ట్.. సత్తుపల్లి నియోజకవర్గంలో చాలా చాలా నిర్మించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సర్పంచ్ దొడ్డపునేని శ్రీదేవి, గ్రామ ప్రజలు, అధికారులకు అభినందనలు’అని పేర్కొన్నారు. ఈ ఫొటోలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి పంపించారు. చాలా సంతోషం వేసిందని కితాబిచ్చారు. పల్లెప్రగతి సంతృప్తినిచ్చింది.. పల్లెప్రగతి కార్యక్రమం తన 16 ఏళ్ల రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అసెంబ్లీలో తెలిపారు. మనిషి చనిపోతే తీసుకెళ్లాలంటే కొట్లాటలు జరిగిన ఘటనలు చూశానని, ఎన్నికలు వస్తే ముందు శ్మశాన వాటికలకు స్థలం కేటాయిస్తేనే ఓటు వేస్తామని చెప్పేవాళ్లు ఉండేదని, వీటన్నింటికి పరిష్కారం పల్లెప్రగతి చూపించిందని పేర్కొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 143 గ్రామపంచాయతీలు ఉంటే అన్నింట్లో ట్రాక్టర్లు కొనడమే కాకుండా.. వైకుంఠధామాల నిర్మాణాలు కూడా 143 పంచాయతీల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలసి వేలాది మంది సమక్షంలో ప్రారంభించి.. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శ్మశానవాటికలు అందంగా ఉండాలని దాతల సాయంతో ఒక శివుడి విగ్రహాన్ని నిర్మించామని, మనిషి పుట్టుక ఎంతగొప్పదో.. చనిపోయిన తర్వాత అంతే పవిత్రంగా ఆ కుటుంబ సభ్యులకు ఆత్మశాంతి కలిగే విధంగా వాటిని నిర్మించామన్నారు. సత్తుపల్లి మండలం కొత్తూరు పంచాయతీ జిల్లాలోనే బెస్ట్ పంచాయతీగా కలెక్టర్ ఎంపిక చేశారని, ఆ పంచాయతీలో పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారని.. ప్లాస్టిక్ గ్లాస్, ప్లాస్టిక్ బ్యాగ్ వాడినా మహిళా సర్పంచ్ ఫైన్ వేస్తారని వెల్లడించారు. అన్ని ఇళ్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారని, సత్తుపల్లి నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ పర్యటనకు రావాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆహ్వానించారు. -
శ్మశానాలూ హాంఫట్
జిల్లాలో 150 ఎకరాలకు పైగా కబ్జా తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి శివారుల్లో ఎక్కువ అనువైన చోట్ల రెచ్చిపోతున్న రియల్టర్లు భూముల ధరలు పెరగడమే కారణం మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ శాఖల్లో ఉదాసీనత జిల్లాలో శ్మశానాలు లేని గ్రామాలెన్నో ఉన్నాయి. వాగులు, వంకలు, చెట్లు, గట్లను అనువుగా చేసుకుని ఆయా గ్రామాల్లో శవ దహనాలతో కూడిన అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి. వానొచ్చినా, వరదొచ్చినా శవ దహనాలు కష్టమైనా భరిస్తున్నారు. మరో కోణంలో చూస్తే....చాలా గ్రామాల్లో ఉన్న శ్మశానాలను బడా బాబులు, రియల్టర్లు ఆక్రమిస్తున్నారు. రాత్రికి రాత్రే హద్దులు తొలిగించి సొంత భూముల్లో కలిపేసుకుంటున్నారు. అధికార, రాజకీయ బలాలను అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా కబ్జాలకు పూనుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 150 ఎకరాల మేర శ్మశాన భూములు ఆక్రమణకు గురయ్యాయని తెలుస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు శివారుల్లోనే ఈ ఆక్రమణలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి, చిత్తూరు, మదనపల్లి రెవెన్యూ డివిజన్ల పరిధిలో 1,360 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో 50 శాతం గ్రామాల్లోనే అధికారికంగా నిర్దేశించిన శ్మశానాలున్నాయి. మిగతా చోట్ల లేవు. కాలువ గట్లు, వాగుల అంచులు, పొలిమేర కాలిబాటల్లోనూ, రహదారుల పక్కన శవ దహనాలు జరుగుతున్నాయి. అయితే అధికారికంగా శ్మశాన భూములున్న ప్రాంతాల్లోనూ ఇటీవల ఆక్రమణలు పెరుగుతున్నాయి. జిల్లాలోని 100 కి పైగా గ్రామాల్లోనూ, ప్రధాన మున్సిపల్ శివారుల్లోనూ శ్మశానాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. విద్య, వైద్యం, పారిశ్రామికంగా పలు పట్టణాలను అభివృద్ధి పర్చనున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగాయి. దీంతో పట్టణాలకు శివారున రియల్ వ్యాపారులు ఆక్రమణలకు తెగబడుతున్నారు. వీటికి పక్కనే ఉన్న పంట భూములను కొనుగోలు చేసి ప్లాట్లుగా చేసి విక్రయించే క్రమంలో శ్మశానాలనూ ఆక్రమిస్తున్నారు. తిరుపతి పట్టణంలో మొత్తం 8 చోట్ల శ్మశాన భూములున్నాయి. ఇక్కడ అంకణం ధర వేలల్లో ఉండటంతో రియల్ వ్యాపారులు, రాజకీయ నేతల కన్ను వీటిపై పడింది. నగరానికి మధ్యలో ఉండే ఎస్టీవీ నగర్ శ్మశాన వాటిక పక్కనున్న సుమారు 10 సెంట్లకు పైగా ఆక్రమణలకు గురవుతోంది. పక్కనే ఉన్న మఠం భూముల పేరు చెబుతున్న కొంతమంది బడాబాబులు శ్మశానానికి కేటాయించిన జాగాను కూడా కబ్జా చేస్తున్నారని సమాచారం. తిరుపతి రూరల్ మండలంలోని చెర్లోపల్లి, సీ మల్లవరం, వేమూరు గ్రామాల్లో శ్మశాన భూములు ఆక్రమణలకు గురయ్యాయి. సీ.మల్లవరం శ్మశాన భూములను ఆక్రమించి రోడ్లు నిర్మించిన వైనంపై పత్రికల్లో కథనాలు రావడంతో రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణలను అడ్డుకున్నారు. చిత్తూరులో కైలాసపురం వద ఉన్న శ్మశాన వాటకిలో 80 సెంట్లు ఇప్పటికే ఆక్రమణలో ఉంది. జానకారపల్లె వద్ద సగానికి పైగా ఆక్రమించుకున్నారు. ఇరువారం, కొంగారెడ్డిపల్లె వద్ద నున్న శ్మశాన వాటికలు సైతం ఆక్రమణలో ఉన్నాయి. గుడిపాల మండలం నంగమంగళం, మరకాలకుప్పం, 197రామాపురం గ్రామాల్లోని శ్మశాన వాటికలు ఆక్రమణలకు గురయ్యాయని మండల సర్వసభ్య సమావేశాల్లో ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసినా అధికారుల్లో చలనం లేదు. ఈ శ్మశాన భూముల్లో కొందరు గానుగ మిషన్లు పెట్టారు. మరికొందరు సారా తయారీ చేసి విక్రయిస్తున్నారు. శ్రీకాళహస్తి వాసులు స్వర్ణవుుఖినదినే శ్మశానవాటికగా వినియోగిస్తారు. టీడీపీ నేతలు ఇసుకను తరలించే నేపథ్యంలో శ్మశానాలు తవ్వేస్తున్నారు. దీంతో వుృతదేహాలు బయటపడుతున్నాయి. అదేవిధం బీవీపురం, వుుచ్చివోలు, అక్కుర్తి, చుక్కలనిడిగల్లు గ్రావూల్లో శ్మశానాలు అక్రమించారు. తొట్టంబేడు వుండలంలోని కొనతనేరి,కొన్నలి,కనపర్తి,చిట్టత్తూరు,బోనుపల్లి గ్రావూల్లోనూ శ్మశానాలను కొందరు ఆక్రమించారు. ఏర్పేడు వుండలం గుల్లకండ్రిగ, కందాడు, నచ్చనేరి, నాగంపల్లి గ్రావూల్లో టీడీపీ నేతలు శ్మశాలను అక్రమించారని ఆరోపణలున్నాయి. సత్యవేడు నియోజకవర్గం పరిధిలో 15 ఎకరాల వరకు శ్మశాన స్థలాలు ఆక్రమణకు గురై ఉన్నాయి. సత్యవేడు మండల పరిధిలో చెన్నేరి, చిన్న ఈటిపాకం, మోటుపాళెం గ్రామాల పరి«ధిలో 2 ఎకరాల శ్మశాన భూములు ఆక్రమణల పాలయ్యాయి. వరదయ్యపాళెం మండలంలోని బత్తలావల్లం, కడూరు, ఆంబూరు, కళత్తూరు, కరింజలం గ్రామాల పరిధిలో సుమారు 10 ఎకరాలు స్థలం ఆక్రమణకు గురైంది. నాగలాపురం మండలంలో వెళ్లూరు దళితవాడ శ్మశానానికి వెళ్లే దారి ఆక్రమణకు గురై ఉంది. శవాలు తీసుకు వెళ్లేందుకు జనం ఇబ్బంది పడుతున్నారు. పిచ్చాటూరు, శేషంపేట, కారూరు, అడవి కొడింబేడు, బంగాళా గ్రామాల పరిధిలో సుమారు మూడు ఎకరాల స్థలం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లింది. పుంగనూరు నియోజకవర్గం సదుం మండల కేంద్రంలో హిందూ శ్మశానవాటిక దురాక్రమణకు గురైంది. దీనిపై ప్రజలు పలు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదు. దీని కారణంగా అంత్యక్రియలు నిర్వహించే ప్రజలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement